-
కొలీజియంలో విభేదాలు!
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త జడ్జీల నియామకప్రక్రియలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య సర్వామోదం సన్నగిల్లింది. నూతన జడ్జీల ఎంపికకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ చేపట్టిన ‘సర్కులేషన్’ పద్ధతిపై కొలీజియంలోని ఇద్దరు జడ్జీలు భిన్న స్వరం వినిపించడం తెలిసిందే. ఆ ఇద్దరి పేర్లను తొలిసారిగా బహిరంగంగా వెల్లడించడం గమనార్హం. 11 మంది నూతన జడ్జీల నియామకం కోసం సెప్టెంబర్ 26న సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కేఎం జోసెఫ్ల కొలీజియం భేటీ జరిగింది. జస్టిస్ చంద్రచూడ్ హాజరుకాలేదు. 10 మంది జడ్జీల నియామక ప్రక్రియ కోసం నలుగురు జడ్జీలకు సీజేఐ లేఖలు రాశారు. తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ జస్టిస్ కిషన్ అక్టోబర్ ఒకటిన, జస్టిస్ జోసెఫ్ అక్టోబర్ ఏడున సీజేఐకు ప్రతిలేఖలు రాశారు. లేఖలు రాసే పద్ధతిపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అభిప్రాయం తెలపాలని అక్టోబర్ రెండున మరోసారి కోరినా స్పందించలేదు. సాధారణంగా కొలీజియంలో వ్యక్తమయ్యే బేధాభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపిన జడ్జీల పేర్లను వెల్లడించరు. కానీ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ పేర్లను బయటపెడుతూ కొలీజియం ప్రకటన విడుదలచేసింది. ఇక నవంబరు 9న కొత్త సీజేఐ వచ్చాకే కొలీజియం సమావేశం కానుంది. జస్టిస్ దీపాంకర్ గుప్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం విదితమే. -
న్యాయవ్యవస్థ ప్రమాణాలు పడిపోతున్నాయి
లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ హైదరాబాద్: అత్యున్నత సుప్రీంకోర్టు నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు న్యాయవ్యవస్థ ప్రమాణాలు పడిపోతున్నాయని లోక్సత్తా, ఫౌండేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థల నిర్వాహకుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కంచే చేను మేసిన విధంగా న్యాయవ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, జవాబుదారీతనం మచ్చుకైనా కానరావడం లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా న్యాయమూర్తులు ఒక గుంపులా తయారై తమను తామే పదవుల్లో నియమిం చుకునే ‘కొలీజియం’ పద్ధతి ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా లేదని తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ఆస్కీలో ‘జ్యుడీషియల్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ’ పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో పేరెన్నికగన్న న్యాయకోవిదుల ఆధ్వర్వంలో రూపొం దించిన జ్యుడీషియల్ అపారుుంట్మెంట్స్ కమిషన్ను పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించినా.. ఆ బిల్లును న్యాయస్థానం కొట్టివేయడం విచారకరమన్నారు. ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య మాట్లాడుతూ ఒకే స్వభావం ఉన్న కేసుల్లో పరస్పర విరుద్ధమైన తీర్పులు ఇస్తూ న్యాయవ్యవస్థ తమ నమ్మకాన్ని పొగొట్టుకుంటోందని, దశాబ్దాల పాటు కేసులు పరిష్కారం కాకపోవడంతో కక్షిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. పారదర్శకత లోపించిన ‘కొలీజియం’ ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ కొలీజియం పద్ధతిలో పారదర్శకత, ప్రమాణా లు, బాధ్యత, జవాబుదారీతనం లోపించాయన్నారు. న్యాయస్థానాల్లో కోట్లాది కేసులు పెం డింగ్లో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రతిపాదించిన జ్యుడీషియల్ అపారుుంట్మెంట్ కమిషన్ మంచి ఆలోచన అని అన్నారు. జస్టిస్ చలమేశ్వర్ లేవనెత్తిన అంశాలకు మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మ ణరావు, రైతు నేత వెంగళరెడ్డి,విశ్రాంత ముఖ్య కార్యదర్శి కాకి మాధవరావు, సోలిపేట రామచంద్రారెడ్డి, ఆవుల మంజులత, విశ్రాంత ఐఏఎస్ కమల్కుమార్, హనుమాన్చౌదరి, తెలకపల్లి రవి తదితరులు మాట్లాడుతూ న్యాయ సంస్కరణలు తక్షణమే చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. న్యాయసంస్కరణలు, కొలీజియం, జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటులపై ప్రజాభిప్రాయం సేకరించాలని నిర్ణయించారు. దేశంలో వివిధ రంగాల్లోని మేధావులు, నిపుణులు అభిప్రాయాలు సేకరించి రాష్ర్టపతి, ప్రధాని, సుప్రీంకోర్టు సీజే తదితరులకు నివేదించాలని తీర్మానించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement