breaking news
Differences between couple
-
పెళ్లయిన నెల రోజులకే విభేదాలు.. కలిసి ఉండలేమంటూ కోర్టు మెట్లు
సాక్షి, పుట్టపర్తి: వందేళ్లు కలసి బతకాల్సిన వారు చిన్నపాటి కారణాలతో విడిపోతున్నారు. పెళ్లయిన ఆరు రోజుల నుంచి ఆర్నెల్లు గడవకముందే భాగస్వామి అర్ధం కావడం లేదనో, అర్ధం చేసుకోవడం లేదనో విడిపోవాలనుకుంటున్నారు. జీవితాంతం కలిసి ఉండే బలమైన బంధమే దాంపత్య జీవితం అని గుర్తించలేకపోతున్నారు. ఒకరి భావాలను ఒకరు అర్ధం చేసుకోకుండా తమ ఆలోచనల్ని గౌరవించడం లేదంటూ వేదనకు గురవుతున్నారు. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా రెండు కుటుంబాల్లో మనస్పర్థలు వస్తున్నాయి. సర్దుకుపోతే ఎలాంటి సమస్య ఉండదని తెలిసినా.. విడాకుల వరకూ వెళ్తున్నారు. ● పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామ్కు చెందిన 24 ఏళ్ల యువతికి పెనుకొండకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్తో గతేడాది వివాహమైంది. నెల రోజుల వ్యవధిలోనే దంపతుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ ఏడాది జనవరిలో పోలీస్ మెట్లు ఎక్కారు. ఇప్పటి వరకూ సమస్య తెగలేదు. పెద్ద మనుషుల సమక్షంలో సర్దిజెప్పినా వినలేదు. పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ● జగరాజుపల్లికి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి అదే గ్రామానికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన మూడేళ్ల నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. ఆరేళ్లుగా పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. విడాకులు తీసుకోలేదు. పెద్ద మనుషుల సమక్షంలో కలిసి జీవిస్తామని వెళ్లినా తిరిగి వారం రోజులకే విడిపోయారు. వారి మధ్యలో ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతున్నారు. ● గోరంట్లకు చెందిన డిప్లొమా విద్యార్థికి బాగేపల్లికి చెందిన మెకానిక్తో ఏడాది క్రితం వివాహమైంది. మూడు నెలలకే గొడవలు మొదలయ్యాయి. అమ్మాయి పుట్టింటికి చేరింది. సర్దిజెప్పినా వినలేదు. తర్వాత అమ్మాయి ఇంటికే అబ్బాయి వచ్చాడు. నెల రోజుల తర్వాత పంచాయితీ మొదటికొచ్చింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. దంపతుల మధ్య సమస్య కారణంగా ఇరు కుటుంబాల్లో గందరగోళం నెలకొంది. అహమే కారణమా? ఏడడుగులు నడిచి ఏడాది గడవక ముందే ఎన్నో జంటలు విడిపోతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులకు కన్నీరు మిగిలిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులను పోషించకపోవడం.. మరికొందరు తాగుడుకు బానిసై కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. మనుషుల మధ్య అహంతోనే ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి రచ్చకెక్కుతున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రతి సోమవారం నిర్వహించే పోలీసు స్పందన కార్యక్రమంలో భార్యభర్తల కేసులు పెరిగిపోతున్నాయి. వచ్చే పిటిషన్లలో మూడింట రెండోవంతు ఉంటున్నాయి. ఆధిపత్య ధోరణితోనే సమస్యలు కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. బండికి రెండు చక్రాలు సమానంగా.. సరిగ్గా ఉంటేనే ముందుకు వెళ్తుంది. అలా కాకుండా ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనే ధోరణి ప్రదర్శిస్తుండటంతో గొడవలు పెరుగుతున్నాయి. తాము చెప్పిందే భార్య వినాలని కొంతమంది భర్తలు, తాను చెప్పినట్లే చేయాలని భార్యలు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. ఆమె మాటను ఆయన గౌరవించకపోవడం, ఆయనకు ఆమె విలువ ఇవ్వకపోవడంతోనే కాపురంలో కలతలు పెరుగుతున్నాయి. మొండి వైఖరి.. క్షమాపణ కోరితే పోయేదేమీ లేదు దంపతులు మొండి వైఖరి వీడి సామరస్యంగా మాట్లాడుకుంటే నాలుగు గోడల మధ్యనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎదుటి వారిపై ఆధిపత్యం ప్రదర్శించాలనే ధోరణి మానేయాలి. జీతాలు, హోదాలు ఎన్ని ఉన్నా కుటుంబం ముఖ్యమనే భావనతో మెలగాలి. దంపతుల మధ్య తగాదా వస్తే మూడో మనిషి దగ్గరకు వెళ్లకుండా ఉంటే మంచిది. తప్పెవరిదో తెలిస్తే క్షమాపణ కోరితే పోయేదేమీ లేదు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా పిల్లలు అనాథలుగా మారుతారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా అవగాహనతో ముందుకెళ్తే మంచిది. – ఎస్వీ మాధవ్రెడ్డి, ఎస్పీ -
అనుమానమే పెనుభూతమై..
దంపతుల మధ్య విభేదాలు.. వేర్వేరు కాపురాలు.. ఇంట్లో ఏ మాత్రం అనారోగ్యం, అస్వస్థత కలిగినా భర్తే మంత్రాలు చేస్తున్నాడని భార్య అనుమానం.. అనుమానమే పెనుభూతమైంది.. మంత్రాలు చేసి ఇంటిళ్లిపాదిని చంపేస్తాడేమోనని భార్యే, భర్త హత్యకు పన్నాగం పన్నింది.. ఇదీ చౌటుప్పల్ మండలం లక్కారం శివారులో, దారుణంగా గొంతు కోసి హత్య చేసి, కాల్చేసి దొరికిన శవం మిస్టరీ. చౌటుప్పల్ పోలీస్స్టేషన్లో శనివారం ఉదయం పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు హత్యకేసు వివరాలు వెల్లడించారు. -చౌటుప్పల్ నల్లగొండలోని పానగల్లుకు చెందిన దండిగ లింగయ్య పెద్దకూతురు శాలిగౌరారం మండలం చెరువుమాదారం గ్రామానికి చెందిన సంకటి మల్లేష్(35)తో మొదట వివాహమైంది. కుమారుడు జన్మించాడు. ఈమె అనారోగ్యంతో చనిపోవడంతో, ఈమె సోదరి భారతమ్మ(30)ను ఇచ్చి వివాహం చేశారు. ఈమెకు ఇద్దరు కుమారులు. 2004లో దండిగ లింగయ్య, సంక టి మల్లేష్లు కుటుంబాలతో కలిసి చౌటుప్పల్కు వలస వచ్చారు. హనుమాన్నగర్లో అం తా ఒకేచోట నివాసమున్నారు. 2011లో మల్లేష్ తన మామను కొట్టడంతో, పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు. అప్పటి నుంచి మల్లేష్ చౌటుప్పల్లోని మల్లికార్జున నగర్లో నివాసముంటున్నాడు. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. భారత మ్మ మాత్రం తల్లిదండ్రులతోనే ఉంటోంది. మల్లేష్ ఇటీవల నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి దేవాలయంలో నిత్య పూజలు చేస్తూ, జుట్టును ఏపుగా పెంచాడు. భారతమ్మ ఇం ట్లో ఎవరికి అనారోగ్యం వచ్చినా,అశుభం జరిగినా, మల్లేష్ మంత్రాలు(బాణామతి) చేయడం వల్లే ఇలా జరుగుతుందని ఇంటిళ్లిపా ది అనుకుంటున్నారు. ఈ క్రమంలో భారతమ్మ తన తండ్రి కుటుం బంతో పా టు తనను చేతబడి చేసి, మల్లేష్ చంపుతాడేమోనని అనుమానం పెరిగి పోయింది. ఇటీవల ఆమె తమ్ము డు దండిగ నాగరాజు(20)కు చిన్న ప్రమాదం అయితే, అది చేతబడి వల్లేనని నమ్మారు. దీం తో భారతమ్మ తన భార్త మల్లేష్ను అంతం చేయాలని తమ్ముడు నాగరాజుతో కలిసి కుట్రపన్నింది. మల్లేష్ ఇంటికే వస్తానని చెప్పి.. హత్యకు 10రోజుల ముందు నుంచే భారతమ్మ మల్లేష్ ఉంటున్న ఇంటికి సామాను సదురుకొని వస్తానని సంకేతాలిచ్చింది. దీంతో మల్లేష్ ఇరుగుపొరుగు వారికి తన భార్య ఇంటికి వస్తానంటోందని చెప్పాడు. వారు వస్తే తీసుకొచ్చుకొమ్మని చెప్పారు. గత నెల 30వ తేదీన భారతమ్మ తన చిన్న కుమారుడితో కలిసి తాపీమేస్త్రీల అ డ్డాకు వచ్చింది. చిన్నకుమారుడు మల్లేష్ను కలి సి తాత, అమ్మ గొడవ పెట్టుకున్నారని, అమ్మ మన ఇంటికి వస్తానంటోంది అని చెప్పాడు. దీం తో మల్లేష్ సామాను తీసుకొచ్చుకుందామని భార్య వెనకాలే, 11గంటల సమయంలో మామ ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి రాగానే, కంట్లో కారం కొట్టి రోకలిబండతో తలపై బలంగా కొట్టింది. నాగరాజు బిగ్గరగా పట్టుకున్నాడు. మల్లేష్కు మంత్రాలు వస్తాయని, ప్రాణం పోదని, గొంతు లో కాగితాలు ఉంటాయని, అవి తీస్తేనే, ప్రా ణం పోతుందని గొంతు కోశారు. చివరకు ప్రా ణం పోవడంతో, బట్టబొంతలో ముదిరి, గోనే సంచిలో వేచి మూతి కట్టారు. ఇల్లును శుభ్రం చేశారు. హత్యకు ఉపయోగించిన రోకలిబండ, కత్తిని దూరంగా పడేశారు. శవాన్ని ఇంటిలో నుంచి తీసుకెళ్లేందుకు, నల్లగొండలోని ప్రకాశంబజార్కు చెందిన సమీప బంధువు మున్న శ్రీకాంత్(21)కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆటోను తీసుకొని రాత్రి ఇంటికి రమ్మని చెప్పి ంది. ఆయన తిప్పర్తి మండలం ఖాజిరామారం గ్రామానికి చెందిన షేక్ నయీమ్(21) ఆటోకు అద్దెకు తీసుకొని మంగళవారం రాత్రి 9.30గంటల సమయంలో చౌటుప్పల్కు వచ్చాడు. ఆలోపు భారతమ్మ లక్కారం శివారులోని నిర్జన ప్రదేశానికి వెళ్లి, శవాన్ని పడేయాల్సిన చోటును చూసి వచ్చింది. రాత్రిపూట శవాన్ని ఆటోలో వేసుకొని, మృతదేహాన్ని అక్కడ వేసి పెట్రోల్ పోసి కాల్చి వెళ్లిపోయారు. మల్లేష్ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెతుకుతున్నారు. ఈ నెల 2న పోలీసులకు మృతదేహం లభ్యమవడం, అతని జుట్టు ఏపుగా పెరిగి ఉం డడం, స్థానికులు జుట్టు ఏపుగా ఉన్న వ్యక్తి మ ల్లేష్ అని పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకొని, విచారించడంతో నేరం అంగీకరించారు. భారతమ్మ, నాగరాజు, శ్రీకాం త్, షేక్ నయీంలను శనివారం రామన్నపేట కోర్టులో హాజరుపరిచా రు. జడ్జి ఆదేశాల మేరకు నల్లగొండ జైలుకు తరలించారు. ఐడీపార్టీ పోలీసులను సీఐ అభినందించారు. సమావేశంలో ఎస్ఐలు మల్లీశ్వరి, హ రిబాబు, యాదవరెడ్డి, ఈద్దయ్య, యాదగిరి, తి రుపతిరావు, శ్రీనివాస్, సైదులు పాల్గొన్నారు.