breaking news
Deep water
-
సముద్రాల గుట్టు ఛేదించే ‘మత్స్య యంత్రం’
మన దేశానికి 7,500 కిలోమీటర్లకుపైగా సముద్ర తీరం ఉంది. బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం, అరేబియా సముద్రం.. మూడూ మూడు దిక్కుల్లో ఆవరించి ఉన్నాయి. ఎంతో మత్స్య సంపదకు, మరెన్నో వనరులకు, చిత్రవిచిత్రాలకు సముద్రాలు పుట్టినిల్లు. వాటి అడుగున ఉండే చిత్రవిచిత్రాలూ ఎన్నో. ఈ క్రమంలోనే సముద్ర అడుగున పరిశోధనలు, వనరుల వెలికితీత కోసం భారత్ ‘సముద్రయాన్’ప్రాజెక్టును చేపట్టింది. ఆ వివరాలేమిటో చూద్దామా.. సముద్రాల్లో మత్స్య సంపద మాత్రమేగాకుండా ఖనిజాలు, మూలకాలు వంటి ఎన్నో వనరులు ఉన్నాయి. వాటిని గుర్తించడం, వెలికితీసి వినియోగించుకోవడం.. సముద్ర ఆధారిత ఎకానమీని అభివృద్ధి లక్ష్యంగా భారత్ ‘డీప్ ఓసియన్ మిషన్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వేల మీటర్ల లోతుకు వెళ్లగలిగే ప్రత్యేక వెహికల్స్ను, సాంకేతికలను అభివృద్ధి చేయనుంది. ఈ క్రమంలో రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాలతో కలిసి పనిచేయనుంది. ఆరు వేల మీటర్ల అడుగుకు వెళ్లగలిగేలా.. సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా.. సముద్రాల అడుగున మానవ సహిత ప్రయోగాల కోసం ప్రత్యేకమైన వాహనాన్ని (డీప్ వాటర్ సబ్ మెర్సిబుల్ వెహికల్)ను భారత్ అభివృద్ధి చేయనుంది. ముగ్గురు శాస్త్రవేత్తలు ఆరు వేల మీటర్ల (ఆరు కిలోమీటర్లు) లోతుకు వెళ్లి పరిశోధనలు చేయగలిగేలా దాన్ని రూపొందిస్తున్నారు. అందులో వివిధ సెన్సర్లు, శాస్త్రీయ పరికరాలు, సముద్రం అడుగున తవ్వడం, కదిలించడానికి వీలయ్యే ఉపకరణాలు ఉంటాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలకు నేతృత్వం వహించనున్నారు. మత్స్య 6000 పేరుతో.. ► ఇస్రో, ఐఐటీ మద్రాస్, డీఆర్డీవో తదితర సంస్థల సహకారంతో ఎన్ఐఓటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే ‘మత్స్య 6000’పేరుతో డీప్ వాటర్ వెహికల్ ప్రాథమిక డిజైన్ను రూపొందించారు. గోళాకారంలో రూపొందించిన ఈ డీప్ వాటర్ వెహికల్ను సిద్ధం చేయడానికి సుమారు రూ.350 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ► సముద్రాల అడుగున అత్యంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. నీటి సాంద్రత, విజిబిలిటీ వంటివి భిన్నంగా ఉంటాయి. వీటిని తట్టుకునేలా డీప్వాటర్ వెహికల్ను రూపొందించాల్సి ఉంటుంది. అంతేగాకుండా ఆ లోతుల్లో పనిచేసే సెన్సర్లు, పరికరాలను, ఆక్సిజన్, అత్యవసర రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉండనుంది. ► మొదట ఈ ఏడాది చివరినాటికి 500 మీటర్ల లోతు వరకు వెళ్లే డీప్ వాటర్ వెహికల్ను రూపొందించనున్నారు. 2024 మార్చి నాటికి పూర్తిస్థాయి ‘మత్స్య 6000’వాహనాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ► సముద్రాల్లో వెయ్యి మీటర్ల నుంచి 5,500 మీటర్ల లోతు వరకు గ్యాస్ హైడ్రేట్లు, మాంగనీస్, సలై్ఫడ్లు, కోబాల్ట్ వంటి ఖనిజాలు లభిస్తాయి. వాటిని వెలికితీసే అవకాశాలను ఎన్ఐఓటీ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. ► ‘మత్స్య 6000’సాయంతో దేశం చుట్టూ ఉన్న సముద్రాల అడుగున జీవజాలంపై పరిశోధనలు చేయనున్నారు. సముద్రాల్లో మునిగిన ఓడలు, ఇతర వస్తువుల పరిశీలన సేకరణ, నీటి అడుగున ఫైబర్ కేబుళ్లు, ఇతర పరికరాల ఏర్పాటు, మరమ్మతులకు దీనిని వినియోగించుకోనున్నారు. ఇదీ చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త! -
ఇన్నేళ్లకు స‘పోర్టు’
- కాకినాడ డీప్ వాటర్, యాంకరేజ్ పోర్టులకు కేంద్ర బడ్జెట్లో చోటు - హార్డ్వేర్ పార్కు ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ - కార్మికులకు ఉపాధితో పాటు ఎగుమతులు పెరుగుతాయని పోర్టు వర్గాల హర్షం కాకినాడ క్రైం : ఇన్నేళ్లకు కాకినాడ పోర్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర సాధారణ బడ్జెట్లో కాకినాడ పోర్టు అభివృద్ధికి స్థానం కల్పించింది. పోర్టులో హార్డ్వేర్ పార్కు ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాకినాడలో డీప్వాటర్, యాంకరేజ్ పోర్టులు న్నాయి. వందేళ్లపైగా చరిత్ర కలిగిన యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం, మొక్కజొన్న వంటి వి, అత్యాధునిక వసతులతో ఏర్పాటైన డీప్ వా టర్ పోర్టు నుంచి క్రూడాయిల్, వంట నూనె, బొగ్గు, ఎరువులు, గ్రానైట్ రాళ్లు ఎగుమతవుతున్నాయి. యాంకరేజ్ పోర్టులో నెలకు సుమారు 10 ఓడల్లో, డీప్వాటర్ పోర్టులో రమారమి రో జుకు పది ఓడల్లో ఎగుమతి దిగుమతులు జరుగుతుంటాయి. కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతుండడంతో భారీ స్థాయి లో విదేశీ మారకద్రవ్యం కేంద్ర ప్రభుత్వానికి లభిస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో యాంకరేజ్ పో ర్టు దాదాపు నిర్వీర్యమైపోయింది. కనీసం జట్టీలు కూడా లేక, రోడ్లు సక్రమంగా లేక ఎగుమతి దిగుమతులకు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. వందేళ్ల క్రితం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి బీడు పాళీలు, పొగాకు కూడా ఎగుమతయ్యేవి. సౌకర్యాలు లేకపోవడంతో చాలా సరుకులు ముంబై, విశాఖపట్నం ఓడ రేవులకు తరలిపోవడంతో పోర్టుపై ఆధారపడిన వేల మంది కూలీల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ప్రస్తుత కేంద్రం కాకినాడ పోర్టు అభివృద్ధిపై దృష్టి సారించడంతో వేల మందికి ఉపాధితో పాటు భారీస్థాయిలో వ్యాపారం జరిగే అ వకాశం ఉందని పోర్టు వర్గాలు పేర్కొంటున్నా యి. కాకినాడ పోర్టులో హార్డ్వేర్ పార్కు అభివృ ద్ధి చేయడమే కాక త్వరలోనే కస్టమ్స్ కమిషరేట్ కూడా ఇక్కడికి మారనుంది. కాకినాడ పోర్టును అనుసంధానం చేస్తూ విశాఖ- చెన్నై ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొం దించడంతో కాకినాడ పోర్టుకు మహర్దశ పడుతుందని భావిస్తున్నారు. ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఏర్పాటుకు కూడా కేంద్రం సుముఖంగా ఉండడంతో పోర్టు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని వ్యాపారులంటున్నారు.