-
H5N1 Bird Flu: ముంచుకొస్తున్న బర్డ్ఫ్లూ ముప్పు!
ప్రపంచమంతటా కోవిడ్–19 మహ మ్మారి సృష్టించిన విలయం అందరికీ తెలిసిందే. లక్షల మంది బలయ్యారు. అలాంటి ప్రాణాంతక మహమ్మారి మరొకటి మానవులకు వ్యాపించే అవకాశాలు అధికంగా ఉన్నాయని అమెరికా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్లో బర్డ్ఫ్లూ వైరస్లో హెచ్5ఎన్1 అనే వేరియంట్ తొలుత ఆవులకు, తర్వాత ఆవుల నుంచి ఓ కార్మికుడికి వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. అతడిని పరీక్షించగా బర్డ్ఫ్లూ పాజిటివ్గా తేలింది. ఏప్రిల్ 1న ఈ కేసు బయటపడినట్లు యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) నిర్ధారించింది. బాధితుడి కళ్లు ఎర్రగా మారాయి. బర్డ్ఫ్లూ లక్షణాల్లో కండ్ల కలక కూడా ఒకటి. అమెరికాలో మనిíÙకి బర్డ్ఫ్లూ హెచ్5ఎన్1 వేరియంట్ సోకడం ఇది రెండో కేసు. బాధితుడిని ఐసోలేషన్కు తరలించి, చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు డాక్టర్లు చెప్పారు. వైరస్ సోకినట్లు వెంటనే గుర్తించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు. ► అమెరికాలో మనుషులకు సోకిన తొలి బర్డ్ఫ్లూ కేసు 2022లో కొలరాడోలో బయటపడింది. ► బర్డ్ఫ్లూ వైరస్ గత కొన్ని దశాబ్దాలుగా మహమ్మారుల జాబితాలో తొలి స్థానంలో ఉందని పిట్స్బర్గ్కు చెందిన బర్డ్ఫ్లూ పరిశోధకుడు డాక్టర్ సురేశ్ కూచిపూడి చెప్పారు. ఇది ప్రమాదకరంగా మారుతోందని, మనుషులకు సోకే అవకాశాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ► కోవిడ్–19తో పోలిస్తే బర్డ్ఫ్లూ హెచ్5ఎన్1 వేరియంట్ 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని ఫార్మా ఇండస్ట్రీ కన్సల్టెంట్ జాన్ ఫల్టన్ వెల్లడించారు. ఇందులో మ్యుటేషన్లు(మార్పులు) జరిగితే బాధితుల్లో మరణాల రేటు భారీగా పెరుగుతుందని చెప్పారు. ► నిజానికి ఇతర దేశాల్లోనూ మనుషులకు బర్డ్ఫ్లూ సోకిన సంఘటనలున్నాయి. 2003 జనవరి 1 నుంచి 2024 ఫిబ్రవరి 26 దాకా 23 దేశాల్లో 887 కేసులు బయటపడ్డాయి. వీరిలో 462 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అంటే 52 శాతం మంది మృత్యువాత పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ► మనుషులు బర్డ్ఫ్లూ బారినపడితే శ్వాస ఆడకపోవడం, చలి, అలసట, తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. బాధితులకు యాంటీ వైరల్ ఔషధాలు ఇస్తుంటారు. - సాక్షి, నేషనల్ డెస్క్ -
వృద్ధులకు కరోనా ముప్పు
