-
తరిమెలలో విషాదం
అనంతపురం: అనంతపురం జిల్లా సింగనమల మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని తరిమెలకు చెందిన దివాకర్ అనే యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దివాకర్(27) నాలుగేళ్లుగా ఆరెకరాల భూమి కౌలుకు తీసుకుని వేరుశెనగ, పత్తి పంటలను సాగు చేస్తున్నాడు. వరుసగా పంటలు దెబ్బ తినడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాక రూ.4లక్షల వరకు అప్పులు మిగిలాయి. దీనిపై మనోవేదనతో ఉన్న దివాకర్ సోమవారం అర్థరాత్రి గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి కట్టుకున్న లుంగీతో ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దివాకర్కు భార్య, కుమారుడు ఉన్నారు. ఏఎస్ఐ ఇక్బాల్ భాషా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అసువులు బాసిన ఉద్యమ నేత
ముమ్మిడివరం, న్యూస్లైన్ : ఉద్యమమే ఊపిరిగా సమైక్యాంధ్ర రక్షణ కోసం శ్రమించిన వైఎస్సార్ సీపీ నేత గిడ్డి దివాకర్ (55) ఉద్యమంలోనే తుదిశ్వాస విడిచారు. అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి పిలుపు మేరకు ముమ్మిడివరం పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం చేసిన రిలే దీక్షల్లో పాల్గొన్న దివాకర్ గుండెపోటుకు గురై వేదికపైనే కుప్పకూలారు. ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందా రు. ఆయనకు భార్య సావిత్రి, కుమారులు గోపీచంద్, సూర్యచంద్ ఉన్నారు. దివాకర్ నడవపల్లి పంచాయతీ శివారు గిడ్డివారిపేట వాసి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వీరాభిమాని. వైఎస్సార్ కాంగ్రెస్ కాట్రేనికోన మండ ల సేవాదళ్ కన్వీనర్గా సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో దివాకర్ భౌతికకాయాన్ని మాజీమంత్రి పినిపే విశ్వరూప్ సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. భౌతిక కాయాన్ని పార్టీ కార్యాలయం వరకు ఊరేగించారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గుత్తుల సాయి, ఇంకా నలమాటి లంకరా జు, జగతా బాబ్జీ శ్రద్ధాంజలి ఘటించారు. ఉద్యమయోధుడు ‘దివాకర్’ కాట్రేనికోన : దీక్షలో అసువులు బాసిన దివాకర్ ఉద్యమ చరిత్రలో యోధునిగా నిలిచిపోతారని వైఎస్సార్ కాంగ్రె స్ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ కొనియాడా రు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గొల్ల బాబూరావు తదితరులు కాట్రేనికోన వచ్చి దివాకర్ భౌతికకాయం వద్ద నివాళులర్పించి, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. బోస్ మాట్లాడుతూ పార్టీకి దివాకర్ సేవలు ఎనలేనివన్నారు. పార్టీ తరఫున ఆయన కుటుంబానికి రూ. లక్ష సహాయం అందజేస్తామని కుడుపూడి చిట్టబ్బా యి ప్రకటించారు. గొల్ల బాబూరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఎందరి గుండెలు ఆగిపోతున్నా కేంద్రప్రభుత్వ గుండె కరగడం లేదన్నారు. పార్టీ నేతలు గుత్తుల సా యి, మిండగుదిటి మోహన్, పి.కె.రావు, కర్రి పాపారాయుడు, భూపతిరాజు సుదర్శనబాబు, చెల్లుబోయిన శ్రీ ను, విత్తనాల వెంకటరమణ, కాలే రాజబాబు, పాలెపు ధర్మారావు, దంతులూరి రవివర్మ శ్రద్ధాంజలి ఘటించారు. ద్వారంపూడి సంతాపం కాకినాడ సిటీ తాజామాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సిటీ పార్టీ కన్వీనర్ ఆర్వీజేఆర్ కుమార్ కూడా దివాకర్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement