Boyfriend Suicide
-
ప్రియుడు ఇక లేడని నిప్పంటించుకున్న యువతి
సాక్షి, చెన్నై: నచ్చినవాడితో కలిసి నడవాలని ఊహల్లో తేలిపోయిందో అమ్మాయి. అతడే తన సర్వస్వమని భావించింది. కానీ అతడు 24 ఏళ్లకే ఈ జీవితమే వద్దనుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి కుమిలిపోయింది. తిండీనిద్రా లేకుండా అతడినే కలవరించింది. తిరిగి రాని లోకాలకు వెళ్లిన ప్రియుడిని చేరుకునేందుకు చివరికి తను కూడా తనువు చాలించింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూర్కు చెందిన ఎమ్ సుజాత(20) కాలేజీ విద్యార్థిని. ఆమె, తన బంధువైన సిలంబర్సన్(24) కొన్నాళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అందుకు అమ్మాయి బంధువులు ఒప్పుకోలేదు. పెళ్లి జరిపించే ప్రసక్తే లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో మనస్తాపానికి లోనైన సిలంబర్సన్ చిత్తూరులోని తన నివాసంలో ఫిబ్రవరి 22న ఉరేసుకుని మరణించాడు. అతడి మృతి సుజాతకు అశనిపాతంలా తాకింది. దీంతో ఆమెను తల్లిదండ్రులు చెన్నైలోని బంధువు ఇంటికి పంపించారు. కనీసం అక్కడైనా ఆమె మనసు కుదుటపడుతుందని భావించారు. కానీ తన ప్రియుడు మరణించాడన్న వార్తను జీర్ణించుకోలేకపోయిన యువతి అన్నపానీయాలు తీసుకోవడం మానేసింది. దీంతో ఆమె శరీరం కొద్దికొద్దిగా నీరసించిపోగా శుక్రవారం నాడు ఒంటికి నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న బంధువులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన ఆమె శనివారం తుదిశ్వాస విడిచింది. ప్రియుడు చనిపోయిన వారం రోజులకే ఆమె కూడా మరణించడం స్థానికులను కలిచివేసింది. చదవండి: పరీక్షలు రాయకుండానే పోయావా నాన్నా! పక్క తడిపాడని కన్నతండ్రే.. -
యువతి చున్నీతో ఉరివేసుకున్న యువకుడు
చీపురుపల్లి: తను ప్రేమించిన యువతికి వేరొకరితో వివాహం నిశ్చయం కావడం, దాన్ని రద్దు చేసుకోమని ఎంత ఒత్తిడి తెచ్చినా ఆమె అంగీకరించకుండా తనను మరచిపోవాలని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆ యువతి చున్నీతోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ ఘటన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మెరకముడిదాం మండలం భీమవరం గ్రామానికి చెందిన గొర్లె ప్రవీణ్ (17), అదే మండలంలోని శ్యామాయవలస గ్రామానికి చెందిన ఓ యువతి చీపురుపల్లిలోని ఓ కంప్యూటర్ కోచింగ్ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. అక్కడ దాదాపు ఆరు నెలల క్రితం వారికి పరిచయం ఏర్పడింది. దాన్ని ప్రేమగా మార్చాలని ప్రవీణ్ ప్రయత్నించాడు. అయితే ఆ యువతి కంటే ప్రవీణ్ ఏడాది చిన్నవాడు కావడంతో ఆమె అంగీకరించలేదు. అయినప్పటికీ వెంట పడి ఎట్టి పరిస్థితుల్లో తన ప్రేమను అంగీకరించాలని కోరాడు. ఇంతలో ఆ యువతికి ఇంట్లో పెద్దలు వివాహం కుదిర్చారు. విషయం తెలుసుకున్న ప్రవీణ్ ఆ పెళ్లి రద్దు చేసుకోవాలని కోరుతున్నా ఆమె పట్టించుకోలేదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేస్తూ వచ్చింది. శుక్రవారం చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మాట్లాడుకుందాం రమ్మని ప్రవీణ్ ఆ యువతిని పిలిచాడు. ఆమె వెళ్లేసరికి ప్రవీణ్ అక్కడ లేకపోవడంతో అమ్మవారిని దర్శించుకుని వెనుదిరిగింది. ఆ తరువాత వచ్చిన ప్రవీణ్ తాను వచ్చానని రమ్మని ఫోన్చేసి పిలిచాడు. ఆమె వెళ్లగా పెద్దలు కుదిర్చిన పెళ్లి రద్దు చేసుకోవాలని మరోసారి కోరాడు. ఆమె ససేమిరా అంటూ నచ్చజెప్పింది. మనస్తాపం చెందిన ఆ యువకుడు కాలకృత్యాలు తీర్చుకుని వస్తానని అక్కడే కూర్చోమని, ఎండగా ఉంది చున్నీ ఇవ్వాలని అడిగాడు. చాలా సేపటి తరువాత ఫోన్ చేసి ‘ఇదే ఆఖరి మాట గుడ్బై’ అని ఫోన్ పెట్టేశాడు. ఆ యువతి పరుగులు తీసి వెళ్లగా అక్కడ ఓ చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ దుర్గాప్రసాద్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలిని చంపి.. ప్రియుడు ఆత్మహత్య
-
ప్రియురాలిని చంపి.. ఆత్మహత్య
ఇల్లంతకుంట (మానకొండూర్): పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవటంతో ప్రియురాలిని చంపి.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్పేటలో గురువారం జరిగింది. ఇల్లంతకుంట మండలం అనంతారానికి చెందిన వొల్లాల ఎల్లయ్య– భారతమ్మల చిన్న కొడుకు మధు(25) హైదరాబాద్లోని ఓ బ్రెడ్ కంపెనీలో కార్మికుడు. వీరి ఇంటి సమీపంలోనే ఉండే మిట్టపల్లి వెంకటమ్మ కుమార్తె సుస్మిత(22) బీఈడీ చదువుతోంది. ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుష్మిత తల్లి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కులాలు వేరుకావడం, కూతురు పుట్టినప్పుడే తనను భర్త వదిలేసి వెళ్లటం, తనలాగే కూతురి జీవితం కాకూడదని భావించింది. వీరు దూరంగా ఉంటున్నట్లు నమ్మించేందుకు మధు హైదరాబాద్కు వెళ్లాడు. అయితే, గురువారం సిద్దిపేటలో మధు స్నేహితుడి వివాహం జరిగింది. వివాహానికి వచ్చిన మధు సుస్మిత కు ఫోన్ చేశాడు. అప్పటికే కళాశాలకు వెళ్లిన సుస్మిత అనుమతి తీసుకొని ఎప్పుడూ కలుసుకునే ముస్కాన్పేటలోని కోళ్లఫారం వద్దకు వెళ్లింది. మధు కూల్డ్రింక్, క్రిమిసంహారక మందు తీసు కొచ్చాడు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవటంతో కలసి చనిపోదామని చెప్పాడు. సుస్మిత నిరాకరించి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా, మధు ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె కన్నుపోయింది. తర్వాత ఆమె గొంతుకు ఉరి బిగించి చంపేశాడు. తర్వాత కోళ్లఫారంలో దూలానికి ఉరి వేసుకున్నాడు. అంతకు ముందే విషయాన్ని సిద్దిపేటలోని స్నేహితుడికి అతడు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. స్నేహితులు వచ్చి చూడగా, ఇద్దరూ శవాలై కనిపించారు. ఇరువురి కుటుంబాలకు వారు సమాచారం అందించారు. -
ప్రేమ ప్రయాణం విషాదాంతం
దావణగెరె: దారితప్పిన ప్రేమ విషాదాంతమైంది. పెళ్లయిన ఒక యువతి, ప్రియునితో కలిసి పరారయ్యారు. ఇంతలో ఆ ప్రేమజంట మధ్య జరిగిన చిన్న గొడవతో విరక్తి చెందిన ప్రేయసి పురుగులమందు ఆత్మహత్యాయత్నం చేయగా, ఎక్కడ తాను పోలీసులకు పట్టుబడాల్సి వస్తుందోనని భయపడిన ప్రేమికుడు తన ప్రేయసి చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘోరం దావణగెరె జిల్లాలో జరిగింది. వివరాలు.. జిల్లాలోని హŸన్నాళి తాలూకా కమలాపుర గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు, రంజిత అనే యువతి ప్రేమించుకున్నారు. అయితే రంజితాకు ఆమె తల్లిదండ్రులు వేరే యువకునితో వివాహం జరిపించారు. దీంతో ఇష్టం లేని పెళ్లిని ధిక్కరించి రంజితా మహేష్తో కలిసి ఉండాలని నిర్ణయించుకొంది. ఈ క్రమంలో ఇద్దరు ఇల్లు వదిలి పారిపోయారు. హావేరి జిల్లా రాణిబెన్నూరు బస్టాండ్లో వీరిద్దరి మధ్య ఎందుకో వాగ్వాదం జరిగింది. జీవితంపై విరక్తి చెందిన రంజిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను స్థానికులు గమనించి దావణగెరెలోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె కోలుకుంటోంది, శనివారం డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. అయితే ఎక్కడ రంజిత తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తుందో, తనను పోలీసులు అరెస్ట్ చేస్తారేమోననే భయంతో మహేష్ శుక్రవారం రాత్రే ఆస్పత్రికి వచ్చి మెట్ల వద్దే ఇనుప రాడ్కు పంచెను కట్టుకొని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బడావణె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ప్రియురాలి ఇంట్లో ప్రియుడి ఆత్మహత్య
లంగర్హౌస్: ప్రియురాలు తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది ఆమె ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లంగర్హౌస్ ఎస్సై శశిధర్ కథనం ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన పిచ్చయ్య(42) గుడిమల్కాపూర్లో కుటుంబసభ్యులతో కలిసి ఉంటూ మేస్త్రీ పని చేస్తూ జీవిస్తున్నాడు. తన వద్ద కూలీ పనిచేసే లంగర్హౌస్ కనకదుర్గా కాలనీకి చెందిన యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పూటుగా మద్యం తాగిన పిచ్చయ్య యాదమ్మ ఇంటికి వచ్చాడు. డబ్బుల విషయంలో ఇద్దరూ రెండు గంటల పాటు గొడవపడ్డారు. యాదమ్మ ఆదివారం రాత్రి పిచ్చయ్య తన ఇంట్లో ఉండగానే పరుగు పరుగున లంగర్హౌస్ పోలీసుస్టేషన్కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు యాదమ్మ ఇంటికి వెళ్లగా.. లోపలి నుంచి గడియపెట్టి ఉంది. పిలిచినా యాదయ్య తలుపు తీయకపోవడంతో పోలీసులు తలుపులు బద్ధలుకొట్టి చూడగా.. చీరతో ఉరికి వేలాడుతూ కనిపించాడు. కొన ఊపిరితో ఉన్న యాదయ్యను సమీపంలోనే ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. డబ్బుల విషయంలో తమ మధ్య గొడవ జరిగిందని యాదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెంది యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడా? వేరే కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.