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే మహమ్మారి నుంచి ముప్పు తప్పినట్లేనని ఇన్నాళ్లూ భావించాం. కానీ, తాజాగా అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీఎస్) నిర్వహించిన అధ్యయనంలో టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ వయసు మీద పడిన వారిలో కరోనా ముప్పు అధికంగా ఉంటున్నట్లు తేలింది. అనారోగ్యంతో బాధపడే వృద్ధులకు కరోనా సోకితే వ్యాక్సిన్ తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదని ఈ అధ్యయనం వెల్లడించింది. గత ఎనిమిది నెలల్లో రెండు డోసులు తీసుకున్నాక కూడా ఆస్పత్రి పాలైన వారు, లేదంటే ప్రాణాలు కోల్పోయిన వారు 12,908 వరకు ఉన్నారని తెలిపింది. ఆస్పత్రిలో చేరిన వారిలో 70 శాతానికి పైగా మంది 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారే. ఇక కరోనాతో మృతి చెందిన వారిలో 87 శాతం మందికి పైగా 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నావారే. సీడీసీ తాజాగా కరోనా కేసుల తీరు తెన్నుల్ని, వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులను క్షుణ్నంగా అధ్యయనం చేసింది. -
డెల్టా వేరియంట్ ఆందోళనకరమైంది
వాషింగ్టన్: భారత్లో మొట్టమొదటిసారిగా గుర్తించిన కోవిడ్–19 వేరియంట్ ‘డెల్టా’ను ఆందోళనకరమైన వేరియంట్గా అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (యూఎస్ సీడీసీ) ప్రకటించింది. అమెరికాలో ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న బి.1.1.7.(ఆల్ఫా), బి.1.351(బీటా), పి.1(గామా), బి.1.427 (ఎప్సిలన్), బి.1.429(ఎప్సిలన్), బి.1.617.2 (డెల్టా) వేరియంట్లను ఆందోళనకరమైనవిగా గుర్తిస్తున్నాం. అయితే, అత్యంత ప్రభావం చూపే వేరియంట్లను అమెరికాలో ఇప్పటి వరకు గుర్తించలేదు’ అని సీడీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. జూన్ 5వ తేదీ నాటికి దేశంలో నమోదైన కోవిడ్ కేసుల్లో 9.9% డెల్టా వేరియంట్వేనని తెలిపింది. డెల్టా సంక్రమణ వేగం చాలా ఎక్కువనీ, ప్రస్తుతం ఉన్న చికిత్సా విధానాలు దీనిపై అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయని వివరించింది. డెల్టాను ఆందోళనకర వేరియంట్గా మే 10వ తేదీనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా, జూన్ 13వ తేదీ నాటికి అమెరికాలో నమోదైన కేసుల్లో 10.3% డెల్టా వేరియంట్వేనని ఔట్బ్రేక్ ఇన్ఫో అనే వెబ్సైట్ వెల్లడించింది. వచ్చే నెల రోజుల్లో అమెరికాలోని కోవిడ్ కేసుల్లో అత్యధిక భాగం డెల్టా వేరియంట్కు చెందినవే అవుతాయని సీఎన్ఎన్ ఒక కథనంలో హెచ్చరించింది. -
ఈ పని సరిగా చేస్తే వ్యాక్సిన్ వేసుకున్నంత రక్షణ!
సాక్షి, సెంట్రల్ డెస్క్: ఓకే.. వ్యాక్సిన్ల కొరత ఉంది.. అందరికీ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు.. మరేం చేద్దాం.. వ్యాక్సిన్ల ఉత్పత్తి, సరఫరా, కొనుగోలు ఇవన్నీ మన చేతిలో లేవు.. మరి మన చేతిలో ఉన్నదానిపైన దృష్టి పెడదామా.. ఎందుకంటే.. ఈ పనిని మనం సరిగా చేస్తే.. దాదాపు వ్యాక్సిన్ వేసుకున్నంత రక్షణ అని అంతర్జాతీయంగా పలు పరిశోధన సంస్థలు అధ్యయనాలు చేసి మరీ తేల్చాయి. ఇంతకీ ఏంటా పని? మాస్కు సరిగా వేసుకోవడం!! సింపుల్. ఆ చాలామంది వేసుకుంటున్నారుగా అని మీరు అనవచ్చు.. ఇక్కడ మేం అన్నది మాస్క్ను సరిగా వేసుకోవడం అని.. ఎందుకంటే.. మన దగ్గర మాస్కు ముక్కుకు కాదు..మూతికి అని అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు కాబట్టి.. మాస్కు వేసుకుంటున్నవారిలో సగం మంది ముక్కు కిందకు దించి వాడుతున్నారు కాబట్టి.. అందుకే మన చేతిలో.. మనం చేయగలిగిన ఈ పనిని సరిగా చేస్తే.. వ్యాక్సిన్ మీ దాకా వచ్చేవరకూ అదే రక్షణ కలి్పస్తుందని అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) పేర్కొంది. అంతేకాదు..ఇటీవల మాస్క్ల ధారణ, కొనుగోలుపై మరోమారు మార్గరద్శకాలనూ విడుదల చేసింది.అవేంటో చూద్దామా.. ఎలాంటి మాస్కు తీసుకోవాలి? ♦ ఏది తీసుకున్నా.. అది మలీ్టలేయర్డ్ ఉండేలా చూసుకోండి.. కనీసం మూడు పొరలు ఉండాలి. దగ్గరగా నేసినవై ఉండాలి. మీరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి. డిస్పోజబుల్ మాసు్కలకూ ఇదే వర్తిస్తుంది. ♦ నోస్ వైర్ తప్పనిసరిగా ఉండాలి. మాస్కును కాంతి వస్తున్న వైపు పెట్టినప్పుడు అది దాన్ని నిరోధించేలా ఉండాలి. ఇలాంటివి వద్దు ♦ చాలామంది మాస్కులకు వాల్వులు ఉన్నవి వాడుతున్నారు. అలాంటివి వద్దు. అలాగే ఒకే పొర ఉన్నవి.. కాంతిని నిరోధించలేని మాస్కులను కొనుగోలు చేయవద్దు. ♦ ఎన్–95 లేదా కేఎన్–95 వాడేటప్పుడు దాని మీద మరో మాస్కును వాడవద్దు. వైద్య సిబ్బంది ఎక్కువగా వాడే వీటిని ఇప్పుడు సామాన్య జనమూ వినియోగిస్తున్నారు. ఇవి మరింత సురక్షితమైనవి అని పేరు ఉండటంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, కేఎన్–95 మాసు్కలు ఎక్కువగా చైనాలో తయారవుతాయి. వీటిల్లో నకిలీలు ఎక్కువగా ఉన్నాయన్న ఫిర్యాదులు అమెరికాలో ఉన్నాయి. కాబట్టి వాటిని కొనేటప్పుడు కాస్త చూసి తీసుకోవాలి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉన్నా.. వీటిని వాడవద్దు. ఎలా ధరించాలి? ♦ ఏ మాస్కు అయినా.. సరిగా ఫిట్ అయిందో లేదో చూసుకోవాలి. అన్ని వైపులా కవర్ అవ్వాలి. నోస్ వైర్ ఉన్న మాస్కు తీసుకోవడం వల్ల అది పై నుంచి గాలి బయటకు పోకుండా లేదా రాకుండా నిరోధిస్తుంది. దాన్ని మీ ముక్కుకు తగ్గట్లు ప్రెస్ చేయాలి. సరిగా ఫిట్ అయి ఉంటే.. వేడి గాలి మాస్కు ముందు భాగం నుంచి రావడాన్ని గమనిస్తారు. అంతేకాదు.. శ్వాస తీసుకుంటున్నప్పుడు, వదులుతున్నప్పుడు దానికి తగ్గట్లు మాస్కు కూడా ముందుకు వెనక్కు కదలడాన్ని గమనించవచ్చు. ♦ ముఖ్యంగా డిస్పోజబుల్ మాసు్కల విషయంలో పై ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఇవి కొంచెం లూజుగా ఉంటుంటాయి. సైడ్ నుంచి గాలి పోయే అవకాశము ఎక్కువ. అందుకే వీటి విషయంలో ఈ విధంగా తాళ్లను ముడివేయడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు. ♦ అలాగే.. ఈ మధ్య డబుల్ మాస్క్ ఎక్కువగా ధరిస్తున్నారు. దీని వల్ల అదనపు రక్షణ లభిస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అలాగని రెండు డిస్పోజబుల్ మాసు్కలు ఒకదానిపై ఒకటి పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అటూఇటూ గాలి పోతూనే ఉంటుంది. దానికి బదులుగా డిస్పోజబుల్ మాస్కు వేసుకుని.. దాని మీద క్లాత్ మాస్కు వేసుకుంటే.. ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. అది కూడా డిస్పోజబుల్ మాస్కు అంచులని ముఖానికి అదిమిపట్టేలా క్లాత్ మాస్కు వేసుకోవాల్సి ఉంటుంది. ♦ ఇక గడ్డం ఉన్నవారి విషయంలో మాస్క్ ఫిటింగ్ అన్నది సమస్యగా మారింది. వీరికంటూ ప్రత్యేకమైన మాసు్కలు లేని నేపథ్యంలో.. ఈ కరోనా కాలంలో అయితే షేవింగ్ చేసుకోవడం లేదా.. గడ్డం ట్రిమ్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించాలని సీడీసీ తెలిపింది. వీరు డబుల్ మాస్క్ ధరిస్తే.. మరింత సురక్షితమని పేర్కొంది. వీటితోపాటు సోషల్ డిస్టెన్స్ కూడా ముఖ్యమని మరోమారు స్పష్టం చేసింది. -
అమెరికాలో నవంబర్ కల్లా కోవిడ్ టీకా
వాషింగ్టన్: కోవిడ్–19 వ్యాక్సిన్ని నవంబర్కల్లా ప్రజలకి అందుబాటులోకి తెస్తామని అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ప్రకటిం చింది. వ్యాక్సిన్ పంపిణీకి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలంటూ రాష్ట్రాల గవర్నర్లకు ఆదేశాలు జారీ చేసింది. ‘‘అక్టోబర్ ఆఖరి వారం లేదంటే నవంబర్ మొదటి వారానికి కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుంది. దీని పంపిణీకి ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి’’అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధికారులకు సూచించినట్టుగా న్యూయార్క్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. సీడీఎస్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ రాష్ట్రాల గవర్నర్లకు ఆగస్టు 27నే ఒక లేఖ రాశారు. మెక్కెసన్ కార్పొరేషన్ టీకా డోసుల్ని సరఫరా చేస్తుందని, రాష్ట్రాలు, వైద్య శాఖ, అన్ని ఆరోగ్య కేంద్రాలకు ఆ సంస్థే వ్యాక్సిన్ సరఫరా చేసేలా సీడీసీతో ఒప్పందం కుదుర్చుకుందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ చివరి వారానికి టీకా డోసులు సిద్ధమవుతాయని, నవంబర్ ఒకటి నుంచి వాటి పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఆ లేఖలో పేర్కొంది. వచ్చే ఏడాది లోపు కోవిడ్ వ్యాక్సిన్ సిద్ధం కాదని శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెబుతున్నప్పటికీ ట్రంప్ సర్కార్ మాత్రం అధ్యక్ష ఎన్నికలకి ముందే కరోనా వ్యాక్సిన్ తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉంది. వ్యాక్సిన్ ద్వారా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు మెరుగుపడతాయని ట్రంప్ భావిస్తున్నారు మూడో దశ ప్రయోగాలకు ముందే అమెరికా పరిశోధనల్లో ఉన్న కరోనా వ్యాక్సిన్లు చాలా వరకు మూడో దశ క్లినికల్ ప్రయోగాల్లో ఉన్నాయి. ఈ ప్రయో గాలు పూర్తి కాకుండానే అత్యవసరమైతే వ్యాక్సిన్ను ఉపయోగించాలని కూడా ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తుది దశ ఆమోదానికి దగ్గరలో ఉందని ఇటీవల ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
Advertisement