-
పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ రూ.330
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచింది. లీటర్ పెట్రోల్పై రూ.26.02, డీజిల్పై రూ.17.34 పెంచుతున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించింది. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ ధర గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి రూ.330కు చేరుకుంది. ద్రవ్యోల్బణం 27.4 శాతానికి చేరడంతో ఈ చర్య అనివార్యమయినట్లు ప్రభుత్వం చెబుతోంది. శనివారం అమెరికా డాలర్తో పోలిస్తే 296.41 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. ఈ నెల ఒకటో తేదీన కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.14 చొప్పున పెంచింది. -
పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా కకర్ ప్రమాణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా అన్వరుల్ హక్ కకర్(52) సోమవారం పదవీ ప్రమాణం చేశారు. సోమవారం అధ్యక్ష భవనంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో కకర్తో అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ప్రధాని పదవి నుంచి వైదొలగిన షెహబాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మరికొద్ది నెలల్లో జరగాల్సిన నేషనల్ అసెంబ్లీ(దిగువసభ) ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించడం, దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడం కకర్ ముందున్న ప్రధాన లక్ష్యాలు. త్వరలోనే ఆయన తన మంత్రివర్గాన్ని ప్రకటించనున్నారు. -
అనుకున్నదొకటి... అయ్యిందొకటి!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం మొదట వేసుకున్న అంచనా తప్పింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాలకంటే ముందే తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు చేసిన కసరత్తు తాజా పరిణామాల నేపథ్యంలో మారిపోయింది. తెలంగాణలో నవంబర్ రెండో వారంలో పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా అక్టోబర్ రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించి షెడ్యూల్ రూపొందించినా తుది ఓటర్ల జాబితా ప్రకటన గడువు పొడిగించాల్సి రావడం, ఓటర్ల జాబితాకు సంబంధించి శుక్రవారం హైకోర్టు ఆదేశాల జారీ దరిమిలా సీఈసీ షెడ్యూల్ను మార్చుకుంది. ఈ కారణంగానే శనివారం మధ్యాహ్నం 12 గంటలకే వెలువరించాల్సిన 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించింది. తెలంగాణ లో ఎన్నికలు నిర్వహించాలనుకున్న షెడ్యూల్ను ఛత్తీస్ గఢ్కు వర్తింపజేసింది. హైకోర్టులో పిటిషన్ దృష్ట్యా అన్ని పరిణామాలను బేరీజు వేసు కుని నవంబర్ 12 న నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రకటన చేసింది. నవంబర్ రెండో వారం ముగిసేటప్పటికీ ఎన్నికల ప్రక్రియ ము గుస్తుందని భావించిన అధికార తెలంగాణ రాష్ట్ర సమి తి (టీఆర్ఎస్) ఈ పరిణామంతో కొంత ఆందోళన చెందినట్లు కనిపించింది. అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుందన్న ఉద్దేశంతోనే ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు 105 నియోజవర్గాలకు పార్టీ అభ్యర్థులను అసెంబ్లీ రద్దు రోజే ప్రకటించారు. ఇబ్బందుల్లేకుండా ఉండేందుకే నోటిఫికేషన్ నవంబర్కు... న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగానే కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ను నవంబర్లో విడుదల చేయాలన్న నిర్ణయం తీసుకుంది. రాజస్తాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికలకు ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేయాలని ముందుగా నిర్ణయం తీసుకున్నా అనుకోని అవాంతరాల కారణంగా తెలంగాణను రాజస్తాన్తో కలిపింది. ఛత్తీస్గఢ్ ఎన్నికలను ముందుకు తీసుకువచ్చింది. సాంకేతిక సమస్యల గుర్తింపులో యంత్రాంగం విఫలం... ఓటర్ల తుది జాబితా ప్రకటనకు ముందు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను గుర్తించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఎక్కువ జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చినా 10–12 జిల్లాల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమించడానికి వీలుగా తుది ఓటర్ల జాబితా ప్రకటనకు సమయం పొడిగించాలని గత బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పలువురు కలెక్టర్లు సీఈవో రజత్కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే రాతపూర్వకంగా తనకు నివేదికలు పంపితే సీఈసీ దృష్టికి తీసుకెళ్తానని రజత్ వారికి చెప్పడంతో గురువారం రాత్రికి వారు ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి నివేదికలు పంపారు. శుక్రవారం ఢిల్లీలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మిజోరంతోపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారుల సమావేశంలో రజత్ కుమార్ ఈ విషయాన్ని సీఈసీ దృష్టిలో పెట్టారు. దీంతోపాటే ఓటర్ల జాబితాలో అక్రమంగా వేలాది మంది పేర్లు తొలగించారంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఓటర్ల తుది జాబితాను తమకు ఇవ్వకుండా ప్రకటించవద్దని షరతు విధించింది. ఈ రెండు అంశాలపై సీఈసీ శనివారం న్యాయ నిపుణులతో కూలంకషంగా చర్చించింది. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో ముందుగా ఎన్నికలు నిర్వహించడం సమంజసమే అయినా తుది ఓటర్ల జాబితా సిద్ధం కాకపోవడం, హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండటంతో కొంత సమయం తీసుకుంటే బాగుంటుందని న్యాయ నిపుణులు సూచించినట్లు తెలిసింది. -
నేటి నుంచి పూర్తిస్థాయి ప్రచారంలో కేసీఆర్
-
గులాబీ ప్రచార భేరి
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల వ్యూహంలో ప్రత్యర్థి పార్టీలకంటే ముందంజలో ఉన్న టీఆర్ఎస్ ప్రచారపర్వంలోనూ దూకుడు ప్రదర్శించనుంది. విపక్షాలకంటే ముందే పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బహిరంగ సభతో టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావు బుధవారం నుంచి పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలవాల్సిన ఆవశ్యకతను తెలపనున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ను ఆశీర్వదించాలని బహి రంగ సభ వేదికగా ప్రజలను కోరనున్నారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని పదేపదే అడ్డుకోవడం వల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని ప్రజలకు వివరించనున్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పుతో టీఆర్ఎస్ను గెలిపిస్తే స్వాభిమానంతో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని, అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుం దని హామీ ఇవ్వనున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ బహిరంగ సభలతో ఎన్నికల్లో రాజకీయ వేడి మరింత రాజుకోనుంది. వరుసగా సభలు.. ఉమ్మడి జిల్లాలవారీగా సభలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. నిజామాబాద్ సభ అనంతరం ఈ నెల 4న నల్లగొండలో, 5న వనపర్తిలో, 7న వరంగల్, 8న ఖమ్మంలో ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలు నిర్వహించనుంది. బహిరంగ సభల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల మంత్రులు, పలువురు అభ్యర్థులతో ఇప్పటికే ఫోన్లలో మాట్లాడారు. బహిరంగ సభలకు జనం త్వరగా వచ్చేలా చూడాలని ఆదేశించారు. అసంతృప్తులు ఆగినట్లేనా... ప్రత్యర్థి పార్టీలను, సొంత పార్టీ వారిని ఆశ్చర్యపరుస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దయిన రోజే 105 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో టికెట్ ఆశించి భంగపడిన నేతలు అసమ్మతి కార్యక్రమాలు మొదలుపెట్టారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని అసంతృప్తి నేతలు డిమాండ్ చేశారు. అభ్యర్థులకు సహకరించేది లేదంటూ ప్రకటించారు. అనంతరం మంత్రి కేటీఆర్ చొరవతో నియోజకవర్గాలవారీగా అసమ్మతి, అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్నారు. టికెట్లు ఖరారైన మరుసటి రోజు నుంచే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా మంది నేతలు ఇప్పటికే కేటీఆర్తో చర్చించి వెళ్లారు. కొందరు నేతలు మాత్రం స్వతంత్రులుగా పోటీ చేస్తామని ప్రకటించి సొంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి స్థానాలు దాదాపు 10 వరకు ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బహిరంగ సభల నిర్వహణలో, ఆయా నియోజకవర్గాల జనసమీకరణ విషయంలో వారి వైఖరి ఆధారంగా తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. పెండింగ్ జాబితాపై అస్పష్టత... టీఆర్ఎస్ మరో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో ప్రచారం మొదలుపెడుతున్నా అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంతో ఆయా సెగ్మెంట్లలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆశావహులు తీవ్ర ఒత్తిడితో నలిగిపోతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో ముందుకు వెళ్తుంటే తమ సెగ్మెంట్లలో పార్టీపరంగా ఇబ్బందులు నెలకొంటున్నాయని అంటున్నారు. ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణకు ముందు అభ్యర్థులను ప్రకటించేలా టీఆర్ఎస్ కసరత్తు పూర్తి చేసింది. అయితే మహాకూటమిలో పార్టీలవారీగా సీట్ల సర్దుబాటుతో తలెత్తే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే పెండింగ్ సీట్ల అభ్యర్థుల ఖరారులో జాప్యం చేస్తోంది. ఎంపీ మల్లారెడ్డి ప్రచారానికి బ్రేక్... టీఆర్ఎస్ పెండింగ్లో పెట్టిన మేడ్చల్ అభ్యర్థి ఖరారులో రోజురోజుకూ పరిణామాలు మారుతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యే ఎం. సుధీర్రెడ్డికి తొలి జాబితాలో స్థానం దక్కలేదు. అదే సమయంలో మల్కాజ్గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి తనకు అధిష్టానం అవకాశం ఇచ్చినట్లుగా సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే మల్లారెడ్డి ప్రచార నిర్వహణపై టీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా స్పందించింది. ప్రచారం ఆపేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మంగళవారం మంత్రి కేటీఆర్ను కలిశారు. దీంతో మేడ్చల్ అభ్యర్థి ఎవరనేది మళ్లీ మొదటికి వచ్చింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement