CENTRAL ITI
-
భారత్లో ఓపెన్ఏఐ అకాడమీ
న్యూఢిల్లీ: చాట్జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ, కేంద్ర ఐటీ శాఖలో భాగమైన ఇండియాఏఐ మిషన్ కలిసి భారత్లో ఓపెన్ఏఐ అకాడమీని ప్రారంభించాయి. ఇందుకు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దేశీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న డెవలపర్ల కమ్యూనిటీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్టార్టప్లు.. ఆవిష్కర్తల నెట్వర్క్కు ఏఐపరంగా కావాల్సిన విద్యావనరులు, సాధనాలు దీనితో అందుబాటులోకి వస్తాయని ఓపెన్ఏఐ తెలిపింది. విద్య, టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉమ్మడి లక్ష్య సాధన దిశగా ఇది కీలక ముందడుగని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ అకాడమీ లో డిజిటల్, ఇన్–పర్సన్ లెరి్నంగ్ విధానంలో ఇంగ్లీష్, హిందీలో కంటెంట్ అందుబాటులో ఉంటుంది. త్వరలో మరిన్ని ప్రాంతీయ భాషలను కూడా జోడించనున్నారు. విద్యార్థులు, డెవలపర్లు, విద్యావేత్తలు, సివిల్ సర్వెంట్లు, చిన్న స్థాయి వ్యాపారవర్గాలు మొదలైన వారందరికీ ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇండియాఏఐ మిషన్ ఆమోదించిన 50 ఫెలోస్/స్టార్టప్లకు 1,00,000 డాలర్ల వరకు విలువ చేసే ఏపీఐ క్రెడిట్స్ లభిస్తాయి. -
గూడెంకు సెంట్రల్ ఐటీఐ
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం సిగలో మరో ప్రతిష్టాత్మక కేంద్ర విద్యాసంస్థ చేరుతోంది. మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సెంట్రల్ ఐటీఐ స్కూల్ ఇక్కడ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి తొలిదశ పనులకు రూ.12 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల నిర్వహణకు సన్నాహాలు సాగుతున్నాయి. తాత్కాలిక వసతిలో సెంట్రల్ ఐటీఐ తరగతులు నిర్వహించేందుకు అధికారులు భవనాల వేటలో పడ్డారు. శాశ్వత భవన నిర్మాణానికి ఐదెకరాల భూమిని కేటాయిస్తున్నారు. కేటాయించే భూమి, దానిలో భవన నిర్మాణాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు బుధవారం సేకరించారు. నాలుగు కోర్సులు ఈ ఐటీఐలో కేంద్ర ప్రభుత్వ కోర్సులు మాత్రమే ఉంటాయి. ఎలక్ట్రికల్, ఫిట్టర్, సివిల్, డీజిల్ మెకానికల్ వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. 400 మంది విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పిస్తారు. ఈ స్కూల్కు 47 మంది సిబ్బందిని నియమిస్తారు. మొత్తం సెంట్రల్ సిలబస్ ఉంటుంది. ఐటీఐ నిర్వహణ బాధ్యతల్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఇప్పటికే ఈ ఐటీఐ కోసం ఐదెకరాల స్థలం కేటాయించారు. రెండు రోజుల్లో తాత్కాలిక వసతి సెంట్రల్ ఐటీఐలో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వహించడానికి అనుమతి వచ్చింది. ఇందుకోసం రెండు రోజుల్లో వసతి సౌకర్యాలను సిద్ధం చేస్తాం. తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. – పైడికొండల మాణిక్యాలరావు, దేవాదాయ శాఖ మంత్రి