-
నటుడు విక్రమ్ గోఖలే చనిపోయారంటూ వార్తలు.. స్పందించిన కుటుంబం
బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే మృతిచెందినట్లు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కుటుంబం స్పందించింది. గోఖలే ఇంకా బతికే ఉన్నారని, అయితే పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. విక్రమ్ గోఖలే ఇంకా బతికే ఉన్నారు. నిన్న సాయంత్రం కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్నారు. గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన కోసం ప్రార్థించండి అంటూ అని గోఖలే కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోఖలే పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉంది. అయితే అప్పటికే మీడియాలో, వెబ్సైట్లలో గోఖలే చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్ముఖ్, అలీ గోనీ, జావెద్ జాఫరీ తదితరులు కూడా ట్విట్టర్ ద్వారా సంతాపం కూడా తెలిపారు. ఈ క్రమంలో గోఖలే కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. బాలీవుడ్లో 'భూల్ భులయ్యా', 'దిల్ సే','దే దానా దాన్', 'హిచ్కీ', 'నికమ్మ', 'మిషన్ మంగళ్' వంటి బాలీవుడ్ హిట్ సినిమాల్లో ఆయన కనిపించారు. Prayers for Vikram Gokhale who has slipped into a Coma and is still very very critical according to his wife 🙏 #VikramGokhale — Sᴜᴢᴀɴɴᴇ Bᴇʀɴᴇʀᴛ (@suzannebernert) November 24, 2022 -
'సాంపుల్ మాత్రమే.. అంతకంటే ఘోరమైనవి చాలానే చూశా'
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలపై రూమర్స్ పెరిగిపోయాయి. సినిమా హీరో నుంచి క్రికెటర్ల వరకు చూసుకుంటే.. ఫలానా వారితో రిలేషిన్షిప్.. లవ్ట్రాక్.. ఇంకా ఎన్నెన్నో గాసిప్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి బతికున్న మనిషిని చంపేయడం సోషల్ మీడియాలో బాగా అలవాటైపోయింది. సోషల్ మీడియా ఉన్నంతవరకు ఇలాంటి ఫేక్న్యూస్ గోల తప్పదు. తాజాగా టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ఇలాంటి అనుభవమే ఎదురైందట. తాను చనిపోయినట్లు వచ్చిన వార్త చదువుకొని నవ్వాలో.. ఏడ్వాలో తెలియక అయోమయంలో ఉండిపోయినట్లు జడేజా పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం ఆసియాకప్లో బిజీగా ఉన్న టీమిండియా పాకిస్తాన్పై విజయంతో జోష్లో ఉంది. టీమిండియా తన తర్వాతి మ్యాచ్లో హాంకాంగ్తో బుధవారం(ఆగస్టు 31న) తలపడనుంది. మ్యాచ్కు సన్నద్ధమవుతున్న సమయంలో జడేజా ఒక చానెల్కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ''ఒక సందర్భంలో టి20 ప్రపంచకప్కు మీకు జట్టులో చోటు ఉంటుందా అని ప్రశ్న వేశారు. అది నాకు పెద్దగా వింతగా అనిపించలేదు. ఎందుకంటే అంతకంటే ఘోరమైనవి చాలానే చూశా. అందులో నా చావు వార్త ఒకటి. ఎప్పుడు పెట్టారో తెలియదు కానీ.. నేను చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్త చదవిన తర్వాత నాకు నవ్వు ఆగలేదు. అయినా ఇలాంటి పనికిమాలినవి పట్టించుకునే టైం లేదు. ఎప్పుడు నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. అందుకోసం కేవలం ప్రాక్టీస్ బాగా చేయాలి. సక్సెస్ అదే వెతుక్కుంటూ వస్తుంది. ఇక హాంకాంగ్తో మ్యాచ్లో భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం. ఈసారి కచ్చితంగా ఆసియాకప్ కొట్టబోతున్నాం.''అంటూ చెప్పుకొచ్చాడు. ఆసియాకప్లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 29 బంతుల్లో 35 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్లో వికెట్ తీయలేనప్పటికి బ్యాటింగ్లో రాణించి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: IND Vs HK: హాంకాంగ్తో మ్యాచ్.. భారీ విజయమే లక్ష్యంగా Virat Kohli: హాంకాంగ్తో మ్యాచ్.. జిమ్లో కష్టపడుతున్న కోహ్లి -
'నేను యాక్సిడెంట్లో చనిపోయానన్నారు.. అది విని మా అమ్మ'
Actor Fardeen Khan Reacts To Fake News On His Death: సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఫేక్ వార్తలు హల్చల్ చేస్తుంటాయి. పెళ్లి, ప్రేమాయణం, బ్రేకప్ వంటి పుకార్లతో సెలబ్రిటీలు చిరాకు పడిపోతుంటారు. అవి వారి సినీ కెరీర్పైనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇబ్బందిపెడుతుంటాయని బాధ వెళ్లబోసుకున్న తారలు ఉన్నారు. ఇలాంటి సంఘటన ప్రముఖ నటుడు ఫర్దీన్ ఖాన్కు ఒకటి కాదు రెండు సందర్భాల్లో జరిగిందట. తాను కొన్నేళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నానని, అప్పుడు ఓ యాక్సిడెంట్లో చనిపోయినట్లు ఇప్పటికీ రెండు సార్లు రూమర్లు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పుకార్లతో ఎంతో కలత చెందానని పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టిన విషయం ఏంటి ?' అని అడిగిన ప్రశ్నకు ఫర్దీన్ ఖాన్ ఈ విషయం చెప్పుకొచ్చారు. 'నేను కొంతకాలం హిందీ సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాను. ఆ సమయంలో నేను ఒక యాక్సిడెంట్లో చనిపోయానని రెండుసార్లు వార్తలు వచ్చాయి. అది నన్ను చాలా బాధించింది. ఎందుకంటే ఈ వార్త విని మా అమ్మకు గుండెపోటు వస్తే. లేదా ఇది చూసి నా భార్య ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చెప్పలేను. అందుకే నేను చనిపోయానన్న వార్త విన్నా, చదివినా నాకు బాధ, చిరాకు తెగ వచ్చేవి. ఇంత బాధ్యాతరాహిత్యంగా ఎలా ఉంటారని అనిపించేది.' అని ఫర్దీన్ ఖాన్ తెలిపారు. ఆయన 2010లో సుస్మితా సేన్తో కలిసి నటించిన 'దుల్హా మిల్గయా' సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఇప్పుడు తాజాగా రితేష్ దేశ్ముఖ్తో కలిసి 'విస్ఫోట్' అనే సినిమాలో అలరించనున్నారు. వీరిద్దరూ 'హే బేబీ' సినిమాలో చివరిగా కలిసి నటించారు. ఇప్పుడు సుమారు 14 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించనున్నారు. -
'నేను చనిపోలేదు.. అది ఫేక్ న్యూస్': రెజ్లర్ నిషా దహియా
Nisha Dahiya Refuses Her Death Reports.. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత, జాతీయ స్థాయి మహిళ రెజ్లర్.. నిషా దహియా చనిపోయిందన్న వార్తల్లో నిజం లేదు. హర్యానాలోని సోనిపట్లోని సుశీల్ కుమార్ అకాడమీలో జరిగిన కాల్పుల్లో నిషా దహియా, అతని సోదరుడుడ చనిపోయిందంటూ బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. తాను చనిపోయానంటూ వచ్చిన వార్తలపై నిషా దహియా స్వయంగా ట్విటర్ ద్వారా స్పందించింది. '' నేను చనిపోయానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్లోని గోండాలో ప్రత్యేక శిక్షణలో ఉన్నాను. అది ఫేక్ న్యూస్.. ఆ వార్త నమ్మకండి'' అంటూ కామెంట్ చేసింది. -
'నేను చనిపోలేదు.. అది ఫేక్ న్యూస్': రెజ్లర్ నిషా దహియా
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement