breaking news
chinab river
-
భారత్తో యుద్ధానికైనా రెడీ.. పాక్ మంత్రి సంచలన ప్రకటన
భారత్–పాకిస్తాన్ మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య కొత్త రాజకీయ, దౌత్య ఉద్రిక్తతలకు దారితీశాయి. సింధూ జలాల విషయంలో పాకిస్తాన్ హక్కులను దెబ్బతీసే ఏ చర్యనైనా తమ దేశం సహించదని, అవసరమైతే భారత్తో యుద్ధానికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.ఇటీవల భారత్ చేపడుతున్న జలవిద్యుత్ ప్రాజెక్టులు, నదీ జలాల నిర్వహణ చర్యలపై స్పందించిన ఖవాజా ఆసిఫ్.. పాకిస్తాన్కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించే లేదా అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే అది కేవలం జలాల సమస్య కాకుండా జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. పాకిస్తాన్ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, కోట్లాది ప్రజల జీవనాధారం సింధూ నదీ వ్యవస్థపై ఆధారపడి ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో నీటి హక్కులను కాపాడుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగిస్తామని చెప్పారు. అవసరమైతే యుద్ధం వరకు వెళ్లడానికి కూడా తమ దేశం వెనుకాడదని ఆయన వ్యాఖ్యానించినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.ఇండస్ ఒప్పందం ఏమిటి?1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఇండస్ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధూ నదీ వ్యవస్థలోని ఆరు ప్రధాన నదులను రెండు దేశాల మధ్య విభజించారు. రవి, బియాస్, సట్లెజ్ నదుల జలాలపై భారత్కు పూర్తి హక్కులు ఉండగా, ఇండస్, జీలం, చీనాబ్ నదుల జలాలను ప్రధానంగా పాకిస్తాన్ వినియోగించుకునేలా ఒప్పందం రూపొందించబడింది. అయితే పశ్చిమ నదులపై కూడా విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం కొన్ని పరిమిత హక్కులు భారత్కు కల్పించబడ్డాయి. గత ఆరు దశాబ్దాలుగా అనేక యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు ఎదురైనా ఈ ఒప్పందం కొనసాగుతుండటం విశేషం.ఎందుకు మళ్లీ వివాదం?గత కొంతకాలంగా జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలో పలు జలవిద్యుత్ ప్రాజెక్టులను భారత్ వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా చీనాబ్, జీలం నదులపై నిర్మిస్తున్న కొన్ని ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇవి ఇండస్ ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తోంది. భారత్ మాత్రం ఈ ప్రాజెక్టులన్నీ ఒప్పంద పరిధిలోనే ఉన్నాయని, నీటి ప్రవాహాన్ని మళ్లించడం లేదా అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా, దేశానికి లభించిన హక్కులను పూర్తిగా వినియోగించుకోవడం తమ బాధ్యత అని చెబుతోంది.మారిన పరిస్థితులు..ఇటీవలి కాలంలో భారత్లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఇండస్ ఒప్పందంపై భారత్లో కూడా చర్చలు పెరిగాయి. "రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవు" అంటూ గతంలో భారత నాయకత్వం చేసిన వ్యాఖ్యలు మళ్లీ ప్రస్తావనకు వచ్చాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదం కొనసాగితే ఇండస్ జలాల ఒప్పందంపై పునఃసమీక్ష అవసరమని భారత రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమైంది. -
పాకిస్తాన్పై నీటి యుద్ధం.. భారత్ సంచలన నిర్ణయం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్కు భారత్ చుక్కలు చూపిస్తోంది. పాక్ను అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తోంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా.. తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను నిలిపివేసింది. పాక్ను ఎండగట్టే చర్యల్లో భాగంగా ఇది రెండో ప్రతీకార చర్యగా చెప్పుకోవచ్చు.వివరాల ప్రకారం.. పాకిస్తాన్కు భారత్ వరుస షాక్లిస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను నిలిపివేసింది. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యామ్ స్లూయిస్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు. దీంతో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్కు ఇక్కడ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. ఇది స్వల్పకాల చర్యగా అక్కడి అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాక్కు తెలియజేసినట్లైందన్నారు. దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోదిగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కాగా, సింధు జలాల ఒప్పందం కింద పాక్కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చీనాబ్ కూడా ఒకటి. పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువగా పంటపొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఈ డ్యామ్ను చీనాబ్ నదిపై 2008లో నిర్మించారు.ఇక, పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ 26న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. ఆ తర్వాత 29 నాటికే ఈ డ్యామ్ నుంచి పాకిస్తాన్కు వెళుతున్న జలాలు నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పాక్లోని సియాల్ కోట్ వద్దకు వచ్చేసరికి చినాబ్ పూర్తిగా ఎండిపోయింది. పాక్లోని పంజాబ్లో పత్తి, వరి సాగుకు ఈ నీరు చాలా ముఖ్యం. ఇక గత వారం జీలం నది వరద ప్రవాహం పాక్ ఆక్రమిత కశ్మీర్ను భయపెట్టింది. అక్కడి ముజఫరాబాద్ సమీపంలో గత వారం జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో స్థానిక అధికారులు హట్టియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఇలా తరచూ నిర్ణయాలు తీసుకుంటూ పాక్కు భారత్కు చుక్కలు చూపిస్తోంది. -
సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తివేత.. వరద భయంతో పాక్ గగ్గోలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ చినాబ్ నదిలో వరద ప్రవాహాం పెరుగుతుండడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేశారు.చినాబ్లో నీటి ప్రవాహం డేంజర్ మార్క్కు చేరుకోవడంతో సలాల్ డ్యామ్ గేట్లు తెరిచారు జమ్మూకశ్మీర్ అధికారులు. దీంతో పాకిస్తాన్లో వరద భయాలు మరింత పెరిగిపోయాయి. భారత్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎత్తివేసిందంటూ పాక్ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఇది వాటర్ సర్జికల్ స్ట్రైక్స్ అంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. అయితే, గత రెండు రోజులుగా జమ్మూకశ్మీర్లో క్లౌడ్ బస్టర్ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. వెరసీ సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తకపోతే వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తారు. -
అద్భుతం సృష్టించిన భారతీయ రైల్వే
కౌరి: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్కి సంబంధించిన ఆర్చ్ నిర్మాణం సోమవారం పూర్తయిందని భారతీయ రైల్వేస్ ప్రకటించింది. దీంతో వంతెన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందని, ఒక్క ఏడాదిలో వంతెన నిర్మాణం సంపూర్ణమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయను ఇతర ప్రాంతాలతో కలిపేందుకు ఉద్దేశించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి దాదాపు రూ. 1486 కోట్లు ఖర్చయ్యాయి. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులో భాగంగా 1.315 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను నిర్మించారు. మొత్తం ప్రాజెక్టు మరో రెండున్నరేళ్లలో పూర్తికానుందని ఉత్తర రైల్వే జీఎం అశుతోష్ గంగల్ చెప్పారు. తాజాగా పూర్తి చేసిన ఆర్చ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతమన్నారు. ప్రధాని మోదీ విజన్తో స్ఫూర్తి పొందిన రైల్వేస్ తాజా నిర్మాణంతో భారత్ను అత్యున్నతంగా నిలిపిందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇది ఒక అద్భుతమన్నారు. A moment of pride for 🇮🇳! The arch of Chenab bridge, connecting Kashmir to Kanyakumari has been completed. With an arch span of 467m, it is the world’s highest railway bridge. PM @NarendraModi ji’s vision to connect India has inspired the Railway family to scale new heights pic.twitter.com/GEDEBIb9nE — Piyush Goyal (@PiyushGoyal) April 5, 2021 వంతెన ప్రత్యేకతలు ►పారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జ్ 35 మీటర్ల ఎత్తులో ఉంది. చీనాబ్ నదీ ఉపరితలం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ►2004లోనే దీని నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మధ్యలో 2009లో నిలిచిపోయాయి. ►2017 నుంచి వంతెనపై ఆర్చ్ను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ ఆర్చ్ పొడవు 467 మీటర్లు, బరువు 10619 మెట్రిక్ టన్నులు. ►28660 మెట్రిక్ టన్నుల ఇనుము, 66వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను వాడారు. ►266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. ►నిర్మాణంలో ‘టెక్లా’ సాఫ్ట్వేర్ను ఉపయోగించి డిటైలింగ్ చేశారు. నిర్మాణంలో వినియోగించిన స్టీల్ –10 నుంచి + 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు తట్టుకోగలదు. -
విశేషాలు: ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన రైల్వే బ్రిడ్జ్
భారత రైల్వేలో మరో అద్భుత నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. చీనాబ్ నదిపై ఈఫిల్ టవర్ కన్నా ఎత్తయిన బ్రిడ్జ్ నిర్మితమవుతోంది. భారత ఇంజనీరింగ్ గొప్పదనాన్ని ఈ రైల్వే బ్రిడ్జ్ మకుటంగా నిలవనుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిందని మార్చ్లో ప్రారంభానికి సిద్ధమైందని కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ ట్విటర్ వేదికగా చెప్పారు. కశ్మీర్ ప్రాంతానికి రైల్వే లైన్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రైల్వే మార్గం వేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని కౌరీ ప్రాంతంలో ఉన్న చీనాబ్ నదిపై ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కత్రా, బనిహాల్ ప్రాంతాలను ఈ బ్రిడ్జ్ కలపనుంది. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 1,178 అడుగుల ఎత్తులో బాంబు పేలుళ్లు, భూకంపాలకు తట్టుకునేలా ఈ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ 63 ఎంఎం పరిమాణంలో ఉన్న స్టీల్ను వినియోగిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ పారిస్లోని ఈఫిల్ టవర్ కన్నా మీటర్లు ఎక్కువ. ‘మౌలిక సదుపాయాల కల్పనలో అద్భుతం. చీనాబ్ నదిపై స్టీల్ బ్రిడ్జ్ భారత రైల్వే నిర్మాణంలో మరో మైలు రాయి కాబోతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది’ అని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ ట్వీట్ చేశారు. ఉద్దంపూర్-శ్రీనగర్- బరాముల్లా రైల్వే మార్గం (111 కిలోమీటర్లు)లో ఈ బ్రిడ్జ్ నిర్మితమవుతోంది. కశ్మీర్ లోయ ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా ఈ బ్రిడ్జ్ ఉపయోగపడనుంది. ఇది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మాణం చేపడుతున్నారు. 2004లో 1.315 కిలోమీటర్ల ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. చీనాబ్ నది ప్రవాహానికి 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నారు. గంటకు 90 కిలోల వేగంతో వీచే గాలులను కూడా ఈ బ్రిడ్జ్ తట్టుకుని నిలబడుతుంది. నిర్వహణకు సెన్సార్ ఏర్పాటుచేశారు. 120 ఏళ్ల వరకు ఈ బ్రిడ్జ్ చెక్కు చెదరకుండా ఉంటుందని తెలిపారు. దీని నిర్మాణ వ్యయం మొత్తం రూ.12,000 కోట్లు అని తెలుస్తోంది. Infrastructural Marvel in Making: Indian Railways is well on track to achieve another engineering milestone with the steel arch of Chenab bridge reaching at closure position. It is all set to be the world's highest Railway bridge 🌉 pic.twitter.com/yWS2v6exiP — Piyush Goyal (@PiyushGoyal) February 25, 2021 -
ఈ వంతెన భూకంపాలనూ తట్టుకుంటుంది!
కౌరి(జమ్మూకశ్మీర్): అత్యంత వినాశకర భూకంపాలు, పేలుళ్లను తట్టుకునేలా కశ్మీర్లోని చినాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రత గత భూకంపాలను, 30 కేజీల పేలుడు పదార్థం సృష్టించే విస్ఫోటనాన్ని సైతం ఈ వంతెన తట్టుకోగలదని చెప్పారు. ఇందుకోసం ఐఐటీ రూర్కీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)లకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో వారు అందించిన డిజైన్తో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.1250కోట్లు. పారిస్లోని ప్రఖ్యాతిగాంచిన ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన 30 మీటర్లు ఎత్తులో ఉంటుంది. 2019 మే నెలకల్లా ప్రాజెక్టు పూర్తిచేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. భారత భూభాగాన్ని కశ్మీర్ లోయను కలుపుతూ చేపట్టిన ఉధంపూర్–రేసి–అనంత్నాగ్–శ్రీనగర్–బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు. వంతెన మొత్తం పొడవు 1,315 మీటర్లుకాగా అందులో నదిపై పూర్తిగా ఉక్కుతో నిర్మిస్తున్న భాగం పొడవు 476 మీటర్లు. -
నదిలో కొట్టుకుపోయి.. పాక్లో తేలిన సైనికుడు!
మన దేశంలో బీఎస్ఎఫ్లో పనిచేస్తున్న సైనికుడు ఒకరు జమ్ము జిల్లాలోని చీనాబ్ నదిలో కొట్టుకుపోయి.. ఏకంగా పాకిస్థాన్లో తేలాడు. ఆయనను వెనక్కి రప్పించేందుకు భద్రతాదళాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. సరిహద్దు భద్రతాదళానికి చెందిన సత్యశీల్ యాదవ్ జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో అంతర్జాతీయ సరిహద్దులలో అఖ్నూర్ ప్రాంతంలో వాటర్ పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు ప్రయాణిస్తున్న మోటారుబోటులో సమస్య తలెత్తడం, బలమైన కెరటాలు వచ్చి బోటును ఢీకొట్టడంతో యాదవ్ నదిలో కొట్టుకుపోయాడు. అదే పడవలో ఉన్న మరో ముగ్గురు మాత్రం సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసినా, యాదవ్ ఉన్న ప్రాంతంలో మాత్రం కెరటాలు బాగా బలంగా, వేగంగా రావడంతో అతడు కొట్టుకపోయాడు. చివరకు పాకిస్థాన్వైపు వెళ్లిపోయాడు. సత్యశీల్ యాదవ్ తమ వద్దే ఉన్నట్లు పాకిస్థానీ రేంజర్లు నిర్ధారించారని, అతడిని వెనక్కి రప్పించేందుకు ఫ్లాగ్ మీటింగ్ పెట్టాల్సిందిగా కోరామని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్లోని సియాల్కోట్ ప్రాంతంలో బాజ్వాత్ గ్రామానికి సత్యశీల్ యాదవ్ కొట్టుకుపోయాడు. అతడు ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ వాసి.


