-
ఉత్తరాఖండ్లో బహుభార్యత్వం రద్దు!
డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో బహుభార్యత్వంపై నిషేధంతో పాటు సహజీవనాన్ని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్నూ తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సంబంధించిన ముసాయిదాను జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ కమిటీ శుక్రవారం సీఎం పుష్కర్ సింగ్ ధామికి సమరి్పంచింది. అందులో కీలక ప్రతిపాదనలు చేసింది. ‘‘రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లినీ విధిగా రిజిస్ట్రర్ చేయించాల్సిందే. విడాకులు కోరే హక్కులు భార్యభర్తలకు సమానంగా ఉంటాయి. భార్య జీవించి ఉండగా భర్త మరో పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం నేరం. బహు భార్యత్వంపై నిషేధం అమలు చేయాలి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకూ వారసత్వ హక్కులుంటాయి. సహజీవనం చేస్తుంటే దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ స్త్రీ, పురుషులిద్దరూ డిక్లరేషన్ను సమరి్పంచాలి’’ అని పేర్కొంది. ఈ నిబంధనల నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపు ఇవ్వనున్నారు. యూసీసీ ముసాయిదా రూపకల్పన కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం 202లో ఈ కమిటీని వేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల హామీ అమలు దిశగా ఇదో కీలక అడుగని ధామీ అభివరి్ణంచారు. ముసాయిదాను క్షుణ్నంగా పరిశీలించాక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో యూసీసీ బిల్లును తెచ్చి ఆమోదించి చట్టం చేస్తామన్నారు. యూసీసీ అమలైతే వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వం వంటి అంశాల్లో పౌరులందరికీ మతంతో సంబంధం లేకుండా సమాన చట్టాలు అమలవుతాయి. మేమూ అదే బాటలో: అసోం సీఎం బహుభార్యత్వం విధానాన్ని రద్దుచేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి çహిమంత బిశ్వ శర్మ కూడా ప్రకటించారు. ‘‘అసోంలో యూసీసీ అమలుపై గతేడాదే మాకు నివేదిక అందింది. దానిని న్యాయశాఖ పరిశీలిస్తోంది. కుదిరితే ఫిబ్రవరి ఐదున మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుగా ప్రవేశపెట్టి చట్టంగా తెస్తాం’’ అని హిమంత అన్నారు. -
UCC CODE: ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి!
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చల్లో నిలుస్తూ వస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ)ని హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ త్వరలో అమలు చేయనున్నట్టు సమాచారం. వచ్చే వారమే ఈ దిశగా చర్యలు చేపట్టబోతోందని తెలుస్తోంది. తద్వారా దేశంలో యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా అది నిలవనుంది. యూసీసీపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ఒకట్రెండు రోజుల్లో సీఎం పుష్కర్సింగ్ ధామికి నివేదిక సమరి్పంచనుంది. దీపావళి అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై యూసీసీ బిల్లును ఆమోదించనుంది. తద్వారా దానికి చట్టబద్ధత కలి్పంచనుంది. ఎన్నికల వాగ్దానం: ఉత్తరాఖండ్లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన ఎన్నికల వాగ్దానాల్లో యూసీసీ అమలు ప్రధానమైనది. ఆ మేరకు జస్టిస్ దేశాయ్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి కేబినెట్ భేటీలోనే సీఎం ధామీ నిర్ణయం తీసుకున్నారు. డ్రాఫ్ట్ తయారీ కోసం రాష్ట్రంలో దాదాపు 2.3 లక్షల మందితో కమిటీ చర్చలు జరిపింది. యూసీసీ డ్రాఫ్ట్ కమిటీలో కూడా ఆమె సభ్యురాలు. ఏమిటీ ఉమ్మడి పౌర స్మృతి? ► కులం, మతం, ఆడ–మగ వంటి తేడాలు, లైంగిక ప్రవృత్తులతో నిమిత్తం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేయడం ఉమ్మడి పౌర స్మృతి ప్రధానోద్దేశం. ► ఇది అమలైతే ప్రస్తుతం అమల్లో ఉన్న పలు మత, ఆచార, సంప్రదాయ ఆధారిత వ్యక్తిగత చట్టాలన్నీ రద్దవుతాయి. ► వివాహాలు, విడాకులు, వారసత్వం, దత్తత తదితరాలతో పాలు పలు ఇతర వ్యక్తిగత అంశాలు కూడా యూసీసీ పరిధిలోకి వస్తాయి. ► రాజ్యాంగంలోని 44వ అధికరణం ఆధారంగా దీన్ని తెరపైకి తెచ్చారు. ► 2024 లోక్సభ ఎన్నికలకు ముందే బీజేపీ పాలిత గుజరాత్ కూడా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనుందని చెబుతున్నారు! ► గోవాలో ఇప్పటికే గోవా పౌర స్మృతి అమల్లో ఉంది. ఇది చాలా రకాలుగా యూసీసీని పోలి ఉంటుంది. రాజ్యాంగం ఏమంటోంది? ‘‘దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలి’’ అని రాజ్యాంగంలోని 4వ భాగం స్పష్టంగా నిర్దేశిస్తోంది. అయితే దీన్ని రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో భాగంగా పేర్కొన్నారు. కనుక దీని అమలు తప్పనిసరి కాదు. ఆ దృష్ట్యా యూసీసీ అమలుకు కోర్టులు ఆదేశించజాలవు. సుప్రీంకోర్టు కూడా... అత్యున్నత న్యాయస్థానం కూడా పలు తీర్పుల సందర్భంగా యూసీసీ అమలు ఆవశ్యకతను నొక్కిచెప్పింది. అయితే 2018లో మోదీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యూసీసీపై లోతుగా పరిశీలించిన కేంద్ర లా కమిషన్ మాత్రం భిన్నాభిప్రాయం వెలిబుచ్చడం విశేషం. ‘‘ఈ దశలో దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమూ లేదు. అభిలషణీయమూ కాదు’’ అంటూ కేంద్రానికి ఏకంగా 185 పేజీల నివేదిక సమరి్పంచింది! పారీ్టల్లో భిన్నాభిప్రాయాలు... యూసీసీ అమలుపై రాజకీయ పక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. బీజేపీ దీన్ని గట్టిగా సమరి్థంచడమే గాక అధికారంలోకి వస్తే దేశమంతటా యూసీసీని కచి్చతంగా అమలు చేస్తా మని 2019 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో హా మీ కూడా ఇచ్చింది. ఇక కాంగ్రెస్, మజ్లిస్ తదితర పక్షాలు యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి... ► ప్రధాని మోదీ తొలినుంచీ యూసీసీ అమలును గట్టిగా సమరి్థస్తూ వస్తున్నారు. రెండు రకాల చట్టాలతో దేశం ఎలా నడుస్తుందని మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రశ్నించారు. ► ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ తదితరులు కూడా పలు సందర్భాల్లో యూసీసీని సమరి్థంచారు. ‘‘దేశ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఉండాలన్నదే మన రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం కూడా. దాని అమలుకు ఇదే సమయం’’ అని ధన్ఖడ్ అభిప్రాయపడ్డారు. ► యూసీసీ పేరుతో ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి పెను సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే మోదీ లక్ష్యమని కాంగ్రెస్ దుయ్యబడు తోంది. ► రాజ్యాంగంలోని 29వ అధికరణానికి యూసీసీ విరుద్ధమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు. ‘‘బహుళత్వం, వైవిధ్యమే మన దేశ సంపద. యూసీసీ పేరుతో వాటికి తూట్లు పొడిచేందుకు మోదీ ప్రయ తి్నస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. ► యూసీసీ వస్తే తమ సాంప్రదాయిక ఆచారాలకు అడ్డుకట్ట పడుతుందేమోనని దేశవ్యాప్తంగా 30 పై చిలుకు గిరిజన సంఘాలు కూడా ఇప్పటికే సందేహం వెలిబుచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తినే హక్కు గురించి కదా అడగాలి?
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) వెంటనే రావాలనే వైపుంటారా, వ్యతిరేకంగా ఉంటారా అని లెక్కలు ఎందుకు? యూసీసీ కావాలా, వద్దా అనే పోటీ పెట్టి, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అనేది సమాధానం కాదు. ఫేస్ బుక్లో, సామాజిక మీడియాలో, ఆలోచించే వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. హిందువులు, ముస్లింలు, జైనులు, క్రైస్తవులు, యూదులు, ఇతర మతాల వారు, ముఠాల వారు, అనేక రకాల వర్ణాల వారు, కులాల వారు, అటూ ఇటూ చీలిపోవడం న్యాయం కాదు. ఏమైనా చేసి ఎన్నికల్లో గెలవడం అత్యవసరమైపోయింది. కొన్ని పార్టీలు ఓడిపోయేందుకు సిద్ధం. వందల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ఇస్తున్నారంటే అనేక పార్టీలు ఓడిపోవ డానికీ, ఓట్లు చీల్చడానికీ సిద్ధం. అందుకే రాజకీయ అవస రాలతో సంస్కరణ చేయాలనడం దారుణం. పర్సనల్ లా అంటే ‘వ్యక్తిగతమైన’ అని అర్థం కాదు. ఒక మతానికి చెందిన చట్టాల ప్రకారం అని అర్థం. వివాహం, ఆస్తుల వారసత్వం ఇందులోని అంశాలు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి వైవిధ్యపూరిత దేశంలో ముందు సమానత్వం, దాంతో మొత్తం మీద భారతదేశానికి ఏకత్వాన్ని కూడా సాధించాల్సి ఉంటుంది. ఇంతవరకు ఉమ్మడి పౌర స్మృతి మీద కోర్టులు సలహాలు ఇచ్చాయే గానీ స్పష్టమైన తీర్పులు ఇవ్వలేదు. గత 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా ‘దేశ సమైక్యత’ కోసం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. ఇటువంటి సంక్లి ష్టమైన యూసీసీ విషయంలో పార్లమెంట్ చట్టం చేయా ల్సిందే కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు కావాలని స్పష్టం చేయడం సాధ్యం కాదు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు తమ తమ మతాలకు వర్తించే విభిన్న చట్టాలున్నాయి. భారత రాజ్యాంగం కింద ఈ మతాలలో అమలు చేసుకునే హక్కులు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం మైనారీలకున్న ఈ హక్కులను ఉల్లంఘించి పార్లమెంటులో చట్టం చేస్తుంది కావచ్చు. కొన్ని సంవత్సరాల తరు వాత దాన్ని సవరించి కొట్టివేసేదాకా జనం ఎన్నికల్లో తమను సమర్థించాలనే ఆలోచన కూడా ఉండవచ్చు. అనేక చట్టాలు అందరికీ వర్తించేలా ఉంటాయి. ఉదాహరణ: ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్. గృహ హింస నిరోధక చట్టం! ఈ చట్టం అన్ని మతాల వారికీ ఉపయోగమే. అందులో ‘వయొలెన్స్’ అన్నంత మాత్రాన దాన్ని క్రిమినల్ చట్టం అనుకుంటారు. కానీ అది సివిల్ కేసు. అవన్నీ సివిల్ కోర్టులో విచారణ చేస్తారు. క్రిమినల్ కేసులు కూడా అన్ని మతాల వారికీ ఉప యోగపడేవి. వీటిని ఎక్కువగా వాడుకునేది హిందువులే. వారితోపాటు ముస్లింలు, క్రైస్తవులు కూడా వినియోగిస్తున్నారనడం నిజం. చాలామంది దుర్వినియోగం అంటారు. దానికి కారణం ఎక్కువమంది అబద్ధాలు ఆడతారు. భార్యలైనా భర్తలైనా లేదా వారి బంధువులైనా అబద్ధాలు విపరీతంగా చెబుతూ అంటారు. లాయర్లని బద్నాం చేస్తాం గానీ, అబద్ధాలు ఆడని వారెవరు? ఎవరూ కోరని యూసీసీ ఇప్పుడెందుకు? తినే హక్కు గురించి ఎవరూ అడగడం లేదు. సంపాదించుకున్న ప్రకారం వండుకొని తినే హక్కు, ఇష్టమైన వస్త్రాలు వేసుకునే హక్కు, నచ్చిన భగవద్గీత, ఖురాన్, బైబిల్ చదువుకుని, పాడుకునే హక్కు ఉన్నాయి. ఇవి యూసీసీకి అతీతమైనవి కదా! రాజ్యాంగం తప్పనిసరిగా చదవాలనే శాసనం, లేదా చట్టం ఉండనవసరం లేదు. అది స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం. టమాటా ధరలను నియంత్రించే చట్టం ప్రభుత్వాలు చేయగలవా? దేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తి, పిల్లలను దత్తత తీసుకోవడం వంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. ఆచరించే మతం, విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంటుంది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా,మహీంద్రా యూనివర్సిటీ -
అసలు కావలిసింది ‘ఉమ్మడి ఆర్థిక స్మృతి!’
దేశ పౌరుల్లో కొందరికి భారీ ఆస్తులున్నాయి! కొందరికి రెక్కల కష్టం తప్ప వేరే మార్గం లేదు. దేశంలో భూములు ఎన్ని? అవి ఉమ్మడిగానే ఉంటున్నాయా? దేశంలో, ఉత్పత్తి రాసుల్ని కురిపించే పరిశ్రమల్లో పౌరులందరూ సమానులేనా? సమస్త రవాణా సాధనాలనూ నిర్మించడానికీ, నడపడానికీ, కోట్ల కోట్ల డబ్బు రాసుల రాబడులకూ కారకులు ఎవరు? వాటి యాజమాన్యాలు ఎవరివి? ఆస్తి హక్కులకు కారణాలు ఏమిటి? పాకీ దొడ్లు తుడిచే అట్టడుగు కులాల శ్రామికులకు దేని మీద యాజమాన్యం ఉంది? దేశంలో, నిత్యం 24 గంటలూ ఉత్పత్తుల కార్యాలలో మునిగి బ్రతికే శ్రామికులకు సుఖ శాంతుల్లో ఉమ్మడితనం ఉందా? ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనేది నిజంగా ఎప్పుడు సాధ్యం? ‘ఉమ్మడి ఆర్థిక స్మృతి’ అనేది ఉన్నప్పుడు మాత్రమే! ‘ఒకే ఇంట్లో వున్న ఇద్దరు వ్యక్తులకు రెండు వేరు వేరు చట్టాలు వుంటే, ఆ కుటుంబం సవ్యంగా సాగుతుందా, చెప్పండి?’ అని ప్రధాని మోదీ, బీజేపీ కార్యకర్తల్ని అడిగిన వార్త, పది రోజులుగా ఒక చర్చనీయాంశం అయింది! అన్ని మతాల వారినీ ఒకే రకపు పౌరులుగా చేయాలనే ప్రయత్నంతో, ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనే విధానం ఎంత అవసరమో చెప్పడానికి మోదీ తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ఉపన్యాసం అది! దేశంలో, ఐదు రాష్ట్రాలలో, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, అన్న బోధనగా ఆ మాటల్ని అర్ధం చేసుకోవచ్చు. ముస్లిం ఓటర్ల ఓట్లు బీజేపీకి ఎలానూ రావని ఆ పార్టీకి తెలుసు. కాబట్టి, హిందూ ఓటర్లలో అత్యధికుల్ని తన వైపు తిప్పుకోవడానికే బీజేపీ చేసే ప్రయత్నం అది. ఆ విధంగా భారత దేశ ప్రజలందర్నీ పౌరులుగా కాక, హిందువులుగా, ముస్లిములుగా, విభజించడానికే మోదీ వేసిన ఎత్తుగడ అది– అని కొన్ని ప్రతిపక్షాలు సరిగానే విమర్శిస్తున్నాయి. ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనే విధానపు మంచి చెడ్డల గురించి చెప్పుకోవాలంటే, ముందు అది ఏమిటో కనీసంగా తెలియాలి. ఒక దేశంలోనే కాదు, ప్రపంచం లోనే వున్న ఆడా, మగా పౌరులందరికీ, మతం, కులం, ప్రాంతం వంటి తేడాలు లేకుండా, పౌరుల వ్యక్తిగత జీవితాల్నీ, కుటుంబ జీవితాల్నీ శాసించే, ఒకే రకమైన చట్టం (‘స్మృతి’) ఉండవలిసిందే! ఎందుకంటే, ఉదాహరణకి, ఒకటి రెండు మతాల్లో, పురుషులకు ఎక్కువ మంది స్త్రీలతో పెళ్ళిళ్ళు! ఇంకో మతంలో, పెళ్ళయిన వాళ్ళు విడిపోవడంలో స్త్రీలకే కాదు, పురుషులకు కూడా అసాధ్యమైనంత కష్టం! మతాల్లో, ఆస్తి హక్కులు ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ వేరు వేరుగా! మొగవాడి దృష్టిలో ఆడది తక్కువ! ఆడదాని దృష్టిలో మొగవాడు ఎక్కువ! ఈ విధంగా, పెళ్ళీ, విడాకులూ, దత్తతా, ఆస్తి హక్కూ, వంటి విషయాల్లో, వేరు వేరు మతస్తుల ఆచారాలూ, నియమాలూ, వేరు వేరే! ఎందుకూ? భారత్లో, మతాల గురించీ, కులాల గురించీ, సమానత్వాల బోధనలతో మాట్లాడే వాళ్ళు, అసలు బ్రతుకు తెరువుకి పునాది కారణం అయిన ఆదాయాల్లో తేడాల గురించి ఎందుకు ఎత్తరు? ‘ఉమ్మడి పౌర స్మృతి’ కోసం ప్రయత్నించాలని, భారత రాజ్యాంగంలో కూడా ఒక చోట చెప్పారని తెలుస్తుంది! కానీ, దాన్ని సాధించడానికి సరైన పునాదిగా ఏ పరిస్థితులు ఏర్పడాలో భారత రాజ్యాంగం చెప్పదు! ఎవరి మతాచారాల్ని వారు ఆచరించే హక్కులు ఉండవచ్చని ఒక వేపు చెపుతూనే, ‘మతాలతో నిమిత్తం లేకుండా’ పౌరులందరికీ, వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు సంబంధించి ఒకే చట్టం ఉండాలని ఇంకో పక్క సూచిస్తుంది. ఎంత గడుసు రాజ్యాంగం! ఒకటి ‘ప్రాధమికమైన హక్కూ’! రెండోది కేవలం ‘సూచన’! సూచన, నిబంధనగా ఎప్పటికీ అవదు. ఉమ్మడి పౌర స్మృతి కూడా నిజానికి సూచన వంటిదే! కానీ, దాన్ని చట్టంగా నిలబెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు. మోదీని, బీజేపీ కార్యకర్తలు ఈ తర్కంతో అడగాలి: అయ్యా! తమరు ఉమ్మడి పౌర స్మృతి పేరుతో పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలంటున్నారు! ఆ స్మృతి, కేవలం వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు మాత్రమే కదా? మరి, పౌరులందరూ ఆర్ధికంగా ఒకే స్తితిలో లేరు! ‘ఆర్ధికంగా’ అంటే, ‘రూపాయి నోట్ల’ పరంగా కాదు, శ్రమలు చేయడాల పరంగా, ఉత్పత్తి కార్యాల పరంగా! దేశ పౌరుల్లో, కొందరికి భారీ భారీ ఆస్తులున్నాయి! కొందరికి రెక్కల కష్టం తప్ప వేరే మార్గం లేదు. దేశంలో భూములు ఎన్ని? అవి ఉమ్మడిగానే వుంటున్నాయా? దేశంలో, ఉత్పత్తి రాసుల్ని కురిపించే పరిశ్రమల్లో పౌరులందరూ సమానులేనా? సమస్త రవాణా సాధనాలనూ నిర్మించడానికీ, నడపడానికీ, కోట్ల కోట్ల డబ్బు రాసుల రాబడులకూ కారకులు ఎవరు? వాటి యాజమాన్యాలు ఎవరివి? ఆస్తి హక్కులకు కారణాలు ఏమిటి? పాకీ దొడ్లు తుడిచే అట్టడుగు కులాల శ్రామికులకు దేనిమీద యాజమాన్యం వుంది? దేశంలో, నిత్యం, 24 గంటలూ, ఉత్పత్తుల కార్యాలలో మునిగి బ్రతికే శ్రామికులకు, సుఖ శాంతుల్లో ఉమ్మడితనం వుందా? ఆడవాళ్ళ గృహ కార్యాలలో, పిల్లల పెంపకాల్లో, వృద్ధుల సంరక్షణల్లో, పురుషుల ఉమ్మడి పాత్ర వుందా? శ్రామిక జనంలో, మేధా శ్రామికులు వేరూ, శారీరక శ్రమల వారు వేరూ! శ్రమలు చేయడాల్లో ఉమ్మడితనం లేకపోతే, పౌరులుగా సమానులా? ఈ రకంగా ఆర్ధిక అసమానతల గురించి స్పష్టంగా గ్రహిస్తూ, మోదీ వంటి నాయకుల్ని అడగవలిసిన ప్రశ్న ఏమిటి? వ్యవసాయంలో, పరిశ్రమల్లో, రవాణాల్లో, సమస్త శ్రమల్లోనూ కాదా; ఏ ఒక్క శ్రమలో అయినా వేలు పెట్టని పౌరులకూ, రాత్రింబవళ్ళూ డ్యూటీలతో సతమతమయ్యే పౌరులకూ మధ్య ఉమ్మడితనం ఉన్నట్టా? ఇది వుందో లేదో ప్రశ్న లేకుండా, పెళ్ళికో, విడాకులకో, దత్తతకో, దీనికో, దానికో ఉమ్మడి చట్టాలా? హక్కులే సమానంగా, ఉమ్మడిగా లేనప్పుడు, ఉమ్మడి పౌర çస్మృతి గురించి ఉపన్యాసం ఇస్తున్నారేమీ మహాశయా?– అని మోదీని ప్రజలందరూ ప్రశ్నించలేరా? ఎన్నికల ముచ్చట్లలోనూ, నాయకుల ఆరాధనల్లోనూ మునిగిపోయిన ఏ పార్టీ ప్రజలకైనా, ఏ ప్రశ్నలూ రావు. ‘ఉమ్మడి పౌర స్మృతి’ అనేది నిజంగా ఎప్పుడు సాధ్యం? ‘ఉమ్మడి ఆర్ధిక స్మృతి’ అనేది ఉన్నప్పుడు! ఉమ్మడి ఆర్ధిక స్మృతి అంటే: మానవుల మనుగడకు ఆధారమైన భూములూ, గనులూ, అడవులూ, పరిశ్రమలూ, రవాణా సాధనాలూ వంటి ఉత్పత్తి సాధనాలు, పౌరులందరి ఉమ్మడి ఆస్తిగా, అంటే, ‘సమాజపు ఆస్తి’ గా ఉన్నప్పుడు! అలా ఉంచే చట్టమే ఉమ్మడి ఆర్ధిక స్మృతి! చిన్న పిల్లలూ, వృద్ధులూ, అనారోగ్యంతో వున్నవారూ తప్ప, ఇతర స్త్రీ–పురుషులందరూ, వేరు వేరు విలువలు కలిగిన, ఉత్పత్తి కార్యాలలో బాధ్యతలు కలిగి వుండే విధానమే ఉమ్మడి ఆర్ధిక స్మృతి! ఆ విధానమే ఉమ్మడి పౌర స్మృతికి దారితీయగలదు! శ్రమ దోపిడీని అనుమతించే వర్గ భేదాల రాజ్యాంగ పాలన వున్న చోట, తర్క రహిత మతాచారాలు జీవితాల్ని శాసిస్తూ వుంటాయి. సమానత్వం లేని శ్రమ విభజన వల్ల తలెత్తిన కుల వ్యవస్త ఉన్నంతవరకూ, కుల కట్టుబాట్లూ, కులాచారాలూ, సమస్త కులాల పౌరుల్నీ ఎంతగానో లొంగదీస్తాయి! ఉమ్మడి ఆర్ధిక వ్యవస్త లేని సమాజంలో, దుర్భరమైన దారిద్య్రం కారణంగా, స్త్రీలని భోగ్య వస్తువులుగా కొనడాలూ, అమ్మడాలూ వంటి ‘వృత్తులు’ పుట్టుకొచ్చి సాగుతున్నాయి. కేవలం ఉమ్మడి పౌర çస్మృతి వల్ల, మతం గానీ, కులం గానీ, వ్యభిచారం వంటి ‘వృత్తులు’ గానీ మాయం అవుతాయా? ఉన్న అసమానతల మీద సంస్కరణలు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. నిజమే! కానీ, మౌలికమైన మార్పులు అత్యవసరమైన సమాజంలో, చిట్టి పొట్టి సంస్కరణలు స్తిరపడతాయా? ‘ఉమ్మడి పౌర స్మృతి’ని వ్యతిరేకించే వారు, ముస్లిం ఆడకూతుర్లకూ (‘ముసల్మాన్ బేటియా’), ముస్లింలలో వెనకబడ్డ ‘పాస్మండా’ కులాలకూ ద్రోహం చేస్తున్నారు– అని వాపోయింది ప్రధాని కరుణా హృదయం! మరి, మొన్న బిల్కిస్ బానోనీ, ఇతర ముస్లిం స్త్రీలనీ అత్యాచారాలకు గురిచేసిన నేరస్తుల్ని, బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడం ‘ముస్లిం బేటీయా’లకు ద్రోహం చేయడం అవలేదా? రంగనాయకమ్మ వ్యాసకర్త సుప్రసిద్ధ రచయిత్రి -
యూసీసీని వ్యతిరేకిస్తాం
లక్నో: ఒకే దేశం ఒకే చట్టం ఆవశ్యకతపై ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోదీ బహిరంగంగానే వ్యాఖ్యానించడంతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మంగళవారం రాత్రికి రాత్రి సమావేశమైంది. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించిన బోర్డు సభ్యులు యూసీసీకి వ్యతిరేకంగా న్యాయపరమైన పోరాటంపై వ్యూహ రచన చేయనున్నట్టు చెప్పారు. ఈ అంశంలో ఏర్పాటు చేసిన 22వ లా కమిషన్కు సమరి్పంచాల్సిన ముసాయిదా పత్రంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా ఏఐఎంపీఎల్బీ సభ్యుడు ఖలీద్ రషీద్ వెల్లడించారు. న్యాయ కమిషన్ ఎదుట అభ్యంతరాలను వెల్లడించడానికి చివరి తేదీ జూలైæ 14 అని, అందుకే దీనిపై విస్తృతంగా చర్చించామన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండే యూసీసీని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. భారత్లో ఎన్నో మతాలు, సంస్కృతులకు ఉన్నాయని ఉమ్మడి పౌరచట్టాన్ని తీసుకువస్తే ముస్లింలతో పాటు హిందువులు, క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, యూదులు ఇలా అందరిపై ప్రభావం చూపిస్తుందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
T20 WC జట్టులో నో ఛాన్స్.. రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్
అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
తప్పక చదవండి
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
Advertisement