-
పుంజుకుంటున్న పారిశ్రామిక విద్యుత్
సాక్షి, అమరావతి: పారిశ్రామిక విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల్లో పురోగతి కనిపిస్తున్నా.. ఎగుమతులు, దిగుమతులపై ఆధారపడే భారీ పరిశ్రమలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది. ఫెర్రో అల్లాయిస్ పారిశ్రామిక వేత్తలు ఇటీవల ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లిని కలిశారు. ఆ రంగానికి విద్యుత్ రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం పురోగతిని ఇంధన శాఖ సమీక్షించింది. ఆ వివరాలివీ.. అది గడ్డుకాలమే! రాష్ట్రంలో 2019 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 3,975.66 మిలియన్ యూనిట్లు ఉంటే.. ఈ ఏడాది అదే త్రైమాసికంలో 2,754.14 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దాదాపు 31 శాతం డిమాండ్ తగ్గింది. ఈ కాలంలో పారిశ్రామిక విద్యుత్ రెవెన్యూ వసూళ్లు 32 శాతం తగ్గి విద్యుత్ రంగం గడ్డుకాలాన్ని ఎదుర్కొంది. జూలై, ఆగస్టు నెలల్లో విద్యుత్ వినియోగం తిరిగి వేగం పుంజుకుని 1,444.75 మిలియన్ యూనిట్లకు చేరింది. పరిశ్రమలకు ప్రభుత్వ అండ కోవిడ్ సమయంలోనూ పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఫెర్రో అల్లాయిస్ పారిశ్రామిక వేత్తలు రాయితీలు కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. – శ్రీకాంత్ నాగులాపల్లి, ఇంధన శాఖ కార్యదర్శి -
మహాజాతరపై సీఎస్ సమీక్ష
మహాజాతరపై సీఎస్ సమీక్ష =ఈ నెలాఖరులోపు పనులన్నీ పూర్తి చేయాలి =నిర్వహణకు మరో రూ. 6 కోట్లు =ఇందులో విద్యుత్ శాఖకు రూ.కోటి విడుదల =రెవెన్యూకు రూ.3 కోట్లు.. పోలీసులకు రూ.2 కోట్లు =పనుల పర్యవేక్షణకు సీనియర్ అధికారులు =హైదరాబాద్లో జరిగిన సమావేశంలో మహంతి వరంగల్, న్యూస్లైన్ : వచ్చే నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న మేడారం మహాజాతరకు సంబంధించి చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే.మహంతి ఆదేశించారు. జాతర పనులపై హైదరాబాద్లో సోమవారం కలెక్టర్ కిషన్తోపాటు పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు జరిగిన సమావేశంలో నిధుల కేటాయింపు, విడుదల... విద్యుత్, దేవాదాయ శాఖల మధ్య కొన్ని రోజులుగానెలకొన్న వివాదానికి సీఎస్ తెరదించారు. విద్యుత్ శాఖకు జిల్లా యంత్రాంగం రూ.25 లక్షలు ఇచ్చిందని... ఆ శాఖ ప్రస్తుతం చేపట్టే పనులకు ప్రభుత్వం తరఫున రూ.కోటి విడుదల చేస్తున్నట్లు మహంతి తెలిపారు. ఇప్పటికైనా పనులు త్వరగా పూర్తి చేయాలని సూచిం చారు. అదేవిధంగా జాతర నిర్వహణ కోసం మరో రూ.ఐదు కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో నుంచి జాతరలో ప్రొటోకాల్, భోజనాలు, నాలుగు రోజులపాటు అధికారుల బస, ఇతర నిర్వహణ ఖర్చుల కింద రెవెన్యూ శాఖకు రూ.3 కోట్లు కేటారుుంచినట్లు వెల్లడించారు. ఇక పోలీస్ శాఖకు కూడా ఈసారి ముందుగానే నిధులిస్తున్నామని... భద్రత, భోజనాలు, ఇతర అలవెన్స్లకు రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. వెంటనే రూ.6 కోట్లు విడుదల చేయూలని ఫైనాన్స్ విభాగానికి ఉత్తర్వులిచ్చినట్లు వివరించారు. జాతరలో ప్రధానంగా ఇంజినీరింగ్ పనులన్నింటినీ ఈనెలాఖరు వరకు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని జిల్లా అధికారులకు సీఎస్ సూచించారు. పనుల ప్రగతిపై కలెక్టర్ వివరణ మేడారం పనుల ప్రగతిపై కలెక్టర్ కిషన్ ముందుగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎస్ మహంతికి వివరించారు. ప్రధానంగా ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, వాటి ప్రగతిని నివేదించారు. మహా జాతరను పురస్కరించుకుని ఫిబ్రవరి ఐదో తేదీ నుంచే పోలీస్, మెడికల్, పంచాయతీతోపాటు పలు విభాగాల అధికారులు స్థానికంగానే ఉంటారని... ఫిబ్రవరి 1 నుంచే ప్రత్యేక బస్సులను మేడారానికి తిప్పునున్నట్లు వివరించారు. అనంతరం జిల్లా యంత్రాంగానికి సీఎస్ పలు సూచనలు చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.4.99 కోట్లతో చేపట్టిన ఏజెన్సీ రోడ్ల అభివృద్ధి, తాగునీటి సరఫరా పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మేడారం వెళ్లి తనిఖీలు చేపట్టాలనిగిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజినీర్ను ఆదేశించారు. పీఆర్ విభాగం రూ. 7.69 కోట్లతో చేపట్టిన ఆరు రోడ్ల విస్తరణ, సీసీ రోడ్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పర్యవేక్షణకు సీనియర్ అధికారులు మేడారం పనుల పర్యవేక్షణకు హైదరాబాద్ నుంచి సీనియర్ అధికారులను నియమించనున్నట్లు సీఎస్ మహంతి వెల్లడించారు. మొత్తం రూ.100 కోట్లతో చేపట్టనున్న పనులకు సంబంధించి నాణ్యత ప్రమాణాలను వారు పరిశీలించనున్నట్లు వివరించారు. అదేవిధంగా పారిశుద్ధ్య పనుల కోసం రాజమండ్రి నుంచి రెండు వేల మంది కార్మికులను ప్రత్యేకంగా రప్పించనున్నట్లు పేర్కొన్నారు. జాతరకు నాలుగు రోజుల ముందు, పూర్తి అయిన వారం రోజుల వర కు వారు మేడారంలో విధులు నిర్వర్తిస్తారని చెప్పా రు. శానిటేషన్ నిర్వహణకు వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ సాయం తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, వైద్యం, తాగునీరు ప్రధానం కోటి మందికి పైగా వచ్చే ఈ జాతరకు పారిశుద్ధ్యం, వైద్యం, తాగునీటి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సీఎస్ సూచించారు. నీటి పారుదల శాఖ ద్వారా రూ. 9.81 కోట్లతో 426 మీటర్ల స్నాన ఘట్టాల నిర్మాణం, కొత్తగా 50 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జాతరకు మూడు రోజుల ముందు నుంచే క్లోరినేషన్ చేయాలని, బ్లీచింగ్ పౌడర్ను ప్రధాన ప్రాంతాల్లో నిల్వ చేయాలని, పంచాయతీ విభాగం వాటర్ క్లోరినేషన్లో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలి పలు పనులను జాతర కోసమే కాకుండా... జాతర తర్వాత కూడా ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సీఎస్ సూచించారు. ఏటా చేపట్టాల్సినవి కాకుండా... శాశ్వతంగా ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జాతర పనులపై కలెక్టర్ కిషన్దే బాధ్యత అని, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. ఆ అధికారుల వివరాలు ఇవ్వండి... గత జాతరలో విధులు నిర్వర్తించిన అధికారుల సహాయ సహకారాలు తీసుకోవాలని, ఐదు రోజుల పాటు డిప్యూటేషన్ విధులు కేటాయించాలన్నారు. జాతర నిర్వహణలో అనుభవం ఉండి, ఇతర జిల్లాలో పనిచేస్తున్న అధికారుల వివరాలివ్వాలని కలెక్టర్ కిషన్కు సీఎస్ సూచించారు. ఈ సందర్భంగా జాతర నిమిత్తం 3600 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. జాతరలో శాంతిభద్రతల పర్యవేక్షణకు పది వేల మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్లు ఐజీ వివరించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి విద్యాసాగర్, కమిషనర్ ఉదయలక్ష్మి, దేవాదాయ శాఖ కార్యదర్శి వెంకటేశ్వర్లు, కమిషనర్ ముక్తేశ్వర్రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి అరవిందరెడ్డి, అటవీ శాఖ ప్రిన్సిపల్ సీసీఎఫ్ జోసెఫ్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ కాస్రాజవశ్రీ, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకుడు సుభాష్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తికేయ మిశ్రా, ఈఎన్సీ రాజేంద్ర ప్రసాద్, జేసీ పౌసుమిబసు, ఐటీడీఏ పీఓగా పని చేసి ఇటీవలే కరీంనగర్ జేసీగా బదిలీ అయిన సర్ఫరాజ్ అహ్మద్, ఆర్అండ్బీ ఎస్ఈ మోహన్ నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్ పాల్గొన్నారు. -
డెడ్లైన్ 31
సాక్షి, బెంగళూరు : నిబంధలనకు విరుద్ధంగా రైతుల నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుపుతున్న నైస్ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మా ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయఅధ్యక్షుడు దేవెగౌడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నైస్ కంపెనీ వ్యవస్థాపకుడు అశోక్ఖైనీ ప్రతి విషయానికి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని పనులు కానిచ్చేస్తున్నాడన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుని నైస్ కంపెనీ చేపట్టిన ‘బెంగళూరు-మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్షర్ కారిడార్’ (బీఎంఐసీ)ను రద్దు చేసి ఇతర సంస్థలకు అప్పగించాలన్నారు. లేదా ప్రభుత్వమే ఈ పథకాన్ని చేపట్టాలన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘బీఎంసీ’ ప్రాజెక్టును తామే చేపడుతామని ముందుకు వచ్చాయన్నారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలోనే ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పాయన్నారు. అంతేకాకుండా టోల్ కూడా సేకరించబోమని చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే అప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదన్నారు. అందువల్లే ప్రస్తుతం ‘బీఎంఐసీ’ కోసమని రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకోవలసిన పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే కలుగజేసుకుని రైతులకు న్యాయం చేయాలని దేవెగౌడ పేర్కొన్నారు. 6- అప్పిచ్చిన వ్యక్తిపై తుపాకీతో కాల్పులు గంగావతి, న్యూస్లైన్ : అప్పు ఇచ్చిన సొమ్మును తిరిగి చెల్లించాలని అడిగిన వ్యక్తిని రుణం పొందిన వ్యక్తి మరొకరి సాహయంతో నాటు తుపాకితో కాల్పులు జరిపిన సంఘటన గంగావతి తాలూకా తాలూకాలోని మొలకనమరళి గ్రామం వద్ద సోమవారం జరిగింది. వివరాలు.. గంగావతి తాలూకాలోని వడ్రహట్టి గ్రామానికి చెందిన చెన్ననగౌడ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బసవరాజ్ వడ్రహట్టికి రూ.4.50 లక్షలు అప్పు ఇచ్చాడు. దీంతో చెన్నన గౌడకు బసవరాజ్ ఫోన్ చేసి నీ అప్పు చెల్లిస్తానని మొలకనమరళి గ్రామం వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో చెన్ననగౌడ కారులో ఆ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడికి రాగానే చెన్ననగౌడను బసవరాజ్ వడ్రహట్టి, అతని స్నేహితుడు నరసప్ప నాటు తుపాకితో కాల్చారు. దీంతో తుపాకి గుండు తలలో దూసుకుపోవడంతో చెన్ననగౌడ నేల కూలుతూ రక్షించండి.. రక్షించండి అంటూ కేకలు వేయడంతో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని బసవరాజ్ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆయనకు తోడుగా వచ్చిన నరసప్ప, పరారై అనంతరం పోలీసులకు లొంగి పోయాడు. కాల్పులకు ఉపయోగించిన నాటు తుపాకిని, బసవరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షతగా త్రుడికి గంగావతి ఆస్పత్రిలో చికి త్స అనంతరం బళ్లారి విమ్స్కు తరలిం చారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ పరిశీలన : ఘటనా స్థలాన్ని కొప్పళ జిల్లా ఎస్పీ మంజునాథ్ అన్నిగి పరిశీలించారు. అనంతరం ఆయన గంగావతి పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలికి తీస్తామన్నారు. ఈ సందర్భంగా గంగావతి డీవైఎస్పీ శాంతకుమార్, సీపీ ప్రభాకర్ ధర్మట్టి, టౌన్ సీఐ కాళీకృష్ణ, తదితరులు ఉన్నారు. గంగావతి రూరల్ పోలీస్ కేసు దర్యాప్తు చేపట్టారు. గంగావతి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చగా తీవ్ర ప్రమాదస్థితిలో ఉందన్న వైద్యులు ఆయన విమ్స్కు తరలించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement