breaking news
dk siva kumar
-
Karnataka: ముగిసిన సిద్ధరామయ్య-శివకుమార్ భేటీ.. రాజీ ఫార్ములా?
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అధికార మార్పిడికి సంబంధించిన చర్చలు ముమ్మరమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ శనివారం ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో అల్పాహారం విందు చేశారు. 2026, మార్చి, ఏప్రిల్ నాటికి సిద్ధరామయ్య నుండి శివకుమార్కు ముఖ్యమంత్రి పీఠం బదిలీ అయ్యేలా ఫార్ములా రూపొందించినట్లు సమాచారం. త్వరలో ఈ వివరాలను ఇద్దరు నేతలు వెలువరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతవరకు శివకుమార్ డిప్యూటీగా కొనసాగనున్నారు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కర్ణాటకలో బహిరంగ విభేదాలను కోరుకోవడం లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని హఠాత్తుగా తొలగించడం పార్టీకి నష్టం కలిగిస్తుందనే ఉద్దేశంతో సమాలోచనలు జరుపుతోంది.ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಡಿ.ಕೆ.ಶಿವಕುಮಾರ್ ಅವರ ಜೊತೆ ಬೆಳಗ್ಗಿನ ಉಪಹಾರ ಸೇವಿಸುತ್ತಾ, ಕೆಲಹೊತ್ತು ಮಾತುಕತೆ ನಡೆಸಿದೆ. @DKShivakumar pic.twitter.com/7ak3xFjatL— Siddaramaiah (@siddaramaiah) November 29, 2025సమావేశం తర్వాత ఇద్దరు నేతలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు అంతా సవ్యంగానే ఉందనే సందేశాన్ని పంపాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ‘ఎక్స్’లో, "నేను డి.కె. శివకుమార్తో అల్పాహారం తీసుకున్నాను" అని పోస్ట్ చేయగా, శివకుమార్ మరింత లోతైన అర్థాన్నిచ్చేలా, ‘ఈ ఉదయం కావేరి నివాసంలో అల్పాహార సమావేశం కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశాను. కర్ణాటక ప్రాధాన్యతలు, ముందుకు సాగే మార్గంపై చర్చ జరిగింది’ అని రాశారు. ఈ అల్పాహార సమావేశంలో ఉప్మా, ఇడ్లీ, కేసరి బాత్ స్వీకరిస్తున్న ఇద్దరు నేతల ఫోటో.. వారి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని సూచిస్తోంది. ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಶ್ರೀ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರನ್ನು ಇಂದು ಅವರ ಕಾವೇರಿ ನಿವಾಸದಲ್ಲಿ ಭೇಟಿಯಾಗಿ ಉಪಾಹಾರ ಸಭೆ ನಡೆಸಲಾಯಿತು.Met Hon’ble CM Shri @siddaramaiah avaru at Cauvery Residence this morning for a breakfast meeting. A productive discussion on Karnataka’s priorities and the road ahead. pic.twitter.com/qhe7q5RNvi— DK Shivakumar (@DKShivakumar) November 29, 2025ఈ రాజీ ఫార్ములాకు శివకుమార్ అంగీకరించేందుకు అనేక బలమైన కారణాలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా పునర్వ్యవస్థీకరణలో ఆయన విధేయులకు మరిన్ని క్యాబినెట్ పదవులు లభించనున్నాయి. ఆయన రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా కొనసాగుతారు. ముఖ్యమంత్రిపై చర్య తీసుకునేందుకు ఆయనకు తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో శివకుమార్ పొందగలిగే ఉత్తమ ఒప్పందం ఇదేనని భావన ఉంది. కులం లెక్కల దృష్ట్యా, పార్టీ దృక్కోణం నుండి సిద్ధరామయ్యను తప్పించడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. ఆయన 'అహింద' (మైనారిటీలు, వెనుకబడిన తరగతులు,దళితులు) రాజకీయ కూటమికి అత్యంత శక్తివంతమైన నేతగా పేరొందారు. శివకుమార్ ఓబీసీ వొక్కలిగ సమాజానికి ప్రతినిధిగా ఉన్నారు. కాంగ్రెస్ ఈ నేతను కూడా దూరం చేసుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ కేంద్ర నాయకులను కలవడానికి శివకుమార్ శనివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. -
డీకే వర్సెస్ సిద్ధు.. ముదురుతున్న కర్ణాటక సంక్షోభం
సాక్షి, బెంగళూరు: అందరూ ఊహించినట్లే కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. 2023 వేసవిలో ఎన్నికల అనంతరం కుదిరిన చెరో రెండున్నరేళ్ల ఒప్పందం ప్రకారం... సీఎంగా సిద్ధరామయ్య వైదొలగాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి. గురువారంతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో అధికార మార్పిడిపై ఉత్కంఠ నెలకొంది. కానీ, అలాంటిదేమీ లేదని సంకేతాలు రావడంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా ఉండదని తేలింది.దీంతో డీకే శివకుమార్ వర్గానికి చెందిన మంత్రులు చెలువరాయస్వామి, దినేశ్ గుండూరావు, ఎమ్మెల్యేలు ఇక్బాల్ హుస్సేన్, హెచ్సీ బాలకృష్ణ, ఎస్ఆర్ శ్రీనివాస్, గుబ్బి శ్రీనివాస్, రవిగణిగ, ఉదయ్గౌడ, అనేకల్ శివణ్ణ, రంగనాథ్, బసవరాజు తదితర పదిమందిపైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లారు. అధికార మారి్పడి దిశగా చర్యలు లేకపోవడాన్ని ఢిల్లీలో అగ్ర నేతల ఎదుట లేవనెత్తేందుకు సిద్ధమయ్యారు. డీకేను సీఎం చేయాలని డిమాండ్ చేయనున్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోరారు. ఆయనతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాం«దీతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం వీరు అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉంది.కర్ణాటకలో 2023 వేసవిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిద్ధు, డీకే వర్గాలు గట్టిగా పోటీపడడంతో సీఎం పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఎవరూ పట్టు వీడలేదు. దీంతో చెరో రెండున్నరేళ్లు ప్రతిపాదన తెచ్చి ముందుగా సిద్ధును సీఎంను చేసేలా అనధికార ఒప్పందం జరిగింది. అప్పటికి ఉప ముఖ్యమంత్రి పదవితో డీకే సర్దుకున్నారు. ఇప్పుడు రెండున్నరేళ్లు పూర్తి కావడంతో తమ నేతను సీఎం చేయాలంటూ డీకే మద్దతుదారులు, ఎమ్మెల్యేలు హస్తిన బాట పట్టారు. ఐదేళ్లు నేనే సీఎం.. మిగతా రెండున్నరేళ్లు తానే సీఎంగా ఉంటానని, అధికార మారి్పడి లాంటిదేమీ లేదని సీఎం సిద్ధు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రజలు తమకు ‘ఐదేళ్లు’ అవకాశం ఇచ్చారని.. తాను కొనసాగుతానా? లేదా? అన్నది అప్రస్తుత చర్చ అని అంటున్నారు. నవంబర్ విప్లవం అంటూ సాగుతున్న ప్రచారం మీడియా కల్పితం అని కొట్టిపడేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా తానే బడ్జెట్ ప్రవేశపెడతానని తేల్చిచెప్పారు.రెండున్నరేళ్ల కాలం ముగిసినందున కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలించవచ్చని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పారు. అయితే, దీనిపై రాహుల్తో చర్చించి చెబుతానని ఖర్గే హామీ ఇవ్వగా.. దానిని అధికార మార్పిడి అంటూ తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంగా తానే కొనసాగుతానని సిద్ధు చాలా స్పష్టంగా చెప్పడం, డీకే వర్గం అలర్ట్ కావడంతో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం సంక్షోభ దిశగా సాగుతోందిఅధిష్ఠానం ఇప్పుడు మార్పు చేస్తుందా? బిహార్ ఎన్నికల్లో చతికిలపడి వారం రోజులు కూడా కాకముందే.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి కర్ణాటక తలనొప్పి మొదలైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంలో మార్పులు చేసి ఇబ్బంది కొని తెచ్చుకోవడం ఎందుకనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. దీంతో సిద్ధు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే ఆయన అంత ధైర్యంగా, బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఈ క్రమంలో తమకు అన్యాయం జరుగుతున్నదని గ్రహించిన డీకే వర్గం వెంటనే తేరుకుంది. అధిష్ఠానం వద్ద తేల్చుకునేందుకే డీకే వర్గం ఎమ్మెల్యేలు, నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. -
నేడు హైదరాబాద్ కు డీకె శివకుమార్
-
రీట్వీట్ చేసిన కేటీఆర్.. తప్పుపట్టిన కర్ణాటక మంత్రి.. అసలు ఏమైంది?
సాక్షి, బెంగళూరు: హౌసింగ్.కామ్, ఖాతాబుక్ సీఈవో రవీష్ నరేష్ కొన్ని రోజుల క్రితం చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రవీష్ నరేష్ ట్వీట్పై కేటీఆర్ స్పందించడం.. కేటీర్కు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకూమార్ కౌంటర్ ఇవ్వడానికి తోడు మంత్రి అశ్వత్నారయన్ కూడా మండిపడటం.. రాజకీయపరంగా దుమారం రేపుతోంది. అసలేం జరిగిందంటే.. కర్ణాటక రాజధాని బెంగళూరులో మౌలిక సదుపాయాలు సరిగా లేవంటూ రవీష్ నరేష్ ట్వీట్ చేశారు.‘బెంగళూరులో(భారత సిలికాన్ వ్యాలీ) ఐటీ సెక్టార్ అభివృద్ధి చెంది ఎన్నో స్టార్టప్లు బిలియన్ డాలర్ల పన్నులు చెల్లిస్తున్నాయి అయినప్పటికీ అధ్వానమైన రోడ్లు, విద్యుత్ కోతలు, నీటి సరఫరాక ఇబ్బందులు, పాడైన ఫుట్పాత్ల సమస్యలున్నాయి. భారత్లోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో సిలికాన్ వ్యాలీ కంటే మెరుగైన మౌలిక సదుపాయలు కలిగి ఉన్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. Pack your bags & move to Hyderabad! We have better physical infrastructure & equally good social infrastructure. Our airport is 1 of the best & getting in & out of city is a breeze More importantly our Govt’s focus is on 3 i Mantra; innovation, infrastructure & inclusive growth https://t.co/RPVALrl0QB — KTR (@KTRTRS) March 31, 2022 అయితే ఈ ట్వీట్పై కేటీఆర్ స్పందించారు. మీరంతా హైదరాబాద్కు రావొచ్చని, ఇక్కడ ఉత్తమ సదుపాయాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. ‘మీ బ్యాగులు సర్దుకుని హైదరాబాద్కి రండి. మా దగ్గర మెరుగైన భౌతిక మౌలిక సదుపాయాలు, మంచి సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మా విమానాశ్రయం అత్యుత్తమమైనది & నగరంలోకి రావడం బయటికి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా ప్రభుత్వం ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు,& సమ్మిళిత వృద్ధి(3 i) సూత్రాలపై దృష్టి పెట్టింది.’ అని రీట్వీట్ చేశారు. చదవండి: రాజకీయ నేతల మధ్య ఛాలెంజ్కి దారి తీసిన స్టార్టప్ కంపెనీ! Dear Shri @DKShivakumar & Shri @KTRTRS, In 2023, both of you friends can pack up & move to any place you like. The "double engine governments of BJP" will not only continue to restore glory to Karnataka but will also take Telangana on super highway of progress and prosperity. pic.twitter.com/bFZAjRG0QZ — BJP Karnataka (@BJP4Karnataka) April 4, 2022 తాజాగా కేటీఆర్ ట్వీట్పై కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్నారయన్ మండిపడ్డారు. బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్తను బ్యాగ్లు సర్దుకుని హైదరాబాద్కు వచ్చేయండంటూ చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ మాటతీరు సరైనదిగా లేదని, ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దురుసు మాటలు మాట్లాడం సరికాదని హితవు పలికారు. ఒకరిని మరొకరు కిందకు లాగేందుకు ప్రయత్నించడం ఏ ప్రభుత్వానికీ శ్రేయస్కరం కాదని సూచించారు. మనమంతా భారతీయులం, మనమంతా కలిసి ప్రపంచంతో పోటీ పడాలని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అదే విధంగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్లకు కర్ణాటక బీజేపీ శాఖ ఘాటుగా రిప్లై ఇచ్చింది. మీరిద్దరూ ఇక బ్యాగులు సర్దుకోవాలని కౌంటర్ వేసింది. నచ్చిన చోటుకి వెళ్లేందుకు ఇద్దరు స్నేహితులు సిద్ధంగా ఉండాలని సూచించింది. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కర్ణాటక వైభవం కాపాడడంతో పాటు తెలంగాణలోనూ మరింత పురోగమించేదిశగా పయనించేలా చేస్తామని చెప్పింది. Dear @DKShivakumar Anna, I don’t know much about politics of Karnataka & who will win but challenge accepted👍 Let Hyderabad & Bengaluru compete healthily on creating jobs for our youngsters & prosperity for our great nation Let’s focus on infra, IT&BT, not on Halal & Hijab https://t.co/efUkIzKemT — KTR (@KTRTRS) April 4, 2022 ఇక కేటీఆర్ సవాల్ను తను స్వీకరించినట్లు కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ పేర్కొన్నారు. ‘నా మిత్రుడు కేటీఆర్.. మీ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నా. 2023లో కర్నాటకలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మా హయాంలో బెంగుళూరుకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం.’ అని కేటీఆర్కు పరోక్షంగా కౌంటర్ వేశారు. అయితే కేటీఆర్ కూడా వెంటనే బదులిచ్చారు. ‘శివకుమార్ అన్నా.. కర్నాటక రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు. అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేను. కానీ మీరు విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నా. దేశ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో, దేశ ప్రగతికి హైదరాబాద్, బెంగుళూరు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. మౌళిక సదుపాయాల కల్పన, ఐటీ, బీటీలపై ఫోకస్ పెడుదాం. కానీ హలాల్, హిజాబ్ లాంటి అంశాలపై కాదు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. చదవండి: కేంద్రం మెడలు వంచే వరకూ పోరాడుతాం: మంత్రి గంగుల -
జేడీఎస్-కాంగ్రెస్ పొత్తుపై శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
విద్యుత్ కొరత
దొడ్డబళ్లాపురం : రాష్ర్టంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని, అయినా లోడ్ షెడ్డింగ్ లేకుండా చర్యలు చేపట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డి.కె.శివకుమార్ అన్నారు. తాలూకాలోని కనసవాడిలో ఇటీవల వినాయకుడి నిమజ్జనం సందర్భంగా హైటెన్షన్ విద్యుత్ తీగలు వృుతి చెందిన ఐదుగురి కుటుంబాలను ఆయన మంగళవారం పరామర్శించి, ప్రతి బాధిత కుటుంబానికి రూ. 9లక్షలు చొప్పున పరిహారం చెక్కులను అఆయన అందజేశారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ... ప్రైవేట్ కంపెనీలు అనుమతి పొందిన భూగర్భ మైనింగ్ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై తీవ్రంగా చూపుతోందని అన్నారు. రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పత్తి కూడా గణనీయం తగ్గిందని అన్నారు. ఈ కొరతను పూడ్చేందుకు మరమ్మతులో ఉన్న విద్యుత్ స్థావరాలను పునరుద్ధరించనున్నట్లు చెప్పారు. నిరంతర జ్యోతి పథకం కింద విద్యుత్ సరఫరాకు కొత్త కనెక్షన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ర్టంలో పింగాణి ఇన్సులేటర్లును పూర్తిగా మార్చి, కొత్త వాటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇకపై రాష్ట్రంలో ఎలాంటి ఉత్సవాలు, ఊరేగింపులకయినా విద్యుత్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇదే కార్యక్రమంలో బాధిత ప్రతి కుటుంబానికి రూ.25వేలు చొప్పున స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణయ్య సాయమందించారు. -
సౌరశక్తి నగరంగా బెంగళూరు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉద్యాన నగరి బెంగళూరును సౌర శక్తి నగరంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ తెలిపారు. శాసన సభలో విద్యుత్ శాఖ డిమాండ్లపై గ్రాంట్లకు మూడు రోజుల పాటు జరిగిన చర్చకు మంగళవారం ఆయన సమాధానమిచ్చారు. ఇళ్లపై సౌర ఘటకాలను అమర్చుకోవడం ద్వారా సౌర విద్యుదుత్పత్తికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో పథకాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతులు కూడా తమ పొలాల్లో సౌర ఘటకాలను అమర్చుకోవడం ద్వారా విద్యుదుత్పాదన చేపడితే సబ్సిడీ ఇస్తామని తెలిపారు. ఈ విద్యుత్ను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఐదెకరాల భూమి, రూ.ఏడు కోట్ల పెట్టుబడి ఉండి ఒక మెగావాట్ సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని వెల్లడించారు. బెంగళూరులో విద్యుత్ సమస్యను నివారించడానికి రూ.2,027 కోట్ల వ్యయంతో పథకాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో రాష్ర్టంలో విద్యుత్ కొరత లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ తాపత్రయమని చెప్పారు. వ్యవసాయ కనెక్షన్ల క్రమబద్ధీకరణ అక్రమ కనెక్షన్ల క్రమబద్ధీకరణ, కొత్త కనెక్షన్లకు విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం కొత్త సర్క్యులర్ను రూపొందించిందని మంత్రి తెలిపారు. 2012 జులై 31కి ముందున్న అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించుకోవాలనుకుంటే రూ.10 వేలతో పాటు డిపాజిట్ను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అలా చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి వసూలు చేస్తామని చెప్పారు. 2012 జులై 31 తర్వాత కనెక్షన్లను కోల్పోయిన వారు కూడా ఇంతే మొత్తం, డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాగా వ్యవసాయానికి 24 గంటలూ విద్యుత్ను సరఫరా చేయడానికి మీటర్లను అమర్చుతామని ఆయన తెలిపారు.


