breaking news
Commonwealth Weightlifting Championship
-
అజయ్ బాబుకు స్వర్ణ పతకం
అహ్మదాబాద్: కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత లిఫ్టర్లు వల్లూరి అజయ్ బాబు, బేద్బ్రత్ భరాలి బంగారు పతకాలు సాధించారు. గురువారం జరిగిన సీనియర్ పురుషుల 79 కేజీల కేటగిరీలో జాతీయ క్రీడల చాంపియన్ అయిన అజయ్ బాబు మొత్తం 335 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచాడు. స్నాచ్లో 152 కేజీల బరువెత్తి కామన్వెల్త్ చాంపియన్షిప్ రికార్డును కూడా నెలకొల్పాడు. క్లీన్ అండ్ జెర్క్లో 183 కేజీలు ఎత్తాడు. స్నాచ్లో ఇంతకుముందు నైజీరియాకు చెందిన ఎడిడివోంగ్ జోసెఫ్ 147 కేజీల రికార్డును అజయ్ తిరగరాశాడు. గత క్రీడల్లోనూ అతను బంగారు పతకం సాధించినప్పటికీ అప్పుడు 81 కేజీల విభాగంలో పోటీపడ్డాడు. సీనియర్ మహిళల 69 కేజీల కేటగిరీలో కామన్వెల్త్ క్రీడల (2022) కాంస్య పతక విజేత హర్జిందర్ కౌర్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. జూనియర్ పురుషుల 79 కేజీల విభాగంలో బేదబ్రత్ భరాలి స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్లో కొత్త రికార్డులతో పసిడి పట్టాడు. అతను స్నాచ్లో 145 కేజీల బరువెత్తాడు. తద్వారా 139 కేజీల గత రికార్డును అధిగమించాడు. అలాగే క్లీన్ అండ్ జెర్క్లో 181 కేజీల బరువెత్తి 169 కేజీల గత రికార్డును తుడిచిపెట్టాడు. మొత్తంగా బేదబ్రత్ 326 కేజీల బరువెత్తాడు. యూత్ మహిళల 77 కేజీల విభాగంలో గ్రీష్మ తోరట్ రజతం నెగ్గింది. -
‘పసిడి’తో పునరాగమనం
అహ్మదాబాద్: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న తొలి ఈవెంట్లోనే భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను మెరిసింది. సోమవారం మొదలైన కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో 31 ఏళ్ల మీరాబాయి చాను స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగిన మీరాబాయి మొత్తం 193 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. స్నాచ్లో 84 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 109 కేజీలు బరువెత్తిన మీరాబాయి... ఈ క్రమంలో కొత్త కామన్వెల్త్ చాంపియన్షిప్ రికార్డులు నెలకొల్పింది. ఏడాది విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన మీరాబాయి ముందుగా స్నాచ్ తొలి ప్రయత్నంలో విఫలమైంది. రెండో ప్రయత్నంలో 84 కేజీలు ఎత్తిన ఈ మణిపూర్ లిఫ్టర్... మూడో ప్రయత్నంలో 89 కేజీలు ఎత్తబోయి విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్ తొలి ప్రయత్నంలో 105 కేజీలు, రెండో ప్రయత్నంలో 109 కేజీలు ఎత్తిన మీరాబాయి... మూడోసారి 113 కేజీలు ప్రయతి్నంచి విఫలమైంది. టోక్యో ఒలింపిక్స్లో 49 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన మీరాబాయి... గత ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య అన్ని వెయిట్ కేటగిరీలను సవరించింది. ఇందులో భాగంగా 49 కేజీల విభాగాన్ని తొలగించి 48 కేజీల విభాగాన్ని మళ్లీ తెచ్చారు. గతంలో మీరాబాయి 48 కేజీల విభాగంలో 2017 ప్రపంచ చాంపియన్షిప్లో.. 2018 కామన్వెల్త్ గేమ్స్లో.. 2013, 2017 కామన్వెల్త్ చాంపియన్షిప్లో స్వర్ణాలు సాధించింది. రిషికాంతకు బంగారు పతకం కామన్వెల్త్ చాంపియన్షిప్ తొలి రోజు రిషికాంత సింగ్ ప్రదర్శనతో భారత్కు రెండో స్వర్ణం దక్కింది. పురుషుల 60 కేజీల విభాగంలో రిషికాంత మొత్తం 271 కేజీలు (స్నాచ్లో 120 కేజీలు+క్లీన్ అండ్ జెర్క్లో 151 కేజీలు) బరువెత్తి మొదటి స్థానంలో నిలిచాడు. -
మీరాబాయి మెరిసేనా!
అహ్మదాబాద్: ఏడాది విరామం తర్వాత భారత స్టార్ లిఫ్టర్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాబాయి చాను పోటీల బరిలోకి దిగుతోంది. నేటి నుంచి ఇక్కడ జరిగే కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో ఆమె స్టార్ ఆఫ్ అట్రాక్షన్ కానుంది. పారిస్ ఒలింపిక్స్లో కేవలం ఒక కిలోగ్రామ్ తేడాతో పోడియంలో నిలువలేకపోయిన మీరాబాయి తర్వాత గాయాల బారిన పడింది. దీంతో చాలా టోర్నీలకు ఆమె దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా పతకం పట్టుపట్టేందుకు 32 ఏళ్ల మీరా 48 కేజీల కేటగిరీకి మారింది. లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్లో ఆమె రెగ్యులర్ కేటగిరీ కాకుండా 48 కేజీల కేటగిరీ ఉండటంతో ఇప్పటి నుంచే ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు ఈ తాజా చాంపియన్షిప్ క్వాలిఫయింగ్ టోర్నీ కావడంతో మీరాబాయి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమెతో పాటు కామన్వెల్త్ క్రీడల రజత విజేత బింద్యారాణి దేవి, కాంస్య విజేతలు హర్జిందర్ కౌర్, లవ్ప్రీత్ సింగ్లు సహా భారత లిఫ్టర్లే ఈ టోర్నీలో ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. భారత జట్ల వివరాలు: మహిళలు: మీరాబాయి చాను (48 కేజీలు), స్నేహా సోరెన్ (53 కేజీలు), బింద్యారాణి (58 కేజీలు), నిరుపమా (63 కేజీలు), హర్జిందర్ కౌర్ (69 కేజీలు), హర్మన్ప్రీత్ కౌర్ (77 కేజీలు), వన్షిత (86 కేజీలు), మెహక్ (+86 కేజీలు). పురుషులు: రిషికాంత సింగ్ (60 కేజీలు), ఎం.రాజా (65 కేజీలు), నారాయణ అజిత్ (71 కేజీలు), వల్లూరి అజయ్ బాబు (79 కేజీలు), అజయ్ సింగ్ (88 కేజీలు), దిల్బాగ్ సింగ్ (94 కేజీలు), హర్చరణ్ సింగ్ (110 కేజీలు), లవ్ప్రీత్ సింగ్ (+110 కేజీలు). -
Ajay Singh: అజయ్ సింగ్కు స్వర్ణ పతకం!
Weightlifter Ajay Singh Wins Gold Medal: కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో భారత వెయిట్లిఫ్టర్ అజయ్ సింగ్ 81 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అతను ఓవరాల్గా 322 కేజీల బరువెత్తి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఇంగ్లండ్లోని బర్మింగ్హమ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్కు నేరుగా అర్హత సాధించాడు. కామన్వెల్త్ చాంపియన్షిప్లో భారత్కు ఇప్పటివరకు మూడు బంగారు పతకాలు లభించాయి. జెరెమీ లాల్రినుంగా (67 కేజీలు), అచింత షెయులి (73 కేజీలు) కూడా స్వర్ణ పతకాలు దక్కించుకొని బర్మింగ్హమ్ గేమ్స్కు బెర్త్లు ఖరారు చేసుకున్నారు. చదవండి: Trolls On Rohit Sharma: వైస్ కెప్టెన్ కాదు.. ముందు ఫిట్గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ! -
స్వర్ణం నెగ్గిన దీక్షిత
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం భారత లిఫ్టర్లు పది పతకాలను సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 58 కేజీల విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ లిఫ్టర్ ఎర్ర దీక్షిత స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని మానుకోట పట్టణానికి చెందిన దీక్షిత స్నాచ్లో 73 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 94 కేజీలు బరువెత్తి ఓవరాల్గా 167 కేజీలతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. యూత్ బాలుర 62 కేజీల విభాగంలో ముత్తుపాండి రాజా స్వర్ణం, జూనియర్ పురుషుల విభాగంలో రజతం గెలిచాడు. సీనియర్ మహిళల 58 కేజీల విభాగంలో సరస్వతి రౌత్ కాంస్యం నెగ్గింది. యూత్ బాలుర, జూనియర్ పురుషుల 69 కేజీల విభాగంలో దీపక్ లాథెర్ రెండు స్వర్ణాలు, సీనియర్ పురుషుల విభాగంలో కాంస్యం సాధించాడు. సీనియర్ మహిళల 63 కేజీల విభాగంలో వందన గుప్తా కాంస్యం... యూత్ బాలికల, జూనియర్ మహిళల 63 కేజీల విభాగంలో ఉమేశ్వరి దేవి కాంస్య పతకాలను సాధించింది. మరోవైపు 2019 కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. -
సంతోషికి రజతం
గోల్డ్కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మత్స్య సంతోషి సత్తా చాటింది. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె రజత పతకాన్ని సాధించింది. మంగళవారం జరిగిన సీనియర్ మహిళల 53 కేజీల విభాగం ఫైనల్లో సంతోషి ఓవరాల్గా 194కేజీల బరువునెత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్ విభాగంలో 86కేజీల లిఫ్ట్ చేసిన సంతోషి క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్లో 108 కేజీల బరువునెత్తింది. ఈ విభాగంలో భారత్కే చెందిన సంజిత చాను ఓవరాల్గా 195 కేజీల బరువునెత్తి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు సీనియర్ మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను విజేతగా నిలవడంతో పాటు స్నాచ్ విభాగంలో కొత్త రికార్డును నెలకొల్పింది. ఆమె ఫైనల్లో ఓవరాల్గా 189 కేజీల బరువునెత్తి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తాజాగా స్నాచ్ విభాగంలో 85 కేజీలు ఎత్తి తన పేరిటే ఉన్న రికార్డు (84 కేజీలు)ను తిరగ రాసింది. ఈ విజయాలతో మీరాబాయి, సంజిత వచ్చే ఏడాది ఇదే వేదికపై జరగనున్న కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించారు. -
శివమ్ సైనికి స్వర్ణం
పెనాంగ్ (మలేసియా): కామన్వెల్త్ వెరుుట్లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో భారత లిఫ్టర్ శివమ్ సైనీ రెండు పతకాలు సాధించాడు. జూనియర్ విభాగంలో సైని స్నాచ్లో 132 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 168 కిలోలు బరువు ఎత్తి స్వర్ణం సాధించాడు. ఇక సీనియర్ 94 కేజీల విభాగంలో శివమ్ సైనీ రజతం గెలిచాడు. స్నాచ్లో 132, క్లీన్ అండ్ జర్క్లో 168లతో మొత్తం 300 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. -
భారత లిఫ్టర్లకు 5 స్వర్ణాలు
పుణే: కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత లిఫ్టర్ల జోరు కొనసాగుతోంది. పోటీల రెండో రోజు మంగళవారం భారత్కు ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. సీనియర్ పురుషుల 77 కేజీల విభాగంలో సతీశ్ కుమార్ 325 కేజీలు బరువెత్తి పసిడి పతకాన్ని సాధించాడు. గతేడాది గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లోనూ సతీశ్ భారత్కు స్వర్ణ పతకాన్ని అందించాడు. యూత్ పురుషుల 69 కేజీల విభాగంలో లాలూ టకూ (282 కేజీలు), యూత్ మహిళల 58 కేజీల విభాగంలో నుంగ్షిటాన్ (157 కేజీలు), జూనియర్ పురుషుల 77 కేజీల విభాగంలో కోజుమ్ తాబా (296 కేజీలు) కూడా భారత్కు పసిడి పతకాలు అందిచారు. సీనియర్ మహిళల 58 కేజీల విభాగంలో మినాతి (194 కేజీలు) కాంస్యం, 77 కేజీల జూనియర్ విభాగంలో అజయ్ సింగ్ (290 కేజీలు) రజత పతకం గెల్చుకున్నారు.