breaking news
Dimanti Colony
-
ఇమైక్కా నోడిగళ్ కోసం భారీ సెట్
సాధారణంగా కొన్ని చిత్రాలు ప్రేక్షకులకు ఉత్సాహాన్నిస్తాయి. మరికొన్ని వినోదాన్ని అందిస్తాయి. ఇక తక్కువ చిత్రాలు మాత్రమే థియేటర్లలో ప్రేక్షకుల్ని కదలకుండా కట్టి పడేస్తాయి. అలాంటి చిత్రంగా ఇమైక్కా నోడిగళ్ ఉంటుందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు. తొలి చిత్రం డిమాంటీ కాలనీతోనే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన దర్శకుడు ఏఆర్.మురుగదాస్ స్కూల్ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. యువ నటుడు అధర్వ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ పాపులర్ నటి రాశీఖన్నా హీరోయిన్గా తమిళ చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. కాగా ప్రముఖ నటి నయనతార కీలక పాత్రలో నటించడం విశేషం. క్యామియో ఫిలింస్ పతాకంపై సీజే.జయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం చెన్నైలోని ఎంజీఆర్ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ఎంజీఆర్ ఫిలింసిటీలో ఈ చిత్రం కోసం బ్రహ్మాండమైన సెట్ను వేసి చిత్రీకరణ జరుపుతున్నట్లు వెల్లడించారు. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభానికి ముందే ఇమైక్కా నోడిగళ్ చిత్రం ఇటు చిత్ర వర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ భారీ అంచనాలను ఏర్పరచిందన్నారు. వాటిని కచ్చితంగా రీచ్ అవుతుందనే విశ్వాసాన్ని నిర్మాత సీజే.జయకుమార్ వ్యక్తం చేశారు. -
డిమాంటి కాలనీ షూటింగ్ ప్రారంభం
హర్రర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోందనే చెప్పాలి. యువ హీరో అరుళ్నిధి సైతం హారర్ కథా చిత్రాల బాట పట్టారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం డిమాంటి కాలనీ. హర్రర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా ఏఆర్ మురుగదాస్ శిష్యుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు మెగాఫోన్ పడుతున్నారు. ఈయన 7 ఆమ్ అరి వు, తుపాకీ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. మోహనా మూవీస్, శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం చెన్నైలో జరిగాయి. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది మూడు కాల ఘట్టాల్లో జరిగే యథార్థ గాథ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. భయానక సన్నివేశాలతో కూడిన హర్రర్ కథా చిత్రం డిమాంటి కాలనీ అని తెలిపారు. ఒక ప్రముఖ నటి హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో రమేష్ తిలక్, అభిషేక్ సానత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పా రు. చిత్రం కోసం మూడు కాల ఘట్టాలను ఆవిష్కరించే విధం గా మూడు బ్రహ్మాండమైన సెట్స్ను వేస్తున్నట్లు తెలిపారు. చిత్రానికి సంతోష్ శివన్ శిష్యుడు అరవింద్ సింగ్ చాయాగ్రహణం, ఏఆర్ రెహ్మాన్ శిష్యుడు కెపాజరమియా సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. మా వీరన్, 7 ఆమ్ అరివు, నాన్ ఈ చిత్రాలకు అబ్బురపరిచే గ్రాఫిక్స్ను రూపొందించిన కమలకన్నన్ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందిస్తున్నారని చెప్పారు. చిత్ర షూటింగ్ను నాన్స్టాప్గా చెన్నై, పొల్లాచ్చి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఏ కే తమిళరసు, ఎన్.మురళి, ఏఆర్ మురుగదాస్, పాండియరాజ్ తదితరులు విచ్చేసి చిత్ర యూనిట్కు ఆశీసులు అందించారు.