breaking news
Constable Movie
-
30 రోజుల్లోనే ‘కానిస్టేబుల్’..చాలా మంది ఫోన్లు చేశారు : కెమెరామెన్ వళి
‘కానిస్టేబుల్’ చూసి ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఫోన్స్ చేశారు. 30 రోజుల్లోనే అంత క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చావా? అని పొగిడేస్తున్నారు. ఓ పెద్ద బ్యానర్ నుంచి కూడా కాల్ వచ్చింది. త్వరలోనే ప్రాజెక్ట్ చేద్దామని అన్నారు. ఇలా ‘కానిస్టేబుల్’కి మంచి స్పందన వస్తుండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు కెమెరామెన్ షేక్ హజాతరయ్య(వళి). కెమెరామెన్గా 25 ఏళ్లలో 78 చిత్రాలకు పైగా చేసిన అనుభవం ఉన్న ఆయన సెంట్గా ‘కానిస్టేబుల్’ అంటూ అందరి ముందుకు వచ్చారు. వరుణ్ సందేశ్ హీరోగా, మధులిక వారణాసి హీరోయిన్గా ఆర్యన్ సుభాష్ తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్గా విడుదలైంది. ఈ క్రమంలో కెమెరామెన్ వళి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..→ మాది నెల్లూరు జిల్లా. మక్కెనవారిపాలెం గ్రామం. నేను ఈ ఇండస్ట్రీలోకి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నారాయణ గారి వల్లే వచ్చాను. ఆయనే నన్ను ఇలా కెమెరా డిపార్ట్మెంట్లో పనిలోకి పెట్టారు. అలా 25 ఏళ్ల క్రితం మొదలైన ఈ ప్రయాణంలో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు పని చేశాను. దాదాపు 8 భాషల్లో పని చేశాను. హిందీ, మరాఠీ భాషల్లో తీసిన చిత్రాలకు అవార్డులు కూడా వచ్చాయి.→ అరుంధతి, అన్నవరం, ఏక్ నిరంజన్, రగడ ఇలా ఎన్నో సినిమాలకు కెమెరా డిపార్ట్మెంట్లో పని చేశాను. నేను చిన్నతనం నుంచీ చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ఆయన వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ తరువాత ‘అన్నవరం’లో పవన్ కళ్యాణ్ను చూశాను. కష్టపడితే పైకి వస్తామని ఆయన్ను చూశాక అర్థమైంది.→ బలగం జగదీష్ ఓ సినిమాకు ఆర్టిస్ట్గా వచ్చారు. ఆ మూవీనికి నేను కెమెరామెన్గా పని చేశాను. అప్పుడు నా వర్కింగ్ స్టైల్ ఆయనకు నచ్చింది. మీతో కచ్చితంగా ఓ సినిమాను తీస్తాను అని అప్పుడు బలగం జగదీష్ అన్నారు.→ జగదీష్ గారు ‘కానిస్టేబుల్’ కథను విన్న వెంటనే నా దగ్గరకు పంపారు. ఆర్యన్ సుభాష్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. కథ అద్భుతంగా ఉంది అని జగదీష్ గారికి చెప్పాను. అలా ఈ మూవీ జర్నీని స్టార్ట్ చేశాం.→ వరుణ్ సందేశ్ గారు మాకు ఎంతో సహకరించారు. ఆయనతో వర్క్ చేస్తే సొంత ఫ్యామిలీ, బ్రదర్లా అనిపిస్తుంది. ఎక్కడా కూడా తన స్థాయిని ప్రదర్శించడు. సెట్లో అందరితో కలిసి మెలిసి ఉంటాడు. ఓ సారి షూటింగ్లో గాయమైనా కూడా రెస్ట్ తీసుకోకుండా పని చేశారు.→ ప్రస్తుతం నేను రామ్ భీమన దర్శకత్వంలో ఓ మూవీని కమిట్ అయ్యాను. రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాకి కెమెరా డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాను. ఇవి కాకుండా శివ ప్రసాద్ నిర్మాతగా ఓ చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రారంభించనున్నాం. -
వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మూవీ రివ్యూ
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. బలగం జగదీష్ నిర్మాతగా ఆర్యన్ సుభాష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ఈ వారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీలో కానిస్టేబుల్గా వరుణ్ సందేశ్ ఏ మేరకు ఆకట్టుకున్నాడు? అసలు ఈ మూవీ కథ ఏంటి? అన్నది చూద్దాం..కథేంటంటే..మోకిలా మండలంలోని శంకరపల్లి ఊర్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆడ, మగ అని తేడా లేకుండా జరుగుతున్న ఈ సీరియల్ కిల్లింగ్స్ పోలీసులకు పెద్ద ఛాలెంజింగ్గా మారుతుంది. అయితే ఈ ఊరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా కాశీ (వరుణ్ సందేశ్) పని చేస్తుంటాడు. ఈ సీరియల్ కిల్లింగ్స్లో కాశీ మేనకోడలు కీర్తి (నిత్య శ్రీ) కూడా బలి అవుతుంది. మరి ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనకాల ఉన్నది ఎవరు? కాశీ ఆ కిల్లర్ను పట్టుకుంటాడా? ఎవరిని అనుమానించినా సరే చివరకు వాళ్లు కూడా చనిపోతుంటారు? అసలు వీటన్నంటి వెనకాల ఉన్నది ఎవరు? చివరకు ఏం జరిగింది? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.ఎలా ఉందంటే..సీరియల్ కిల్లర్స్, క్రైమ్ స్టోరీలకు ఓ ఫార్మూలా ఉంటుంది. చాలా మంది ఆ ఫార్మూలాను వాడుకుని కథను అల్లుకుంటారు. కానీ కానిస్టేబుల్ విషయంలో మాత్రం అంతా కొత్తగా, డిఫరెంట్గా ఉంటుంది. ఆడియెన్స్ ఊహించి ఏదీ కూడా తెరపై జరగదు. ప్రతీ ఒక్క చోట ప్రేక్షకుడ్ని సర్ ప్రైజ్ చేసుకుంటూ వెళ్తుంది.ఫస్ట్ హాఫ్ అంతా కూడా సీరియల్ కిల్లింగ్స్, కొందరి మీద అనుమానం వచ్చేలా సీన్లను చూపించడం, హీరో ఇంట్లోనే విషాదం జరగడం వంటి సీన్లతో సాగుతుంది. ఇంటర్వెల్కు ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్లో అసలు కథ రివీల్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కూడా ఓకే అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే ఊహకు భిన్నంగా ఉంటుంది. అలా మొత్తానికి ఓ మంచి క్రైమ్, థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..ఈ చిత్రంలో కాశీ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటాడు. వరుణ్ సందేశ్కు ఇలాంటి పాత్ర చాలా కొత్త. ఈ మూవీలో వరుణ్ సందేశ్ లుక్స్, యాక్టింగ్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్కు సర్ ప్రైజింగ్గా ఉంటాయి. హీరోయిన్ మధులిక పాత్ర కూడా మెప్పిస్తుంది. యాక్టింగ్కు ఓ మోస్తరుగా స్కోప్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఇక భవ్య శ్రీ, నిత్య శ్రీ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు. అసలు ట్విస్ట్ ఏంటి? విలన్ ఎవరన్నది మాత్రం సినిమాలో చూస్తేనే కిక్ వస్తుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఇలాంటి సీరియల్ కిల్లింగ్ స్టోరీలకు ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. ఇందులోనూ మంచి ఆర్ఆర్ ఉంటుంది. షైక్ హజారా కెమెరా కూడా సీన్లకు తగ్గట్టుగా మూడ్ను రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. మాటలు, పాటలు పర్వాలేదనిపిస్తాయి.ఎడిటింగ్, ఆర్ట్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగానే ఉన్నాయి. -
ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి : వరుణ్ సందేశ్
‘నా కెరీర్ లో అక్టోబర్ నెలను మరచిపోలేను. ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం "హ్యాపీడేస్" 2007లో ఇదే నెలలో విడుదలై, ఘన విజయం సాధించి, నా కెరీర్ నే మలుపు తిప్పింది. అందుకే నా జీవితంలో అక్టోబర్ మాసం గుర్తుండి పోయింది. ఇప్పుడు కానిస్టేబుల్ చిత్రం కూడా ఇదే నెలలో విడుదలవుతుండటంతో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి’ అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు.వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో ఈ చిత్రాన్ని మలచడం జరిగింది. కమర్షియల్, ఎంటర్టైన్మెంట్, సందేశం వంటి అంశాలను మిళతం చేసి రూపొందించడం జరిగింది" అని అన్నారు.నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ, "ఈ చిత్రానికి సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 10న చిత్రాన్ని భారీగా విడుదల చేయబోతున్నాం. ఒక అమ్మాయికి అవమానం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని చూపించాం. అమ్మాయిలతో పాటు తల్లి తండ్రులు కూడా ఈ సినిమాను చూడాలి" అని అన్నారు.దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన సినిమా పట్ల మా నమ్మకాన్ని పెంచింది. నిర్మాత కథను నమ్మి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఈ సినిమా తెరపైకి వచ్చింది" అని అన్నారు. -
వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
'కానిస్టేబుల్' సెన్సార్ పూర్తి.. స్పెషల్ సాంగ్ రిలీజ్
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన సినిమా 'కానిస్టేబుల్'. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించారు. అక్టోబరు 10న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికెట్ వచ్చింది. ఈ చిత్రం తన కెరీర్కు మరో మలుపు అవుతుందని హీరో వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు.నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. సెన్సార్ పూర్తి కావడం, ట్రైలర్ కి వస్తున్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇందులోని ఓ మంచి ఐటమ్ సాంగ్ని దసరా సందర్భంగా విడుదల చేశాం. దానికి కూడా మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది అని అన్నారు. -
పోలీసులు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయం: ఆర్. నారాయణమూర్తి
దేశ సరిహద్దులలో జవానులు, దేశం లోపల పోలీసులు ప్రజలను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తుంటారని ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు.వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, హీరో హీరోయిన్లుగా జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మిస్తున్నచిత్రం "కానిస్టేబుల్"" చిత్రం విడుదలకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఓ ఎమోషనల్ పాటను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఈ పాటను రామారావు రచించగా, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ ఆలపించడం ఓ విశేషం.ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి స్పందిస్తూ, "సమాజంలో పోలీసులు పోషిస్త్తున్న పాత్ర అనిర్వచనీయం. చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా పనిచేసే పోలీసులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు. అలాంటి నిజాయితీ కలిగిన ఓ కానిస్టేబుల్ ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయం. ఈ రోజు నేను ఆవిష్కరించిన ఎమోషనల్ పాట మనసును ఎంతగానో హత్తుకుంటోంది. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ ఈ పాటను ఆలపించి రక్తికట్టించారు. నా కళ్ళు చమర్చాయి. వరుణ్ సందేశ్ కు ఇది కమ్ బ్యాక్ చిత్రం కావాలి. కెప్టెన్ అఫ్ ది షిప్ దర్శకుడు. ట్రైలర్, ఈ పాట చూస్తుంటే దర్శక, నిర్మాతల అభిరుచి అర్ధమవుతోంది" అని అన్నారు.హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "నేను ఇంతవరకు నటించిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో నా పాత్ర ఉంటుంది. చక్కటి డ్రామా, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్, సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ప్రేక్షకులను అలరింపజేస్తుంది. యూనిట్ సమష్టి కృషికి ఈ చిత్రం ఓ మంచి ఉదాహరణగా నిలిచిపోతుంది. అలాగే నా కెరీర్ కు మరో మలుపు అవుతుంది" అని అన్నారు -
‘కానిస్టేబుల్’కి 30 లక్షలు!
"హ్యాపీడేస్, కొత్త బంగారులోకం" వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో కెరీర్ ను మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ ఇప్పటివరకు అనేక చిత్రాలు చేసినప్పటికీ లవర్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తాను నటిస్తున్న తాజా చిత్రం ‘కానిస్టేబుల్’ తో మాస్ కమర్షియల్ హీరోగా కొత్త ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్కి భారీ స్పందన లభించింది. ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ..‘ఈ సినిమాట్రైలర్ ను ఆగస్టు 31 వ తారీఖున రిలీజ్ చేశాం. ,నాటి నుంచి ఇప్పటివరకు జనాల్లో విశేష స్పందన వస్తోంది. 30 లక్షల మందికి పైగా ఈ ట్రైలర్ ని ఆదరించారు. మా అంచనాలు అందుకునేలా సినిమా ఉంటుంది. త్వరలో భారీగా ప్రపంచవ్యాప్తంగా చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం’ అని అన్నారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ‘టైలర్ కి అద్భుత స్పందన రావడం ఆనందదాయకం. సినిమా సస్పెన్స్ తో పాటు ప్రతి సీన్ థ్రిల్లింగ్ గా ప్రతి ఒక్కరికి నచ్చే విదంగా ఉంటుంది, అలాగే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుంది’అని అన్నారు. -
కానిస్టేబుల్ సందేశం
‘‘కానిస్టేబుల్’ సినిమా కంటెంట్ నేటి ట్రెండ్కు తగ్గట్టుగా ఉంది. వరుణ్ సందేశ్ తన పాత్రలో ఒదిగిపోయి ఉంటాడని భావిస్తున్నాను’’ అని అన్నారు రాజేంద్రప్రసాద్. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో ‘బలగం’ జగదీష్ నిర్మించిన థ్రిల్లర్ చిత్రం ‘కానిస్టేబుల్’. ఆదివారం హైదరాబాద్లో చిత్రయూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది.ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేసి, మాట్లాడారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు ఆర్యన్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు కానిస్టేబుల్ క్యారెక్టర్ను ఊహించుకుని, చేయగలననే నమ్మకం ఏర్పడిన తర్వాతే ఈ సినిమా చేశాను’’ అని చెప్పారు. ‘‘ఒక వ్యక్తికి అవమానం జరిగినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందనే అంశానికి సందేశాన్ని మిళితం చేసి, ఈ చిత్రం చేశాం’’ అని పేర్కొన్నారు ‘బలగం’ జగదీష్.‘‘ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉండగా, ఒక పాటను చంద్రబోస్గారు, మరో పాటను గద్దర్ నర్సన్న పాడారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సినిమా ఇది’’ అని చెప్పారు ఆర్యన్ సుభాన్. ‘‘మన భద్రత కోసంపోలీస్వారు అహర్నిశలూ ఎంతో శ్రమ పడుతున్నారు. ఇలాంటి అంశాలతో తీసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అని అన్నారు తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నటుడు శివారెడ్డి. ఈ కార్యక్రమంలో ముగ్గురు కానిస్టేబుల్స్ను యూనిట్ సత్కరించింది. -
ట్రెండ్కు తగ్గట్టు 'కానిస్టేబుల్'.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా నటించిన సినిమా 'కానిస్టేబుల్'. ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించగా బలగం జగదీష్ నిర్మించారు. థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో ఆదివారం జరిగింది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రైలర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: 'జెర్సీ' వదులుకున్నా.. ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు)ఇప్పటివరకు లవర్ బాయ్గా నాకు పేరుంది. సినిమాతో పాటు నా పాత్ర కూడా బాగా వచ్చిందని మూవీ టీం చెప్పడంతో చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా మా అంచనాలని 'కానిస్టేబుల్' నిలబెడుతుందని అనుకుంటున్నానని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చాడు. మా అందరి కెరీర్ మలుపుతిప్పే చిత్రం ఇది అవుతుంది. వరుణ్ సందేశ్కి కూడా కమ్ బ్యాక్ ఇస్తుందని దర్శకుడు ఆర్యన్ సుభాన్ అన్నారు.(ఇదీ చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి అప్పుడే చేసుకుంటాం: హీరోయిన్ నివేతా) -
వరుణ్ సందేశ్ లేటేస్ట్ మూవీ.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది
వరుణ్ సందేశ్, మధులిక జంటగా చిత్రం కానిస్టేబుల్. ఈ మూవీకి ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్పై బలగం జగదీష్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ మూవీ నుంచి 'మేఘం కురిసింది' అనే క్రేజీ సాంగ్ను విడుదల చేశారు. హైదరాబాద్లోని వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..' శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రధానమైxof. పోలీసు శాఖలో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ నేపథ్యం, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావాలి. ప్రేక్షకుల ఆదరణ పొందాలి. సినీ పరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతో కొత్త నటీనటులు వస్తున్నారని.. వారిని ప్రోత్సహించాలని' సూచించారు.సందేశాత్మక చిత్రాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలోనే హైదరాబాద్ నగరం సినీ హబ్గా మారిందని చెప్పారు. చిత్ర నటీనటులు, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, డైరెక్టర్ ఆర్యన్ సుభాన్, నిర్మాత బలగం జగదీశ్, నాయకులు జగ్గయ్య, రమణ పాల్గొన్నారు. -
సమాజమే నీ సేవకు సలాం
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్పై బలగం జగదీష్ నిర్మించారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతులమీదుగా విడుదల చేశారు.‘కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న... కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా....’ అంటూ ఈ పాట సాగుతుంది. శ్రీనివాస్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల మీద వచ్చిన ఈ పాటని నేను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి పోలీస్ ఈ సాంగ్ వింటారు’’ అన్నారు. ‘‘కానిస్టేబుల్..’ పాటని సీవీ ఆనంద్గారు విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. ‘‘కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల. అది నెరవేరకపోవడంతో ఈ సినిమా నిర్మించాను’’ అని బలగం జగదీష్ తెలిపారు. ‘‘ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ అందర్నీ స్పందింపజేస్తుంది’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. -
నల్లగొండ గద్దర్ నోట ‘కానిస్టేబుల్’ పాట
వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి నటిస్తోంది. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. "కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న...కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా" అంటూ సాగే టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్ చేతుల మీదగా విడుదల చేశారు. ఈ పాటకు శ్రీనివాస్ తేజ సాహిత్యాన్ని అందించగా సుభాష్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చారు. నల్గగొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, నేను ఆవిష్కరించిన ఈ టైటిల్ సాంగ్ చాలా బావుంది. మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ మీద ఈ సాంగ్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రతీ పోలీస్ ఈ సాంగ్ వింటారు" అని అన్నారు.హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సి వి ఆనంద్ గారు ఈ పాట విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు మంచి కం బ్యాక్ సినిమా అవుతుంది. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించాను" అని అన్నారు.నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, "కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల అది నెరవేరకపోవడంతో ఆ టైటిల్ తో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. కానిస్టేబుల్ ల మీద నాకున్న గౌరవంతో ఒక అద్భుతమైన పాటను నేను దగ్గరుండి రాయించి, నల్గొండ గద్దర్ నరసన్న తో పాటించడం జరిగింది. ఈ పాటను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. .దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, మంచి కథ, కథనాలు, పాత్రలో వరుణ్ ఒదిగిపోయిన విధానం, నిర్మాత అభిరుచి ఈ చిత్రం అద్భుతంగా రావడానికి దోహదం చేసిందని అన్నారు. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ ఎంతగానో స్పందింప జేస్తుందని అన్నారు. -
సస్పెన్స్... థ్రిల్
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఎస్కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్. ఈ సినిమా టీజర్ను విడుదల చేసిన దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ– ‘‘టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అని అర్థం అవుతోంది. ‘కానిస్టేబుల్’ చిత్రం హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ మూవీ ఆడియన్స్ను అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు వరుణ్ సందేశ్. ‘‘కానిస్టేబుల్’ వరుణ్ సందేశ్కి మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుంది’’ అని తెలిపారు బలగం జగదీష్. ‘‘ఈ చిత్రానికి అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు ఆర్యన్. ఈ సినిమాకు సంగీతం: సుభాష్ ఆనంద్. -
‘కానిస్టేబుల్’గా వరుణ్ సందేశ్
హ్యాపీ డేస్’ ఫేమ్ వరుణ్ సందేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఒకప్పుడు వరుసగా ప్రేమ కథలు చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు తన పంథాను మార్చుకున్నాడు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల ‘నింద’అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. త్వరలోనే మరో డిఫరెంట్ మూవీతో అలరించడానికి రాబోతున్నాడు. అదే ‘కానిస్టేబుల్’.ఆర్యన్ సుభాన్ ఎస్కే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ని నెల్లూరు టౌన్ హాల్లో కలెక్టర్ కే. కార్తిక్, సినిమా రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చరవేగంగా జరుగుతున్నాయి అంటూ తెలిపారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రమిదని చెప్పగా చిత్రానికి సంబంధించిన పాటలు మరియు టీసర్ త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపారు.


