-
Ind Vs Sl Test Series: లంకపై విజయఢంకా
11–0 ఇదీ రోహిత్ లెక్క! ఈ ‘హిట్మ్యాన్’ పూర్తిస్థాయి జట్టు పగ్గాలు చేపట్టాక... స్వదేశంలో ఇద్దరు ప్రత్యర్థులతో ఆడిన మూడు ఫార్మాట్లలోనూ భారత్ వైట్వాష్ చేసింది. వెస్టిండీస్తో మూడేసి చొప్పున టి20, వన్డేలు... తర్వాత శ్రీలంకతో మూడు టి20 పోటీలు, ఇప్పుడు రెండు సంప్రదాయ టెస్టులు అన్నింటా భారత్దే జయం. పాపం కరీబియన్, లంక జట్లు కనీస విజయం లేక ‘జీరో’లతో ఇంటిబాట పట్టాయి. రెండో రోజే టెస్టులో విజయానికి బాటలు వేసుకున్న భారత్ సోమవారం రెండో సెషన్లోనే లంక ఆటను ముగించడంలో సఫలమైంది. కెప్టెన్ కరుణరత్నే శతకం మినహా లంక ఈ పర్యటనలో చెప్పుకునేందుకు ఏమీ లేక వెనుదిరిగింది. బెంగళూరు: టీమిండియా బౌలింగ్ ఉచ్చులో చిక్కుకున్న శ్రీలంక మూడో రోజు రెండు సెషన్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. డేనైట్ టెస్టులో భారత్ 238 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. రెండు టెస్టుల సిరీస్ను 2–0తో క్లీన్స్వీప్ చేసింది. భారత బ్యాటర్లలాగే బౌలర్లూ శ్రీలంక భరతం పట్టారు. 3 వికెట్లు తీసిన స్టార్ సీమర్ బుమ్రా ఈ టెస్టులో మొత్తం 8 వికెట్లను పడేశాడు. స్పిన్నర్లు అశ్విన్ (4/55), అక్షర్ పటేల్ (2/37) లంక బ్యాటర్స్కు ఏమాత్రం అవకాశమివ్వకుండా తిప్పేశారు. అయితే తొలి ఇన్నింగ్స్లో వంద పైచిలుకు పరుగులకే ఆపసోపాలు పడిన లంక... కెప్టెన్ దిముత్ కరుణరత్నే (174 బంతుల్లో 107; 15 ఫోర్లు) వీరోచిత సెంచరీ పుణ్యమాని రెండో ఇన్నింగ్స్లో 200 పైచిలుకు పరుగులు చేయడమే ఆ జట్టుకు ఊరట. శ్రేయస్ అయ్యర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కగా... 120.12 స్ట్రైక్రేట్తో సిరీస్లో 185 పరుగులు చేసిన రిషభ్ పంత్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ మూడోరోజు 447 పరుగుల లక్ష్యం ఛేదించేందుకు 28/1 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక 59.3 ఓవర్లలో 208 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్, కెప్టెన్ కరుణరత్నే... ఇతనితో పాటు ఓవర్నైట్ బ్యాటర్ కుశాల్ మెండిస్ (60 బంతుల్లో 54; 8 ఫోర్లు) ఆడినంత వరకే ఆట కనిపించింది. వీళ్లిద్దరి బౌండరీలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మెండిస్ వన్డేలాగే ధాటైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ కంటే ముందుగా 57 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరూ ఉన్నంతసేపు 12 ఓవర్ల పాటు బౌండరీలు, పరుగులతో స్కోరుబోర్డు కదిలింది. ఈ జోడీ రెండో వికెట్కు 97 పరుగులు జతచేసింది. ఎప్పుడైతే జట్టు స్కోరు 97 వద్ద మెండిస్ను అశ్విన్ స్టంపౌట్ చేశాడో 9 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు పడ్డాయి. మాథ్యూస్ (1)ను జడేజా బౌల్డ్ చేయగా, ధనంజయ డిసిల్వా (4)ను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. డిక్వెలా (12) విఫలమయ్యాడు. మరో వైపు కరుణరత్నే 92 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తయింది మరో వికెట్ పడకుండా తొలిసెషన్ 151/4 స్కోరు వద్ద ముగిసింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికే డిక్వెలా, అనంతరం అసలంక(5) అక్షర్ పటేల్ ఉచ్చులో పడ్డారు. 166 బంతుల్లో సెంచరీ (14 ఫోర్లు) పూర్తి చేసుకున్న కరుణరత్నే అవుటయ్యాక 4 పరుగుల వ్యవధిలోనే లంక ఆలౌటైంది. స్కోరు వివరాలు భారత్ తొలిఇన్నింగ్స్ 252; శ్రీలంక తొలిఇన్నింగ్స్ 109; భారత్ రెండో ఇన్నింగ్స్: 303/9 డిక్లేర్డ్; శ్రీలంక రెండో ఇన్నింగ్స్: తిరిమన్నె (ఎల్బీ) (బి) బుమ్రా 0; కరుణరత్నే (బి) బుమ్రా 107; మెండిస్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 54; మాథ్యూస్ (బి) జడేజా 1; ధనంజయ (సి) విహారి (బి) అశ్విన్ 4; డిక్వెలా (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 12; అసలంక (సి) రోహిత్ (బి) అక్షర్ 5; ఎంబుల్డెనియా (ఎల్బీ) (బి) అశ్విన్ 2; లక్మల్ (బి) బుమ్రా 1; ఫెర్నాండో (సి) షమీ (బి) అశ్విన్ 2; జయవిక్రమ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 20; మొత్తం (59.3 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–0, 2–97, 3–98, 4–105, 5–160, 6–180, 7–204, 8–206, 9–208, 10–208. బౌలింగ్: బుమ్రా 9–4–23–3, షమీ 6–0–26–0, అశ్విన్ 19.3–3–55–4, జడేజా 14–2–48–1, అక్షర్ పటేల్ 11–1–37–2. 442: టెస్టుల్లో అశ్విన్ వికెట్ల సంఖ్య. రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసిన అతను...దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ (439)ను అధిగమించి ఓవరాల్గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. -
Ind Vs Sl 2nd Test: విహారికి ఛాన్స్.. మరి సిరాజ్?
India Vs Sri Lanka 2nd Test- బెంగళూరు: మూడు రోజుల్లోపే తొలి టెస్టులో శ్రీలంక ఆట ముగించిన భారత్ ఇప్పుడు అదే ప్రదర్శనను పునరావృతం చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. తాజా ఫామ్, బలాబలాల దృష్ట్యా ప్రత్యర్థికంటే ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియాకు ఇక్కడా అడ్డు ఉండకపోవచ్చు. తొలి పోరులో ఘోర వైఫల్యం తర్వాత రెండో టెస్టులో లంక ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. ఫ్లడ్ లైట్ల వెలుగులో ‘డే అండ్ నైట్’గా గులాబీ బంతితో జరగనున్న ఈ మ్యాచ్కు మైదానంలో ప్రేక్షకులను 100 శాతం అనుమతిస్తుండటం చెప్పుకోదగ్గ విశేషం. సిరాజ్కు అవకాశం ఇస్తారా! మొహాలీలో భారత జట్టు ప్రదర్శన చూసిన తర్వాత సహజంగానే తుది జట్టులో మార్పులకు అవకాశం కనిపించదు. రోహిత్తో పాటు సొంతగడ్డపై మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. మూడో స్థానంలో హనుమ విహారికి మళ్లీ అవకాశం ఖాయం కాగా... కోహ్లి ఈ మ్యాచ్లోనైనా సెంచరీ సాధించి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతాడా చూడాలి. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా ఆ తర్వాత అశ్విన్ కూడా సత్తా చాటగలడు. బుమ్రా, షమీ ఖాయం కాగా... మూడో స్పిన్నర్గా జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ను ఆడించడంపై టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. అయితే ‘పింక్ బంతి’ బాగా స్వింగ్ అయ్యే అవకాశం ఉండటంతో దాదాపు సొంత మైదానంలాంటి చిన్నస్వామిలో మూడో పేసర్గా హైదరాబాద్ బౌలర్ సిరాజ్కు చాన్స్ లభిస్తుందేమో చూడాలి. తుది జట్టులో ఎవరు? మొదట టి20 సిరీస్లో క్లీన్స్వీప్ అయి తొలి టెస్టులోనూ ఓడిన శ్రీలంక ఇప్పుడు రెండో మ్యాచ్ కోసం తుది జట్టును సిద్ధం చేసుకోవడమే కష్టంగా మారింది. గత మ్యాచ్లో ఆడిన కుమార, నిసాంకా గాయాలతో దూరం కాగా, ఆడే అవకాశం ఉన్న చమీరా కూడా గాయపడ్డాడు. కుశాల్ మెండిస్ కోలుకోవడం ఆ జట్టుకు ఊరట. అసలంక స్థానంలో చండిమాల్కు అవకాశం దక్కవచ్చు. మరోసారి టీమ్ బ్యాటింగ్ సీనియర్లు కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్లపైనే ఆధారపడి ఉంది. ఎంబుల్డెనియాతో పాటు కొత్తగా వస్తున్న చమిక కరుణరత్నే భారత్ను ఏమాత్రం కట్టడి చేయగలరో చూడాలి. ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెబుతున్న సురంగ లక్మల్ ఆటపై అందరి దృష్టీ ఉంది. 4:భారత్కు ఇది నాలుగో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్... స్వదేశంలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్లపై గెలిచిన భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ఓడింది. 400: మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్కిది 400వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. #TeamIndia vice-captain @Jaspritbumrah93 on the mental changes that need to be made for a Pink Ball Test.@Paytm #INDvSL pic.twitter.com/PCfrY6sJe7 — BCCI (@BCCI) March 11, 2022 -
డే అండ్ నైట్ టెస్టులో సెంచరీ.. స్మృతి మంధాన సరి కొత్త చరిత్ర
Smriti Mandhana Maiden Century: భారత ఓపెనర్ స్మృతి మంధాన (216 బంతుల్లో 127; 22 ఫోర్లు, 1 సిక్స్) ‘పింక్ బాల్’ టెస్టులో చరిత్రకెక్కింది. భారత్ ఆడుతున్న తొలి డే నైట్ టెస్టులో ఆమె శతకం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన రెండో రోజు ఆటలో ఆమె సెంచరీ హైలైట్గా నిలిచింది. వర్షంతో ఆట ముగిసే సమయానికి భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్లో 101.5 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. రెండో రోజు వర్షం, ప్రతికూల వాతా వరణంతో 57.4 ఓవర్ల ఆటే సా«ధ్యమైంది. డిన్నర్ బ్రేక్ తర్వాత ఆట కాసేపే (17 ఓవర్లు) జరిగింది. పటిష్టస్థితిలో భారత్ ఓవర్నైట్ స్కోరు 132/1తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్ను స్మృతి పటిష్ట స్థితిలో నిలిపింది. ఆట మొదలైన రెండో ఓవర్లోనే పెర్రీ క్యాచ్ జారవిడువడటంతో బతికిపోయిన స్మృతి తర్వాత ఎలాంటి పొరపాటుకు తావివ్వలేదు. స్ట్రయిట్ డ్రైవ్లతో బౌలర్లను ఓ ఆటాడుకుంది. ఆఫ్సైడ్లో ఫీల్డర్లను పదేపదే పరిగెత్తించింది. ఆమె చేసిన 127 పరుగుల్లో 94 (22 ఫోర్లు, సిక్స్) పరుగులు బౌండరీల రూపంలో రావడం విశేషం. 170 బంతుల్లో కెరీర్లో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేసిన ఆమె రెండో వికెట్కు పూనమ్ రౌత్తో కలిసి 102 పరుగులు జతచేసింది. స్వల్ప వ్యవధిలో స్మృతితో పాటు రౌత్ (36; 2 ఫోర్లు) నిష్క్రమించాక 231/3 స్కోరు వద్ద భారత్ భోజన విరామానికెళ్లింది. తర్వాత కెపె్టన్ మిథాలీ రాజ్ (30; 5 ఫోర్లు), యస్తిక భాటియా (19) కాసేపు ఆడారు. ఆట నిలిచే సమయానికి దీప్తి శర్మ (12 బ్యాటింగ్), తానియా (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సోఫీ మోలినెక్స్కు 2 వికెట్లు దక్కాయి. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన విదేశీ మహిళా క్రికెటర్గా స్మృతి గుర్తింపు పొందింది. గతంలో ఈ రికార్డు మోలీ హైడ్ (124 నాటౌట్–ఇంగ్లండ్; 1949లో) పేరిట ఉండేది. ఆ్రస్టేలియా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ స్మృతి. సంధ్యా అగర్వాల్ (134; 1984లో) తర్వాత ఆ్రస్టేలియా జట్టుపై టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాటర్ స్మృతి. ఆ్రస్టేలియా జట్టుపై వన్డేల్లో, టెస్టుల్లో సెంచరీలు చేసిన నాలుగో క్రికెటర్ స్మృతి. గతంలో ఎనిడ్ బేక్వెల్ (ఇంగ్లండ్), దెబోరా హాక్లీ (న్యూజిలాండ్), క్లెయిర్ టేలర్ (ఇంగ్లండ్) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
Mithali Raj: వ్యక్తిగతం కాదు... సమష్టితత్వం ముఖ్యం
న్యూఢిల్లీ: దేశానికి ఆడేటప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు ఎలాంటి ప్రాధాన్యం ఉండదని మహిళల జట్టు టెస్టు, వన్డే సారథి మిథాలీ రాజ్ పేర్కొంది. చాన్నాళ్ల తర్వాత మహిళల జట్టు పూర్తిస్థాయి సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళుతోంది. వచ్చేనెల 16 నుంచి బ్రిస్టల్లో ఏకైక టెస్టు జరుగుతుంది. ఈ నేపథ్యం లో మిథాలీ మాట్లాడుతూ... ‘కోచ్ రమేశ్ పొవార్తో వివాదం గతంతో సమానం. నేను ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా. ఇక్కడ వ్యక్తిగతం పనికి రాదు. సమష్టితత్వమే కావాలి. 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో నేనెప్పుడూ వ్యక్తిగత ఇష్టాలకు విలువ ఇవ్వలేదు. జట్టు కోసమే ఆడాను. ఇకమీదట కూడా అంతే’ అని పేర్కొంది. ‘నా కెరీర్లో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. చేదు అనుభవాలూ ఉన్నాయి. కానీ అవన్నీ వెంట మోసుకెళ్లలేదు. వర్తమానమే జట్టుకు అవసరం. ఇప్పుడు కోచ్తో జట్టు ప్రయోజనాలపైనే చర్చించుకుంటాం. మిగతావి అప్రస్తుతం. ఇక్కడ మా ఇద్దరి లక్ష్యం జట్టును ముందుకు తీసుకెళ్లడమే. ఇంగ్లండ్తో ఏకైక టెస్టు ఆడాక... ఆస్ట్రేలియాతో మరో టెస్టు ఆడనున్నాం. తొలిసారి డే–నైట్ టెస్టు ఆడనున్నాం. కెరీర్ ముగిసేలోపు డే–నైట్ టెస్టు ఆడతానని ఊహించలేదు. నా కల నిజమవుతున్నందుకు ఆనందంగా ఉంది’ అని మిథాలీ తెలిపింది. (చదవండి: ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్న టీమిండియా మాజీ సారధి) -
రెడ్–పింక్ బాల్స్ మధ్య తేడా ఏమిటి!?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్ల మధ్య మొట్టమొదటి సారిగా డే–నైట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుందనే విషయం తెల్సిందే. ఈ కారణంగానే కాకుండా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ గ్రౌండ్లో ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్కు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం ఉంది. భారత్ పింక్ (గులాబీ రంగు) బాల్తో క్రికెట్ మ్యాచ్ ఆడడం కూడా ఇదే మొదటిసారి. సాధారణంగా అన్ని దేశాలు మొదటి నుంచి రెడ్ బాల్స్తోనే టెస్ట్మ్యాచ్లు ఆడుతూ వచ్చాయి. ఒన్డేలు, ఐపీఎల్ లాంటి పరిమిత ఒవర్ల మ్యాచ్లను వైట్ బాల్స్తో ఆడుతున్నాయి. వైట్ బాల్స్కు బౌన్స్ రేటు ఎక్కువగా ఉంటుంది. దానితోని ఫోర్లు, సిక్స్లు ఎక్కువగా కొట్టే అవకాశం ఉంటుంది. అందుకని ప్రేక్షకులను ఎక్కువగా అలరించడం కోసం వన్డే, ఐపీఎల్ లాంటి మ్యాచ్ల్లో వైట్ బాల్స్ను వాడుతున్నారు. భారత్ మినహా కొన్ని దేశాలు పింక్ బాల్స్తోని కూడా టెస్ట్ మ్యాచ్లు ఆడాయి. ఆడుతున్నాయి. భారత్కే బంగ్లాదేశ్తో అరంగేట్రం. అసలు రెడ్ బాల్స్కు, పింక్ బాల్స్కు తేడా ఏమిటీ? ఇందులో ఏ బాల్స్ ఎక్కువ ఒవర్ల వరకు దెబ్బతినదు? ఏది ఎక్కువగా బరువు ఉంటుంది? పింక్ బాల్స్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయా? బ్యాట్స్మెన్కు అనుకూలంగా ఉంటాయా? ఫాస్ట్ బౌలర్లకు మేలు చేస్తుందా? స్పిన్నర్లకు మేలు చేస్తుందా? అన్న సందేహాలు క్రికెట్ అభిమానుల్లో సుడులు తిరుగుతూనే ఉండవచ్చు. రెడ్ బాల్స్, పింక్ బాల్స్, వైట్ బాల్స్ ఏవైనా ఒకే స్థాయి బరువు కలిగి ఉంటాయి. లండన్లోని మార్లిబోన్ క్రికెట్ క్లబ్ సూచించిన ప్రమాణాల వరకు ఈ మూడు రంగుల క్రికెట్ బంతులు 156 గ్రాముల నుంచి 162 గ్రాముల బరువు మధ్యనే ఉండాలి. దీనికన్నా ఎక్కువున్నా, తక్కువ బరువున్న తిరస్కరిస్తారు. అన్ని అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో దీన్నే ప్రమాణంగా పాటిస్తున్నారు. కొందరు రెడ్ బాల్స్ బరువుంటాయని, వైట్ బాల్స్ తేలిగ్గా ఉంటాయంటారు. అది పూర్తిగా అబద్ధం. వైట్ బాల్స్కు స్వింగ్ ఎక్కువగా ఉంటుంది కనుక అలాంటి భావన కలుగుతుంది. స్వింగ్ రావడం కోసం బంతి మధ్యలో మెత్తటి పదార్థాన్ని ఉపయోగిస్తారు. అసలు రెండింటి మధ్య తేడా ఏమిటి? భారత్లో టెస్ట్ మ్యాచ్ల కోసం రెడ్ బాల్స్ను తయారుచేసి అందిస్తున్న మీరట్లోని ‘సాన్స్పరేల్స్ గ్రీన్లాండ్స్ (ఎస్జీ)’ కంపెనీలో గత 45 ఏళ్లుగా చీఫ్ బాల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వసీవుల్లా ఖాన్ (73) కథనం ప్రకారం అన్ని రంగుల క్రికెట్ బాల్స్కు పైనా కవచంలా లెదర్నే ఉపయోగిస్తారు. ఎరుపు, పింక్ బాల్స్లోపల కాట్స్వూల్, కార్క్లనే కూరుతారు. బంతులను కుట్టడంలో కూడా తేడా ఉండదు. రెడ్ బాల్స్ను తెల్లదారంతో కుడితే, పింక్ బాల్స్ను నల్లదారంతో కుడతారు. రెడ్ బాల్స్కు పైన మైనం కోటింగ్ ఉంటుంది. అందువల్ల రెడ్ బాల్స్ మిల మిలా మెరుస్తూ చెర్రీ పండ్ల రంగులో కనిపిస్తాయి. కొన్ని ఓవర్ల తర్వాత మైనాన్ని బంతి లోపలికి లాగేసుకోవడం వల్ల స్పిన్ బౌలింగ్కు అనుకూలంగా బంతి మారుతుంది. మైనం ప్రభావాన్ని త్వరగా పోగొట్టడానికే బౌలర్లు ఒకవైపున వాటిని బాగా రాపిడి పెడతారు. పింక్ బాల్స్కు మైనాన్ని ఉపయోగించరు! మైనం వాడితే పింక్ రంగు నలుపు రంగులోకి మారుతుంది. అందుకని మైనాన్ని వాడరు. పాలిష్ వాడుతారు. ఎర్రరంగు త్వరగా పోకుండా రెడ్ బాల్స్పై మైనం పూత ఎలా రక్షిస్తుందో ఈ పాలిష్ 40 ఓవర్ల వరకు పింక్ రంగు పోకుండా రక్షిస్తుంది. టెస్ట్ మ్యాచ్లకు ఉపయోగించే బంతుల్లో నాణ్యమైన పదార్థాన్ని కూరడంతో పాటు బలమైన దారాన్ని ఉపయోగిస్తారు. ఈ రెండింట్ని కూడా భారత్ కంపెనీలు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. బంతిని కుట్టే రెండు (కప్పులు) అంచుల మధ్య భాగాన్ని ‘సీమ్’ అని పిలుస్తారు. రెడ్ బాల్స్లో బంతి కప్పు అంచులకు సింథటిక్ను మాత్రమే వాడతారు. పింక్ బాల్స్లో సింథటిక్ను, లైనెన్ను సమపాళ్లలో వినియోగిస్తారు. డే టెస్ట్ మ్యాచ్లకే రెడ్ బాల్స్ను ఉపయోగిస్తారు. డే–నైట్ టెస్ట్ మ్యాచ్లకు పింక్ బాల్స్ వాడుతారు. లైనెన్తో గ్రిప్ పెరుగుతుంది పింక్ బాల్స్ సీమ్లో లైనెన్ను ఉపయోగించడం వల్ల బౌలర్లకు గ్రిప్పు పెరుగుతుంది. ముఖ్యంగా సీమ్ బౌలర్లకు అది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మొదటి పది–పదిహేను ఓవర్ల వరకు పింక్ బాల్స్ ఎక్కువగా స్వింగ్ అవుతాయి. 40–45 ఓవర్ల తర్వాత కూడా స్పిన్ బౌలింగ్కు ఎక్కువగా ఉపయోగపడతాయి. మొత్తంగా రెడ్ బాల్స్తో పోలిస్తే రంగు త్వరగా పోదు. పటిష్టత ఎక్కువగా ఉంటుంది. అంటే బాల్ త్వరగా షేపవుట్ కాదు. ‘గోగేజ్–నోగేజ్’ పేరిట బాల్ షేపవుట్ అయిందా, లేదా? అన్న అంశాన్ని ఎంపైర్లు నిర్ధారిస్తారు. గోగేజ్ అంటే బంతి చుట్టూ కొలత 71 మిల్లీ మీటర్ల ఉండాలి. నోగేజ్ అంటే 73 మిల్లీ మీటర్లకు మించి ఉండరాదు. అంటే, బంతి మధ్య కేంద్ర బిందువు నుంచి బంతి చుట్టూ కొలత కొలచినప్పుడు బంతి వృత్తం 71–73 మిల్లీ మీటర్ల మధ్యనే ఉండాలి. ఎక్కడ బంతి ఉపరితల వృత్తం 71 మిల్లీ మీటర్లకన్నా తగ్గినా, 73 మిల్లీ మీటర్లకన్నా పెరిగినా అది షేపవుట్ అయినట్లు. అన్ని విధాల పింక్ బాల్స్ బాట్స్మెన్కన్నా బౌలర్లకే ఎక్కువగా ఉపయోగపడుతుంది. (చదవండి: రహానే కళ్లలో గులాబీ కలలే.. )
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement