-
చిన్నమ్మ తంత్రం
సాక్షి, చెన్నై : విదేశీ మారక ద్రవ్యం కేసులో చిన్నమ్మ శశికళ కుటుంబీకులు కోర్టుకు హాజరయ్యారు. పరప్పన అగ్రహార చెర నుంచి భద్రత నడుమ సుధాకరన్ను ఎగ్మూర్ కోర్టుకు తీసుకొచ్చారు. ఆయనతో పాటుగా మరో బంధువు భాస్కరన్ విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా బెంగళూరు చెరలో ఉన్న శశికళతో దినకరన్, తంబిదురైతో పాటుగా ఐదుగురు ఎమ్మెల్యేలు వేర్వేరుగా ములాఖత్ కావడం గమనార్హం. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళ కుటుంబానికి చెందిన వారిపై విదేశీ మారక ద్రవ్యం కేసుల మోత మోగుతున్న విషయం తెలిసిందే. శశికళ మీద కూడా ఈ కేసు నమోదై ఉంది. ఈ కేసుల విచారణ చెన్నై ఎగ్మూర్ ఆర్థిక నేరాల విభాగం కోర్టు న్యాయమూర్తి మలర్ మది విచారిస్తున్నారు. శశికళ అక్క కుమారుడు, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్, అన్న కుమారుడు భాస్కరన్ పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఇక, దివంగత సీఎం జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్, శశికళ విచారణకు డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఇందుకు కారణం ఆ ఇద్దరు అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తుండటమే. విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ నిమిత్తం సుధాకరన్ను హాజరుపరచాలని ఇప్పటికే పలుమార్లు కోర్టు సమన్లు జారీచేసింది. అయితే, కర్ణాటక పోలీసులు అందుకు తగ్గ చర్యలు తీసుకోలేదు. అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటాన్ని ఓ కారణంగా ఆ పోలీసులు చూపించారు. ఎట్టకేలకు మంగళవారం జరిగిన విచారణకు పరప్పన అగ్రహార చెర నుంచి గట్టి భద్రత నడుమ సుధాకరన్ను చెన్నైకి తీసుకొచ్చారు. నిఘా నీడలో ఆయన్ను ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచారు. సూపర్ డూపర్ టీవీకి ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుతో తనకు సంబంధం లేదని, అన్యాయంగా ఇరికించారంటూ కోర్టుకు సుధాకరన్ విన్నవించుకున్నారు. అభియోగాలపై ప్రభుత్వ తరపు వాదన, సాక్షుల విచారణకు కోర్టు తేదీ నిర్ణయించడంతో సుధాకరన్ అంగీకరించారు. ఇదే కేసు నిమిత్తం భాస్కరన్ సైతం కోర్టుకు హాజరైన తన వాదన వినిపించారు. తదుపరి విచారణను జూలై 13కు వాయిదా వేశారు. దీంతో సుధాకరన్ను గట్టి భద్రత నడుమ మళ్లీ బెంగళూరుకు తరలించారు. ఇక, విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ నిమిత్తం చిన్నమ్మ శశికళను కోర్టులో ఎప్పుడు హాజరు పరుస్తారో అన్నది వేచి చూడాల్సిందే. చిన్నమ్మతో ములాఖత్ : పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళతో మూడోసారిగా మంగళవారం దినకరన్ ములాఖత్ అయ్యారు. ఆయనతో పాటుగా సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ తదితర ఐదుగురు ఎమ్మెల్యేలు శశికళను కలిశారు. రాష్ట్రంలో పళనిస్వామి ప్రభుత్వం సాగిస్తున్న వ్యవహారాలు, పార్టీలతో తమకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలు, అసంతృప్తి ఎమ్మెల్యేల గురించి చిన్నమ్మకు వివరించినట్టు సమాచారం. ఈసందర్భంగా మీడియాతో దినకరన్ మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవని, దివాకరన్తో సాగుతున్న వివాదంపై స్పందించారు. వివాదాలన్నీ పనిగట్టుకుని సృష్టిస్తున్నారని, తమ కుటుంబీకులు అందరూ ఐక్యతతోనే ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్పై చిన్నమ్మ తన నిర్ణయాన్ని పార్టీకి పంపుతారని, అందుకు తగ్గ ప్రకటన వెలువడుతుందన్నారు. ఇక, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై చిన్నమ్మతో వేరుగా ములాఖత్ కావడం గమనార్హం. చాలాకాలం అనంతరం చిన్నమ్మతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని మీడియాతో మాట్లాడుతూ తంబిదురై వ్యాఖ్యానించడం విశేషం. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటు బీజేపీకి అనుకూలంగా పడే రీతిలో పార్టీ వర్గాలకు సందేశం ఇవ్వాలన్న సంకేతాన్ని చిన్నమ్మకు తంబి దురై సూచించినట్టు సమాచారం. అలాగే, ఇదే ఎన్నికల్ని అడ్డం పెట్టుకుని కేంద్రాన్ని ఎదుర్కొందామా..? లేదా, సామరస్యంగా సాగుదామా..? అన్న అంశంపై దినకరన్ మంతనాలు సాగించినట్టు తెలిసింది. అయితే, తన రాజకీయ తంత్రాన్ని ఎన్నికల తేదీ నాటికి ప్రయోగించేందుకు చిన్నమ్మ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. -
నా సోదరికి పోలీసుల నుంచి ప్రాణహాని
కేసులుంటే కోర్టులో హాజరుపరచండి .. లేదంటే విడుదల చేయూలి అన్నపూర్ణ సోదరుడు భూతం వుస్తాన్రావు డిమాండ్ పిడుగురాళ్ళ మావోయిస్టు అనే ఆరోపణలతో పిడుగురాళ్ళ వుండలం జూలకల్లుకి చెందిన తన సోదరి అన్నపూర్ణ అలియూస్ అరుణ అలియూస్ పద్మక్కను తుళ్లూరు వుండలం తాళ్లారుుపాలెంలో పోలీసులు అరెస్టు చేశారని, ఆమెకు పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆమె సోదరుడు భూతం మస్తాన్రావు ఆరోపించారు. వుస్తాన్రావు మంగళవారం పిడుగురాళ్ళ పట్టణంలోని పోలీస్స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన చిన్న చెల్లెలు అరుున అన్నపూర్ణ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. తన పెద్ద చెల్లెలు వెంకటరత్నం ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతోందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కారులో వచ్చిన కొందరు పోలీసులు ఆమె చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి విజయువాడ వైపు తీసుకెళ్లారని చెప్పారు. అన్నపూర్ణపై కేసులు ఉంటే తక్షణమే కోర్టులో హాజరు పరచాలని, కేసులు లేకుంటే వెంటనే విడుదల చేయూలని వుస్తాన్రావు డివూండ్ చేశారు. గతంలో వుస్తాన్రావు మేనకోడలు కువూర్తె అరుున రాయుపాటి స్వర్ణలత అలియూస్ నాగవుణిని పట్టుకుని పోలీసులు కాల్చి చంపిన చరిత్ర ఉందన్నారు. ఇప్పుడు అదే విధంగా తన చిన్న చెల్లెలు అన్నపూర్ణ ప్రాణాలకు హాని ఉందని ఆయున ఆందోళన వ్యక్తం చేశారు. 1991లో జననాట్య వుండలి పట్ల ఆకర్షితురాలైన అన్నపూర్ణ ఇంటి నుంచి వెళ్లిపోరుుందని, అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియలేదని, ఇటీవలే రెండు రోజుల క్రితం పెద్ద చెల్లెలు వెంకటరత్నం ఇంటికి వచ్చిన అన్నపూర్ణను పోలీసులు తీసుకెళ్లారని వుస్తాన్రావు వివరించారు. ఆమెను వెంటనే కోర్టుకు హాజరు పరచడవూ? లేదా విడుదల చేయుడమో చేయకపోతే పెద్దయెత్తున ఆందోళనకు దిగుతామని ఆయున పోలీసులున హెచ్చరించారు. అన్నపూర్ణతోపాటు తన పెద్ద చెల్లెలు వెంకటరత్నం, బావ బాలస్వామి కూడా పోలీసులు అదుపులోనే ఉన్నారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వెంటనే విడుదల చేయాలని కోరారు. అన్నపూర్ణను బేషరతుగా విడుదల చేయాలి: పౌరహక్కుల సంఘం నరసరావుపేట టౌన్: పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు నాయకురాలు భూతం అన్నపూర్ణను వెంటనే బేషరతుగా విడుదలచేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్జీవో హోమ్లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పోలీసుల చర్యను నిరసించారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళయ్యపాలెంలో తన సోదరి ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న తలదాచుకున్న భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణను యాంటీ నక్సల్ స్క్వాడ్ (ఏఎన్ఎస్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పిడుగురాళ్ల మండలం జూలకల్లుకి చెందిన అన్నపూర్ణ 1991నుంచి ఉద్యమంలో భాగస్వామ్యురాలైందన్నారు. గత నాలుగైదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అన్నపూర్ణ బంధువుల ఇంట్లో చికిత్స పొందుతోందని చెప్పారు. ఏఎన్ఎస్ పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకువెళ్ళారని, ఆమెకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అన్నపూర్ణపై ఏమైనా కేసులు ఉంటే వెంటనే ఆమెను కోర్టులో హాజరుపరచాలని లేకుంటే విడుదల చేయాలని డిమాండ్చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పీడీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై వెంకటేశ్వరరావు, రాష్ట్రకమిటీ సభ్యులు నల్లపాటి రామారావు , కెఎన్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శిఖినం చిన్నా, పికెఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు కంభాల ఏడుకొండలు, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి దండు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
బెయిల్ స్కాం!
⇒ నిందితులకు నకిలీ ష్యూరిటీ పత్రాలు జారీచేసే గ్యాంగ్ గుట్టురట్టు ⇒ మూడు రాష్ట్రాల్లోని కోర్టులను బురిడీ కొట్టించిన వైనం ⇒ జిల్లాలో పదిమంది దాకా ఏజెంట్లు ⇒ కీలక సూత్రధారి అనంతపురం జిల్లా వాసి ⇒ పోలీసుల అదుపులో పలువురు నిందితులు నిప్పులాంటి చట్టంతోనే చెలగాటమాడుతూ నకిలీ జామీను పత్రాలు సృష్టించి మూడు రాష్ట్రాల్లోని కోర్టులను బురిడీ కొట్టించే ముఠా గుట్టురట్టయింది. ఎంచక్కా ఐదేళ్లుగా సాగిన ఈ వ్యాపారం ఎస్పీ చొరవతో బట్టబయలైంది. ఇందులో జిల్లాకు చెందిన పదిమంది దాకా ఏజెంట్లు.. మరికొందరు న్యాయవాదులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని అతిత్వరలో అరెస్ట్ చేసేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. పలమనేరు: మూడు రాష్ట్రాల కోర్టులను తప్పుదోవ పట్టించి నిందితులను నకిలీ జామీను పత్రాల ద్వారా విడుదల చేయించే ఓ భారీ గ్యాంగ్ ముఠా గుట్టురట్టయ్యింది. దీనివెనుక జిల్లావాసుల హస్తమున్నట్టు సమాచారం. వీరిని రేపోమాపో అరెస్ట్ చేసేందుకు ఎస్పీ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సంఘటన ఇలా వెలుగులోకి.. గతంలో గంగవరం సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చోరీ జరిగింది. దీనికి సంబంధించిన నిందితులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తర్వాత నిందితులు కోర్టు ద్వారా బెయిల్ పొందారు. ఆపై కోర్టుకు హాజరు కాలేదు. దీంతో వారిపై వారెంట్లు జారీ అయ్యాయి. ఈ ముఠా గతంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. వారెంట్ జారీ అయిన నిందితులను పట్టుకొనే క్రమంలో పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు చిక్కాయి. నిందితులు కోర్టుకు సమర్పించిన జామీను పత్రాల్లో చాలా వరకు ఉద్యోగుల సాలరీ సర్టిఫికెట్లు ఉడడంతో వాటి ఆధారంగా ఆ ఉద్యోగులను విచారించారు. కానీ వారు తమకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. దీంతో జామీను పత్రాలు నకిలీవని గుర్తించారు. కీలక సూత్రధారి అనంతపురం వాసే అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కోర్టులో బెయిల్ పొందేందుకు అవసరమైన అన్ని రకాల జామీపత్రాలను నకిలీవి సృష్టించి ఇవ్వడంలో సిద్ధహస్తుడు. ఇతని ఏజెంట్లు జిల్లాతో పాటు కడప, అనంతపురంలోనూ పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కోర్టుల్లో నిందితులకు అవసరమైన నకిలీ పత్రాలను అందజేస్తూ ఇప్పటిదాకా రూ.30 లక్షల దాకా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ఇతని వద్ద వందల సంఖ్యలో నకిలీ సీళ్లు, ధ్రువపత్రాలకు కావాల్సిన టెక్నాలజీ ఉన్నట్లు సమాచారం. ఐదేళ్లుగా సదరు వ్యక్తి ఇదే వ్యాపారంలో మునిగితేలినట్టు స్పష్టమవుతోంది. పోలీసుల అదుపులో పలువురు ఏజెంట్లు నకిలీ జామీను పత్రాల స్కామ్కు సంబంధించి తిరుపతి, చిత్తూరు ప్రాంతాలకు చెందిన పలువురు ఏజెంట్ల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా జిల్లాలోని పలు కోర్టుల్లో 70 కేసులకు నకిలీ సర్టిఫికెట్లను అందజేసి బెయిల్ పొందినట్లు సమాచారం. వీరి ద్వారా మరింతమంది ముఖ్య వ్యక్తులు, పలువురు న్యాయవాదుల పేర్లు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బురిడీ అంతర్రాష్ట్ర ముఠాలు, హిట్అండ్న్ ్రకేసులు, ఎక్సైజ్ స్మగ్లర్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులకు ఈ ముఠా బెయిల్ మంజూరు చేయించేందుకు నకిలీ సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలుస్తోంది. మన రాష్ట్రంలోని మూడు జిల్లాలతో పాటు కర్ణాటకలోని కోలార్, బెంగళూరు, తమిళనాడులోని కృష్ణగిరి, వేలూరు తదితర కోర్టుల్లోనూ ఈ గ్యాంగ్ నకిలీ పత్రాలను ఇచ్చి నిందితులకు బెయిల్ వచ్చేలా చేసినట్లు సమాచారం. ‘ఎర్ర’బెయిళ్లపై ఆరా కొన్నాళ్లుగా జిల్లాలో వందలాది మందిపై ఎర్రచందనం అక్రమరవాణా కేసులు నమోదయ్యాయి. పలువురు కోర్టులకు సమర్పించిన బెయిల్పత్రాలు అసలైనవా లేక నకిలీవా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ఒకవేల ఈ కేసుల బెయిళ్లలోనూ ఇలాగే జరిగిఉంటే ఇంకెంతమంది ఇరుక్కుంటారో..! ఎస్పీ చొరవతో గుట్టురట్టు న్యాయ వ్యవస్థనే తప్పుదోవ పట్టించిన ఈ కుంభకోణం వెనుక ఉన్న ముఠాను పట్టుకోవడంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవచూపినట్లు తెలిసింది. ఆయన ఆదేశాలతో గంగవరం పోలీసులు ఓ ప్రత్యేక బృందంగా ఏర్పడి వారం రోజులుగా పలు ప్రాంతాల్లో ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపో, మాపో జిల్లా ఎస్పీ నిందితులను అరెస్ట్ చేసి పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం. -
సత్వర న్యాయం కోసమే వీడియో కాన్ఫరెన్స్
హైకోర్టు జడ్జి జస్టిస్ అఫ్జల్పుర్కర్ తిరుపతి లీగల్: క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించడానికి కోర్టు ఆవరణలో వీడియోకాన్ఫరెన్స్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు జడ్జి, చిత్తూరు జిల్లా పోర్టుపోలియో జడ్జి జస్టిస్ విలాస్రావ్ అఫ్జల్పుర్కర్ తెలిపారు. తిరుపతి కోర్టు ఆవరణలో శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై వీడియో కాన్పరెన్స్ సెంటర్ను ప్రారంభించారు. ఓ హత్య కేసుకు సం బంధించి తిరుపతి సబ్ జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్న పి.దిల్షాన్ అలియాస్ దిల్ అనే మహిళకు సంబంధించిన సెషన్స్ కేసులో వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆమెను న్యాయమూర్తి విచారించారు. ఆమెకు న్యాయవాదిని నియమించుకునే ఆర్థికశక్తి లేకపోవడంతో ప్రభుత్వం తరపున పి.రవి అనే న్యాయవాదిని నియమి స్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జూనియర్ జడ్జిల కోర్టుల్లోని కేసుల్లో నిందితులై, జైల్లో రిమాండ్లో ఉన్న ఖైదీలతో న్యాయమూర్తి వీడియో కాన్సరెన్స్ ద్వారా మాట్లాడారు. కార్యక్రమం అనంతరం హైకోర్టు న్యాయమూర్తి విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హై కోర్టు జడ్జి మాట్లాడుతూ ప్రస్తుతం న్యాయశాఖలోని అన్ని విభాగాలను కంప్యూటరైజేషన్ చేస్తున్నట్టు తెలిపా రు. న్యాయస్థానాలను, జైళ్లను అనుసంధానం చేసేందుకు ఈ- కోర్టు విధానంలో భాగంగా వీడియో లింకేజీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన క్రమంలో పెలైట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 37 వీడియో లింకేజీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో గతనెల 22న మొదటిసారిగా వీడియో లింకేజీ ప్రోగ్రామ్ను ప్రారంభించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జుడిషియల్ కస్టడీలోని ఖైదీల రిమాం డ్ పొడిగించడం సులభతరమవుతుందని, ప్రభుత్వానికి అయ్యే ఖర్చు తగ్గుతుందని తెలిపారు. భవిష్యత్లో సాక్షుల విచారణ, ఇరువైపుల వాదనలు వినడం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ప్రభుత్వ అధికారుల, నిపుణులు తాము కోరుకున్న చోటు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్షం చెప్పడానికి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి టి.ఆనంద్, తిరుపతి నాలుగో అదనపు జిల్లా జడ్జి నాగార్జున, మూడో అదనపు జిల్లా జడ్జి రాంబాబు, ఐదో అదనపు జిల్లా జడ్జి శ్యామ్సుందర్, వీడియో కాన్పరెన్స్ నోడల్ ఆఫీసర్, నాల్గవ అదనపు జూనియర్జడ్జి సన్యాసినాయుడు, సీనియర్ సివిల్జడ్జిలు రాంగోపాల్, సదానందమూర్తి, జూనియర్జడ్జిలు మల్లీశ్వరి, శశిధర్రెడ్డి, లీలా వెంకటశేషాద్రి, పి.విజయ, న్యాయవాదులసంఘ కార్యవర్గ సభ్యులు, జిల్లా డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఏపీపీ రాజేంద్రకుమార్, ఇతర పబ్లిక్ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. -
టీటీడీ అధికారి ఇంట్లో ముగిసిన ఏసీబీ దర్యాప్తు
నిందితుడిని నెల్లూరు కోర్టుకు హాజరు తిరుపతిక్రైం : టీటీడీ డెప్యూటీ ఈవో భూపతి రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలో దర్యాప్తు మంగళవారం ముగిసిందని ఏసీబీ డీఎస్పీ శంకర్రెడ్డి తెలిపారు. భూపతిరెడ్డి ఆస్తులు విలువ ఎంతనేది అంచనాకు రాలేక పోతున్నామన్నారు. ఇప్పటికే ఆయన బంధుమిత్రులకు సంబంధించిన 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. అయితే 2015 డిసెంబర్లో రూ.1.8 కోట్ల విలువ చేసే ఒక స్థలానికి రూ.65 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకున్నారని, అలాగే ఆయనకు తిరుచానూరు, రాఘవేంద్రనగర్ గ్రామీణ బ్యాంకుల్లో రెండు లాకర్లు ఉన్నాయని గుర్తించినట్లు చెప్పారు. ఆ లాకర్లను బుధవారం తెరుస్తామని, వాటిల్లో మరింత ఆస్తుల సమాచారం, ఇతరత్రా లభించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఇప్పటికే 12 ఖాతాలు ఉన్నట్లు గుర్తించామని, వాటిలో ఎంత మొత్తం నగదు వుందనేది బుధవారం నాటికి పూర్తిగా తెలుస్తుందన్నారు. అయితే ఐసీసీఐ బ్యాంకు ఖాతాలో మాత్రం రూ.37లక్షలు ఉన్నట్టు తేలిందన్నారు. ఇంకా పోస్టల్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో దర్యాప్తు చేస్తున్నామన్నారు. భూపతిరెడ్డిని నెల్లూరు కోర్టులో హాజరు పరచామన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement