-
రెండోసారి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి పదవి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎలాంటి రాజకీయ వారసత్వం లేదు.. సామాన్య కుటుంబంలో జని్మంచిన వ్యక్తి. సడలని పట్టుదల, అకుంఠిత దీక్షతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఉమ్మడి పాలమూరు కీర్తిపతాకాన్ని మరోమారు రెపరెపలాడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రాభవాన్ని కోల్పోయి అచేతన స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్కు అలుపెరగని పోరాటంతో ఊపిరిలూదిన ఎనుముల రేవంత్రెడ్డి. రాష్ట్రంతోపాటు కేంద్రంలోని అధికార పారీ్టలపై పదునైన విమర్శలు, ఉద్వేగపూరిత ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. హస్తం గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో మార్పు రావాలి అనే నినాదంతో ప్రజల మనసులను గెలుచుకున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే పార్టీని అధికార బాట పట్టించారు. నల్లమల అటవీ పరిధిలోని నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో జని్మంచిన ఆయనను సీఎంగా ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బూర్గుల తర్వాత మళ్లీ.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బూర్గుల రామకృష్ణారెడ్డి 1952లో షాద్నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైహైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. సుమారు 71 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇదే జిల్లాకు చెందిన కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్రెడ్డి తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో సీఎం మనోడే అంటూ ఆయన పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లి , ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. రైతు కుటుంబం నుంచి.. వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన నర్సింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులది సాధారణ రైతు కుటుంబం. వీరికి ఏడుగురు మగ, ఒక ఆడ సంతానం. 1967 నవంబర్ 8న రేవంత్రెడ్డి జన్మించారు. రేవంత్రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం ఐదో తరగతి వరకు కొండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో కొనసాగింది. ఆరో తరగతి కల్వకుర్తి మండలం (అప్పుడు వెల్దండ) తాండ్రలోని ఉన్నత పాఠశాలలో చదివారు. ఏడు నుంచి పదో తరగతి వరకు వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటరీ్మడియట్ వనపర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల.. డిగ్రీ (బీఏ ఆర్ట్స్) హైదరాబాద్లోని ఏవీ కాలేజీలో చదివారు. జేఎన్టీయూలో ఫైన్ ఆర్ట్స్ కోర్సు పూర్తి చేశారు. రేవంత్రెడ్డికి భార్య గీతారెడ్డి, కూతురు నైమిషారెడ్డి ఉన్నారు. ఈ అవకాశం మళ్లీ రాదంటూ.. రాష్ట్రంలోని 119 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎంతోమంది పెద్దవాళ్లు, ఉద్దండులు ఉన్నా పాలమూరు బిడ్డ సంతకంతోనే పోటీలో నిలుస్తున్నారు. ఇది పాలమూరు గడ్డ గొప్పతనం. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తర్వాత 70 ఏళ్లకు మళ్లీ మనకు అవకాశం వచ్చింది. ఇప్పుడు చేజారితే ఈ అవకాశం రాదు. పాలమూరు బిడ్డలు నాటిన మొక్కను నరికేందుకు ఢిల్లీ నుంచి కొందరు, గల్లీ నుంచి మరికొందరు గొడ్డళ్లు పట్టుకుని వస్తున్నారు. పాలమూరు బిడ్డలు చైతన్యంతో ఎదురుతిరగాలి. – రేవంత్రెడ్డి టీపీసీసీ చీఫ్ తర్వాత అనతికాలంలోనే.. 2021లో టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సుమారు రెండేళ్లుగా పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ అగ్రనేతల సహకారంతో, ఐకమత్యంతో పార్టీని ముందుకు నడిపిస్తూ.. నిరి్వరామంగా ప్రజల్లో ఉంటూ పార్టీని విజయతీరాలకు చేర్చారు. అనతి కాలంలోనే తన సవాల్ను నెగ్గించుకోవడమే కాకుండా.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు రెడీ అవుతున్నారు. జెడ్పీటీసీ టు ముఖ్యమంత్రి.. రేవంత్కు చిన్ననాటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలో 2004లో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్లో చేరి కొంతకాలం పనిచేశారు. 2006లో మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ అభ్యరి్థగా స్వతంత్రంగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత స్థానిక సంస్థల కోటాలో మహబూబ్నగర్ శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి 2009, 2014లో కొడంగల్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ‘ఓటుకు నోటు’తో మలుపు.. తొలి నుంచీ దూకుడే.. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. 2015 మే 15న రేవంత్రెడ్డిని ఓటుకు నోటు కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ సమయంలో కేసీఆర్ను గద్దె దించడమే తన లక్ష్యమని ప్రకటించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2017లో టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 2021 జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది తనతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్కు అఖండ మెజార్టీ వచ్చేలా చేసి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా రేవంత్ తొలి నుంచీ దూకుడుగానే ముందుకు సాగారు. పదునైన విమర్శలు..ఉద్వేగపూరిత ప్రసంగాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పదునైన విమర్శలు, ఉద్వేగపూరిత ప్రసంగాలే కాదు.. దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, వెంటనే అమలు చేయడం ఎనుముల రేవంత్రెడ్డి ప్రత్యేకత. చిన్న నాటి నుంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా బరిలో నిలిచి గెలిచిన తీరు ఇప్పటికీ చర్చనీయాంశమే. ఒక సారి ఎమ్మెల్సీ, ఒక దఫా ఎంపీ, ఇప్పటితో కలిపి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. అయినా పట్టుదలతో టీపీసీసీ చీఫ్గా అనతికాలంలోనే కాంగ్రెస్లో జవసత్వాలు నింపి.. పార్టీని ముందుండి నడిపించారు. తాను బరిలో నిలిచిన కొడంగల్లో నామినేషన్కు ఒక రోజు, రోడ్షోకు మరో రోజు, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ సభకు ఇంకో రోజు.. ఇలా కేవలం మూడు సార్లు మాత్రమే ప్రచారానికి వచ్చిన రేవంత్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల్లో 83 ప్రచార సభల్లో పాల్గొన్నారు. అధికార బీఆర్ఎస్, బీజేపీలపై తూటాల్లాంటి మాటలు, విమర్శలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపడమే కాకుండా.. ఉద్వేగ ప్రసంగాలతో ప్రజల మనసు దోచుకుని కాంగ్రెస్ను విజయతీరాలకు చేర్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి రేపు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న నేపథ్యంలో ఆయన రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న తీపిగుర్తులు, ప్రసంగాల తీరును ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఎస్.. ఢీ అంటే ఢీ.. నల్లగొండలో నిర్వహించిన సభలో ఆ జిల్లాకు చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ మేము మా జిల్లాలో 12కు 12 సీట్లు గెలుస్తాం.. రేవంత్రెడ్డి పాలమూరులో 14కు 14 సీట్లు గెలిపిస్తారా అని సవాల్ విసిరారు. అక్కడే ఉన్న రేవంత్రెడ్డి సైతం యస్.. గెలిచి తీరుతాం అన్నారు. వారు అన్నట్లే నల్లగొండ జిల్లాలో 11 సీట్లు కాంగ్రెస్కు రాగా.. మహబూబ్నగర్లో 12 కైవసం చేసుకున్నారు. -
అన్యాయంపై తిరుగుబాటు ‘ముల్కీ!’
ముల్కీ ఉద్యమంలో భాగంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపి నేటికి సరిగ్గా 70 ఏళ్లు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తెలంగాణ ప్రాంత ప్రజలపై పెత్తనం చలాయించడం, తెలంగాణ విద్యార్థు లకు దక్కాల్సిన ఉద్యోగాలను నాన్ ముల్కీ లైన ఆంధ్ర ప్రాంత ప్రజలు తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి పొందడం వంటి చర్యల ద్వారా ఎంతో దోపిడీ చేశారు. దీనిని వ్యతి రేకిస్తూ ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి ప్రజలకే కల్పిం చాల్సిందిగా కోరుతూ ‘నాన్ ముల్కీ గో బ్యాక్’, ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ నినాదాలతో ముల్కీ ఉద్యమం వరంగల్లో ప్రారంభమయ్యింది. ‘ముల్కీ’ అనగా స్థానికుడు అని అర్థం. ఈ ముల్కీ సమస్య 1868 నుంచి హైదరాబాద్ రాష్ట్రంలో ఉంది. నాన్ ముల్కీలను తొలగించాలని అనేక సమావేశాలు నిర్వహించి, వినతి పత్రాలు అందించి ప్రజల్లో చైతన్యం కలిగించారు నాటి స్థానిక ముస్లిం మేధావులు. పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయింది. పోలీస్ చర్య పిమ్మట ఏర్పడిన అస్థిరత ఒత్తిళ్ళ కారణంగా పోలీస్ శాఖలో గైర్ ముల్కీలను నియమించడం అనివార్యమైందని అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తెలిపారు. కానీ పోలీస్ శాఖలోనే కాకుండా అనేక శాఖల్లో గైర్ ముల్కీల నియామకం జరిగింది. వరంగల్లోని డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా నియమించ బడిన పార్థసారథి 1952 జూన్, జూలై నెలల్లో 180 మంది ఉపాధ్యా యులను మూకుమ్మడిగా బదిలీ చేశారు. తెలంగాణ వారిని మారు మూల గ్రామాలకు, ఏకోపాధ్యాయ పాఠశాలలకు బదిలీ చేస్తూ... వీరి స్థానాల్లో ఆంధ్ర ఉపాధ్యాయులను నియమించడం తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. నాన్ ముల్కీ అయిన పార్థసారథి ఇంతటి ఇబ్బందులకు గురి చేయడంతో తెలంగాణకు చెందిన ఉపాధ్యాయులంతా విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షండార్కర్కు 1952 జూలై 26న ఫిర్యాదు చేశారు. ఆ విషయంపై వరంగల్లో విచారణ జరిపించారు. న్యాయ పరమైన విచారణ జరగాలని వెంటనే నాన్ ముల్కీలను ఉద్యోగాల నుంచి తొలగించాలని వరంగల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఊరేగింపు చేశారు. ఆ ర్యాలీనే 1952 ముల్కీ ఉద్యమంలో తొలి ప్రదర్శనగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు జూలై 27, 28, 29 తేదీల్లో తరగతులు బహిష్కరించి ముల్కీ సమస్యపై ముఖ్యమంత్రికి తీర్మానాన్ని పంపాలని నిర్ణయిం చారు. ఈ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. తమ తమ జిల్లాల్లో విద్యార్థులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఊరేగింపులు నిర్వహించారు. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుండడంతో ముఖ్యమంత్రి బూర్గుల విద్యార్థులతో సమావేశమై ఈ సమస్య పరిష్కారానికి సబ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేసి సమ్మె విరమించు కోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కానీ ఎలాంటి పత్రికా ప్రకటన వెలువడలేదు. దీంతో హన్మకొండ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు సమ్మె కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకొని ఉద్యమం తారస్థాయికి చేరుకోకముందే అణచివేయాలని విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. ఈ చర్యను నిరసిస్తూ తెలంగాణ అంతటా విద్యార్థులు రోడ్లెక్కారు. సెప్టెంబర్ మూడవ తేదీన ముల్కీ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చింది. విద్యార్థులను అదుపు చేయడం కోసం పోలీసులు సైఫాబాద్ సైన్స్ కాలేజ్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 22 కింద ఊరేగింపులు, సభలు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు బేఖాతరు చేశారు విద్యార్థులు. సిటీ కాలేజ్ ఆవరణలోని విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు, విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. సిటీ కాలేజ్ పక్కనే గల హైకోర్టులో ఉన్న వకీల్, ఆనాటి శాసనసభ్యుడు కొండా లక్ష్మణ్ విద్యార్థులను శాంతింపచేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. మేజిస్ట్రేట్ పరిస్థితిని అదుపు చేయడా నికి వెంటనే ఫైరింగ్కి ఉత్తర్వులు ఇచ్చారు. ఒక విద్యార్థికి బుల్లెట్టు తగిలి నేలకు ఒరిగాడు. ఆగ్రహించిన విద్యార్థులు రాళ్లు రువ్వుతూ బస్సులను తగలబెట్టారు. దీంతో మేజిస్ట్రేట్ రెండోసారి ఫైరింగ్కి ఉత్తర్వులు ఇచ్చాడు. చాలామందికి బుల్లెట్లు తగిలి నేలపై పడి పోయారు. సెప్టెంబర్ 3న సిటీ కాలేజీ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు అక్కడే చనిపోగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ ఉస్మానియా హాస్పిటల్లో మరణించారు. చనిపోయిన వారి శవాలను తీసుకొని ఊరేగింపు చేయాలని విద్యార్థులు నిర్ణయించుకొని సెప్టెంబర్ 4న ఉస్మానియా హాస్పిటల్కి బయలుదేరారు. శవాలను అప్పగించే విషయంలో వాగ్వాదం పెరిగి పోలీసులు మళ్లీ విద్యార్థుల పైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు మళ్లీ కాల్పులు జరిపారు. సెప్టెంబర్ 4న జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారు. వందల మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. (క్లిక్: బంగారు బాతును కాపాడుకోవాలి!) ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఉండాలనీ, ఆంధ్రలో ఎట్టి పరిస్థి తుల్లో విలీనం చేయరాదన్న తెలంగాణ ప్రజల అంతర్గత ఆకాంక్షకు నిలువెత్తు రూపమే ఈ మహోత్తర ముల్కీ ఉద్యమం! అందుకే ఆ తర్వాత తలెత్తిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ముల్కీ ఉద్యమం నేపథ్యాన్ని ఏర్పరచిందని చెప్పవచ్చు. (క్లిక్: రోజురోజుకూ పెరుగుతున్న వ్యత్యాసాలు) - జక్కుల శ్రీనివాస్ హెచ్సీయూ విద్యార్థి (సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పుల సంఘటనకు 70 ఏళ్లు) -
బూర్గులకు గవర్నర్ దత్తాత్రేయ నివాళి
సాక్షి, హైదరాబాద్: నిస్వార్థ నాయకుడిగా, హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించిన మహావ్యక్తి బూర్గుల రామకృష్ణారావు అని హిమాచల్ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. దత్తాత్రేయ శనివారం బూర్గుల వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు గవర్నర్గా సేవలందించిన గొప్పవ్యక్తి అని తెలిపారు. దత్తాత్రేయ హిమాచల్ప్రదేశ్ గవర్నర్ హోదాలో నగరానికి రావడంతో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడీ, సీసీఆర్ఓ వెంకటరమణ ఘనంగా స్వాగతం పలికారు. కాగా బండారు దత్తాత్రేయ ఇటీవల హిమాచల్ప్రదేశ్ 27వ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. -
విశేషాల కొలువు.. ఉద్దండుల నెలవు..
సాక్షి, ఎలక్షన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి శాసనసభకు సంబంధించిన విశేషాల గురించి రాష్ట్రంలోని సీనియర్ ప్రజాప్రతినిధులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. శాసనసభకు ఎన్నికైంది ఒకే పర్యాయమైనా ఏడేళ్ల సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలుగా కొనసాగిన అరుదైన అవకాశం, ఆంధ్ర రాష్ట్రం, ఏపీ అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం వహించిన రికార్డు ఆంధ్ర ప్రాంతీయులకే సొంతమైంది. 1956లో ఏర్పాటైన ఏపీ మొదటి శాసనసభ.. మూడు ప్రాంతాలకు చెందిన ఉద్దండులతో మొత్తం తెలుగువారికి వేదికగా కనిపించేది. బూర్గుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్రెడ్డి లాంటి తెలుగు ప్రముఖులంతా ఈ సభలో ప్రాతినిధ్యం వహించిన వారే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అంతర్భాగంగా ఉన్న సమయంలో (1952) మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి ఫలితంగా 1953లో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకూ ఉన్న ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం సీఎంగా ఎన్నికయ్యారు. మద్యనిషేధం అంశంపై అవిశ్వాస తీర్మానం కారణంగా ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులయ్యారు. 1955 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఆంధ్ర రాష్ట్రానికి బెజవాడ గోపాల్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణా(హైదరాబాద్ రాష్ట్రం) కలిసి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్కు నీలం సంజీవరెడ్డి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.తెలంగాణా ప్రాంతంలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే 1957లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతంలో ఉప ఎన్నికలు జరిగి రెండేళ్లు మాత్రమే అయినందున 1957 సార్వత్రిక ఎన్నికలు ఇక్కడ నిర్వహించలేదు. ఫలితంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు 1955 నుంచి 1962 వరకూ సుమారు ఏడున్నరేళ్లపాటు శాసనసభ్యులుగా కొనసాగారు. ఇలా ఆంధ్రప్రదేశ్ మొదటి అసెంబ్లీ మూడు పర్యాయాలు ఎన్నికైన (1952, 1955, 1957) వారికి వేదికగా నిలిచి ప్రత్యేకతను సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్కు సీఎం కావడం మొదటి శాసనసభలో కనిపించిన అరుదైన విశేషాల్లో ఒకటిగా చెప్పవచ్చు. నీలం సంజీవరెడ్డి.. తర్వాత కాలంలో దేశ ప్రథమ పౌరునిగా అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించగా పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాల్రెడ్డి తన కింద ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి వద్ద తర్వాత మంత్రిగా పనిచేయడం ఈ కాలంలో చోటుచేసుకొన్న మరో ఆసక్తికర సన్నివేశం. 1955 నుంచి 1962 వరకూ ఏడేళ్లు సభలో ఉన్న వారిలో గౌతు లచ్చన్న, పీవీజీ రాజు, పుచ్చల పల్లి సుందరయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, కడప కోటిరెడ్డి, ఆనం చెంచు సుబ్బారెడ్డి ప్రముఖులు ఉన్నారు.1952, 1955లో తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచినవారు కూడా మొదటి శాసనసభలో ఉన్నారు. – లేబాక రఘురామిరెడ్డి, సాక్షి ప్రతినిధి -
ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు సీఎంలు
సాక్షి, వికారాబాద్/షాద్నగర్: ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు సీఎంలుగా వ్యవహరించి మంచి పేరుప్రఖ్యాతులు గడించారు. హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి రామకృష్ణారావుది షాద్నగర్ నియోజకవర్గంలోని బూర్గుల స్వగ్రామం. మర్రి చెన్నారెడ్డిది వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం సిరిపురం. జిల్లాల పునర్విభజనలో భాగంగా షాద్నగర్ రంగారెడ్డి జిల్లాలో కలిసింది. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని బూర్గుల గ్రామంలో 1899లో నర్సింగ్రావు, రంగనాయకమ్మ దంపతులకు రామకృష్ణారావు జన్మించారు. 1948 అనంతరం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆయన విద్యా, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. వినోబాభావే చేపట్టిన భూదానోద్యమానికి చట్టబద్దత కల్పించారు. 1952లో షాద్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. కమ్యూనిస్టు నేత ఎల్ఎల్రెడ్డిపై 15 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అప్పట్లో హైదరాబాద్ స్టేట్ ఉండటంతో తొలిముఖ్యమంత్రి పదవిని రామకృష్ణారావు అలంకరించారు. ఆయన తన హయాంలోనే రక్షిత కౌలుదారు(టెనెంట్) చట్టాన్ని తీసుకొచ్చి నిరుపేదలకు భూములు పంపిణీ చేశారు. అనంతరం 1956లో విశాలాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956–1960లో కేరళ, 1960–1962 ఉత్తరప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1967 సెప్టెంబరు 14న ఆయన కన్నుమూశారు. బూర్గుల గ్రామంలో రామకృష్ణారావు స్మారక స్థూపాన్ని ప్రజలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ముద్ర వేసిన మర్రి.. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1969లో ‘తెలంగాణ ప్రజాసమితి‘ పార్టీని ఏర్పాటు చేసి తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లారు. ఈయన స్వగ్రామం వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండల పరిధిలోని సిరిపురం గ్రామం. మర్రి లక్ష్మారెడ్డి, శంకరమ్మ దంపతులకు 1919 జనవరి 13 జన్మించారు. ప్రాథమిక విద్యను సిరిపురంలోనే పూర్తిచేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలంలోని పెద్దమంగళారంలో తన మేనమామ కొండా వెంకట రంగారెడ్డి వద్ద ఉంటూ ప్రాథమికోన్నత, వికారాబాద్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీసీ పూర్తి చేసి ఉస్మానియాలోనే డాక్టర్గా కొంతకాలం పనిచేశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1952, 1957లో వికారాబాద్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం 1962లో ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో తాండూరు నుంచి పోటీచేశారు. 1962,1967లో విజయం సాధించారు. అనంతరం 1978లో మేడ్చల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1989లో సనత్నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1978–79, 1989–90లో రెండు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు గవర్నర్గా సేవలందించారు. దీంతోపాటు బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో 27 ఏళ్ల పిన్నవయసులో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేసి రికార్డు సృష్టించారు. తమిళనాడు గవర్నర్గా ఉండగానే ఆయన కన్నుమూశారు. ఆయన తన మేనమామ మీద ఉన్న అభిమానంతో ఆయన పేరుమీదే కొండా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
బీజేపీలో చేరిన రాధికా ఖేరా.. ఎవరీమె?
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement