Dacoit Movie
-
అడివి శేష్ ప్రేమ కథ.. కళ్లు చెమ్మగిల్లే స్టోరీ
డెకాయిట్ మూవీతో అడివి శేష్ ప్రేక్షకులను మెప్పించాడు. భగ్నప్రేమికుడు ఎలా ఉంటాడో చాలా ఎమోషనల్ టచ్తో నటించాడు. గతంలో గూఢచారి, మేజర్ వంటి సినిమాలతో సీరియస్ పాత్రలు చేసినప్పటికీ అందులో లవ్ సీన్ వస్తే జీవించేస్తాడు. ఇంతటి బరువైన సీన్లో కూడా సులువుగా అతను నటించడం చూసి ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. 'క్షణం', 'డెకాయిట్' వంటి సినిమాల్లో ఆ 'బిట్టర్ స్వీట్ పెయిన్' ఎలా వచ్చిందో ఒక ఇంటర్వ్యూలో అడివి శేష్ వివరణ ఇచ్చారు.సినిమాల్లో ఎంట్రీకి ముందు అడివి శేష్ అమెరికాలో ఉండేవారని తెలిసిందే. అక్కడ తనకు 17ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానని శేష్ ఇలా చెప్పాడు. అయితే, ప్రేమ విషయంలో ఎంతో క్షోభను అనుభవించానంటూ కొన్ని బాధాకరమైన విషయాలను ఇలా బయటపెట్టారు. అమెరికాలో ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడ్డాను.. కానీ, రెండూ విషాదాన్నే ఇచ్చాయి. నా పుట్టినరోజు నాడే ప్రేమించిన అమ్మాయి మరోకరిని పెళ్లి చేసుకుంది. ఆ సంఘటన నేను భరించలేకపోయాను. ప్రతి పుట్టినరోజు నాడు అందరూ శుభాకాంక్షలు చెబుతుంటే.. నాకు ఆ సంఘటనే గుర్తుకు వస్తుంది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మరో ప్రియురాలు అకాల మరణం ఎంతగానో నన్ను కుంగదీసింది.అడివి శేష్ ప్రేమ జీవితం గురించి తెలుసుకున్న తర్వాత నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అడివి శేష్ జీవితంలో ఇంతటి విషాదమా..? అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ గుండె కోత వింటే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లాల్సిందేనని . ఆయన ధైర్యానికి ఫిదా అవుతున్నారు. -
అడివి శేష్ డెకాయిట్.. చిచ్చుబుడ్డి ఫుల్ వీడియో వచ్చేసింది..!
టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో సింగర్ జోనితా గాంధీ ఆకట్టుకుంది. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల, జోనితా గాంధీ ఆలపించారు. ఈ సాంగ్ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. -
అప్పుడు మేజర్.. ఇప్పుడు డెకాయిట్.. మూవీ లవర్స్కు గుడ్ న్యూస్
టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఇప్పటికీ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు. తాజాగా డెకాయిట్ మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. సినీ ప్రియులకు ఊరట కల్పించేలా టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని అడివి శేష్ ట్విటర్లో షేర్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు తగ్గించారు. ఏపీలోని సింగిల్ స్క్రీన్స్లో రూ.105, రూ.70గా ధరలు నిర్ణయించారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్లో రూ.105, రూ.80, రూ.50గా ఖరారు చేశారు. టీజీలోని అన్ని మల్టీప్లెక్స్ల్లో మాత్రం రూ.150గా ఫిక్స్ చేశారు. తగ్గించిన ధరలు ఈనెల 24వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. కాగా.. గతంలో మేజర్ సినిమాకు కూడా ఇదే తరహాలో టికెట్ ధరలు తగ్గించారని ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో డెకాయిట్ మూవీని థియేటర్లలో చూడాలనుకున్నావారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీని సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించారు. ఈ చిత్రంలో ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. Thank you for all the LOVE ❤️🔥❤️🔥❤️🔥Appudu #MAJOR ki Lowest Ticket PriceIppudu #DACOIT ki. We called the Theaters and Spoke to them about Lowering Ticket Prices ❤️🔥❤️🔥❤️🔥ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరల్లో:👉 ఆంధ్రప్రదేశ్ – ₹105, ₹70👉 తెలంగాణ – ₹105, ₹80, ₹50… pic.twitter.com/63Cq0H0Q4m— Adivi Sesh (@AdiviSesh) April 23, 2026 -
డెకాయిట్ సంతృప్తి ఇచ్చింది: సుప్రియ
‘‘సినిమా అంటే ఒక మ్యాజిక్ ఉండాలి. అలాంటి మ్యాజిక్ ‘డెకాయిట్’ చిత్ర కథలో ఉంది. అందుకే బడ్జెట్ గురించి ఆలోచించకుండా తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరించాం. అన్నీ బడ్జెట్ పరంగా ఆలోచిస్తే కథకు న్యాయం చేయలేం. అలాగే మంచి సినిమాకి ఎప్పుడూ రిస్క్ ఉంటుంది. ‘డెకాయిట్’ చిత్రానికి పతాక సన్నివేశమే అందం’’ అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ చెప్పారు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘డెకాయిట్’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్పై సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం సుప్రియ విలేకరులతో పంచుకున్న విశేషాలు....⇒ ‘డెకాయిట్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్ని ఇస్తోంది. హరి పాత్రలో శేష్ అద్భుతంగా నటించారు. మృణాల్ పోషించిన సరస్వతి పాత్రకు ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ బలంగా ఉన్న సినిమా తీయాలనే నా ఆకాంక్ష ఈ సినిమాతో తీరింది. ‘డెకాయిట్’ చిత్రం ఆ సంతృప్తి ఇచ్చింది.⇒ డిస్ట్రిబ్యూషన్ పరంగా, నిర్మాణపరంగా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు బయటకు చెప్పుకుంటున్నాం అంతే. నాగార్జునగారి వందో సినిమా గురించి, 2027 సంక్రాంతికి ఆయన హీరోగా రానున్న సినిమా గురించి ప్రస్తుతం నేను ఏం చెప్పలేను.. ఆయనే చెబుతారు. మా ఎస్ఎస్ క్రియేషన్స్లో మళ్లీ సినిమా చేసేందుకు కథలు వినాల్సి ఉంది.⇒ ఓ సినిమా థియేటర్స్లో రిలీజైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధనపై నిర్మాతలందరూ నిర్ణయం తీసుకోవాలి. అలాగే నిర్మాతలు–ఎగ్జిబిటర్స్ మధ్య పర్సెంటేజ్ వి«ధానం గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. రెంటల్ విధానంవైపే నేను మొగ్గు చూపుతాను. కాకపోతే సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం థియేటర్స్వారికి లాభం చేకూర్చేలాగా ఆలోచించాలి. ఈ అంశంపై నువ్వా? నేనా? అనే ధోరణితో కాకుండా మనం అనుకుని అందరం కలిసి మాట్లాడుకోవాలి. -
అడివి శేష్ డెకాయిట్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్ హీరో అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం డెకాయిట్. ఈ నెల ఏప్రిల్ 10న విడుదలైన ఈ మూవీ చిత్రం వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. మూడో రోజు కూడా అదే జోరు కొనసాగించింది. ఓవరాల్గా చూస్తే మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్ రాబట్టింది. మూడో రోజు ఆదివారం కావడంతో ఈ సినిమాకు మరింత కలిసొచ్చింది. ఈ చిత్రం ఆదివారం రోజు రూ. 6.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా విదేశీ మార్కెట్లోనూ రాణిస్తోంది. సండే ఒక్క రోజే రూ. 2.25 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్ వసూళ్లు ఇప్పటివరకు రూ. 11.65 కోట్లకు చేరుకున్నాయి.ఇక ఇండియా వ్యాప్తంగా వసూళ్లను పరిశీలిస్తే రూ. 23.12 కోట్ల గ్రాస్ సాధించగా.. రూ. 19.80 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అడివి శేష్ నటించిన హిట్-2తో పోలీస్తే బాక్సాఫీస్ వసూళ్ల పరంగా డకాయిట్ ముందంజలో ఉంది. హిట్-2 విడుదలైన మూడు రోజుల్లోనే భారతదేశంలో రూ. 16.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టగా.. అదే సమయంలో డెకాయిట్ రూ. 19.80 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. కాగా.. ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించగా.. మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.. -
మృణాల్ ఠాకూర్ను లెజెండరి హీరోయిన్లతో పోల్చిన నాగ్ అశ్విన్
సీతారామం, హాయ్ నాన్న వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఆమె మరాఠీ అమ్మాయని తెలిసినప్పటికీ అంతా తెలుగమ్మాయిలాగే భావిస్తారు. తాజాగా ఆమెపై దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. అడివి శేష్తో కలిసి మృణాల్ నటించిన చిత్రం ‘డెకాయిట్’ భారీ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.. దీంతో సినిమా విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు నాగ్ అశ్విన్ పాల్గొన్నారు.డెకాయిట్ మూవీ విజయోత్సవంలో దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ మృణాల్ ఠాకూర్ను ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మృణాల్ అద్భుతమైన నటి అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమెలాంటి నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. సాధారణమైన పాత్రలు చేసి నీ స్థాయిని తగ్గించుకోవద్దు. లెజెండరీ అలనాటి హీరోయిన్లు స్మిత పాటిల్, మధుబాల తరహాలో గొప్ప పాత్రలు చేయాలని కోరుకుంటాను' అని అన్నారు. అదే సమయంలో నిర్మాత సుప్రియ యార్లగడ్డను నాగ్ అశ్విన్ అభినందించారు. సుప్రియ స్కూల్లో తన సీనియర్ అని ఆమె ఇంత గొప్ప సినిమాని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని ప్రశంసించారు.అడివి శేష్ కెరీర్లోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా డెకాయిట్ నిలిచింది. రెండురోజుల్లోనే ఏకంగా రూ. 28 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ నిర్మాత సుప్రియ అంటూ అడివి శేష్ తెలిపారు. అయితే, మృణాల్ ఈ సినిమాకి మరో బలం అంటూ గుర్తుచేశారు. -
‘డెకాయిట్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
మృణాల్.. టాలీవుడ్ హీరోనే పెళ్లి చేసుకో : అల్లు అరవింద్
స్టేజ్పై సరదాగా మాట్లాడే టాలీవుడ్ ప్రముఖుల్లో నిర్మాత అల్లు అరవింద్ ఒకరు. సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో ఆయన స్పీచ్ ఎప్పుడూ నవ్వించేలా ఉంటుంది. అలాగే టాలెంట్ ఉన్న యువ నటీనటులను ప్రోత్సహించేలా ఆయన మాటలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాళ్ల ప్రేమ విషయాలను కూడా బయటపెడుతుంటాడు. అయితే ఆయనకు తెలిసి అంటాడో తెలియక అంటాడో తెలియదు కానీ.. ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు కొన్నిసార్లు నిజమవుతుంటాయి. ఓ సినిమా ఈవెంట్లో లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ..‘తెలుగు చక్కగా మాట్లాడుతున్నావు.కాబట్టి ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది’ అని దీవించగా..ఆయన మాటలే నిజమై.. వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకుంది. ఇక తాజాగా ఆయన మరో నటిపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. సీతారామం ఫేం మృణాల్ ఠాకుర్ని కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు.తాజాగా ఆయన అడివి శేష్-మృణాల్ జంటగా నటించిన ‘డెకాయిట్’ మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మృణాల్ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. లావణ్య మాదిరే నువ్వు కూడా తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. ‘ఇంతకు ముందు ఒక అమ్మాయిని(లావణ్య త్రిపాఠి) దీవించాను. ఆమె మా వరుణ్ తేజ్ భార్య అయిపోయింది. అలాగే నువ్వు(మృణాల్) కూడా ఇక్కడ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మాకు(టాలీవుడ్) కావాలి. అందుకే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా’ అని అరవింద్ నవ్వుతూ అన్నాడు. #AlluAravind to #MrunalThakur,"You should marry somebody from here (Tfi ) and settle."We all know what happened when #AlluAravind said this on stage last time🤫😙 pic.twitter.com/3F9KQxvYft— MovieMind (@_MovieMind) April 12, 2026 -
'డెకాయిట్' రెండురోజుల కలెక్షన్స్
టాలీవుడ్ హీరో అడివి శేష్ నటించిన చిత్రం డెకాయిట్.. ఏప్రిల్ 10న విడుదలైన ఈ మూవీని దర్శకులు షానియల్ డియో తెరకెక్కించారు. తాజాగా రెండురోజుల కలెక్షన్స్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. రెండోరోజు కూడా అదే రేంజ్లో సత్తా చాటింది. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ మూవీలో ,మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల తదితరులు నటించారు.డెకాయిట్ చిత్రం రెండురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 28 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ చిత్రం విదేశాలలో కూడా బాగా రాణిస్తోంది, ఉత్తర అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ మార్కును దాటింది. రాబోయే రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరగవచ్చని ఆశిస్తున్నారు. డెకాయిట్ చిత్రం బాగుందని ఇప్పటికే చాలామంది ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ కావద్దని పోస్టులు షేర్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. దీంతో చాలా థియేటర్స్ హౌస్ఫుల్ కలెక్షన్స్తో సత్తా చాటుతుంది. #Dacoit pulls off a massive heist at the box office, stealing audience love ❤️Collects ₹28+ CRORES GROSS worldwide in just 2 days 💥Don’t miss it in theatres near you 🤩Book your tickets now!🎟️ https://t.co/jOhNHoshAS#AudienceBlockbusterDacoit pic.twitter.com/9NSGeIyELD— Annapurna Studios (@AnnapurnaStdios) April 12, 2026 -
ప్రేమతో మా సినిమా చూస్తున్నారు.. ధన్యవాదాలు: అడివి శేష్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నిన్న (శుక్రవారం) రిలీజైంది. ఈ సందర్భంగా ప్రేక్షకులతో కలిసి సినిమాను చూసింది ‘డెకాయిట్’ యూనిట్. అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను మేం ప్రేమతో చేశాం. మీరు కూడా ప్రేమతో చూశారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రంలో సరస్వతి పాత్ర చేసిన మృణాల్ మా హీరో (నవ్వుతూ). నా బెస్ట్ ఫ్రెండ్ షానియల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కావడం నాకు ఎమోషనల్గా అనిపిస్తోంది’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన సరస్వతి పాత్ర మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపారు మృణాల్ ఠాకూర్. ‘‘మా సినిమాపై ఇంతటి ప్రేమ, ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు షానియల్ డియో. -
డెకాయిట్ 1st డే కలెక్షన్స్: శేష్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్..
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం డెకాయిట్. ప్రేమకథ, యాక్షన్ మేళవించి ఉన్న చిత్రాన్ని షానియల్ డియో డైరెక్ట్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. సునీల్ నారంగ్ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఫస్ట్ డే కలెక్షన్స్భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ.15 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇంత భారీ ఓపెనింగ్స్ రావడం అడివి శేష్ కెరీర్లో ఇదే మొదటిసారి! మరి మొదటిరోజే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన డెకాయిట్ రానున్నరోజుల్లో ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి!సినిమా కథతక్కువ కులానికి చెందిన హరి (అడివి శేష్)ని అగ్రకులానికి చెందిన సరస్వతి (మృణాల్ ఠాకూర్) ప్రేమిస్తుంది. కానీ, కులం కారణంగా ఇద్దరూ విడిపోతారు. ఈ క్రమంలో ఓ కేసులో అబద్ధపు సాక్ష్యం చెప్పి హరిని జైలుకు పంపిస్తుంది సరస్వతి. 13 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన హరి తర్వాత అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను కేసులో ఇరికించిన సరస్వతిపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. ఇంతలో హరి, సరస్వతికి డబ్బు సమస్య వస్తుంది. మరి హరి.. సరస్వతిపై పగ తీర్చుకున్నాడా? డబ్బు కోసం ఇద్దరు కలిసి ఏం చేశారు? అతడు సరస్వతి అతడిని జైలుకు ఎందుకు పంపించింది? అన్నది డెకాయిట్ చూసి తెలుసుకోవాల్సిందే! #Dacoit opens with a BANG ❤️🔥❤️🔥15 CRORES+ GROSS ON DAY 1 🔥The Biggest opening ever for @AdiviSesh 💥💥💥Don’t miss it in theatres near you 🤩Book your tickets now!🎟️ https://t.co/jOhNHoshAS#AudienceBlockbusterDacoit pic.twitter.com/3WON13una1— Annapurna Studios (@AnnapurnaStdios) April 11, 2026 చదవండి: డెకాయిట్ మూవీ రివ్యూ -
డెకాయిట్ మూవీ ఫస్ట్ రివ్యూ
-
సీతామహాలక్ష్మిలా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
-
‘డెకాయిట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: డెకాయిట్ నటీనటులు: అడివి శేష్,మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల తదితరులునిర్మాత: సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్కథ, స్క్రీన్ప్లే: అడివి శేష్ దర్శకత్వం: షానియల్ డియోసంగీతం: భీమ్స్ సిసిరోలియోసినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్విడుదల తేది: ఏప్రిల్ 10, 2026అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన చిత్రం ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. టీజర్, ట్రైలర్తో అంచనాలు పెంచేసిన ఈ టీం మరి ఆడియెన్స్ని మెప్పించిందా? లేదా? అన్నది చూద్దాం.కథేంటంటే..తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.ఎలా తీశారంటే?..ప్రేమ కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రేమ కథల్ని ఎంత కొత్తగా, ఎంత అట్రాక్టివ్గా చెప్పామన్నదే విజయంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఆ విషయంలో డెకాయిట్ కొంత వరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రేమకు కులం అడ్డు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇందులోనే అదే పాయింట్ను చూపించారు. కానీ ఇందులోని ప్రేమ కథను, ప్రేమికుల్ని కాస్త కొత్తగా, భిన్న శైలిలో చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేయసి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు హీరో. ఇద్దరూ కలిసి దొంగ తనాలు కూడా చేస్తుంటారు. ఇంటర్వెల్కు ఓ చిన్న పాటి ట్విస్ట్లాంటిది ఇస్తారు.ఇక సెకండాఫ్లో హీరోకి అసలు విషయం తెలియడం, గతానికి సంబంధించిన నిజం, తన కోసం ప్రేయసి చేసిన త్యాగం ఇవన్నీ తెలుస్తాయి. ఇక ప్రేయసికి ఉన్న ఇబ్బందిని తీర్చేందుకు ప్రియుడు చేసే త్యాగంతో క్లైమాక్స్ కాస్త బరువెక్కినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ ట్విస్ట్ కూడా ఆడియెన్స్ ముందే పసిగట్టేస్తారు. కాబట్టి చివరకు అదేదో పెద్ద ట్విస్ట్, త్యాగంలా అనిపించదు. పైగా ఇది వరకు సినిమాల్లో చూసేసి ఉండటంతో ఇక్కడ ఆ ట్విస్ట్ అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు.అయితే ఈ చిత్రంలో కరోనా సమయంలో హాస్పిటల్స్ చేసిన దోపిడి, వ్యవహరించిన తీరుని మాత్రం బాగానే చూపించారు. ఈ సినిమాలో చాలా వరకు కరోనా నాటి పరిస్థితులు, అప్పటి వైద్య వ్యవస్థ గురించే చర్చించారు. ఆ పార్ట్ వరకు డెకాయిట్ ఆడియెన్స్ని మెప్పించే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు.ఎలా చేశారంటే?అడివి శేష్ ఈ సారి కాస్త కొత్తగా కనిపించాడు. యాసలోనూ చాలా వరకు మాడ్యులేషన్ చూపించాడు. ఆ యాస వల్లే కొన్ని డైలాగ్స్ కూడా అర్థం కాకపోవచ్చు. లుక్స్, యాక్షన్ పరంగా అడివి శేష్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. ఇక మృణాల్కి మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. సరస్వతి అలియాస్ జూలియట్గా మృణాళ్ ఆడియెన్స్ మరోసారి మెస్మరైజ్ చేస్తుంది. ఇక అనురాగ్ కశ్యప్ పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుంది. సునీల్, ప్రకాష్ రాజ్ కారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అనే చెప్పాలి. ఆర్ఆర్ సైతం సరికొత్తగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అయితే విజువల్స్ గురించి చెప్పుకోవాలి. కెమెరా వర్క్ టాప్ నాచ్లో ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా అనిపిస్తాయి. ప్రతీ పైసాకి తగ్గ వర్క్ తెరపై కనిపిస్తుంది. -
డెకాయిట్ నిర్మాత సుప్రియపై సమంత ప్రశంసలు
సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తున్న డెకాయిట్ సినిమాపై నటి సమంత ఒక పోస్ట్ షేర్ చేశారు. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని షానియల్ డియో తెరకెక్కించారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపిస్తూనే ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు.డెకాయిట్ చిత్రం విజయం సాధించాలని నిర్మాత సుప్రియకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశారు. 'డియర్ సుప్రియ డెకాయిట్ చిత్రం కోసం నువ్వు చాలా కష్టపడ్డావ్.. సినిమాపై నీవు చూపే అంకితభావం చాలా గొప్పగా ఉంటుంది. ఈ చిత్రం కోసం నీవు పడిన శ్రమ, నిబద్ధత అన్నీ నేను చాలా దగ్గరగా చూశాను. ఒక నిర్మాతగా బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకోవాలని దానికి పూర్తి అర్హత నీకుందని నేను నమ్ముతున్నాను. దేవుడి ఆశీస్సులు ఎప్పటికీ నీకు ఉంటాయ్.. ఈ మూవీలో నటించిన అడివి శేష్, మృణాల్ ఠాకూర్కు నా అభినందనలు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాలని కోరుకుంటున్నాను.' అని ఆమె పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
అడివి శేష్ డకాయిట్.. ఫుల్ మెలోడి సాంగ్ రిలీజ్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. ఇటీవల ట్రైలర్ రిలీజైన ట్రైలర్కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ మూవీతో హిట్ కొట్టాలని అడివి శేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు ఆడియన్స్ను అలరించాయి. నీవెంట నేను అంటూ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. శ్రీరామచంద్ర ఆలపించారు. ఈ సాంగ్ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. కాగా.. మూవీని ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. A melody born from a heart that truly loves 🎶💕#Dacoit third single out now ❤️#NeeventaNenu (Telugu) sung by @Sreeram_singer ▶️ https://t.co/Ins3Eg6tx6#TuJahaan (Hindi) sung by @AdityaRikhariii ▶️ https://t.co/1UxWgVECH5Book your tickets now!🎟️ https://t.co/jOhNHoshAS… pic.twitter.com/SespX3usQI— Annapurna Studios (@AnnapurnaStdios) April 8, 2026 -
'అలా జరిగినందుకు క్షమించు'.. మృణాల్కు సారీ చెప్పిన సుమంత్
టాలీవుడ్ హీరో సుమంత్ సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్కు క్షమాపణలు చెప్పారు. సీతారామం మూవీలో ఓ సీన్లో ఉందని అన్నారు. 'క్షమించు.. నీ రాముని నీ దగ్గరి నుంచి తీసుకెళ్లినందుకు' ఓ సీన్లో ఉందని అన్నారు. కానీ ఈ సీన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఎడిటింగ్లో తీసేయాల్సి వచ్చిందని సుమంత్ తెలిపారు. అందుకే నేను 'డెకాయిట్లో మృణాల్ కి ఛాన్స్ ఇప్పించానని సుమంత్ వెల్లడించారు. డకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన సుమంత్ ఈ కామెంట్స్ చేశారు.కాగా.. అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీని లవ్స్టోరీతో కూడిన యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించారు. మృణాల్ ఠాకూర్ ని క్షమాపణలు కోరిన సుమంత్ 'సీతారామం' లో నేను మృణాల్ కి క్షమాపణలు చెప్పిన సీన్ ఒకటి ఉంది అది ఎడిటింగ్ లో డిలీట్ చేశారు అందుకే నేను 'డెకాయిట్' లో మృణాల్ కి ఛాన్స్ ఇప్పించాను : సుమంత్#AdiviSesh #MrunalThakur #Dacoit #Sumanth pic.twitter.com/5a1tUXY1lh— Filmy Focus (@FilmyFocus) April 7, 2026 -
అడివి శేష్ అంటే చాలా క్రష్ : టాలీవుడ్ నటి
టాలీవుడ్ హీరో అడివి శేష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా వస్తోన్న చిత్రం డకాయిట్. ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. లవ్స్టోరీతో కూడిన యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాను అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు అడివి శేష్ అంటే నాకు క్రష్ ఉండేదని కామాక్షి భాస్కర్ల తన మనసులో మాటను బయటపెట్టింది. అయితే ఇప్పుడు మాత్రం అలాంటిదేమీ లేదని తెలిపింది. ఇప్పుడు ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టమని వెల్లడించింది. కామాక్షి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. నాకు శేష్ అంటే చాలా క్రష్ ఉండేది : కామాక్షి భాస్కర్ల#AdiviSesh #MrunalThakur #Dacoit #KamakshiBhaskarla pic.twitter.com/wFNG7XC1Z3— Filmy Focus (@FilmyFocus) April 7, 2026 -
మదనపల్లి యాస మాట్లాడా: అడివి శేష్
‘‘నా గత సినిమాల్లో కథలో ఒక చిన్న భాగంగా ప్రేమకథ ఉంటుంది. కానీ, ‘డెకాయిట్’లో మాత్రం ప్రేమకథే మెయిన్ ప్లాట్ ఫామ్. ఒక ప్రేమకథలో యాక్షన్ చూసేందుకు వెళ్లే ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే ఒక యాక్షన్ సినిమాలో లవ్ స్టోరీ చూసేందుకు వెళ్తే నిరుత్సాహపడరు. ఇందులోని భావోద్వేగాలన్నీ కూడా సహజంగా ఉంటాయి’’ అని హీరో అడివి శేష్ తెలిపారు. షానియల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘డెకాయిట్’.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లో అడివి శేష్ విలేకరులతో పంచుకున్న విశేషాలు... ⇒ ఒక ఇంటెన్స్ యాంగర్ యాక్షన్ మధ్యలో లవ్ స్టోరీ తయారు చేశాం. ‘డెకాయిట్’ తెలుగు ట్రైలర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. హిందీలో మేము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ రీచ్ ఉంది. పవన్ సింగ్గారు ‘డెకాయిట్’లో చేయడం భోజ్ పురికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోజ్పురిలో కూడా ప్రీమియర్ వేస్తారా? అని ఫస్ట్ టైమ్ అడిగినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ మూవీ చేస్తున్నప్పుడు నా మోకాలికి గాయం కావడంతో షూటింగ్ రెండు మూడు నెలలు ఆలస్యం అయింది. ఆ ఎఫెక్ట్ ‘గూఢచారి 2’ మూవీపైన కూడా పడింది. ‘డెకాయిట్’ కోసం 45 డిగ్రీల వేడిలో క్లైమాక్స్ చిత్రీకరించాం.⇒ డైరెక్టర్ షానియల్ డియో, నేను బెస్ట్ ఫ్రెండ్స్. అయితే సినిమా విషయంలో మాత్రం రాజీపడం. మృణాల్ ఠాకూర్ అద్భుతమైన నటి. నాగచైతన్య–శోభితగార్ల పెళ్లికి హైదరాబాద్ వచ్చిన సమయంలో అనురాగ్ కశ్యప్గారికి ఈ కథ చె ప్పాం. ఆయనకి నచ్చడంతో వెంటనే చేస్తానన్నారు. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ సుప్రియగారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్గారికి కూడా ఇది చాలా ఫ్రెష్ ప్రాజెక్టు అయింది. ‘డెకాయిట్’ తెలుగు వెర్షన్లో ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో...’ సాంగ్ని, హిందీలో ‘చీజ్ బడీ õß మస్త్..’ పాటని పెట్టాం. పోలాకి విజయ్గారు చాలా స్వీట్ కొరియోగ్రాఫర్. ⇒ ఈ సినిమాలో నేను చేసిన హరి పాత్ర క్యారెక్టర్ని బట్టి ‘డెకాయిట్’ టైటిల్ ఫిక్స్ చేశాం. ఈ పాత్ర కోసం మదనపల్లి యాస ప్రాక్టీస్ చేశాను. నా నుంచి వరుసగా సినిమాలు రావాలంటే నేను రచయితగా ఉండకూడదనుకున్నాను. ‘గూఢచారి 2’ తర్వాత ఎమోషనల్గా రీఛార్జ్ అవ్వాలి అనుకుంటున్నా. ‘డెకాయిట్’ ని డాల్బీలో రిలీజ్ చేయాలని మొదటి నుంచి అనుకున్నాం. అల్లు అరవింద్గారు ఫోన్ చేసి, సినిమా చాలా ప్రామిసింగ్గా ఉంది.. కలిసి పనిచేద్దామనడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నాకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు 19 ఏళ్లు. దాన్నుంచి బయటపడడానికి పదేళ్లు పట్టింది. నేను సిగరెట్స్, మందు తాగను, నాన్ వెజ్ కూడా తినను. అందుకే ఇప్పటికీ ఒకేలా ఉన్నాను. నా ‘గూఢచారి 2’ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల అవుతుంది. -
ధురంధర్-2 ని లెక్కచేయని అడివి శేష్.. డెకాయిట్ పై.. ఫుల్ కాన్ఫిడెన్స్
-
డెకాయిట్లో అందాల చిచ్చుబుడ్డి ఫోటోలు వైరల్.. ఎవరో తెలుసా?
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్’.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి జైన్ మేరీ ఖాన్(31) ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె గురించి నెట్టింట ఆరా తీస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని షానిల్ డియోల్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి , సునీల్, కామాక్షి భాస్కర్ల, అనురాగ్ కశ్యప్ నటిస్తున్నారు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది.బాలీవుడ్ దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, నటుడు–దర్శక–నిర్మాత ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్(Zayn Marie Khan) . డెకాయిట్ చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఒక్క ఈవెంట్తోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. కపూర్ అండ్ సన్స్ (2016), సీక్రెట్ సూపర్ స్టార్ (2017) వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా జైన్ పని చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ నిర్మించిన మిసెస్ సీరియల్ కిల్లర్ సినిమాతో జైన్ మేరీ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మోనికా ఓ మై డార్లింగ్(2022) మూవీలో ఛాన్స్ దక్కించుకుని మెప్పించారు. ఆకాష్ మొహిమెన్ను ప్రేమించి 2021లో ఆమె పెళ్లి చేసుకుంది. View this post on Instagram A post shared by Zayn Khan (@zaynmarie) -
‘డెకాయిట్’లో రొమాన్స్ కష్టంగా అనిపించింది: మృణాల్
అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 10న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ బట్టి చూస్తే..ఇది లవ్స్టోరీతో కూడిన యాక్షన్ సినిమా అని అర్థమవుతుంది. ఇందులో హరి పాత్రలో హీరో అడివి శేష్, సరస్వతి పాత్రలో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారు. అయితే మృణాల్ తొలిసారి ఇందులో యాక్షన్ సీన్స్ కూడా చేసింది. అంతేకాదు ఓ పాపకు తల్లిగానూ నటించింది. అయితే ఈ సన్నివేశాలన్నీ ఈజీగానే చేసింది కానీ.. రొమాన్స్ సీన్సే కాస్త ఛాలెంజింగ్గా అనిపించాయట. ఈ విషయాన్ని స్వయంగా మృణాలే చెప్పింది. డెకాయిట్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఆదివారం మృణాల్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఛాలెంజింగ్గా అనిపించిన సన్నివేశాలేంటని ఓ విలేకరి అడగ్గా.. ఈ విధంగా సమాధానం ఇచ్చింది. ‘యాక్షన్ సీన్లు నాకు ఇబ్బంది కాలేదు కానీ.. రొమాన్స్ సన్నివేశాలే ఛాలెంజింగ్గా అనిపించాయి. ఇదొక డిఫరెంట్ లవ్స్టోరీ సినిమా. ఇందులో హీరోపై కోపం ఉన్నప్పటికీ.. పాస్ట్లో ప్రేమగా ఉండాలి. రొమాన్స్ చేయాలి. అలా నటించడం నాకు సవాల్గా అనిపించింది. సరస్వతి పాత్ర నా కెరీర్లో గుర్తుండిపోతుంది’ అన్నారు. ఇక స్టోరీ నచ్చడంతో ఈ సినిమాకు పారితోషికం కూడా తగ్గించుకున్నట్లు మృణాల్ చెప్పుకొచ్చింది. -
శేష్-మృణాల్ ‘డెకాయిట్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది.. థ్రిల్ అవుతారు: అడివి శేష్
‘‘ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎన్ని మంచి చిత్రాలు చేశామన్నదే నా లైఫ్ ఫిలాసఫీ. ప్రాణం పెట్టి చేసిన సినిమా ‘డెకాయిట్’. ఇందులో ముఖ్యమైన విషయాలున్నాయి. కానీ, వాటిని ట్రైలర్లో చూపించలేదు. మా సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అని హీరో అడివి శేష్ తెలిపారు. షానియల్ డియో దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘డెకాయిట్’. ఈ మూవీలో అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించారు. సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అడివి శేష్ మాట్లాడుతూ–‘‘మనసు బద్దలైనప్పుడు మనిషి ఏమి దోచుకుంటాడు? అనే అంశమే ‘డెకాయిట్’లో ప్రధానంగా ఉంటుంది. ఇది యూనివర్సల్ కథ’’ అని పేర్కొన్నారు. ‘‘డెకాయిట్’లో నేను చేసిన సరస్వతి పాత్ర నా కెరీర్లో గుర్తుండిపోతుంది’’ అని మృణాల్ ఠాకూర్ చెప్పారు. ‘‘ఈ చిత్రంలో నేను పోషించిన పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ఈ తరహా పాత్రలో నేను ఇంతవరకు నటించలేదు’’ అని చెప్పారు అనురాగ్ కశ్యప్. ‘‘మంచి లవ్స్టోరీతో కూడిన యాక్షన్ ఫిల్మ్ ఇది’’అని చె΄్పారు షానియల్ డియో. ‘‘మహేశ్ బాబు, ఎన్టీఆర్గార్లు మా సినిమా ట్రైలర్ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమా ఎప్పుడూ విజయం సాధిస్తుంది’’ అని పేర్కొన్నారు నిర్మాత సుప్రియ. -
శేష్-మృణాల్ 'డకాయిట్' ట్రైలర్ రిలీజ్
అడివి శేష్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా నటించిన 'డకాయిట్' సినిమా.. వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 10) థియేటర్లలోకి రానుంది. అనురాగ్ కశ్యప్ విలన్గా చేస్తున్నాడు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇది ఆకట్టుకునేలా ఉంది. మూవీపై అంచనాలు పెంచేస్తోంది. -
ఐటమ్ డ్యాన్సర్గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్
అనిరుధ్తో పలు పాటలు పాడిన గ్లామరస్ సింగర్ జోనితా గాంధీ.. ఇప్పుడు ఐటమ్ సాంగ్లో నటించింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న 'డకాయిట్' కోసం తొలిసారి కాలు కదిపింది. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఈ పాటని లెక్క ప్రకారం ఈ సాయంత్రమే రిలీజ్ చేయాలి. కానీ కాస్త ఆలస్యంగా ఇప్పుడు విడుదల చేశారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్కి డ్యాన్స్ నేర్పింది నేనే)ఇప్పటివరకు సింగర్గానే అందరికీ తెలిసిన జోనితా.. ఇప్పుడు అందంతో ఐటమ్ సాంగ్లోనూ ఆకట్టుకోవడం విశేషం. ఇకపోతే ఏప్రిల్ 10న 'డకాయిట్'.. తెలుగు, హిందీలో థియేటర్లలోకి రాబోతుంది. మృణాల్ ఠాకుర్ హీరోయిన్. దాదాపు నాలుగేళ్ల తర్వాత శేష్ నుంచి వస్తున్న మూవీ ఇది. చూడాలి మరి ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటాడో?(ఇదీ చదవండి: 'పెద్ది'కి దారి ఇచ్చేసిన 'లెనిన్'.. కొత్త రిలీజ్ డేట్) -
మేనకోడలికి ఆమిర్ ఖాన్ శుభాకాంక్షలు
బాలీవుడ్ దర్శక–నిర్మాత మన్సూర్ ఖాన్ కుమార్తె, నటుడు–దర్శక–నిర్మాత ఆమిర్ ఖాన్ మేనకోడలు జైన్ మేరీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్’. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, జైన్ మేరీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. జైన్ మేరీ ఖాన్ బర్త్ డే (మార్చి 20) సందర్భంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఆమె ఫస్ట్ లుక్ను యూనిట్ రిలీజ్ చేసింది. ఈ లుక్ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి, యూనిట్కు అభినందనలు తెలిపారు ఆమిర్ ఖాన్. షానియల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ‘‘లవ్, యాక్షన్, హార్ట్బ్రేక్ వంటి అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సహ–నిర్మాత: సునీల్ నారంగ్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నేపథ్య సంగీతం: గ్యాని. -
అడివి శేష్ 'డెకాయిట్' మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
డెకాయిట్ నుంచి లవ్ సాంగ్ రిలీజ్
యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. కెమెరామెన్ షానియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ యాక్షన్ లవ్స్టోరీ నుంచి తాజాగా రుబరూ.. అంటూ సాగే లవ్ సాంగ్ను రిలీజ్ చేశారు.లవ్ సాంగ్మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని.. అంటున్నది మనసే.. కాసేపు నువ్వు,నేను కలిసి.. క్షణంలో లోకమంత తెలిసే.. అన్న లిరిక్స్తో పాట మొదలైంది. 'మోసం అంటే ఏందో తెలియని వయసులో నిన్ను ప్రేమించినానే.. మోసం చేస్తావని తెలీదు కదా జూలియట్.. ఎందుకు నమ్మించినావే..' అంటూ హీరో లవ్స్టోరీని పాటలో చూపించారు. అలాగే చివర్లో బ్రేకప్ బాధను కూడా చూపించారు.సినిమాఇదివరకు రిలీజైన టీజర్లో యాక్షన్ను ఎక్కువ హైలైట్ చేయగా ఈ పాటలో మాత్రం లవ్ టచ్ ఎక్కువ జోడించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
రుబరూ రెడీ
అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ జోడీగా నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘డెకాయిట్’. ఈ యాక్షన్ లవ్స్టోరీతో కెమెరామెన్ షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలోని ‘రుబరూ...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను ఈ నెల 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.‘‘డెకాయిట్’ మూవీ కథాంశం ప్రధానంగా యాక్షన్ చుట్టూ తిరిగినప్పటికీ ‘రుబారూ..’ సాంగ్ మాత్రం మంచి ఎమోషనల్ టచ్తో కొత్త ఫీల్ని ఇస్తుంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీని హైలెట్ చేస్తూ, వారి జర్నీని ప్రజెంట్ చేసే పాట ఇది’’ అని యూనిట్ పేర్కొంది. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించి ఈ సినిమాకు సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. -
పెద్ది, డకాయిట్.. ఇక ది ప్యారడైజ్ వంతు..!
ఇటీవల కొద్దికాలంగా టాలీవుడ్ సినిమా పరిస్థితి కాస్తా అయోమయానికి గురి చేస్తోంది. పెద్ద హీరోల చిత్రాల రిలీజ్ డేట్లను ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుందనేది పక్కాగా ముందే చెప్పేస్తున్నారు. ఆ రోజే గ్రాండ్ రిలీజ్ అంటూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తీరా డేట్ దగ్గరికొచ్చేసరికి వాయిదా వేసుకుంటూ పోతున్నారు. భారీ బడ్జెట్, స్టార్ హీరో ఉన్నా సరే విడుదలకు వెనకాడుతున్నారు. తాజాగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ఏకంగా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. గ్లోబల్ స్టార్ చెర్రీ- బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ వాయిదా పడడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ మార్చిలో పెద్ది చూడాలనుకున్న సినీ ప్రియులకు కూడా ఈ నిరాశే మిగిల్చింది.అంతేకాకుండా అడివి శేష్ డకాయిట్ సైతం మరోసారి వాయిదా పడింది. గతంలో చాలాసార్లు వాయిదా పడినా.. ఈ ఏడాది మార్చి 19న వస్తామని ప్రకటించారు. అంతలోనే డకాయిట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఇక మార్చిలో వస్తోన్న టాలీవుడ్ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా వస్తోన్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే రోజు ఉస్తాగ్ భగత్ సింగ్ విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో నాని మూవీ కూడా దాదాపు వాయిదా పడిందనే వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. దీంతో ఈ చిత్రాలన్నీ సమ్మర్కు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.దురంధర్-3 దెబ్బకేనా?ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేయడం అభిమానుల్లో నిరాశ పెంచుతోంది. తమ అభిమాన హీరోల చిత్రాలు పోస్ట్పోన్ కావడం వల్ల ఫ్యాన్స్లో ఉన్న క్యూరియాసిటీ తగ్గుతోంది. అయితే ఇలా వరుసగా టాలీవుడ్ సినిమాలు వాయిదా పడడానికి ప్రధాన కారణం ఆ ఒక్క సినిమానేనా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మార్చి 19న రానున్న దురంధర్-2 దెబ్బకేనని సగటు సినీ ప్రియుడు భావిస్తున్నారు. లేదంటే నిజంగానే షూటింగ్ పెండింగ్ వల్ల వాయిదా వేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. వరుసగా మూడు టాలీవుడ్ చిత్రాలు వాయిదా పడడంతో సినీ ప్రియుల్లో అసలేం జరుగుతోందనే డౌటానుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
'ధురంధర్ 2'కి భయపడుతున్నారా? ఎందుకీ వాయిదాలు?
కొన్ని సినిమాల విషయంలో అప్పుడప్పుడు ఊహలకు అందనివి జరుగుతుంటాయి. రెండు నెలల క్రితం అలాంటి ఓ సంచలనానికి కారణమైంది 'ధురంధర్' అనే మూవీ. రిలీజ్ వరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. రెగ్యులర్ ఆడియెన్స్ కాస్తోకూస్తో ఆసక్తి చూపించారు గానీ సాధారణ ప్రేక్షకుడికి అయితే థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో సినిమా ఉందని కూడా తెలియదు. అలాంటిది బ్లాక్బస్టర్ హిట్ కొట్టేసరికి.. దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్కి కారణమైంది. త్వరలో రాబోతున్న దీని సీక్వెల్ ప్రభావం.. తెలుగు చిత్రసీమపై గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)సాధారణంగా వేసవిని తెలుగు దర్శకనిర్మాత మిస్ చేసుకోరు. ఈసారి కూడా అందుకు తగ్గట్లే డకాయిట్, పెద్ది, ప్యారడైజ్ లాంటి మూవీస్ రిలీజ్ అవుతాయని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్, సినిమా లవర్స్ చాలా ఉత్సాహపడ్డారు. తీరా చూస్తే ఈ తెలుగు చిత్రాలన్నీ ఇప్పుడు వాయిదా పడటం గ్యారంటీ. అధికారిక ప్రకటనలు రాలేదు గానీ వాయిదా పడటం అయితే పక్కా.చరణ్ 'పెద్ది', నాని 'ప్యారడైజ్' సినిమాల షూటింగ్ చాలా పెండింగ్లో ఉంది. దీంతో ఇవి వాయిదా పడ్డాయంటే సరేలే ఏదో అనుకోవచ్చు. కానీ అడివి శేష్ 'డకాయిట్' మాత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మార్చి 19న పక్కా వస్తామని శేష్ కూడా కొన్నాళ్ల ముందు జరిగిన ప్రెస్మీట్లో చెప్పాడు. ఇదంతా 'ధురంధర్' విడుదలకు ముందు జరిగింది. కానీ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యేసరికి.. రిస్క్ ఎందుకని 'డకాయిట్' టీమ్ వెనకడుగేసింది. ఏప్రిల్లో రావాలని ప్లాన్స్ చేసుకుంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)మరోవైపు 'పెద్ది' కోసం అనుకున్న రిలీజ్ తేదీకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం వరకు రూమర్స్ వచ్చాయి. ఎప్పుడైతే 'ధురంధర్ 2' రిలీజ్ పక్కా అని క్లారిటీ వచ్చిందో.. 'ఉస్తాద్' టీమ్ రిస్క్ వద్దులే అనుకుందనే టాక్ వినిపిస్తుంది. వీళ్లు కూడా ఏప్రిల్ నెలనే టార్గెట్ చేస్తున్నారని టాక్. ఈ లెక్కన చూసుకుంటే మార్చిలో ప్రామిసింగ్ తెలుగు సినిమా ఒక్కటి కూడా వచ్చే సాహసం చేయట్లేదనిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2'కి దాదాపు లైన్ క్లియర్.అయితే ఈ చిత్రానికి 'టాక్సిక్' పోటీగా నిలబడుతోంది. కన్నడ స్టార్ యష్ నటించిన గ్యాంగస్టర్ డ్రామా మూవీ ఇది. మార్చి 19నే 'ధురంధర్ 2'తో పాటు ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. కాకపోతే ప్రమోషన్ పరంగా చాలా వీక్గా ఉన్నారు. సాంగ్స్, ట్రైలర్స్ లాంటివి రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు 'టాక్సిక్' వాయిదా పడటానికి అవకాశాల్లేవని తెలుస్తోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. విజయ్ 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థనే యష్ మూవీ కూడా తీసింది. ఇది కూడా వాయిదా పడితే కోట్లలో నష్టాలు ఉండొచ్చు. అందుకే 'ధురంధర్ 2' పోటీలో ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు.(ఇదీ చదవండి: 'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?) -
దురంధర్ 2 డెకాయిట్ తగ్గేదెలే అంటున్న అడివిశేష్
-
అడివి శేష్ ‘డెకాయిట్’ చిత్రం టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
'కన్నెపిట్టరో..' సాంగ్తో డెకాయిట్ టీజర్
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డెకాయిట్. ఒక ప్రేమ కథ అనేది క్యాప్షన్. అడివి శేష్ నటించిన క్షణం, గూఢచారి సినిమాలకు కెమెరామెన్గా పని చేసిన షానిల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.టీజర్ రిలీజ్నాగార్జున నటించిన 'హలో బ్రదర్' మూవీలోని కన్నెపిట్టరో.. కన్ను కొట్టరో పాటతోనే టీజర్ మొత్తం సాగుతుంది. చివర్లో ఓ చిన్నారి డాక్టర్వా..? అని హీరోను అడిగితే అందుకతడు దొంగ అని బదులిస్తాడు. మొత్తానికి టీజర్ అయితే అదిరిపోయింది. టీజర్ డిఫరెంట్గా బాగుందంటున్నారు అభిమానులు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. డెకాయిట్ ఉగాది కానుకగా మార్చి 19న విడుదల అవుతోంది. -
అడివి శేష్ డకాయిట్.. ఒకే రోజు రెండు భాషల్లో రిలీజ్..!
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ప్రేమకథా చిత్రం 'డకాయిట్'. ఈ మూవీకి షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. అడివి శేష్ చిత్రాలైన క్షణం, గూఢచారి లాంటి సినిమాలకు కెమెరామెన్గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డకాయిట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. డకాయిట్ టీజర్ను ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓకేసారి రెండు భాషల్లో టీజర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండు భాషలు, రెండు నగరాలు, రెండు టీజర్స్ అంటూ ప్రత్యేక పోస్టర్స్ను పంచుకుంది.ఈనెల 18న గురువారం ఉదయం 11 గంటలకు ముంబయిలో జరిగే ఈవెంట్లో హిందీ టీజర్ రిలీజ్ చేయనున్నారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్లోని ఏఏఏ సినిమాస్లో జరిగే ఈవెంట్లో టీజర్ లాంఛ్ చేయనున్నట్వు ప్రకటించారు. కాగా.. ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19, 2026న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. 2 LANGUAGES. 2 TEASERS.2 CITIES.Gear up for the #DacoitTeaser on December 18th ❤🔥Grand launch event at Gaiety Galaxy, Mumbai from 11 AM onwards on Dec 18th 🤩Media Meet & Greet event at AAA Cinemas, Hyderabad from 6.30 PM onwards on Dec 18th 💥#DACOIT GRAND RELEASE… pic.twitter.com/KuHsIamvIs— Annapurna Studios (@AnnapurnaStdios) December 15, 2025 -
'ఈ సారి మామూలుగా ఉండదు'.. డకాయిట్ కొత్త రిలీజ్ డేట్
టాలీవుడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ఇంటెన్స్ యాక్షన్ ప్రేమకథా చిత్రం డకాయిట్(Dacoit). ఇప్పటికే రిలీజ్ తేదీ ప్రకటించినా అనివార్య కారణాలతో వాయిదా పడుతూనే వస్తోంది. గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి కోలీవుడ్ భామ శృతిహాసన్ అనూహ్యంగా తప్పుకుంది. ఇది కూడా సినిమా ఆలస్యానికి కారణం కావొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్గా చేస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.కానీ వారు అనుకున్న తేదీ ప్రకారం కుదరకపోవడంతో తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు డకాయిట్ మేకర్స్. వచ్చే ఏడాది ఉగాది కానుకగా డకాయిట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 'ఈ సారి మామూలుగా ఉండదు.. వెనక్కి తిరిగి చూసేదే లేదు' అంటూ అడివి శేష్ మూవీ పోస్టర్ను పంచుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో డకాయిట్ సందడి చేయనుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో అడివి శేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. (ఇది చదవండి: 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ విడుదల)ఈ మూవీని షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను ఆకట్టుకుంది. Ee Saari Mamulga undadhu ❤️🔥There’s NO LOOKING BACK#DACOIT This UGADI MARCH 19th 2026in Theaters WORLDWIDE pic.twitter.com/KaxruBidTN— Adivi Sesh (@AdiviSesh) October 28, 2025


