-
బంజారాహిల్స్లో దారుణం: ప్రేమ పేరుతో లొంగదీసుకొని.. నగ్న ఫొటోల్ని..
బంజారాహిల్స్: తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యూడ్ వీడియోలను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్న వ్యక్తిపై బాధితురాలుఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. వివరాలివీ... యూసుఫ్గూడ సమీపంలోని ఎల్.ఎన్.నగర్లో నివసించే యువతికి అదే ప్రాంతంలో నివసిస్తున్న దెబాస్ దేకా(27)తో గతేడాది అక్టోబర్లో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాడు. అప్పటి వరకు సహజీవనంతో కలిసి ఉందామని నమ్మించాడు. తరచూ ఆమెకు ఇష్టం లేకుండానే లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. గత మార్చి 26వ తేదీన యూసుఫ్గూడలోని తన గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ సమయంలో కూడా పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడ్డట్లు ఆమె వెల్లడించింది. ఇష్టం లేకుండానే బలవంతంగా శారీరక వాంఛలు తీర్చుకునేవాడని ఎన్నోసార్లు వ్యతిరేకించడం జరిగిందని పేర్కొంది. ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండగా తన న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దేబాస్ దేకాపై ఐపీసీ సెక్షన్ 376, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించి.. లోబర్చుకుని.. జాబ్ వచ్చాక కాదన్నాడు
సహ విద్యార్థినితో ప్రేమాయణం సాగించాడు. ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుంటానని శారీకరకంగా లోబరుచుకున్నాడు. తీరా ఉద్యోగం వచ్చాక తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని వివాహానికి నిరాకరించాడు. మోసాన్ని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు, పెద్దలు కౌన్సెలింగ్ ఇచ్చినా వివాహానికి నిరాకరించాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. రామభద్రపురం: బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన మెరుపుల నాగేంద్ర, రామభద్రపురానికి చెందిన ఓ విద్యార్థిని 2014 నుంచి బొబ్బిలి రాజాకళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా డిగ్రీ ద్వితీయ సంవత్సరంలో ప్రేమగా మారింది. ఉద్యోగం వస్తే వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. మూడు నెలల కిందట ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నాగేంద్రకు ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని వివాహానికి నిరాకరించాడు. దీంతో ఆ అమ్మాయి మే 31వ తేదీన పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు దర్యాప్తు చేశారు. నిందితుడ్ని బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం సాలూరుకు రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నట్టు సీఐ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సై కృష్ణమూర్తితో కలసి సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు విలేకరులకు వెల్లడించారు. చదవండి: ప్రేమించి.. లోబర్చుకుని.. ఉద్యోగమొచ్చాక కాదన్నాడు -
ప్రియుడి ఇంట్లో బైఠాయింపు
వరంగల్ అర్బన్ ,ఎల్కతుర్తి: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంట్లో బైఠాయించి నిరసనకు దిగింది. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. దామెరకు చెందిన ప్రశాంత్కు, ధర్మసాగర్ మండలం దేవునూర్కు చెందిన ఓ యువతికి గుడిలో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నాలుగు రోజులుగా ప్రశాంత్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుంది. దీంతో సదరు యువతి బంధువులతో ప్రశాంత్ ఇంటికి చేరుకుని బైఠాయించింది. న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తానని భీష్మించుకు కూర్చుంది. విషయం తెలుసుకున్న ఎస్సైలు గడ్డం ఉమ, టీవీఆర్ సూరి, స్వప్న సిబ్బందితో దామెరకు చేరుకుని రెండు రోజుల్లో న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ప్రియుడి ఇంటి ముందు యువతి మౌనదీక్ష
పశ్చిమ గోదావరి, అత్తిలి: ప్రేమించి పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకుంటానని ఒప్పుకున్నాడు. తీరా ముహూర్తం సమయానికి ప్రేమికుడు పత్తా లేకుండా పోవడంతో యువతి ప్రియుడి ఇంటిముందు మౌనదీక్షకు దిగిన ఘటన అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు చెల్లబోయిన నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం...పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామానికి చెందిన నాగలక్ష్మి అదే గ్రామంలో రొయ్యల కంపెనీలో పనిచేయడానికి వెళుతుంది. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామానికి చెందిన కడలి కిషోర్ రొయ్యల కంపెనీలో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. ఐదు నెలల క్రితం కిషోర్ తన వెంటపడి ప్రేమిస్తున్నాను అని చెప్పాడని తొలుత అంగీకరించలేదని, తర్వాత అతని నిజాయతీని చూసి తానుకూడా ప్రేమించానని తెలిపింది. అయితే తనకు నమ్మకంలేక పెళ్లిచేసుకోవాలని కోరానని, రెండు నెలలు క్రితం ఫ్యాక్టరీ వద్ద తాళికట్టాడని, ఇంట్లో ఎవరికీ చెప్పవద్దని, రెండేళ్ల తరువాత ఇంటికి తీసుకువెళతానని అప్పటి వరకు ఎవరి ఇంటి వద్ద వాళ్లే ఉందామని చెప్పాడని తెలిపింది. గత నెల 18వ తేదీ రాత్రి కిషోర్ తన ఇంటికి రావడంతో తమ కుటుంబ సభ్యులు అతనిని పట్టుకుని పెనుమంట్ర పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని చెప్పింది. అక్కడ పోలీసుల సమక్షంలో నాగలక్ష్మిని పెళ్లి చేసుకున్నానని కిషోర్ ఒప్పుకున్నాడని, అంగీకార పత్రంపై ఇరు కుటుంబాల పెద్దలు సంతకాలు చేశారని వెల్లడించింది. దీంతో పెద్దలు వీరికి ఈనెల 5వ తేదీన సాయంత్రం మాముడూరు వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వివాహం చేయడానికి నిశ్చయించారు. అయితే వివాహానికి నాగలక్ష్మి సిద్ధమవుతున్న తరుణంలో 5వ తేదీ మధ్యాహ్నం కిషోర్ కుటుంబ సభ్యులు తమ పెద్దలకు ఫోన్చేసి, తమ అబ్బాయి కనిపించడంలేదని తెలిపారని, దీనిపై పెనుమంట్ర పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం ప్రియుడు కిషోర్ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి నాగలక్ష్మి మౌనదీక్షకు దిగింది. ప్రియుడి ఇంటికి తాళం వేసిఉండటంతో బాధితురాలు ఇంటి ముందే కూర్చుంది. తనకు న్యాయం చేయాలని, కిషోర్తో పెళ్లి చేసేవరకు ఇక్కడే ఉంటానని నాగలక్ష్మి పేర్కొంది. ఈసమాచారాన్ని ఆమె 100 నంబర్కు తెలపడంతో అత్తిలి పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. న్యాయం జరుగుతుందని, అధైర్యపడవద్దని పోలీసులు ఆమెకు భరోసా కల్పించారు. -
ప్రియుడి వంచన.. వివాహిత ఆత్మహత్యాయత్నం
కర్నూలు, బొమ్మలసత్రం: భర్తను కాదనుకొని వెళ్లిన ఓ వివాహితను ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నంద్యాల మండలం కానాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కానాలకు చెందిన సుబ్బ లక్ష్మమ్మ కూతురు శాంతమ్మ, అదే గ్రామానికి చెందిన రాజేష్ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి శాంతమ్మను ఓ వ్యక్తికి ఇచ్చి తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే పెళ్లైన 10 రోజులకే తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు భర్తకు చెప్పడంతో అతడు విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లి విడిపోయారు. దీంతో శాంతమ్మ భర్తను వదిలి ప్రియుడి రాజేష్ వద్దకు వెళ్లిపోయింది. ఇద్దరూ సహజీవనం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో రెండు సార్లు అబార్షన్ చేయించాడు. తనను వివాహం చేసుకోవాలని పలుమార్లు కోరినా అప్పుడు ఇప్పుడూ అంటూ దాట వేస్తూ వచ్చాడు. వారం క్రితం పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పడంతో పుట్టినింటికి చేరుకుంది. తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం ఉదయం మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో పడివుండగా తల్లి గుర్తించి బంధువుల సాయంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎలాగైనా తన బిడ్డకు న్యాయం చేయాలని శాంతమ్మ తల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement