breaking news
Chief Minister Mehbooba Mufti
-
'వంచనకే చర్చలు.. పనికిమాలిన ఆలోచన'
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పాలన్న ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు వేర్పాటువాదుల రూపంలో భంగం కలుగుతోంది. అక్కడికి ఇప్పటికే వెళ్లిన అఖిలపక్ష బృందాన్ని కలిసి మాట్లాడి తమ సమస్యలు చెప్పేందుకు వేర్పాటువాదులు అంగీకరించడం లేదు. అసలు చర్చలకు ఒప్పుకోం అని చెబుతున్నారు. రాష్ట్రంలో సుస్థిర శాంతిపరిస్థితులు నెలకొల్పేందుకు చర్చకు రావాల్సిందిగా అఖిలపక్ష భేటీ సందర్భంగా వేర్పాటువాద నాయకులకు, ఇతర పక్షాలకు ఆహ్వానం పంపగా వేర్పాటువాదులు అందుకు ససేమిరా అంటున్నారు. వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్ లు ఉమ్మడిగా ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి ముఫ్తీది మోసపూరిత పనికిమాలిన ఆలోచన అని, ఇంతపెద్ద విషయాన్ని కేవలం చర్చల పేరిట ముందుకు తీసుకెళ్లాలనుకోవడం మూర్ఖపు ఆలోచన అని వారు తీవ్రంగా నిందించారు. అసలు ఏ ఎజెండాతో చర్చలకు వస్తున్నారో కూడా ఇప్పట వరకు తమకు అర్ధం కావడం లేదని ఆరోపించారు. ఈ చర్చలకు తాము ఏమాత్రం ఆసక్తితో లేమని మరొక వేర్పాటువాద నాయకుడు చెప్పాడు. -
జమ్ము కాశ్మీర్ చేరుకున్న ప్రధాని మోదీ
జమ్ము: జమ్ము కాశ్మీర్లో ఒక్క రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం జమ్ము ఎయిర్ పోర్టు చేరుకున్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ చేరుకున్న మోదీకి రాష్ట్ర గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా, ముఖ్యమంత్రి మహాబూబా ముఫ్తీ, డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు స్వాగతం తెలిపారు. అనంతరం ఎమ్ఐ 17 హెలికాప్టర్లో ఆయన కాట్రా పట్టణానికి బయలుదేరారు. ఆయన వెంటన గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ఉన్నారు. ఈ రోజు జరగనున్న శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్లొనున్నారు. అలాగే 250 పడకల సూపర్ స్పెషాలటీ ఆసుపత్రిన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.