-
ఆన్లైన్ సమస్యలు
రోజూ బడి బాదరబందీ ఏమిటన్న బెంగ లేదు... చండామార్కుల వంటి గురువుల ఆగ్రహ నయనాలు తమవైపే తీక్షణంగా చూస్తాయన్న భయం లేదు. అడిగిన ప్రశ్నకు బదులీయకపోతే వీపు పగలవచ్చునన్న బెరుకు లేదు. సెలవులు ఎప్పుడెప్పుడా అన్న చింత లేదు. కరోనా వైరస్ మహ మ్మారి పుణ్యమా అని కనీవినీ ఎరుగని రీతిలో నాలుగు నెలలుగా బడులన్నీ తలుపులు మూసుకున్నాయి. పిల్లలంతా వేసవికాలం, వర్షాకాలం తేడా లేకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే వారిలో చాలామందికి బడికెళ్తేనే బాగుండునన్న అభిప్రాయం కలిగివుండొచ్చు. కానీ ఈ మహమ్మారి పీడ పోయేదాకా అది సాధ్యమయ్యేలా లేదు. అందుకే ఒకటి రెండు నెలలుగా ఆన్లైన్ బోధన అనే మాట వినబడుతోంది. లేడికి లేచిందే పరుగన్నట్టు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఇదే అదునుగా సొమ్ములు పోగేసుకోవచ్చునన్న దురాశతో ఆన్లైన్ బోధన మొదలుపెట్టేశాయి. కనుకనే తల్లిదండ్రుల నుంచి, విద్యారంగ నిపుణుల నుంచి ఆన్లైన్ బోధనపై మార్గదర్శకాలను విడుదల చేయాలన్న డిమాండు మొదలైంది. ఆలస్యంగానే అయినా మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వీటిని విడుదల చేసింది. ఆన్లైన్ బోధనంటూ మొదలుపెట్టిన పాఠశాలలు, కళాశాలలు మౌలికమైన అంశాలను విస్మ రించాయి. తరగతి గదిలో జరిగే బోధన మాదిరే ఆన్లైన్లోనూ బోధిస్తే సరిపోతుందని అవి భావిం చాయి. ఎదురుగా ఒక కెమెరా పెట్టుకుని బ్లాక్ బోర్డు ముందు టీచర్ నించుని చెప్తే ఎప్పటిలానే విద్యార్థికి అవగాహన కలుగుతుందని యాజమాన్యాలు అనుకున్నాయి. కానీ తరగతిలో పిల్లలనుద్దేశించి బోధించడం వేరు. ఆ పిల్లలకే ఆన్లైన్లో పాఠం చెప్పడం వేరు. పిల్లలు బడికొచ్చి టీచర్ చెప్పే పాఠాలు వినడం, నోట్సు రాసుకోవడం మాత్రమే చేయరు. తమ తోటివారితో సంభాషణల్లో నిమగ్నమవుతారు. అవి బోధనకు సంబంధించి కావొచ్చు... ఊళ్లో జరిగిన ఘటన గురించి కావొచ్చు... ఇంట్లో వచ్చిన కష్టసుఖాల గురించి కావొచ్చు... తమకు ఎదురైన అనుభవం గురించి కావొచ్చు. ఈ క్రమంలో వారికి తమ చుట్టూ వున్న సమాజం గురించి అర్థమవుతుంది. బుద్ధి విక సిస్తుంది. దేన్నయినా నేర్పుగా ఎలా ఎదుర్కొనాలో తెలుస్తుంది. తోటి పిల్లలను వారు అనునిత్యం గమనిస్తారు. ఒక అంశాన్ని వారు అవగాహన చేసుకుంటున్న తీరుకూ, తమ తీరుకూ పోల్చు కుంటారు. మరింత సులభంగా, ప్రభావవంతంగా చదవడం ఎలాగో తెలుసుకుంటారు. వివేచ నాత్మక అధ్యయన నైపుణ్యం అలవడుతుంది. తరగతి గది చర్చల్ని ప్రోత్సహిస్తుంది. ఏకకాలంలో ఉపాధ్యాయులనూ, విద్యార్థులనూ సానబడుతుంది. టీచర్లు చదువు చెప్పి ఊరుకోరు. తమ ముందున్నవారి ముఖకవళికలు గమనిస్తూ ఎవరికి అవగాహన కలుగుతున్నదో, ఎవరిలో ఇంకా సందేహాలున్నాయో పోల్చుకోగలుగుతారు. వాటిని అడిగేందుకు ప్రోత్సహిస్తారు. వారితో సంభాషిస్తూ... వారి స్థాయికి దిగి బోధించే ప్రయత్నం చేస్తారు. తాము చెప్పే పాఠంపై పిల్లల్లో ఒక రకమైన ఆసక్తిని, అనురక్తిని కలగజేస్తారు. ఈ క్రమంలో మరింత మెరుగ్గా బోధించడమెలాగో తాము కూడా నేర్చుకుంటారు. అటు విద్యార్థులు సైతం తమకు అర్ధమవుతున్నదేమిటో, కానిదేమిటో చెప్పగలిగే సామర్థ్యం అలవర్చుకుంటారు. అంతేకాదు... భిన్న అంశాలపై తార్కికంగా ఆలోచించడం, అభి ప్రాయాలు ఏర్పర్చుకోవడం సాధ్యపడుతుంది. బోధించడమనేది ఒక కళ అయినట్టే... వినడం కూడా కళే. ఆ లక్షణం వారిని ఉన్నతశిఖరాలకు ఎదిగిస్తుంది. చదువుకైనా, ఆటలకైనా, ఇతరత్రా కార్య కలాపాలకైనా తోటివారిని కూడగట్టడం పిల్లలు నేర్చుకుంటారు. ముందురోజు ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేసుకోవడం, ఎప్పటికప్పుడు అసైన్మెంట్లు చేయడం, రోజూ నిర్ణీత సమయానికల్లా బడికి హాజరుకావడం వంటివి పిల్లలను నియమబద్ధ జీవితంవైపు అడుగులేయిస్తాయి. అనంతర కాలంలో సమాజంలో వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయి. దురదృష్టవశాత్తూ ఆన్లైన్ విద్యాబోధనలో ఇదంతా సాధ్యం కాదు. అవసరమైన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఉన్నవారికీ... వాటిని సమకూర్చుకునే స్తోమత లేనివారికీ మధ్య ఎటూ అంతరాలు ఏర్పడుతున్నాయి. అన్నీ సమకూర్చుకోగలిగినవారు సైతం చదువుకునే క్రమంలో పొందవలసిన జ్ఞానానికి ఆన్లైన్ విధానం వల్ల దూరమవుతున్నారు. కొన్ని దశాబ్దాలక్రితం దూరవిద్యా విధానం మొదలైనప్పుడు విద్యారంగ నిపుణుల్లో చాలామంది దాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ బోధన తప్పేలా లేదు. పిల్లల్ని బడికి పంపాలంటే తల్లిదండ్రులు బెంబేలు పడుతున్నారు. బడిలో ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా అక్కడికి చేరేలోగా, అక్కడినుంచి తిరిగొచ్చేలోగా ఏమవుతుందోనన్న ఆందోళన వారికుంది. అందుకే సెల్ఫోన్లు లేదా కంప్యూటర్లు కొనిస్తే చదువుకుంటారని వారనుకున్నారు. అయితే ఎక్కువ సమయం ఆ ఉపకరణాలతో గడిపితే పిల్లల్లో ఏర్పడే సమస్యలపైనా తల్లిదండ్రులకు భయం వుంది. కనుకనే తగిన మార్గదర్శకాలు రూపొందించాలన్న అభిప్రాయం కలిగింది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు రోజుకు అరగంట మించి బోధించరాదని, ఒకటి నుంచి 8వ తరగతి వరకూ రోజుకు రెండు క్లాసులు, అవి కూడా ఒక్కోటి 30–45 నిమిషాల మధ్య మాత్రమే ఉండాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. 9–12 తరగతుల వారికి గరిష్టంగా నాలుగు సెషన్లు మాత్రమే వుండాలని సూచిస్తున్నాయి. వీటిపైనా, ఇతర మార్గదర్శకాలపైనే మరింత లోతుగా చర్చించి, అవసరమైన సవరణలు చేస్తే పిల్లలకు ఉపయోగపడతాయి. బోధనకు రోజులో ఎంత కేటా యించాలన్న అంశంతోపాటు, ఆన్లైన్ విధానంలో దానికి సృజనాత్మకత జోడించి మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దడమెలాగన్న అంశంపైనా నిపుణులు శ్రద్ధ పెట్టాలి. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేవరకూ ఇదంతా తప్పదు. -
ఫైనలియర్ పరీక్షలు రాయడం తప్పనిసరి
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో చివరి సంవత్సరం పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్చార్డీ) మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను పంజాబ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం సరైంది కాదని పేర్కొంటున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో జరగాల్సిన ఆఖరి సంవత్సరం పరీక్షలను సెప్టెంబర్లో నిర్వహించాలని యూజీసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మార్గదర్శకాల్లో సవరణలు సైతం చేసింది. ఆరు రాష్ట్రాల అభ్యంతరాలపై హెచ్చార్డీ శాఖ అధికారి ఒకరు స్పందిం చారు. విద్యార్థుల ఉన్న త చదువులు, భవిష్యత్తు ఉద్యో గ అవకాశాల దృష్ట్యా ఫైనలియర్ పరీక్షలు రాయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రాల సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పా రు. రాష్ట్రాలు తమకు వీలైన సమయంలోనే ఈ పరీక్షలు నిర్వహించవచ్చని సూచిం చారు. ఆన్లైన్ విధానంలోనూ పరీక్షలు రాసే అవకాశం ఉందని గుర్తుచేశారు. -
స్కూలు పిల్లలకు ఎన్సీఈఆర్టీ క్యాలెండర్
న్యూఢిల్లీ: లాక్ డౌన్లో ఒకటినుంచి 12 తరగతుల విద్యార్థులు సమయం సద్వినియోగం చేసుకునేలా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం ఈ క్యాలెండర్ విడుదల చేశారు. టెక్నలాజికల్ టూల్స్, సోషల్ మీడియా టూల్స్ ఉపయోగించుకొని మరింత పరిజ్ఞానాన్ని పిల్లలకు అందించే విధంగా ఇందులోని కోర్సులు ఉన్నాయని రమేశ్చెప్పారు. ఇందులో అధ్యాపకులు బోధించే విషయాలను విద్యార్థులు చూసి నేర్చుకోవచ్చని తెలిపారు. టెక్నాలజీ అందుబాటులో లేని విద్యార్థుల కోసం ఫోన్ కాల్ ద్వారా బోధించే విధానం కూడా ఇందులో ఉన్నట్లు వెల్లడించారు. 1 నుంచి 12 తరగతుల వరకు ఉన్న అన్ని విషయాలు ఇందులో ఉంటాయని, అయితే విద్యార్థులు వరుస క్రమంలోనే గాక, తమకు ఆసక్తి ఉన్న అంశాలను ఎన్నుకొని మరీ చూసి నేర్చుకోవచ్చని తెలిపారు. అందులో ఉన్న వరుస క్రమం తప్పనిసరి కాదని అన్నారు. లాక్ డౌన్ లో విద్యార్థులను సమయం వృధా కానివ్వకుండా, ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల స్కూళ్లు కూడా లబ్ధి పొందుతాయని చెప్పారు. -
ఇక విద్యలో రాష్ట్రాలకు ర్యాంకులు!
- కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కసరత్తు - వచ్చే జూన్ నాటికి ర్యాంకులిచ్చేలా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: బోధన, సదుపాయాలు, నాణ్యత ప్రమాణాల ఆధారంగా యూనివర్సిటీలకు ర్యాంకులు ఇస్తున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ).. ఇక పాఠశాల విద్యా పరంగా రాష్ట్రాలకు ఇవ్వనుంది. రాష్ట్రాల్లోని పాఠశాల విద్యా స్థితిగతులు అంచనా వేసి వచ్చే జూన్ నాటికి ర్యాంకులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రాల్లో విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందన్న ఉద్ధేశంతో ఎంహెచ్ఆర్డీ ముందుకు సాగుతోంది. నిధులను సద్వినియోగంతో పాటు ప్రయోగాలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించొచ్చని భావిస్తోంది. ఇందుకోసం నీతి ఆయోగ్, ఎంహెచ్ఆర్డీ 34 రకాల అంశాలతో స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ (ఎస్ఈక్యూఐ) రూపొందించేందుకు ఎంహెచ్ఆర్డీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. వాటి ఆధారంగానే ర్యాంకులు ఖరారు చేయనుంది. 2014-15, 2015-16 విద్యా సంవత్సరాల్లో జిల్లా విద్యా సమాచార విధానంలో (డైస్ డాటా) ఇచ్చిన సమాచారం ఆధారంగా 2017 జూన్లో మొదటిసారి ర్యాంకులను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తర్వాత జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ఏటా డైస్ డాటాను పరిశీలించి, శాంపిల్ సర్వే చేపట్టనుంది. వాటి ఆధారంగా ర్యాంకులివ్వడం.. నాణ్యత ప్రమాణాల కోసం ఆయా రాష్ట్రాల్లో ఆయా విభాగాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా ఎన్సీఈఆర్టీ సూచించనుంది. రాష్ట్రాలు సరైన సమాచారం ఇవ్వకపోతే ఎంహెచ్ఆర్డీ నేతృత్వంలో అత్యుత్తమ ప్రమాణాలు గల మరో సంస్థ ఆధ్వర్యంలో పరిస్థితి అంచనా వేయనుంది.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటు హక్కు వినియోగించుకున్నతర్వాత సీఎం జగన్ రియాక్షన్
అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్
గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
ఓటేసిన సీఎం జగన్
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
పోలింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..
నాలుగో దశ ఎలక్షన్స్.. ఆసక్తికర విషయాలు
మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
అందరూ తప్పకుండా ఓటు వేయండి..సీఎం జగన్ ట్వీట్
తప్పక చదవండి
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement