-
ఎంసెట్ కేసులో చార్జిషీట్..
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఎట్టకేలకు సీఐడీ చార్జిషీట్ దాఖలు చేయనుంది. మూడేళ్లుగా నానుతూ వస్తున్న దర్యాప్తు కొద్ది రోజుల క్రితం పూర్తి కావడంతో పట్టుబడిన నిందితులపై చార్జిషీట్ దాఖలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనితో సీఐడీ దర్యాప్తు బృందం ఇప్పటివరకు కేసులో అరెస్టయిన ప్రధాన సూత్రధారులు, బ్రోకర్లు, కాలేజీ ప్రతినిధులను ఎఫ్ఐఆర్లో చేర్చింది. పట్టుబడకుండా తప్పించుకొని తిరుగుతున్న వారి పేర్లను సైతం చేర్చి దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డ్రాఫ్ట్ చార్జిషీట్ కొద్ది రోజుల క్రితమే తయారుచేసిన సీఐడీ అధికారులు న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకు లీగల్ విభాగానికి పంపించారు. చార్జిషీట్ డ్రాప్ట్ను అధ్యయనం చేసిన న్యాయవిభాగం అధికారులు కొన్ని సాంకేతిక కారణాలను ఎత్తిచూపారు. వీటిని సరిచేసుకున్న దర్యాప్తు బృందం నాంపల్లిలోని సీఐడీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు కేసులో 124 మందిని నిందితులుగా గుర్తించిన సీఐడీ 94 మందిని అరెస్ట్ చేసింది. వీరిలో ప్రధాన సూత్రధారులుగా 22మంది ఉండగా, మిగిలిన వారంతా బ్రోకర్లని సీఐడీ లెక్క తేల్చింది. మరో దఫా దర్యాప్తు... ప్రస్తుతం దాఖలు చేస్తున్న చార్జిషీట్ తుదిది కాదని, మరో దఫా దర్యాప్తు ఉంటుందని సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ఈ కేసులో ఇంకొంత మంది పాత్ర తేలాల్సి ఉందని, గతంలో దర్యాప్తు అధికారులు చేసిన పొరపాట్ల వల్ల కొంత మంది నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారని, వారి కోసం వేటసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.మరికొంత మంది బ్రోకర్ల పాత్ర సైతం పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాల్సి ఉందని, వారినీ అరెస్ట్ చేసి అనుబంధ చార్జిషీట్ కూడా దాఖలు చేసేందుకు తాము కృషిచేస్తున్నామని సీఐడీ ఉన్నతాధికారులు వెల్లడించారు. మూడేళ్లుగా సాగుతూ.. వస్తున్న ఈ కేసులో కీలక నిందితులు ఇద్దరు మృతి చెందడం, కేసులో అనేక ప్రతిష్టంభనలకు కారణమైంది. 312మంది విద్యార్థులకు కోల్కత్తా, బెంగళూరు, ఢిల్లీ, కటక్, ముంబై, పుణేలో క్యాంపులు నిర్వహించి లీకైన ప్రశ్నపత్రంపై శిక్షణ ఇప్పించిన సంగతి విదితమే. -
ఎంసెట్ కేసు దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ అధికారుల దర్యాప్తు తుదిదశకు చేరుకుంది. లీకేజీలో ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొంటున్న కార్పొరేట్ కాలేజీల లింకును పూర్తిస్థాయిలో ఛేదించేందుకు కృషి చేస్తున్నారు. లీకేజీలో కీలకంగా ఉండి దర్యాప్తులో మృతి చెందిన కమిలేశ్కుమార్ లింకును ఛేదించనున్నారు. కమిలేశ్కు అనుచరులుగా వ్యవహరిస్తూ.. విద్యార్థులను క్యాంపులకు తరలించిన మరో 9మందిని సీఐడీ గుర్తించింది. వీరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బృందాలను పట్నా, పుణే, ముంబై, బెంగళూరు, ఢిల్లీ పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. రెండు రోజుల్లో నిందితుల ఆచూకీ పూర్తిస్థాయిలో గుర్తిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తునకు సంబంధించి బ్రోకర్లు, కీలక నిందితుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలతో చార్జిషీట్ రూపొందించే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. -
వాసుబాబు, నారాయణకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కళాశాల ఏజెంట్ శివనారాయణలకు సీఐడీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో వీరిద్దరినీ చంచల్గూడ జైలుకు తరలించారు. బుధవారం వీరి కస్టడీ ముగియడంతో సాయంత్రం నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో భాగంగా శివనారాయణను సీఐడీ బృందం భువనేశ్వర్ తీసుకెళ్లి విచారించిన విషయం తెలిసిందే. భువనేశ్వర్లోని రాజధాని హోటల్లో 4 రూములు బుక్ చేసి 18 మంది విద్యార్థులకు శిక్షణ ఇప్పించినట్లు సీఐడీ ఆధారాలు రాబట్టింది. ఇందులో రెండు గదులు శివనారాయణ బంధువులమ్మాయి పేరుతో, మరో రెండు గదులు వరంగల్ జిల్లాకు చెందిన తిరుపతిరెడ్డి పేరుతో ఉన్నట్లు హోటల్ రికార్డుల ద్వారా తెలిసింది. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కు మేక్ మై ట్రిప్ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసినట్లు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్వాన్స్ రూపంలో రూ.65 లక్షలు తీసుకున్నట్లు విచారణలో వాసుబాబు, శివనారాయణ వెల్లడించినట్లు అధికారుల ద్వా రా తెలిసింది. సీఐడీ కస్టడీలోని వీరిద్దరినీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం ప్రశ్నించారు. కార్పొరేట్ కాలేజీలకు చెందిన మరో వ్యక్తి వ్యవహారంపై వారిని ఆరా తీసినట్లు తెలిసింది. గత దర్యాప్తు అధికారులపై నజర్ గతంలో దర్యాప్తు అధికారులుగా పనిచేసిన వారిపై పోలీస్శాఖ దృష్టి సారించింది. రెండుసార్లు చార్జిషీట్ దాఖలు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన ఆ అధికారులపై సీఐడీ ఉన్నతాధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేసులోని కీలకాంశాలను పూర్తిగా వెలుగులోకి తీసుకురాకుండా కుట్రపూరితంగా వ్యవహరించారని, దీని వెనకున్న రహస్యా న్ని బయటపెట్టేందుకు అంతర్గత విచారణకు ఆదేశించామని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. గతేడాది ఆగస్టులో శ్రీచైతన్య మాజీ డీన్ను విచారణ పేరుతో పిలిచి పంపేయడం, ఆ తర్వాత మరో కార్పొరేట్ కాలేజీ ప్రిన్సిపాల్నూ కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించినట్లు వెలుగులోకి రావడంతో పోలీస్ పెద్దలు సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. కేసును కేవలం బిహార్ గ్యాంగ్కు అంటగట్టి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించారని, కార్పొరేట్ కాలేజీల ఒత్తిడికి తలొగ్గి వారి నుంచి భారీగా దండుకున్నారని పోలీస్ పెద్దలు అనుమానిస్తున్నారు. దాదాపు రూ.1 కోటి వరకు దర్యాప్తు అధికారుల మీదుగా చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఏమాత్రం ఆధారం దొరికినా దర్యాప్తు అధికారి, ఆయనకు సహకరించిన డీఎస్పీ, ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. -
పాత్రధారులయ్యారు.. ఇక సూత్రధారే!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందిన మరో కీలక వ్యక్తి ని అరెస్టు చేసేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. తమ కస్టడీలో ఉన్న శ్రీచైతన్య మాజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణ విచారణలో ఆ కీలక వ్యక్తి వ్యవహారం వెలుగులోకి రావడంతో అతడిని అరెస్టు చేసేందుకు ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంది. కేసుకు సంబంధించి 16 మంది బ్రోకర్ల అరెస్టుకు 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది. అతడే కీలకం: ప్రశ్నపత్రం ప్రింటింగ్, లీక్, విద్యార్థులతో బ్రోకర్ల క్యాంపు నిర్వహణ తదితరాలన్నీ సీఐడీ ఛేదించింది. కుట్రకు సూత్రధారిగా భావిస్తున్న కార్పొరేట్ సంస్థల కీలక వ్యక్తిని అరెస్టు చేస్తే దర్యాప్తు పూర్తయినట్లేనని అధికారులు భావిస్తున్నారు. అనుకున్నట్లుగా అతడిని అరెస్టు చేస్తే ఆగస్టు రెండో వారానికి చార్జిషీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సీఐడీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పలు క్యాంపులు నిర్వహించిన బ్రోకర్లలో 16 మంది పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోడానికి కౌంటర్ ఇంటెలిజె న్స్ నేతృత్వంలో 6 ప్రత్యేక బృందాలు ముంబై, ఢిల్లీ, బిహార్, పుణే, కర్ణాటక, షిర్డీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. నేటితో ముగియనున్న కస్టడీ: వాసుబాబు, శివనారాయణ సీఐడీ కస్టడీ బుధవారంతో ముగియనుంది. దీంతో వీరిని బుధవారం మధ్యాహ్నం నాంపల్లిలోని 6వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వాసుబాబు, శివనారాయణ లింకు ద్వారా అరెస్టయిన గణేశ్ప్రసాద్ను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని సీఐడీ భావిస్తోంది. -
‘ఎంసెట్’ నిందితులు సీఐడీ కస్టడీకి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సీఐడీ లోతుగా దర్యాప్తు చేయనుంది. ఈ కేసులో అరెస్టయి న శ్రీచైతన్య కాలేజీ డీన్ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్ శివనారాయణలను ఆరు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి 6వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో కార్పొరేట్ కాలేజీల గుట్టు విప్పేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు. లీకైన ప్రశ్నపత్రంపై క్యాంపులో శిక్షణ పొందిన 136 మంది విద్యార్థుల వాంగ్మూలాలను సీఐడీ ఇప్పటివరకు సేకరించింది. వారిలో 80 శాతం మంది ఈ రెండు కాలేజీలకు చెంది న వారే ఉండటంతో వాసుబాబు, శివనారాయణ కస్టడీ విచారణ కీలకం కానుందని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడ్డారు. కమీషన్ల కోసమే విద్యార్థులను క్యాంపులకు పంపించామంటూ వాసుబాబు, శివనారాయణ చెబుతుండగా కమీషన్ల కోసమే అయితే ఇంత మంది ఒకే గ్యాంగుతో ఎలా క్యాంపులకు వెళ్తారని సీఐడీ అనుమానిస్తోంది. రెండు కార్పొరేట్ కాలేజీల్లో చదివి, ప్రస్తుతం మెడికోలుగా ఉన్న ఆరుగురు బ్రోకర్లు సైతం మాఫియా తో చేతులు కలపడం వెనుకున్న రహ స్యాన్ని బయటపెట్టేందుకు వాసుబాబు, శివనారాయణ కస్టడీ కీలకమని అధికారులు తెలిపారు. శ్రీచైతన్యలోనే చదివిన బ్రోకర్, మెడికో గణేష్ప్రసాద్ వెల్లడించిన ఆసక్తికర అంశాలు వాసుబాబు, శివనారాయణ మెడకు ఉచ్చు బిగేంచేలా ఉన్నట్లు తెలిసింది. ఏటా ఎంసెట్ సమయంలో వీరిద్దరూ గణేష్, ఇతర నిందితులైన డాకర్లు ధనుంజయ్, సందీప్లతోనూ వ్యవహారం నడిపినట్లు తేలింది. దీంతో కేవలం ఆరుగురు విద్యార్థులనే కాకుండా వాసుబాబు, శివనారాయణ ఈ రెండు కార్పొరేట్ కాలేజీలకు చెందిన మరికొందరిని క్యాంపులకు తరలించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ లింకు ఛేదించేందుకు శుక్రవారం నుంచి ఆరురోజులపాటు ప్రశ్నిస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement