breaking news
Chrysanthemum
-
సెంట్ ఎల్లో మెరుపులు!
వ్యవసాయంలో రైతులు ఆధునిక మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. కొత్త పద్ధతులతో పంటలను సాగు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఆన్ సీజన్లో(ఆఫ్ సీజన్) పంటలు సాగుచేస్తే ధరలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నారు. చలికాలంలో చామంతి పూలను ఎల్ఈడీ లైట్ల ద్వారా సాగుచేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో దీని ద్వారా చామంతి సాగులో అక్కడి రైతులు మంచి ఫలితాలను సాధించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం ప్రాంతాలకు చెందిన పలువురు రైతులు ఈ కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారు. పలమనేరు: సాధారణంగా చిత్తూరు జిల్లాలో పలమనేరు, కుప్పం ప్రాంతాలు శీతల వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ వేసవిలోనూ మంచు కురవడం సర్వసాధారణం. మామూలుగా చామంతి పూల సీజన్ మేలో మొదలై డిసెంబర్ కల్లా ముగుస్తుంది. ఆపై శీతల వాతావరణం కారణంగా ఆఫ్ సీజన్ కావడంతో మొగ్గరాక పంట సాగు కష్టంగా మారుతుంది. అయితే అన్ సీజన్ అయిన వేసవిలో చామంతికి భారీ డిమాండ్ ఉంటుంది. దీన్ని పసిగట్టిన కొందరు కర్ణాటక రైతులు పగటిపూట ఉండే ఉష్ణోగ్రతలే రాత్రుల్లో ఉండేలా తోటల్లో ఎల్ఈడీ బల్బులను అమర్చి మంచి దిగుబడులను సాధించారు. ఆ మేరకు జనవరిలో చామంతిని సాగుచేస్తే మూడు నెలల్లో ఏప్రిల్, మే, జూన్ దాకా దిగుబడి వస్తుంది. చామంతి ధరలు ఆశాజనకంగా ఉంటాయి. అందుకే రైతులు ఈ కొత్త పద్ధతితో సాగుచేస్తున్నారు. తేడా ఏంటంటే? సాధరణ సీజన్లో చామంతిని సాగుచేస్తే ఎకరానికి రూ.2 లక్షల ఖర్చవుతుంది. నాలుగు టన్నుల పూల ఉత్పత్తి ఉంటుంది. కిలో సగటున రూ.100 పలికినా నాలుగు టన్నులకు రూ.4 లక్షలు దాకా వస్తుంది. ఇందులో పెట్టుబడి రూ.2 లక్షలుపోగా రూ.2లక్షల నికర లాభం ఉంటుంది. అదే ఎల్ఈడీ పద్ధతిలో ఎకరానికి పంట పెట్టుబడి రూ.5 లక్షలుగా ఉంటుంది. పంట దిగుబడి 7 టన్నులకు పైగా వస్తుంది. అన్ సీజన్లో ధరలు కిలో రూ.200 నుంచి రూ.250 దాకా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో రూ.14 నుంచి రూ.16 లక్షల దాకా రాగా ఇందులో పంట పెట్టుబడి రూ.5 లక్షలు పోగా రూ.9 లక్షల దాకా నికర లాభాలుంటాయి. అందుకే రైతులు పెట్టుబడి ఎక్కువైనా ఎల్ఈడీ సిస్టమ్ వైపు ఆసక్తిని చూపుతున్నారు. ఎకరాకు రూ.60 వేల ఖర్చు ఎకరా పొలంలో చామంతి పంటకు 250 ఎల్ఈడీ లైట్లు, హోల్డర్లు, 260 మీటర్ల సిల్కువైరు, వెయ్యి మీటర్ల సర్వీసు వైరు, 250 ఉడెన్ఫోల్స్(నిలువు కర్రలు), ప్రత్యేకంగా విద్యుత్ సరీ్వసు, వీటి ఏర్పాటుకు కూలీలతో కలిపి ఖర్చు రూ.60 వేల దాకా అవుతోందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. మంచి మార్కెట్ సదుపాయం ఈ ప్రాంతంలో పండిస్తున్న సెంట్ ఎల్లో చామంతి క్వాలిటీ బాగుంటుంది. బెంగళూరు మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఉంటుంది. దీంతోపాటు ఇక్కడికి బెంగళూరు వంద కిలోమీటర్లు దూరంలో ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణాకు సౌకర్యంగా ఉంది. అన్సీజన్ అయిన వేసవిలో చామంతి పూలు రావడంతో వీటికి డిమాండ్ ఎక్కువ. మంచి ధరలు పలికేందుకు అస్కారముంటుంది. ముఖ్యంగా వేసవిలో శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాల డెకరేషన్లకు ఇవే ట్రెండ్గా మారాయి. ఔత్సాహిక రైతులు ఎల్ఈడీ సేద్యంపై మక్కువ చూపుతున్నారు.ఎక్కువగా సెంట్ ఎల్లో సాగు!ఈ ప్రాంతంలో ఎక్కువగా రైతులు కలకత్తా నుంచి అందిన సెంట్ ఎల్లో సీడ్ను నాటారు. ఇది మూడు నెలల్లో పూల దిగుబడి మొదలై నాలుగు నెలల పాటు కోతలుంటాయి. నాటాక మొక్కలు పెద్దవయ్యే దాకా దాదాపు 40 రోజులపాటు ఎల్ఈడీ బల్బులను తోటలో ఏర్పాటు చేయాలి. లేదంటే ఇవి మొక్క దశలోనే చనిపోతాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 20 ఎకరాల్లో ఐదుగురు రైతులు ఎల్ఈడీ ద్వారా చామంతి పూలను సాగుచేస్తున్నారు. బైరెడ్డిపల్లి సమీపంలోని జాలారిపల్లి రోడ్డు వద్ద కర్ణాటకకు చెందిన రైతులు ద్వారా శంకరప్ప అనే రైతు ఎల్ఈడీ విధానం ద్వారా ఇటీవలే చామంతిని సాగుచేశారు.ఆఫ్ సీజన్లో పంటను తెప్పించే పద్ధతిది సాధారణంగా మామిడి కాయలు ఆ సీజన్లో వస్తాయి. కానీ వీటిని ఆఫ్ సీజన్లో పండిస్తే ఎంతటి గిరాకీ ఉంటుందో అదే విధంగా వేసవిలోనూ చామంతి పూలు రావాలంటే శీతల కాలంలో రాత్రుల్లో పగటి ఉష్ణోగ్రతలను ఎల్ఈడీ బల్బుల ద్వారా కల్పించే కృత్రిమ పద్ధతిది. దీంతో నాణ్యమైన పూలు, ఆశించిన దిగుబడి, ధరలుంటాయి. ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఎల్ఈడీ సాగు మొదలవుతోంది. రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా పంట సాగుపై మక్కువ చూపడం మంచి పరిణామం. – డా.కోటేశ్వరావు, సైంటిస్ట్, సెంటర్ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్, కుప్పం -
బంతీ.. చామంతీ.. ముద్దాడుకున్నాయిలే..!
పూలంటే ఇష్టం లేని వారు ఉండరు. అలాంటిది బంతి, చామంతి (chamanthi) పూలంటే మరీ ఇష్టం. అవే పూలు వివిధ రంగుల్లో ఉండి కనువిందు చేస్తే ఇక వారి ఆనందానికి హద్దే ఉండదు.ఇలాంటి ఫొటోలను చూసే కాబోలో ఓ సినీ రచయిత బంతీ.. చామంతీ ముద్దాడుకున్నాయిలే అంటూ చరణం కట్టినట్లున్నారు.బేతంచెర్ల (betamcherla) నుంచి కర్నూలుకు (Kurnool) వెళ్లే ప్రధాన రహదారిలో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పూల తోటలు ప్రయాణికులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.సీతారామాపురం, శంకలాపురం, బైనపల్లె, యంబాయి, మండ్ల వానిపల్లె, రుద్రవరం, ముద్దవరం, వీరాయపల్లె గ్రామాల రైతులు బోరుబావుల కింద బంతి, చేమంతి పూలు (chrysanthemum) సాగు చేశారు.సుమారు 300 ఎకరాల్లో సాగు చేసిన చేమంతి, బంతి పూల తోటలు కోత దశకు వచ్చాయి. కర్నూలు ప్రధాన రహదారి వెంట రాకపోకలు సాగించే ప్రయాణికులకు కొత్త ప్రాంతానికి వచ్చామా అనే అనుభూతిని కలిగిస్తున్నాయి.– బేతంచెర్ల -
Chrysanthemum: ఎల్ఇడీ బల్బుల వెలుగులో చామంతి పూల సాగు!
మార్కెట్లో ఎప్పుడు ఏ పంట దిగుబడులకు గిరాకీ ఉంటుందో అప్పుడు ఆ పంట దిగుబడి వచ్చేలా ప్రణాళిక రూపొందించుకొని పంటలు పండిస్తే రైతులకు ఆదాయం పెరుగుతుంది అనటానికి విద్యాధిక యువ రైతు మంచిరెడ్డి శశికళాధరప్ప చామంతి సాగు అనుభవమే నిదర్శనం. అన్సీజన్లో చామంతి సాగుకు శ్రీకారం చుట్టి తక్కువ పెట్టుబడితో మంచి నికదాయాన్ని పొందుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల తోడ్పాటుతో అన్సీజన్లో కృత్రిమ కాంతితో చామంతి పూల సాగు విధానాన్ని అమలుచేస్తూ శశికళాధరప్ప సత్ఫలితాలు సాధిస్తుండటం విశేషం. సాధారణంగా జూన్–జూలై నుంచి చామతి పూల సాగు చేపడుతారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో శాఖీయోత్పత్తి జరుగుతుంది. నవంబరు నెల నుంచి పూలు కోతకు వస్తాయి. అయితే, రైతులందరూ ఈ సీజన్లో ఒకేసారి సాగు చేయడం, దిగుబడులు ఒకేసారి మార్కెట్లోకి వస్తుండటం వల్ల ఒక్కోసారి గిట్టుబాటు ధర లభించదు. ఈ సమస్యను అధిగమించి వేసవిలో పూల దిగుబడి వచ్చేలా శాస్త్రవేత్తల తోడ్పాటుతో శవికళాధరప్ప కృత్రిమ కాంతిని ఉపయోగించి దిగుబడులు తీస్తున్నారు. ఎల్ఈడీ బల్బుల వెలుగు.. శశికళాధరప్ప(31) ఎంసీఏ పూర్తి చేసి 2020–21లోనే కాడిపట్టి సేద్యానికి శ్రీకారం చుట్టారు. మిరప, ఉల్లి, సీజన్లో చామంతి సాగు చేపట్టి విశేషంగా రాణిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ఎకరా విస్తీర్ణంలో పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్ రకాల చామంతి పూల సాగు చేపట్టారు. చామంతిలో శాఖీయోత్పత్తిలో కొమ్మలు బాగా రావడానికి పగటి సమయం ఎక్కువగా ఉండాలి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పగటి సమయం తక్కువగా ఉంటుంది. శాఖీయోత్పత్తిని పెంచుకోవడానికి పగటి సమయం సరిపోకపోతుండటంతో కృత్రిమంగా పగటి సమయాన్ని పెంచుకున్నారు. రూ.20 వేలు ఖర్చు చేసి చామంతి పొలం చుట్టూ మూడు మీటర్లకు ఒకటి చొప్పున 84 ఎల్ఇడీ బల్బులు అమర్చారు. దీంతో చామంతి పూల తోటలో రాత్రి సమయంలో కూడా పగటి పూట మాదిరిగా వెలుతురు పరుచుకుంది. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 10 వరకు కృత్రిమంగా పగటి సమయాన్ని పెంచుకోవడంతో అన్ సీజన్లో కూడా చామంతిలో కొత్తగా ఇగుర్లు వచ్చాయి. 30 రోజులకు తలలు తుంచడంతో విశేషంగా కొమ్మలు వచ్చాయి. ఇప్పటికి ఒక సారి పూలు కోశారు. ప్లాస్టిక్ షీట్లతో కృత్రిమ చీకట్లు.. శశికళాధరప్ప ఈ నెలలో కృత్రిమంగా రాత్రి సమయాన్ని పెంచుకోనున్నారు. శాఖీయోత్పత్తి జరిగిన తర్వాత పూ మొగ్గలు ఏర్పడి పువ్వులు వచ్చేందుకు రాత్రి సమయం కనీసం 14 గంటలు అవసరం. 14 గంటలు రాత్రి/ చీకటి వాతావరణం ఉండాలి. ఇందుకోసం ఎకరాలోని చామంతి పూల తోటలో కర్రలు పాతి నల్లటి ప్లాస్టిక్ షీట్లు కప్పి కృత్రిమ చీకటిని సృష్టించుకోవడానికి రంగం సిద్ధం చేసుకోనున్నారు. వేసవిలో చామంతి పూల సాగు చేపట్టడం వల్ల చీడపీడల బెడద లేకుండా పోయింది. డ్రిప్ సదుపాయం కల్పించుకొని ఎరువులు వినియోగించారు. సూక్ష్మ పోషకాల నివారణకు పార్ములా–1, పార్ములా–2 మందులు పిచికారీ చేశారు. ఇప్పటికే ఒక్కకోత పూలు వచ్చాయి. ఇంకా దాదాపు 50 రోజుల వరకు పూల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అన్సీజన్లో చామంతి పూలు లభిస్తుండటం వల్ల నికరాదాయం కనీసం రూ.2 లక్షల వరకు ఉండవచ్చని శశికళాధరప్ప అంచనా వేస్తున్నారు. – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) రూ. 2 లక్షల నికరాదాయం ఆశిస్తున్నా! మాకు గ్రామం ప్రక్కనే 8.50 ఎకరాల సారవంతమైన భూమితోపాటు బోరు ఉంది. ఎంసీఏ పూర్తి చేసిన తర్వాత గత ఏడాది వైఎస్ఆర్ కడప జిల్లా ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తల సూచనలతో అన్సీజన్లో చామంతి పూల సాగు చేపట్టాను. అనువుకాని కాలంలో పూల సాగు చేపట్టి కృత్రిమ కాంతి, కృత్రిమ చీకటి కల్పించడం వల్ల పూల సాగు ఆశాజనకంగా ఉంది. పెట్టుబడి రూ.90 వేలు అవుతోంది. రూ.2 లక్షల వరకు నికరాదాయం వస్తుందనుకుంటున్నా. – మంచిరెడ్డి శశికళాధరప్ప, రామళ్లకోట, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా (99669 98816, 91823 27249) ఇక్కడ చదవండి: కొత్త బంగారు లోకం.. సతత హరిత పంటలు -
చైనా చేమంతికి గిన్నిస్ రికార్డ్!
ఆకట్టుకునే రేకుల దొంతరలు.. ఆమడ దూరానికి వెదజల్లే పరిమళాలు... కనువిందైన రంగు రంగుల చేమంతి పూల అందాలకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. చైనా హెనాన్ ప్రావిన్స్ లో అంటుకట్టిన మొక్కకు విరిసిన పూలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఒకే మొక్కకు అనేక రకాల్లో పూచిన పుష్పాలు గిన్నిస్ పుటలకెక్కాయి. చేమంతిలో ఎన్నో రకాలు, రంగులు చూసి ఉంటారు. కానీ అనేక రకాల పుష్పాలు ఒకే మొక్కకు పూయడం చూశారా? చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో అదే జరిగింది. 3.8 మీటర్ల వ్యాసంలో ఉన్న మొక్క 641 రకాల పూలు పూసి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మొక్క వేసిన తర్వాత పెరిగి పూతకు వచ్చేందుకు నాలుగేళ్ళ సమయం పట్టింది. ఇప్పుడు ఈ మొక్కకు ఒకేసారి సుమారు 15 వందల పుష్పాలు ఒకేసారి పూయడమే కాక, వాటిలో 641 రకాలు కూడా ఉండటం రికార్డు నెలకొల్పింది.


