చైనా ఉత్పత్తులకు సోషల్ మీడియా దెబ్బ
న్యూఢిల్లీ: చైనా ఉత్పత్తులను దేశంలో నిషేధించాలన్న ప్రచారం భారీగానే ప్రభావాన్ని చూపిస్తోందట. చైనీస్ వస్తువుల బహిష్కరించాలన్న సామాజిక మీడియా ప్రచారం రిటైల్ వ్యాపారులు సెంటిమెంట్ ను దెబ్బతీసిందని ట్రేడర్స్ బాడీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న వాడి వేడి చర్చల కారణంగా తమ లైటింగ్ అండ్ డెకొరేటివ్ ఉత్పత్తుల అమ్మకాలపై భారీగా పడిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటి) వెల్లడించింది. ముఖ్యంగా దీపావళిసందర్భంగా గృహాలను అలంకరించుకునే తమ ప్రొడక్ట్స్ అమ్మకాలు దాదాపు 20 శాతం తగ్గిపోయాయని ఈ సంస్థ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు.
చైనీస్ లైటింగ్, దీపావళి అలంకరణ, ఇతర సామగ్రి పండుగ సీజన్ మూడు నెలల ముందే భారత మార్కెట్లో వెల్లువెత్తుతుందని ప్రవీణ్ చెప్పారు. కానీ చైనా వస్తువుల నిషేధంపై సామాజిక మీడియా లో తీవ్రస్థాయిలో నడుస్తున్న చర్చ తమ ఉత్పత్తులపై పడిందని తెలిపారు. రానున్న దీపావళి పండుగ సందర్భంగా ఇప్పటికే భారీ సంఖ్యలో తో రిటైల్ వ్యాపారులు వద్దకు చేరిన ఈ ఉత్పత్తుల విక్రయాలకు డిమాండ్ 20 శాతం క్షీణించడంతో ఇబ్బందుల్లో పడ్డారని చెప్పారు. దీంతోపాటు అసలు అమ్ముడు పోతాయా? లేదా? అనే భయాందోళనలు వారిలో నెలకొన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే టోకు వ్యాపారుల నిల్వ చేసి వున్న ఈ వస్తువులు కాలక్రమంలో అమ్ముడు పోవాలని ఆశిస్తున్నామని....లేదంటే వ్యాపారులకు తీవ్ర నష్టాలు తప్పవనే ఆందోళనను ఆయన వ్యక్తంచేశారు.
కాగా న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ) లోదేశం యొక్క సభ్యత్వాన్ని చైనా అడ్డుకోవడం, జెమ్ చీఫ్ మసూద్ అజహర్ పై అమెరికాలోనిషేధం నేపథ్యంలో భారతదేశం లో చైనీస్ వస్తువుల బహిష్కరించాలని సోషల్ మీడియా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపావళి అలంకరణ విక్రయాలపైనే వ్యాపారులు బావురుమంటోంటే.. మరి చైనా దీపావళి టపాసులు, ఇతర బాణాసంచా విక్రయాలపై ఇంకెంత భారం పడనుందో ....