-
నగదుతో ఉడాయించిన వ్యక్తే కిడ్నాపరా?
దామరచర్ల : దామరచర్ల మండలం కొండ్రపోల్ రైతు మిత్ర ఎరువుల దుకాణంలో సోమవారం విజిలెన్స్ అధికారిగా హల్చల్ చేసిన వ్యక్తి.. ఈ నెల 23న హయత్ నగర్లో సోనీని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఒక్కరేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీ ఫార్మసీ విద్యార్థిని సోనీని రవిశంకర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. కిడ్నాపర్ వినియోగించిన లాంటి కారునే విజిలెన్స్ అధికారిగా చెప్పుకున్న వ్యక్తీ వినియోగించాడని సమాచారం. అయితే కారునంబర్లో మాత్రం తేడాలున్నట్లు తెలుస్తోంది. ఎరువుల దుకాణం నుంచి నగదుతో ఉడాయించిన సదరు వ్యక్తి రాష్ట్ర సరిహద్దు అయిన వాడపల్లి వంతెన ద్వారా ఏపీలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఉన్నతాధికారులు అప్రమత్తం చేయడంతో కిడ్నాపర్, విజెలెన్స్ అధికారిగా చెప్పుకున్న వ్యక్తి ఒక్కరేనా? అన్న దిశలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
‘భద్రాద్రి’ తనిఖీ నివేదిక సానుకూలం
కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల సబ్ కమిటీ నివేదిక యాదాద్రి ప్లాంట్కు అనుమతులపై నిర్ణయం వాయిదా సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 (4x270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ ప్రభావ అధ్యయనం (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) సాధ్యమేనని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల సబ్ కమిటీ నివేదించింది. పర్యావరణ అనుమతులు రాకముందే పనులు చేపట్టిన దృష్ట్యా అసలు ఈ ప్లాంట్కు ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ సాధ్యమేనా? కాదా? అన్న అంశంపై నిర్ణయం తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని నెలల కింద కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల సబ్ కమిటీ గత నెల 17-19 తేదీల్లో మణుగూరులో తనిఖీలు జరిపి ఆ శాఖకు సమగ్ర అధ్యయన నివేదిక సమర్పిం చింది. మొత్తం ప్లాంట్ నిర్మిత ప్రాంతంలోని 1.85% భాగంలో మాత్రమే జెన్కో పనులు చేపట్టిందని, ఈ నేపథ్యంలో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సాధ్యమేనని నివేదించింది. ఈ కమిటీలోని ఓ సభ్యుడు మాత్రం ప్రస్తుత పరిస్థితిలో అసెస్మెంట్ కష్టమని విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత నెల 29,30వ తేదీల్లో ఢిల్లీలో సమావేశమైన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ(ఈఏసీ) ఈ నివేదికపై చర్చించి మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని ఆమోదించింది. యాదాద్రి నివేదిక తయారీలో జెన్కో గ్రంథ చౌర్యం.. నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 (5x800) మెగావాట్ల సామర్థ్యంతో జెన్కో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్కు పర్యావరణ అనుమతుల జారీ అంశంపై నిర్ణయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల మదింపు కమిటీ మరోసారి వాయిదా వేసింది. ఇతర ప్లాంట్ల నివేదికలను కాపీ పేస్ట్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ ప్రభావ అధ్యయన నివేదికను జెన్కో తయారు చేసి గ్రంథ చౌర్యానికి పాల్పడిందని ఆక్షేపించింది. జెన్కోపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సిఫారసు చేసింది. బొగ్గు రవాణా కోసం రైల్వే, పోర్టులతో ఒప్పందాలు, నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు తదితర వివరాలతో కొత్త నివేదికను సమర్పిం చాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై నిర్వహించిన బహిరంగ విచారణలో వచ్చిన ప్రజల అభ్యం తరాలకు సమాధానాలను ప్రధాన పత్రికల్లో ప్రచురించాలని, జెన్కో వెబ్సైట్లో ప్రదర్శనకు ఉంచి ప్రజల నుంచి తదుపరి అభ్యంతరాలను స్వీకరించాలని ఆదేశించింది. -
దామరచర్లలో వీవీఎస్ లక్ష్మణ్ పుష్కరస్నానం
దామరచర్ల: ఇండియన్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గురువారం కృష్ణా పుష్కరాల్లో స్నానమాచారించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలోని పుష్కర ఘాట్కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్య స్నానమాచారించారు. -
అరగంటపాటు నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్ ప్రెస్
దామరచర్ల(నల్లగొండ): సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళోతన్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా దామరచర్లలో అర్ధాంతరంగా నిలిచిపోయింది. బొత్తల పాలెం వద్ద పట్టాలపై ఉన్న రెండు గేదెలను రైలు ఢీకొట్టిన అనంతరం డ్రైవర్ రైలును నిలిపేశాడు. చనిపోయిన గేదెల శరీరభాగాలు రైలు చక్రాల్లో ఇరుక్కుపోవడంతో రైలును అనివార్యంగా నలిపేశారు, వీటిని తొలగించిన అనంతరం తిరిగి రైలు గుంటూరుకు బయలుదేరింది. -
10 అడుగుల కొండచిలువ హతం
దామరచర్ల (నల్లగొండ) : అడవికి మేతకు వెళ్లిన గొర్రెలు మాయమవుతున్నాయని బాధపడుతున్న గొర్రెల కాపరులకు ఈ రోజు ఒక మేకపిల్లను తింటున్న కొండచిలువ కనిపించింది. దీంతో గొర్రెల కాపరులంతా కలిసి దాన్ని హతమార్చారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాజ్యతండాలో మంగళవారం జరిగింది. సుమారు పది అడుగులు ఉన్న కొండచిలువ మేకను తింటుండగా.. గుర్తించిన మేకల కాపరులు స్థానికుల సాయంతో దాన్ని హతమార్చారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement