-
గిరిజన ఆణిముత్యం.. నీట్లో ఆల్ఇండియా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంక్
దహెగాం: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ కూలీ కూతురు. చిన్న తనంలోనే తండ్రి మృతి చెందగా తల్లి కూలీ పనులు చేసుకుంటూ కూతుర్ని చదివించింది. తండ్రి క్యాన్సర్తో ఐదేళ్ల క్రితం మృతిచెందడంతో ఆ పసి మనసులో అప్పటి నుంచే డాక్టర్ కావాలని తలపించింది. మా నాన్నలాగా ఎవరు మృతిచెందవద్దనే ఉద్దేశంతో పట్టుదలతో చదివి ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో 427 మార్కులు సాధించగా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంక్ కై వసం చేసుకుంది. కొలవార్ తెగలో వైద్య విద్యను పూర్తి చేస్తే తొలి విద్యార్థిని సంగర్ష్ స్రవంతి కానుంది. కుటుంబ నేపథ్యం.. కుమురంభీం జిల్లా దహెగాం మండలం చంద్రపల్లి గ్రామానికి చెందిన సంగర్ష్ శంకర్, బుచ్చక్కలకు ఐదుగురు ఆడపిల్లలే. అందులో ఐదో సంతానమైన స్రవంతి 1 నుంచి 5వ తరగతి వరకు చంద్రపల్లి ప్రాథమిక పాఠశాలలో చదివింది. 6 నుంచి 10వ తరగతి వరకు దహెగాంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో చదివింది. పదిలో 8.2 జీపీఏ సాధించింది. 9వ తరగతి చదువుతున్న క్రమంలో తండ్రి శంకర్ క్యాన్సర్తో మృతి చెందాడు. శంకర్కు సరైన వైద్యం అందక చనిపోయాడని ఇరుగుపొరుగు వారు అనేవారు. అప్పుడే ఆమెలో డాక్టర్ కావాలనే ఆలోచన మొదలైంది. దీంతో బంధువుల సహకారంతో డీఆర్డీఏను సంప్రదింది హైదరాబాద్లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో సీటు సాధించింది. ఇంటర్ బైపీసీలో 934 మార్కులు సాధించింది. కుంగిపోకుండా చదివి.. ఇంటర్ పూర్తి చేసిన స్రవంతి డాక్టర్ కావాలని కోరిక ఉండగా ప్రైవేటులో నీట్ శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత లేక గిరిజన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్రాల్డ్లో నీట్ శిక్షణ తీసుకుంది. మొదటి ప్రయత్నంలో నీట్లో సీటు కోల్పోయింది. అయినా కుంగిపోకుండా అధైర్యపడకుండా పట్టుదలతో చదివి రెండోసారి 427 మార్కులు సాధించి ఎస్టీ కోటాలో 2,782 ర్యాంకు సాధించి వైద్య విద్యకు ఎంపికై ంది. వైద్య విద్య పూర్తి చేస్తే తెలుగు రాష్ట్రాల్లో కొలవార్ తెగలో మొదటి మహిళగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. నా బిడ్డను డాక్టర్గా చూడాలనుకున్నా నా భర్త ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిండు. నాకు ఐదుగురు ఆడపిల్లలే. నలుగురు పిల్లల పెండ్లీలు చేసినా. స్రవంతి ఐదవ బిడ్డ ఆమె చిన్నప్పటి నుంచి మంచిగ చదువుకుంటుంది. స్రవంతిని డాక్టర్ చదివించాలని నా కోరిక నేను కూలీ పనులు చేసుకుంటు ఆమెను చదివిపిచ్చినా మేము కష్టపడినట్లు నా బిడ్డ కష్టపడవద్దని ఆమెను చదివిపించి డాక్టర్ చేయాలని అనుకున్న. స్రవంతి డాక్టర్ అయితందని అందరు అంటురు. నాకు ఆనందంగా ఉంది. – బుచ్చక్క, స్రవంతి తల్లి, చంద్రపల్లి పేదలకు వైద్యం అందిస్తా సరైన వైద్యం అందక మా నాన్న చనిపోయినట్లు ఊర్లో అందరూ అనేవారు. అప్పటి నుంచే డాక్టర్ కావాలని అనుకున్న. కష్టపడి చదివితే సాధించవచ్చని అనుకుని నీట్ మొదటి సారి రాస్తే ర్యాంక్ రాలేదు. అయినా బాధపడకుండా రెండో సారి కోచింగ్ తీసుకుని ప్రయత్నం చేయగా ఎస్టీ కోటాలో 2,782 ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రులు కష్టపడి నన్ను చదివించారు. నాన్న లేకపోయినా అమ్మ నాకు ధైర్యం చెప్పింది. నిరుపేదలకు వైద్యం అందిస్తా. – స్రవంతి, చంద్రపల్లి -
‘సీఎం వైఎస్ జగన్కు సదా కృతజ్ఞుడినై ఉంటా’
గుంటూరు: సీఎం సహాయనిధి ఆ ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపింది. పరిపూర్ణ ఆరోగ్యవంతులను చేసింది. ఎన్నోఏళ్ల నుంచి గూనితో బాధపడుతున్న వారికి విముక్తి కల్పించింది. గుంటూరు కొత్తపేట నారాయణ సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిలో ఈనెల 13, 14 తేదీల్లో న్యూరోమానిటరింగ్ సిస్టమ్ ద్వారా శస్త్రచికిత్సలు చేయించుకున్న కాంతారావు, వినోద్కుమార్ ఆనందంగా ఇళ్లకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆస్పత్రి స్పయిన్ సర్జన్ డాక్టర్ దుంపా శ్రీకాంత్రెడ్డి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.ఏడు లక్షల ఖరీదైన ఆపరేషన్ను ఉచితంగా చేసినట్టు వివరించారు. శస్త్రచికిత్సకు 8 గంటల సమయం పట్టిందని, గూనిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీతోనే నయం చేయొచ్చని వెల్లడించారు. సమావేశంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ గుండం శివశ్రీనివాసరెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ హర్ష, క్రిటికల్కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింధు పాల్గొన్నారు. కాంతారావు కష్టాలకు ఇక చెల్లు ఈచిత్రంలో ఉన్న వ్యక్తిపేరు బి.కాంతారావు. వయసు 40 ఏళ్లు. ఊరు ఊటుకూరు. గూని వల్ల వెన్నుపూస పూర్తిగా ఒంగిపోయింది. రోజువారీ కూలీపనులు చేసుకునే ఇతను చాలా కష్టపడేవాడు. కొన్నిసార్లు కాలు జాలువారేది. ఊపిరి తీసుకోవడమూ కష్టమయ్యేది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న ఇతనికి సీఎం సహాయనిధి వరమైంది. ఎట్టకేలకు శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యవంతుడయ్యాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సదా కృతజ్ఞుడినై ఉంటానని చెబుతున్నాడు. జీవితమంతా ‘వినోద్’మే ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి పేరు వినోద్కుమార్. వయసు 17ఏళ్లు. ఊరు అమలాపురం. ఇంటర్ చదువుతున్నాడు. పుట్టుకతోనే గూని ఉంది. చిన్ననాటి నుంచి ఎంతో కష్టపడేవాడు. ఇటీవల నడుంనొప్పి, కాళ్ల తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్టు ఉండడంతో తీరని వేదన అనుభవించాడు. వైద్యులను సంప్రదిస్తే ఆపరేషన్ చేయాలనడంతో ఆర్థిక స్తోమత లేక మిన్నకుండిపోయాడు. ఎట్టకేలకు సీఎం సహాయనిధి ఆయన జీవితంలో వెలుగులు నింపింది. ఆపరేషన్ చేయించింది. -
డాక్టర్లను నియమించకుండా గాడిదలు కాస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలను గాలికి వదిలేసిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ రాష్ట్రానికి నియంతలా మారిన కేసీఆర్.. ముందు తన రాజకీయ క్రీడలను ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. మంగళవారం జూమ్ యాప్ ద్వారా మీడియాతో భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి కేసీఆరే కారణమని ఆరోపించారు. తాము ఏడాది క్రితమే అన్ని ఆసుపత్రులు తిరిగి వైద్యుల నియామకానికి చిట్టా ఇచ్చినా పట్టించుకోకుండా ప్రభుత్వం గాడిదలు కాసిందా? అని ప్రశ్నించారు. నవ్వులాటలు, గాలి మాటలతో ప్రజల ప్రాణాలను గాలిలో పెట్టారని మండిపడ్డారు. వద్దంటే ఎన్నికలు పెట్టి నాగార్జునసాగర్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగేందుకు కారణమయ్యారని విమర్శించారు. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో లాక్డౌన్ ఒక్కటే శరణ్యమని, కనీసం 15 రోజులపాటు సంపూర్ణ లాక్డౌన్ విధించాలని కోరారు. వైరస్ను నియంత్రించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోనికి తీసుకురావాలని భట్టి డిమాండ్ చేశారు. ఢిల్లీ తరహాలో ఒక యాప్ ఏర్పాటు చేసి ఆసుపత్రుల వివరాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఎప్పుడు, ఎన్ని డోసుల వ్యాక్సిన్ కావాలో ఈ ప్రభుత్వం దగ్గర యాక్షన్ ప్లాన్ లేదని మండిపడ్డారు. చదవండి: ఈటలతో కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క భేటీ -
సీటు బెల్ట్తో యువ డాక్టర్ సేఫ్
సాక్షి, రాజేంద్రనగర్: కారు సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఎయిర్ బ్యాగ్ తెరుచుకుని ప్రమాదం నుంచి సురక్షితంగా ఓ యువ డాక్టర్ బయటపడింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సైదాబాద్ పూర్ణాదేవీకాలనీకి చెందిన డాక్టర్ ఎ.దివ్యారెడ్డి(26) గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తుంది. గురువారం నైట్ డ్యూటీ చేసిన డాక్టర్ దివ్యారెడ్డి శుక్రవారం ఉదయం విధులు ముగించుకుని తన కారులో ఇంటికి బయలుదేరింది. ఔటర్ పై నుంచి హిమాయత్సాగర్ వద్ద దిగి రాజేంద్రనగర్ మీదుగా చంద్రాయణగుట్ట వైపు వెల్తుంది. గాందీనగర్ మందిరం దాటగానే రోడ్డుపై ఓ వీధి కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో కారు కాస్తా పక్కనే ఉన్న సైన్బోర్డును ఢీకొని అలాగే ముందున్న రాళ్లను ఢీకొంటూ వెళ్ళి ఆగిపోయింది. ఆమె సీటు సీటు బెల్టు ధరించడంతో వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. వాహనం పూర్తిగా ధ్వంసమయింది. ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన దివ్యారెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవరీ జో జోర్గెన్సన్
విధ్వంసం.. పురుషుడి అభిమతం.. నిర్మాణం.. స్త్రీ లక్షణం.. దాదాపు ప్రతి ఇల్లే కాదు ప్రపంచ రాజకీయ తాజా పరిణామాలూ ఇవే చెప్తున్నాయి. ఇంటిని చక్కదిద్దినంత తేలికగా తమ పాలనలో ఉన్న దేశాల ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలను చక్కదిద్దుతున్నారు. ఈ నిజాన్ని కరోనా కూడా ప్రూవ్ చేసింది. మహిళలు ఏలికలుగా ఉన్న దేశాల్లో కరోనా కూడా కోరలు ముడుచుకుంది. కాదు ముడుచుకునేలా చేశారు. విధ్వంసంతో సవాళ్లను విసురుతూ ఉన్న పురుషులకు నిర్మాణంతో జవాబు ఇస్తున్నారు. అలాంటి సవాలే స్వీకరించింది ఓ స్త్రీ అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పోరులో నిలబడి. ఆమె పేరు జో జోర్గెన్సన్. వయసు..63. కమలా హారిస్ గెలుపు ముందు ఆమె ప్రయత్నం కనిపించకుండాపోయింది. అమెరికాలో నడుస్తున్న ద్విపార్టీ తీరును వ్యతిరేకించే, నిరసించే సమూహంలోని వ్యక్తి జోర్గెన్సన్. లిబర్టేరియన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేసిన తొలి మహిళ ఆమె. ఈ పార్టీ విజయావకాశాలు, పదవుల అర్హత వగైరాల చర్చ కాదు. నిర్మాణాత్మాక స్ఫూర్తి మాత్రమే సందర్భం. అందుకే జోర్గెన్సన్ పరిచయం. ఆమె మీద కరడుగట్టిన రిపబ్లికన్స్ అంతా గుర్రుమంటున్నారట. రిపబ్లికన్స్ ఖాతాలో పడాల్సిన జార్జియా రాష్ట్రం బైడెన్ వశం కావడానికి జోర్గెన్సనే కారణమని. అవును ఆమె వల్లే ట్రంప్ ఓట్లు చీలాయి. ఈ ఎన్నికల్లో జోర్గెన్సన్కు పదహారు లక్షల ఓట్లు పడ్డాయి. ఆమె ప్రజలకు ఇచ్చిన మాట... నిర్మాణమే. యుద్ధమనే విధ్వంసం వద్దంది. వనరుల స్వాధీనం కోసం ప్రపంచ దేశాలతో అమెరికా చేస్తున్న ఆధిపత్యపోరును తీవ్రంగా వ్యతిరేకించింది. విదేశాల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కి పిలిపించాలని గళమెత్తింది. మూకుమ్మడిగా ఖైదు చేయడాన్ని, అమెరికా సమాఖ్య ప్రభుత్వ ప్రణాళికలను నిరసించింది. తను అధ్యక్షపదవిలోకి వస్తే అమెరికాను నిరాయుధ దేశంగా మలుస్తానని, ప్రపంచ దేశాల వ్యవహారాల్లో తలదూర్చకుండా ... హింసను ప్రేరేపించకుండా, తటస్థంగా ఉండేలా చూస్తానని చెప్పింది జోర్గెన్సన్. తను ఎన్నికైన మరుక్షణమే ప్రపంచ దేశాల్లోని అమెరికా మిలటరీ ఆపరేషన్స్ను నిలిపేసి.. ఆ సైన్యాన్ని స్వదేశానికి రప్పిస్తానని, విదేశాలకు అందించే ఫండ్ను ఆపేస్తానని చెప్పింది. సమాఖ్య ప్రభుత్వం విధించే ఇన్కమ్టాక్స్ను రద్దు చేస్తానని మాటిచ్చింది. అమెరికా పౌరుల వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు పాటుపడుతూ అమెరికాను సర్వశక్తి దేశంగా తీర్చిదిద్దుతామని, క్రిమినల్ జస్టిస్లో మార్పు తీసుకొస్తామనీ విన్నవించుకుంది జోర్గెన్సన్. ‘నేను రాజకీయాల పక్షం కాదు, బ్యూరోక్రాట్స్ పక్షమూ కాదు.. వాషింగ్టన్లోని పైరవీకారుల పక్షం అసలే కాదు. నేను ప్రజల పక్షం.. అంటే మీ పక్షం. ఇప్పుడున్న రెండు పార్టీలకూ ప్రజాప్రయోజనాల కన్నా వాషింగ్టన్లోని స్పెషల్ ఇంట్రెస్ట్లే ముఖ్యం. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ వంటి ఎన్నో హామీలను తుంగలో తొక్కింది. ప్రధానంగా అమెరికా స్థానిక ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వాళ్లను తమ పౌరులుగా గుర్తించనేలేదు’ అంది ఆమె. ఆ ఉపన్యాసానికి ఆకర్షితులయ్యారు ప్రజలు. అమెరికా ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తున్న ప్రపంచ ప్రేక్షకులకూ ఆసక్తి గలిగింది. ఆమె తలపెట్టిన అమెరికా పునర్నిర్మాణపు ఆలోచనలు నచ్చాయి. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నిక మీద ప్రపంచ దేశాలు ప్రధానంగా ఆసియా దేశాలు.. ఇంకా చెప్పాలంటే ట్రంప్ గెలుపు ఓటముల మీద రైట్వింగ్ రాజకీయ భవిష్యత్తును అంచనా వేసుకుని సంబరపడ్డమో.. బాధపడ్డమో చేసే (వాణిజ్యం, వీసా వంటి లెక్కలు కాకుండా) దేశాలకూ జోర్గెన్సన్ ఆలోచనా విధానం సంతోషాన్ని కలిగించే విషయం. పెత్తనాల జోలికి వెళ్లకుండా సొంత కుంపట్లో ఎగసిపడ్తున్న నిప్పురవ్వల మీద అమెరికా దృష్టి పెట్టుకుంటే అంతకన్నా ప్రపంచ దేశాలకు కావాల్సిందేముంటుంది? మహిళ కాబట్టే ఆ సమస్యను గ్రహించింది. మహిళ కాబట్టే ఆ సవాలును స్వీకరించే చొరవ చూపించింది. పోరులో నిలబడింది. ప్రస్తుతం ప్రపంచంలోని ఇరవైమూడు దేశాల్లో ఇలాంటి స్త్రీ శక్తే అధికారంలో ఉంది. ప్రజలకు చేతినిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా కునుకు ఉండే భద్రతను కల్పిస్తోంది. ప్రతి పౌరుడి ఆత్మగౌరవానికి రక్షణగా నిలస్తోంది. అందుకే ప్రపంచానికి కావల్సింది వైషమ్యాల విధ్వంసం కాదు.. సమైక్యనిర్మాణం. నిర్మొహమాటం, ధైర్యం, చొరవ కలిస్తే డాక్టర్ జో జోర్గెన్సన్. సౌత్ కరోలినాలోని క్లెమ్సన్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్ ఆమె. హాకీ ప్లేయర్ కూడా. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. జోర్గెన్సన్లో వ్యాపార దక్షతా మెండే. 1980లో ఏంబీఏ చదివింది. ఐబీఎంలో మార్కెటింగ్ రిప్రజెంటేటివ్గా చేరింది. తర్వాత సొంతంగా సాఫ్ట్వేర్ బిజినెస్ ప్రారంభించింది. పెళ్లి, పిల్లలతో కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూనే తన కెరీర్కూ బ్రేక్ పడకుండా చూసుకుంది. 1983లో లిబర్టేరియన్ పార్టీలో సభ్యత్వం తీసుకుంది. 2002లో సైకాలజీలో పీహెచ్డీ చేసింది. 2006 నుంచి ప్రొఫెసర్గా కొనసాగుతోంది. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే. -శరాది
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement