decoit
-
'డెకాయిట్'లో హీరోయిన్ మార్పు నిర్ణయం సరైనదేనా?
కొన్ని నెలల క్రితం 'డెకాయిట్' చిత్రంలో హీరోయిన్గా ఎంపికైన శృతి హాసన్ అనుకోకుండా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే తను స్వచ్ఛందంగా తప్పుకుందా లేక డెకాయిట్ టీమ్ తొలగించిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ ఆ పాత్రకు ఆమెకు సంబంధం లేకుండా పోయింది. వెంటనే ఆ స్థానంలో మృణాల్ ఠాకూర్ను తీసుకున్నారు.అయితే ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత, మృణాల్ పోషించిన "సరస్వతి" పాత్రపై చర్చలు మొదలయ్యాయి. శృతి అభిమానులు ఈ పాత్రను ఆమె మరింత బాగా పోషించి ఉండేదంటున్నారు. కానీ తెరపై మృణాల్ నటన చూసిన ప్రేక్షకులు మాత్రం ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేసిందని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో డెకాయిట్ టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని వంద శాతం సమర్థిస్తున్నారు.నటనలో శృతిని తక్కువ చేసి చూడలేం. తను కూడా ఈ పాత్రను బాగా చేసి ఉండేది. కానీ ప్రేక్షకులు ఆమెను తెరపై చూడలేకపోయారు. ఆ అవకాశాన్ని మృణాల్ చాలా బాగా సద్వినియోగం చేసుకుంది. సినిమాలో శృతి లేని లోటును మృణాల్ తీర్చిందనే చెప్పాలి. మొత్తానికి శృతి హాసన్ ఒక మంచి పాత్రను మిస్ అయింది. అదే సమయంలో మృణాల్ ఠాకూర్ తన కెరీర్లో మరో బలమైన పాత్రను సంపాదించుకుని ఆ పాత్రకు న్యాయం చేసింది. -
అనుమానం అక్కర్లేదు... బ్లాక్బస్టర్ ఖాయం: వెంకటేశ్
‘‘కొన్ని సినిమాలు ఆరంభించినప్పుడే ఒక మంచి అనుభూతి ఉంటుంది. ‘డెకాయిట్’ ఆరంభమైనప్పుడే సుప్రియ ఓ మంచి సినిమా తీస్తోందనే ఫీల్ ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే తను చాలా ప్యాషనేట్. క్రమశిక్షణ ఉన్న టీమ్ని ఎంచుకుంది. అడివి శేష్ వరుస హిట్స్ కొడుతున్నాడు. మరిన్ని బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. ‘డెకాయిట్’ కూడా బ్లాక్బస్టర్ అవుతుంది... ఎలాంటి అనుమానం అక్కర్లేదు’’ అని హీరో వెంకటేశ్ చెప్పారు. అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించారు.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్పై సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘సుప్రియ కోసం ఇక్కడికి వచ్చాననుకుంటున్నారు.నిజాయతీగా చెప్పాలంటే నాకు ఇష్టమైన మా సురేంద్ర మామ (సుప్రియ తండ్రి)కోసం వచ్చాను. ఎస్ఎస్ క్రియేషన్స్పై సుప్రియ ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. మృణాళ్ మంచి నటి. ఈ మూవీ ట్రైలర్ చూడగానే లవ్స్టోరీలోనే యాక్షన్, ఎమోష న్ అన్నీ ఉన్నాయని తెలిసిపోయింది. ఇలాంటి మంచి కథ ఎంచుకున్నందుకు గౌరవంగా ఉంది. యూనిట్కి ఆల్ ది వెరీ బెస్ట్’’ అని పేర్కొన్నారు. సుప్రియ మాట్లాడుతూ– ‘‘నాన్నగారి ఎస్ఎస్ క్రియేష న్్స బ్యానర్లో మంచి సినిమా తీయాలని ఎక్కడో మనసులో ఉంది. అందువల్లే ‘డెకాయిట్’ ఆరంభించాను. ఈ లోగోలో మా తాతగారి (ఏఎ న్ ఆర్) పంచె, మా నానమ్మ (అన్నపూర్ణ) కుంకుమ, పరిగెత్తే పాప, ముందు నడిపించే తాత... దాని వెనుక మా నాన్నగారు చేయించుకున్న మ్యూజిక్. ఇవన్నీ కూడగట్టి ఓ పదిహేను సెకన్లలో మా ఫ్యామిలీ కథ ఎలా చూపించుకోవాలా అనుకున్నాను. ‘డెకాయిట్’కి సైలెంట్గా ప్రోడ్యూస్ చేసి బ్యాక్బో న్ గా నిలిచిన మా అన్నయ్య సుమంత్కి థ్యాంక్స్’’ అని తెలిపారు. -
సుప్రియను వెక్కిరించడానికే వచ్చా.. నాగవంశీ ర్యాగింగ్
‘డెకాయిట్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నిర్మాత నాగవంశీ, సహ నిర్మాత సుప్రియపై సరదాగా ర్యాగింగ్ చేశారు. సినిమాలు ఎక్కువ రోజులు తీస్తున్నామని ఎప్పుడూ తమకు క్లాస్ పీకే సుప్రియ ఇప్పుడు రెండు సంవత్సరాలు కష్టపడి ‘డెకాయిట్’ పూర్తి చేసిందనిక వెక్కిరిస్తూ మాట్లాడారు. మమ్మల్ని సినిమాలు ఎందుకు ఇన్ని రోజులు తీస్తున్నారంటూ సుప్రియ ఎప్పుడూ తిట్టేవారు. కానీ ఇప్పుడు ఆమె రెండు సంవత్సరాలు కష్టపడి 147 వర్కింగ్ డేస్లో సినిమా తీశారు. ఇకపై మమ్మల్ని తిట్టే హక్కు ఆమెకు లేదని ఆటపట్టించారు. నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో సుప్రియకు చూపించినందుకు అడివి శేష్కు థ్యాంక్స్ చెప్పారు. అలాగే, “హీరోల్ని నెత్తిన ఎక్కించుకున్నామని ఎప్పుడూ క్లాస్ పీకే సుప్రియ, ఇప్పుడు తొలిసారి బయట హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనుభవించారు. ఇంతకు ముందు తన ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు తీసిన సుప్రియకు ఈ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. డెకాయిట్ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. మరింత మంది హీరోలతో సుప్రియ సినిమాలు చేసి తమలాగే కష్టపడాలని చమత్కరించారు. ఓ వైపు నాగవంశీ సరదాగా ర్యాగింగ్ చేస్తుంటే, పక్కనే ఉన్న సురేశ్ బాబు నవ్వుతూ ఎంజాయ్ చేయడం వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
అంబులెన్స్ నడపడం సవాల్ అనిపించింది: మృణాల్ ఠాకూర్
‘‘సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు నన్ను తెలుగు అమ్మాయిగా అంగీకరించారు. నేను మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారిలో ఏర్పడింది. ‘డెకాయిట్’లో చేసిన సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు మృణాల్ ఠాకూర్. అడివి శేష్, మృణాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా, సునీల్ నారంగ్ సహ–నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో మృణాల్ ఠాకూర్ చెప్పిన విశేషాలు. ⇒ ‘డెకాయిట్’ ఓ డిఫరెంట్ లవ్స్టోరీ మూవీ. ఈ చిత్రంలో నేను సరస్వతి పాత్రలో, హరి పాత్రలో శేష్ నటించాం. హరి, సరస్వతి ఎందుకు డెకాయిట్స్గా మారారనేది సినిమాలో చూడాలి. సరస్వతి క్యారెక్టర్ నాకో సవాల్. ఈ సినిమా కోసం కొన్ని స్టంట్, చేజింగ్, డ్రైవింగ్ సన్నివేశాలు చేశాను. అంబులెన్స్ కూడా నడిపాను. చాలా స్పీడ్గా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఈ వెహికల్కు హ్యాండ్ బ్రేక్ లేదు. ఇలాంటి రిస్కీ సీన్స్ కూడా చేశాను. ⇒ ‘సీతారామం, హాయ్.. నాన్న, ఫ్యామిలీ స్టార్’లను తెలుగులోనే తీశాం. కానీ ‘డెకాయిట్’ను తెలుగు, హిందీ భాషల్లో చేశాం. నాకైతే తక్కువ రెమ్యునరేషన్తో రెండు సినిమాలు చేసిన ఫీలింగ్ కలిగింది (సరదాగా). ఈ సినిమాలో ఓ సీన్లో బురదలో నటించాల్సి వచ్చింది. కానీ మేకర్స్ నా ఫేస్ గురించి ఆలోచించి బురద బదులు చాక్లెట్ను ప్లాన్ చేశారు. ఇలా చాలా కేరింగ్గా చూసుకున్నారు. షానియల్గారు అద్భుతమైన డైరెక్టర్. ఓ మంచి సినిమా చేసిన ఫీలింగ్ నాకు ఉంది. -
డెకాయిట్కి బై బై
డెకాయిట్కి బై బై చెప్పేశారు మృణాల్ ఠాకూర్. ఆమెకు వీడ్కోలు చెప్పింది డెకాయిట్ యూనిట్. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా తెలుగు, హిందీ భాషల్లో రానున్న చిత్రం ‘డెకాయిట్’. ఛాయాగ్రాహకుడు షానియల్ డియోను దర్శకుడిగా పరిచయం చేస్తూ, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలోని తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేశారు మృణాల్ ఠాకూర్. అందుకే బై బై చెప్పిన ఆమెకు వీడ్కోలు పలికింది యూనిట్. ‘‘తెలుగు, హిందీ భాషల్లో తన పాత్రకు మృణాల్ డబ్బింగ్ కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఉగాది సందర్భంగా మార్చి 19న తెలుగు, హిందీలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
శృతి హాసన్ కాదు.. 'డెకాయిట్'లో మృణాల్
అంతా ఫిక్స్ అయిన తర్వాత సినిమాల విషయంలో కొన్నిసార్లు చేర్పులు మార్పులు జరుగుతుంటాయి. అయితే హీరో లేదా హీరోయిన్ని మాత్రం ఎప్పడో ఓసారి జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ తెలుగు సినిమా నుంచి హీరోయిన్గా శృతి హాసన్ని తీసేసి మృణాల్ ఠాకుర్ని ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: పెళ్లెప్పుడో చెప్పిన 'హనుమాన్' హీరోయిన్)2022లో 'మేజర్' సినిమా వచ్చింది. దీని తర్వాత అడివి శేష్ ఏ సినిమాలు చేస్తున్నాడో కనీసం చిన్న అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. మధ్యలో 'గూఢచారి 2' గురించి చెప్పారు గానీ. అది ఏ స్టేజీలో ఉందనేది క్లారిటీ లేదు. మరోవైపు కొన్నాళ్ల క్రితం 'డెకాయిట్' అనే సినిమాను ప్రకటించిన శేష్.. శృతి హాసన్తో కనిపించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేశాడు.కట్ చేస్తే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ మారిపోయింది. శృతి ప్లేసులోకి మృణాల్ వచ్చి చేరింది. మరి కావాలనే తప్పించారా? లేదా శృతి హాసన్ తప్పుకొందా అనేది తెలియాల్సి ఉంది. మూవీ పోస్టర్తో పాటు 'అవును వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అని మృణాల్ క్యాప్షన్ పెట్టింది. మరోవైపు శేష్ కూడా ఈ పోస్టర్స్ షేర్ చేస్తూ.. 'అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు..! ఇడిచిపెట్టను...తేల్చాల్సిందే' అని క్యాప్షన్ పెట్టాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)అవును వదిలేసాను..కానీ మనస్పూర్తిగా ప్రేమించానుHappy Birthday, @AdiviSesh ✨Let's kill it - #DACOIT pic.twitter.com/tH4trCr0Fe— Mrunal Thakur (@mrunal0801) December 17, 2024 -
మాజీ ప్రేమికుల కథ
అడివి శేష్ హీరోగా రూపొందుతోన్నపాన్ ఇండియన్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’తో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్గా చేసిన షానీల్ డియో ‘డెకాయిట్’తో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్కి జోడీగా శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యారు శ్రుతీహాసన్. ఈ విషయాన్ని తెలియజేస్తూ... శేష్, శ్రుతి సరదాగా దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘‘ఇద్దరు మాజీ ప్రేమికుల కథే ‘డెకాయిట్’. వారు తమ జీవితాలను మార్చడానికి వరుస దోపిడీలకు ప్రణాళిక రచిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. హైదరాబాద్లో జరుగుతున్న షెడ్యూల్లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు, ఓ యాక్షన్ పార్ట్ను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్ నారంగ్. -
మీ ఇంటికే వస్తాం..!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలు, చిన్నారులపై వేధింపులు పెరుగుతున్నాయి. స్కూలు, కాలేజీ, హాస్టల్, ఆఫీసు ఎక్కడపడితే అక్కడ ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో వేధింపులూ ఆగడం లేదు. దీంతో రాచకొండ షీ టీమ్స్ ఒక అడుగు ముందుకేసింది. సున్నితమైన కేసులలో బాధితుల ఇంటికే వెళ్లి భరోసా ఇచ్చి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నారు. బాధితులు పోలీసు స్టేషన్కు రాకుండానే ఫిర్యాదులు తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతి ఫిర్యాదుపై క్షుణ్నంగా దర్యాప్తు చేసి ప్రాథమిక ఆధారాలను సేకరించి, నిందితులను జైలుకు పంపిస్తున్నారు. 3,273 కేసుల నమోదు.. రాచకొండ షీ టీమ్స్లో 7 బృందాలు, ఒక్కో బృందంలో ఐదుగురు పోలీసులు మొత్తం 35 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 292 కేసులు నమోదయ్యాయి. వీటిలో 123 ఎఫ్ఐఆర్ నమోదు కాగా, 118 పెట్టీ, 51 కౌన్సిలింగ్ కేసులున్నాయి. ఆయా కేసులలో 310 మంది పోకిరీలను అరెస్టు చేశారు. వీరిలో 110 మంది మైనర్లు, 200 మంది మేజర్లున్నారు. అధికార హోదా, అంగబలం, రాజకీయ అండదండల ప్రలోభాలతో మహిళలు, విద్యారి్థనిలు, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినా, అసభ్యకరంగా ప్రవర్తించే ఎవరినైనా వదిలిపెట్టడం లేదు. ఉదయం 4 నుంచే డెకాయ్ ఆపరేషన్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఉదయం, రాత్రి సమయాలలో సినిమాలు, సీరియళ్ల చిత్రీకరణ జరుగుతుంటాయి. షూటింగ్స్ ముగించుకొని రాత్రి సమయాలలో ఇంటికి వెళుతున్న కళాకారులు, కాస్టింగ్ సిబ్బందిని స్థానికంగా పోకిరీలు వేధిస్తున్నట్లు రాచకొండ షీ టీమ్స్ దృష్టికి వచి్చంది. దీంతో ప్రత్యేక బృందాలతో ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచే షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. కళాకారుల లాగే పోలీసులూ మఫ్టీలో తిరుగుతూ.. ఆకతాయిల ఆటకట్టిస్తున్నారు. దీంతో పెద్ద అంబర్పేట, అబ్దుల్లాపూర్, హయత్నగర్, వనస్థలిపురం వంటి మార్గాలలో పోకిరీల చేష్టలు తగ్గుముఖం పట్టాయి. – ఎస్కే సలీమా, రాచకొండ షీ టీమ్స్ డీసీపీ (చదవండి: చట్టానికి దొరక్కుండా ఆన్లైన్ గేమింగ్) -
అప్పట్లో బందిపోటు..ఇప్పుడు బ్యాలెట్ బరిలో..
భోపాల్ : యూపీ, మధ్యప్రదేశ్ల్లో విస్తరించిన చంబల్ లోయలో 1970 ప్రాంతాల్లో ఆయన పేరు చెబితే ఎవరికైనా వెన్నులో వణుకుపుట్టేది. హత్యలు, కిడ్నాప్లు, హత్యాయత్నం కేసులను ఎదుర్కొన్న ఈ మాజీ బందిపోటు ఇప్పుడు సమాజంలో డెకాయిట్లకు వ్యతిరేకంగా పోరాడే రెబెల్గా మారానని చెబుతున్నారు. బందిపోట్ల నుంచి సామాన్య ప్రజలకు రక్షణ కవచంలా ఉంటానంటూ ఎన్నికల బరిలో దిగాడు. బందిపోటుగా చంబల్ లోయను వణికించిన 76 ఏళ్ల మల్కాన్ సింగ్ రాజ్పుట్ ప్రగతిశీల్ సమాజ్వాది పార్టీ అభ్యర్ధిగా దరుహ్ర స్ధానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల్లో తన విజయం ఖాయమని, తమ పార్టీ ఆ ప్రాంతంలో బలంగా ఉందని, ప్రచారంలో తానెక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని మల్కాన్ సింగ్ చెబుతున్నారు. తనను 17 ఏళ్ల వయసులోనే ఆయుధ చట్టం కింద పోలీసులు 1964లో అరెస్ట్ చేశారని, తాను నిత్యం సామాన్య ప్రజల పట్ల పోరాడతానని, వారిని బందిపోట్ల నుంచి కాపాడతానని ఆయన చెప్పుకొచ్చారు. పేదలు, మహిళలను వేధించే వారికి వ్యతిరేకంగా తాను నిలబడతానని హామీ ఇచ్చారు. ఒక డెకాయిట్కు ప్రజలు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించగా, తాను ప్రజలకు రక్షణగా ఉంటానని ఇక్కడ ఎవరికీ ఏ ఒక్కరూ అన్యాయం చేయలేరని, ప్రజలకు వారి ప్రతినిధిగా తన నుంచి అందరూ లబ్ధి పొందవచ్చని చెప్పారు. తాను బందిపోటును కాదని, కేవలం ఆత్మ గౌరవం, ఆత్మరక్షణ కోసమే తుపాకీని చేతబట్టానని చెప్పుకున్నారు. తనకు నిజమైన బందిపోట్లు ఎవరో తెలుసుననీ, వారిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసని అన్నారు. యూపీ, మధ్యప్రదేశ్లో వేరొక స్ధానం కాకుండా దరుహ్రనే ఎందుకు ఎంచుకున్నారని అడగ్గా, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తుండగా తానెందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు. కాగా మల్కాన్ ఆయన గ్యాంగ్పై చంబల్లో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ వంటి కేసులు సహా మొత్తం 94 పోలీసు కేసులున్నాయి. 1982లో అప్పటి మధ్యప్రదేశ్ సీఎం అర్జున్ సింగ్ ఎదుట లొంగిపోయిన తర్వాత మల్కాన్ మధ్యప్రదేశ్లోని శివ్పురిలో స్ధిరపడ్డారు. 76 ఏళ్ల వయసులో ఆరు అడుగుల పైగా ఎత్తుతో గంభీరంగా కనిపించే మల్కాన్ తన కాన్వాయ్తో దరుహ్ర రహదారుల దుమ్ముదులుపుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2009లో ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి జితిన్ ప్రసాద విజయానికి మల్కాన్ కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి తనకు బందా టికెట్ ఇస్తానని నమ్మబలికి మోసం చేసిందని మల్కాన్ ఆరోపించారు. ఇక దరుహ్ర నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్ధి జితిన్ ప్రసాద, బీజేపీ అభ్యర్ధి రేఖా వర్మ, బీఎస్పీ కూటమి అభ్యర్ధి అర్షద్ ఇలియాస్ సిద్ధిఖిలతో చతుర్ముఖ పోరులో చెమటోడుస్తున్నారు. దిగ్గజ అభ్యర్ధులను ఢీ కొని మాజీ డెకాయిట్ ఎంతమేర రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. -
నయవంచకుడిపై కేసు
అనంతపురం సెంట్రల్ : ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన నయవంచకుడిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు అనంతపురం వన్టౌన్ సీఐ రాఘవన్ తెలిపారు. స్థానిక మున్నానగర్కు చెందిన యువతిని అదే కాలనీకి చెందిన షేక్ హాజీపీరా అలియాస్ పీరా ప్రేమ పేరుతో లోబరచుకున్నట్లు బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందన్నారు. ఆ తరువాత పెళ్లి ప్రస్తావన తెస్తే అడ్డం తిరగడంతో తమను ఆశ్రయించినట్లు వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు జడ్జి ఆదేశించార ని సీఐ తెలిపారు.


