breaking news
delhi teacher
-
ఢిల్లీలో దారుణం.. విద్యార్థినిని మొదటి అంతస్తు నుంచి విసిరేసిన టీచర్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి మంచి మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయురాలు ఓ విద్యార్థిని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని టీచర్ మొదటి అంతస్తు నుంచి బయటకు విసిరేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలో పనిచేసే నగర్ నిగమ్ బాలికా విద్యాలయంలో ఉదయం 11.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారిని వందనగా గుర్తించారు. బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. చిన్నారిని మొదటి అంతస్తు నుంచి తోసేసే ముందు విద్యార్థినిపై టీచర్ గీతా దేశ్వాల్ కత్తెరతో దాడి చేసింది. గమనించిన రియా అనే మరో టీచర్ చిన్నారిని కొట్టకుండా అడ్డుకుకునేందుకు ప్రయత్నించింది. అయినా వినకుండా కోపంతో టీచర్ వందనను క్లాస్ రూమ్లోని బాల్కనీ నుంచి కిందకు తోసేసింది. వెంటనే గమనించిన పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసీలు తీవ్రంగా గాయపడిన చిన్నారిని బారా హిందూ రావు అసుపత్రికి తలించారు. విద్యార్థినికి అవసరమైన అన్ని పరీక్షలు చేశామని, ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని చికిత్సకు స్పందిస్తుందని వైద్యులు తెలిపారు. అయితే బాలిక చికిత్సకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. ఈ ఘోరానికి పాల్పడిన ఉపాధ్యాయురాలు గీతా దేశ్వాల్ను సస్పెండ్ చేశామని, దీనిపై విచారణ జరుగుతోందని ఎమ్సీడీ సీనియర్ అధికారి తెలిపారు. నిందితురాలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా చౌహాన్ తెలిపారు. చదవండి: షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి.. -
ఫొటోకు పోజు.. తలలోకి తూటా..
సాక్షి, న్యూఢిల్లీ : నిత్యం వార్తల్లో వస్తున్న అప్రమత్తం కాకపోవడంతో సెల్ఫీ మరణాలు ఎక్కువవుతూనే ఉన్నాయి. ప్రమాదకరమైన వస్తువులతో కెమెరాకు పోజులివ్వడం.. క్లిక్ ఇచ్చే సమయానికి తమ చేతుల్లోని వస్తువులను కూడా నొక్కేయడం ఆ వస్తువు కాస్త తుపాకీ అయి ఉంటే అది పేలిపోయి ప్రాణాలుపోవడం పరిపాటిగా జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ ఉపాధ్యాయుడు అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. ఓ టీనేజీ యువకుడితో కలిసి గన్తో సెల్ఫీ తీసుకుంటుండగా అనూహ్యంగా అది పేలి అతడు చనిపోయాడు. సెల్ఫీ తీస్తున్న 17 ఏళ్ల బాలుడే ఆ తుపాకీ ట్రిగ్గర్ నొక్కినట్లు తెలుస్తోంది. ఆ తుపాకీ ఆ యువకుడి తండ్రిది అని దానికి లైసెన్స్ కూడా ఉందని, అతడు ప్రాపర్టీ డీలర్గా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మైనర్ అయిన ఆ యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. -
ఢిల్లీ నడిబొడ్డున దారుణ హత్య
-
ఢిల్లీ నడిబొడ్డున దారుణ హత్య
⇒ టీచర్ని 22 సార్లు కత్తెరతో పొడిచిన వైనం ⇒ ఉదయం 9 గంటలకు అంతా చూస్తుండగానే ఘోరం ⇒ విలవిల్లాడుతూ అక్కడే ప్రాణాలు విడిచిన యువతి ⇒ దాడికి పాల్పడింది ఓ రిటైర్డ్ ఎస్సై కొడుకు ⇒ పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు న్యూఢిల్లీ: మూడు నెలల కిందట.. చెన్నైలోని ఓ రైల్వేస్టేషన్.. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే ఓ యువతిని ఉన్మాది కత్తితో విచక్షణరహితంగా పొడిచి చంపాడు! నేడు.. దేశ రాజధాని.. ఉదయంపూట.. మరో ఘోరం! ఓ రాక్షసుడు అమ్మాయిని అతి కిరాతకంగా చంపేశాడు!! వెంట తెచ్చుకున్న కత్తెరతో రెండున్నర నిమిషాల్లో ఏకంగా 22 సార్లు పొడిచి దారుణంగా హతమార్చాడు. వాడు అలా దాడి చేస్తున్న సమయంలో చుట్టూరా జనం ఉన్నా.. ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వారిలో ఒక్కరు ధైర్యం చేసినా ఆ అమ్మాయి బతికేదేమో పాపం!! ఆ ఉన్మాది ఓ రిటైర్డ్ ఎస్సై కొడుకు కావడం గమనార్హం. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీలో రికార్డయింది. ఆ వీడియో క్లిప్ మీడియా, సోషల్ మీడియాలో విసృ్తతంగా ప్రచారం కావడంతో కేంద్రం కదిలింది. ఢిల్లీ పోలీసుల నుంచి నివేదిక కోరింది. అసలేం జరిగింది? ఆమె పేరు కరుణ కుమార్. వయసు 21 సంవత్సరాలు. ఢిల్లీలోని నావెల్ రిచెస్ స్కూళ్లో టీచర్గా పనిచేస్తోంది. వరుసకు సోదరైన నేహా కూడా అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు ఎప్పట్లాగే ఇద్దరూ కలసి పాఠశాలకు బయల్దేరారు. నార్త్ ఢిల్లీలోని బురారీలో లేబర్చౌక్కు చేరుకున్నారు. ఉన్మాది సురేందర్(34) మరో వ్యక్తితో కలసి బైక్పై వచ్చి ఒక్కసారిగా కరుణపై విరుచుకుపడ్డాడు. కిందకు తోసేసి కత్తెరతో విచక్షణరహితంగా పొడిచాడు. కరుణ విలవిల్లాడుతూ సాయం కోసం అర్థించింది. ఆ సమయంలో ఓ వ్యక్తి సురేందర్ను ఆపేందుకు కొద్దిగా ముందుకు వచ్చాడు. కానీ తనపైనా దాడి చేస్తాడేమోనన్న భయంతో వెనక్కి తగ్గాడు. వెంట ఉన్న నేహాను ఉన్మాది కత్తెరతో బెదిరించడంతో పక్కన నిలబడి గట్టిగా కేకలు పెట్టింది. రెండున్నర నిమిషాల వ్యవధిలో ఆ ఉన్మాది... కరుణ ముఖం, గొంతు, గుండెపై 22 సార్లు పొడిచి పారిపోయాడు. తర్వాత అక్కడున్నవారు ఆమెను సివిల్లైన్స్లోని శుశ్రుత హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు సరైన వివరాలు చెప్పడం లేదంటూ కరుణ కుటుంబీకులు ఆసుపత్రి ముందు గంటసేపు ధర్నాకు దిగారు. అదనపు డీసీపీ ఈశా పాండే వచ్చి వారిని సముదాయించడంతో ఆందోళన విరమించారు. పట్టుకొని చితకబాదిన స్థానికులు కరుణను చంపి పారిపోతున్న సురేందర్ను కొద్దిదూరంలో స్థానికులు పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. అతడి తలకు తీవ్ర గాయం కావడంతో తొలుత అరుణ అసఫ్ అలీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తర్వాత అక్కడ్నుంచి ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 320 (హత్య) కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనే పోలీసులకు ఫిర్యాదు సురేందర్ ఢిల్లీలో ఓ రిటైర్డ్ ఎస్సై కొడుకు. ఇతడికి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం భార్యతో విడాకుల కేసు నడుస్తోంది. గత ఏడాదిన్నర నుంచి కరుణ వెంట పడుతున్నాడు. దీంతో ఆమె కుటుంబం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. గతంలో సురేందర్కు చెందిన కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో కరుణ ట్రెయినింగ్ తీసుకుంది. అప్పట్నుంచే సురేందర్ తనను ప్రేమించాలంటూ కరుణను వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు ఆగ్రాలో సమీప బంధువు ఒకరు చనిపోవడంతో కరుణ తల్లిదండ్రులు ఆగ్రా వెళ్లి మంగళ వారం ఉదయమే ఢిల్లీకి తిరిగి వచ్చారు. వచ్చీరాగానే కరుణ మరణవార్త తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘‘మా బంధువు చనిపోవడంతో భర్తతో కలసి ఆగ్రా వెళ్లాం. ఉదయమే వచ్చాం. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. నా బిడ్డ ఎంతో కష్టపడేది. నెలకిందటే ఆ స్కూల్లో టీచర్గా చేరింది. ఇంకా పై చదువులు చద వాలనుకుంటోంది’’ అంటూ కరుణ తల్లి రామ్ బేటీ గుండెలవిసేలా విలపించింది. ఆమె తండ్రి నరేశ్కు సంత్నగర్లో ఓ చిన్న బ్యాగుల షాపు ఉంది. దాంతో నెలకు వచ్చే రూ.10 వేలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దూరవిద్య ద్వారా బీఏ పూర్తి చేసిన కరుణ.. టీచర్గా వస్తున్న రూ.5 వేల జీతంతో తన తండ్రికి అండగా నిలిచింది. తన ఇద్దరు సోదరులు మనీశ్, హిమాన్షులను చదివిస్తోంది. ‘‘సురేందర్ మా అక్కను వేధించడంతో మేం గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. అతడి తల్లిదండ్రులు వచ్చి క్షమాపణలు చెప్పారు. రాజీ కుదిరింది. ఇంతలోనే ఇలా చంపేశాడు’’ అని మనీశ్ తెలిపాడు. ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నాం.. కరుణ, తాను ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నామని సురేందర్ పోలీసులకు తెలిపాడు. పెళ్లి ప్రతిపాదనను ఆమె కుటుంబం తిరస్కరించిందని, మరొకరితో పెళ్లి చేయాలని చూస్తున్నారని వివరించారు. ‘‘కరుణ మరో వ్యక్తితో కలసి ఉన్న ఫొటోను ఓ వ్యక్తి సురేందర్కు ఫోన్లో పంపాడు. దాంతో అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చు’’ అని పోలీసులు తెలిపారు. దాడి సమయంలో సురేందర్తోపాటు బైక్ వచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పట్టపగలు.. 22 సార్లు కత్తితో పొడిచి టీచర్ హత్య
-
పట్టపగలు.. 22 సార్లు కత్తితో పొడిచి టీచర్ హత్య
పట్టపగలు అందరూ చూస్తుండగానే దేశ రాజధానిలో ఓ మహిళను ఓ వ్యక్తి 22 సార్లు కత్తితో పొడిచాడు. దాంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. కరుణ (21) టీచర్గా పనిచేసేది. 34 ఏళ్ల సురేందర్ అనే వ్యక్తి ఆమెను తరచు వెంటాడి, వేధిస్తుండేవాడు. అతడే ఆమెను మంగళవారం ఉదయం 22 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. అతడు వేధిస్తున్న విషయమై కరుణ కుటుంబ సభ్యులు ఐదు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిచి రాజీ చేయించారు తప్ప ఎలాంటి చర్య తీసుకోలేదు. సురేందర్కు ఇంతకుముందే పెళ్లయిందని, భార్య నుంచి విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా.. అక్కడ కేసు ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.