-
వలస కూలీస్వయంకృషి
మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా) : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్కు చెందిన కుంట శివారెడ్డిది సాధారణ రైతు కుటుంబం. పదో తరగతి వరకు చదువుకున్నాడు. పైచదువులు చదివే ఆర్థిక స్థోమత లేకపోవడంతో చదువు నిలిపివేశాడు. తమ కుటుంబానికి ఉన్న ఐదు ఎకరాల భూమిలో తమ ఇంటి వారే పనిచేస్తుండటంతో శివారెడ్డికి మరో పని వెతుక్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో గల్ఫ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 2001లో దుబాయికి వెళ్లాడు. అక్కడ ఒక భవన నిర్మాణ కంపెనీలో కార్మికునిగా చేరిన శివారెడ్డి కొన్ని నెలల పాటు పనిచేశాడు. కార్మికునిగా ఎన్ని రోజులు పనిచేసినా తాను నిర్ణయిం చుకున్న లక్ష్యానికి చేరుకోలేనని భావించి సూపర్వైజర్గా పదోన్నతి పొందడం కోసం కృషిచేశాడు. సూపర్వైజర్గా పదోన్నతి పొందాలంటే అరబ్బీ, ఇంగ్లిష్ భాషలు రావాలని గుర్తించి రెండు భాషలపై పట్టు సాధించాడు. దుబాయికి వెళ్లిన కొన్ని నెలలకే సూపర్వైజర్గా పదో న్నతి పొందాడు. తాను ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే పది మందికి ఉపాధి చూపాలని భావించాడు. సొంతంగా కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. సూపర్వైజర్గా పనిచేసినంత కాలం కంపెనీ ఏర్పాటు, కార్మికులకు పనిచూపడానికి అవసరమైన మార్గాలను తెలుసుకున్న శివారెడ్డి 2012లో ‘ఏఆర్డీ అల్రువిస్ టెక్నికల్ సర్వీసెస్’ కంపెనీ ఏర్పాటు చేసి దుబాయి ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందాడు. కన్స్ట్రక్షన్ కంపెనీలకు కార్మికులను సరఫరా చేస్తూనే విల్లాలు, బహుళ అంతస్థుల భవనాలను నిర్మించడానికి కాంట్రాక్టులను తీసుకున్నాడు. తన వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరిస్తూ కార్మికుల సంఖ్యను పెంచుకున్నాడు. తాజాగా దుబాయ్లోని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ.. విల్లాలను నిర్మించే బాధ్యతను శివారెడ్డి కంపెనీకి అప్పగించింది. ఒక్కో కార్మికునికి నెలకు మన కరెన్సీలో రూ.20వేల నుంచి రూ.30వేల వరకు వేతనం చెల్లిస్తున్నాడు. కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం రూ.15వేల వరకే ఉంది. కానీ, శివారెడ్డి మాత్రం కార్మికుల శ్రమకు తగ్గ వేతనం చెల్లిస్తున్నాడు. తెలంగాణకు చెందిన కార్మికులతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్కు చెందిన కార్మికులకు కూడా శివారెడ్డి ఉపాధి కల్పిస్తున్నాడు. కార్మికులకు ఉచిత వసతి, భోజన సదుపాయాన్ని సైతం శివారెడ్డి కంపెనీ కల్పిస్తోంది. పని కల్పించడమూ సేవనే.. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వచ్చిన కార్మికులకు పని కల్పించడము కూడా సేవనే. కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడం, ఇమిగ్రేషన్ సమస్యలను పరిష్కరించడం ప్రధానం కాదు. పని చేయాలనుకునేవారికి పని ఇవ్వడమే ప్రధానం. మా కంపెనీపై నమ్మకంతో ఎంతో మంది కార్మికులు పని కోసం వస్తున్నారు. కార్మికులకు మా కంపెనీపై నమ్మకం ఉందనే విషయం మాకు ఎంతో సంతృప్తి ఇస్తుంది. - కుంట శివారెడ్డి సొంతూరులో వ్యవసాయం శివారెడ్డికి వ్యవసాయంపై ఎంతో మక్కువ. వ్యాపారం ద్వారా సంపాదించిన సొమ్ముతో సొంతూర్లో 20 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. వీలున్న సమయంలో దుబాయి నుంచి తిమ్మాపూర్కు వచ్చి వ్యవసాయాన్ని చూసుకుంటున్నాడు. కేవలం అజమాయిషీనే కాకుండా స్వయంగా పొలం పనులు చేస్తుండటం గమనార్హం. -
0.5 శాతానికి ఈపీఎఫ్వో పరిపాలనా రుసుము
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో)కు కంపెనీల యజమానులు చెల్లించే పరిపాలనా రుసుము 0.5 శాతానికి తగ్గింది. దీంతో అన్ని కంపెనీలకూ కలిపి ఏటా మొత్తంగా 900 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గనుంది. ఉద్యోగులకు చెల్లించే మొత్తం వేతనంలో 0.65 శాతాన్ని పరిపాలనా రుసుము కింద కంపెనీలు ఇప్పటివరకు ఈపీఎఫ్వోకు చెల్లించేవి. వచ్చే నెల నుంచి ఈ రుసుమును 0.15 శాతం తగ్గించి 0.5 శాతంగా ఉండేలా ఈపీఎఫ్వో ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్వో చందాదారుల సంఖ్య పెరుగుతున్నందున తమ పరిపాలనా ఖర్చులకు అవసరమైన వాటికన్నా ఎక్కువ నిధులే వస్తున్నాయనీ, ఈ కారణంగానే చార్జీలను తగ్గిస్తున్నట్లు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ వీపీ జాయ్ చెప్పారు. -
మనుషుల అక్రమ రవాణా
* ఇరాక్, మలేషియాలో తెలుగు వారికి వెతలు * నీచమైన పనులు చేయిస్తున్నారు.. * ఏజెంట్ల వలలో చిక్కి మోసపోతున్నారు మోర్తాడ్ : ఉన్న ఊరిలో ఉపాధి లేక, కన్నవారికి, కట్టుకున్న వారికి తోడు ఉండకుండా దేశం కాని దేశంలో పని కోసం వెళుతున్న తెలుగువారికి కష్టాలు సర్వసాధారణంగా మారాయి. అడుగడుగునా ఏజెంట్ల మోసాలు దీనికి తోడు కంపెనీల యజమానుల నయ వంచనతో గల్ఫ్ బాట పట్టిన వారు నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా గల్ఫ్ దేశాల నుం చి వచ్చినవారు వెల్లడించిన సమాచారం ప్రకారం ఇరాక్, మలేషియాలలో మన తెలుగువారి అక్రమరవాణా జోరుగా సాగుతోంది. ఏజెంట్ల వలలో చిక్కి బిక్కుబిక్కు మంటున్న తెలుగువారు ఇళ్లకు చేరుకోవడానికి కనిపించిన ప్రతివారిని కాళ్లు పట్టుకోవాల్సి వస్తోంది. ఇరాక్, మలేషియాలో మనుషుల అక్రమ రవాణా పెద్ద మాఫియాగా తయారైంది. మనుషుల అక్రమ రవాణాలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన అనే క మంది పావులుగా మారారు. ఈ మాఫియాలో ఏజెంట్లు కీలకపాత్రదారులు కాగా దీనికి గల్ఫ్లోని షేక్లు భారీగా పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోం ది. దీనిపై అవగాహన లేక మన తెలుగువారు ఎదు రు డబ్బులు ఇచ్చి కష్టాలను కొని తెచ్చుకొంటున్నా రు. ఇరాక్, మలేషియాలో తెలుగువారిని కొంటున్న యజమానులు కార్మికులతో నీచమైన పనులు చేయిస్తున్నారు. దుబాయ్, మస్కట్, కువైట్, సౌది అరేబియా తదితర దేశాల్లో పనులు సరిగా లేక పోవడం తో అనేక మంది ఇరాక్, మలేషియాలవైపు మొగ్గుచూపుతున్నారు. ఇరాక్, మలేషియాలో జోరుగా సాగుతున్న మనుషుల అక్రమ రవాణాలో సమిధలుగా మారిన తెలుగువారు దాదాపు 30 వేల మంది వరకు ఉంటారని అంచనా. ఇరాక్, మలేషియాలో మనుషుల అక్రమ రవాణా సాగుతోందని గల్ఫ్ ఏజెంట్లకు తెలిసినా వారు మాయమాటలతో కార్మికులను నట్టేట ముంచుతున్నారు. ఇరాక్, మలేషియాలకు పని కోసం వెళ్లిన కార్మికులు సుమారు పది మంది చేతులు మారుతున్నారు. గల్ఫ్ ఏజెంట్లు చెప్పిన పనులకు విరుద్ధంగా అక్కడ నీచమైన పనులే కార్మికులు చేయాల్సివస్తోంది. ఇరాక్, మలేషియాలో కంపెనీ యజమానులు కార్మికులతో తమ కు అవసరం అయిన అన్ని పనులు చేయించుకుం టున్నారు. వీసా పొందిన మొదట్లో కార్మికుడు కోరిన పని ఉన్నట్లు ఏజెంట్లు కాగితాలను సృష్టిస్తున్నారు. చివరకు ఎలాంటి పనైనా కార్మికులతో చేయిస్తున్నారు. వీసా కోసం మన వారు గల్ఫ్ ఏజెంటుకు రూ.1 లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు చెల్లిస్తున్నారు. అయితే తమకు అవసరం అయిన మనుషు ల కోసం ఇరాక్, మలేషియాలోని షేక్లు భారీగానే పెట్టుబడులు పెడుతున్నారు. షేక్లు పెట్టిన పెట్టుబడులను అందరు వాటాలుగా పంచుకుంటున్నా రు. ఒక్కో తెలుగు కార్మికుడు ఇరాక్లోనైతే నలుగురి చేతులు మారుతున్నాడు. మలేషియాలో అయితే మాత్రం ఎనిమిది మంది చేతులు మారాల్సివస్తుంది. మనుషుల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న గల్ఫ్ ఏజెంట్లు కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేస్తునే షేక్లు ఇచ్చే ముడుపులను స్వీకరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గల్ఫ్ ఏజెంట్ల వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అలాగే ఇరాక్, మలేషియాకు సాగుతున్న మనుషుల అక్రమ రవాణాకు పుల్స్టాప్ పెట్టాలని పలువురు విన్నవిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement