-
IND VS AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ విడుదల
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరుగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ (మార్చి 26) విడుదలైంది. భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ హైఓల్టేజ్ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. 1991-92 సీజన్ తర్వాత తొలిసారి ఈ సిరీస్ ఐదు మ్యాచ్ల సిరీస్గా మారింది. ఈ సిరీస్లో రెండో టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్గా సాగనుంది. పింక్ బాల్తో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్కు సంబంధించిన టికెట్లు జూన్ 4 నుంచి ఆన్లైన్లో లభ్యమవుతాయి. ఇటీవలికాలంలో జరిగిన నాలుగు BGT సిరీస్లను వరుసగా కైవసం చేసుకున్న టీమిండియా.. ఐదో సిరీస్పై కన్నేసింది. భారత్ 2017, 2019, 2021, 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్.. నవంబర్ 22-26- పెర్త్ డిసెంబర్ 6-10- అడిలైడ్ ఓవల్ (డే అండ్ నైట్, పింక్ బాల్ టెస్ట్) డిసెంబర్ 14-18- గబ్బా డిసెంబర్ 26-30- మెల్బోర్న్ 2025 జనవరి 3-7- సిడ్నీ -
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 వేదికలు ఖరారు
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగాల్సి ఉన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 వేదికలు ఖరారైనట్లు తెలుస్తుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) ప్రకారం ఈ టోర్నీ ఈ ఏడాది నవంబర్-వచ్చే ఏడాది జనవరి మధ్యలో జరుగనుంది. ప్రతిష్టాత్మక సిరీస్కు ఈ దఫా ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. సంప్రదాయానికి విరుద్దంగా ఈసారి నాలుగు మ్యాచ్ల సిరీస్ కాకుండా ఐదు మ్యాచ్ల సిరీస్ జరుగనుందని తెలుస్తుంది. ఇందులో ఓ డే అండ్ నైట్ మ్యాచ్ను కూడా యాడ్ చేశారని సమాచారం. ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు సిరీస్ల్లో (BGT) భారత్ చారిత్రక విజయాలు సాధించిన విషయం తెలిసిందే. 2018-19, 2020-21 సిరీస్లను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై టెస్ట్ల్లో భారత్ సాధించిన తొలి విజయాలు ఇవే. ఇటీవల భారత్ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లోనూ భారత్దే పైచేయిగా నిలిచింది. ఈ సిరీస్లోనూ టీమిండియా 2-1 తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. భారత్లో జరిగిన 2016-17 సిరీస్లోనూ టీమిండియానే విజయం వరించింది. ఆ సిరీస్లో కూడా భారత్.. 2-1 తేడాతో ఆసీస్ను ఓడించింది. ఈ లెక్కన టీమిండియా ఆసీస్పై వరుసగా నాలుగు టెస్ట్ సిరీస్ల్లో విజయాలు సాధించింది. అన్ని సిరీస్ల్లో టీమిండియా 2-1 తేడాతో ఆసీస్ను చిత్తు చేయడం విశేషం. ఈ నాలుగు సిరీస్ల్లో 2020-21 గబ్బా టెస్ట్కు చాలా ప్రత్యేకత ఉంది. అప్పటిదాకా గబ్బాలో ఓటమి ఎరుగని ఆసీస్కు టీమిండియా ఓటమి రుచి చూపించింది. ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు చారిత్రక విజయాన్ని అందించాడు. రాబోయే సిరీస్ 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్ట్యా చాలా కీలకం కానుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్పై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వేదికలను లాక్ చేసినట్లు సమాచారం. తొలి టెస్ట్: పెర్త్ రెండో టెస్ట్: అడిలైడ్ (డే అండ్ నైట్) మూడో టెస్ట్: గబ్బా నాలుగో టెస్ట్: మెల్బోర్న్ ఐదో టెస్ట్: సిడ్నీ -
ఆ విజయం తర్వాత ఆసీస్ మమ్మల్ని చూసి భయపడుతోంది: కోహ్లి
ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సిరీస్లో విజయం సాధించడంతో కంగారూ జట్టు కూడా టీమిండియాను చూసి భయపడుతుందని కోహ్లి తెలిపాడు. కాగా 2018-19 ఆసీస్ టూర్లో కోహ్లి కెప్టెన్సీలో టెస్టు సిరీస్ను భారత్ సొంతం చేసుకోగా.. 2020-21లో రహానే సారధ్యంలో కూడా చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించింది. అయితే ఈ సిరీస్లో తొలి టెస్టుకు విరాట్ కోహ్లినే నాయకత్వం వహించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లి స్వదేశానికి రావడంతో రహానే టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక ఇదే విషయంపై తాజాగా స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడాడు. "టెస్టు క్రికెట్ తొలి రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండేది. ఇరు జట్ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉండేది. కానీ మేము ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీస్లు గెలిచిన తర్వాత ఆ పోటీ కాస్త గౌరవంగా మారింది. అప్పటి నుంచి మమ్మల్ని ఆసీస్ జట్టు తేలికగా తీసుకోవడం లేదు. వారి గడ్డపై కూడా మేము గట్టి పోటీని ఇచాం. అలా అని ఆసీస్ను మేము కూడా తేలికగా తీసుకోం" అని కోహ్లి పేర్కొన్నాడు.అదే విధంగా ఓవల్ మైదానం గురించి మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడిన జట్టే చాంపియన్గా నిలుస్తుంది అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి లండన్లోని ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. చదవండి: WTC Final 2023: అశ్విన్ వర్సెస్ ఉమేశ్ యాదవ్.. రోహిత్కు కఠిన పరీక్ష! -
హ్యాట్సాఫ్ హార్దిక్ పాండ్యా.. అశ్విన్ ప్రశంసల జల్లు! ఇలాంటి స్టార్ నోటి నుంచి..
India Vs Australia: ‘‘సాధారణంగా మనమంతా మన వైఫల్యాలకు ఇతరులను బాధ్యులను చేసేలా మాట్లాడతాం. మనం నిరాశ చెందాల్సి వచ్చిన సమయంలో మూఢనమ్మకాలు, ఇతరత్రా కారణాలు చూపి తప్పించుకోవాలని చూస్తాం. కానీ హార్దిక్ అలా కాదు. టెస్టులు ఆడేందుకు ప్రస్తుతం తాను అర్హుడిని కానని తనే స్వయంగా అంగీకరించాడు’’ అంటూ టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రశంసించాడు. స్టార్ నోటి నుంచి ఇలాంటి మాటలు.. పాండ్యాలాంటి స్టార్ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అతడి గొప్పదనానికి నిదర్శనమని.. హ్యాట్సాఫ్ హార్దిక్ పాండ్యా అంటూ ఆకాశానికెత్తాడు. కాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో తొలి మ్యాచ్కు పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన హార్దిక్కు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జట్టు కూర్పు గురించి ప్రశ్న ఎదురైంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే అవకాశం ఉందా అని విలేకరులు హార్దిక్ను ప్రశ్నించగా.. తానిప్పుడు టెస్టులు ఆడేందుకు ఏమాత్రం సిద్ధంగా లేనని, వేరొకరి స్థానాన్ని ఆక్రమించలేనని వ్యాఖ్యానించాడు. టీమిండియా టెస్టు విజయాల్లో తన పాత్ర ఏమాత్రం లేదని.. అలాంటిది జట్టులో చోటుకు అర్హుడినెలా అవుతానని ప్రశ్నించాడు. హార్దిక్ వ్యాఖ్యలపై స్పందించిన అశ్విన్ హిందుస్థాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. అతడి నిజాయితీని మెచ్చుకున్నాడు. హార్దిక్ కెప్టెన్సీ అమోఘం ఇక ఆసీస్తో తొలి వన్డేల్లో టీమిండియా ఘన విజయం నేపథ్యంలో.. ‘‘రోహిత్ శర్మ గైర్హాజరీలో హార్దిక్ టీమిండియాను ముందుండి నడిపించాడు. ఆస్ట్రేలియా భారీ స్కోరు చేస్తుందని అంతా భావించారు. కానీ హార్దిక్ తెలివిగా సిరాజ్, షమీతో వరుస ఓవర్లు వేయించి సఫలమయ్యాడు. స్పిన్నర్లు రెండు వికెట్లు తీసిన తర్వాత కూడా పేసర్లకు ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. 155కి కేవలం మూడు వికెట్లు కోల్పోయి పటిష్టంగా ఉన్న జట్టును 188 పరుగులకే ఆలౌట్ చేయడమంటే మాటలు కాదు’’ అని హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రశంసించాడు. కాగా ముంబై వన్డేలో గెలుపొందిన టీమిండియా.. వైజాగ్ మ్యాచ్లో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. దీంతో 1-1తో సమమైన సిరీస్ ఫలితం మార్చి 22నాటి చెన్నై ఫలితంతో తేలనుంది. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్.. జూన్ 7న మొదలుకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు సిద్ధమవుతున్నాడు. చదవండి: IPL 2023: పంజాబ్ కింగ్స్కు ఊహించని షాక్.. విధ్వంసకర వీరుడు దూరం! ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో భారీ కుదుపు.. నంబర్ 1 స్థానం కోసం కొత్త ఛాలెంజర్ -
ICC Test Rankings: టీమిండియా ఆటగాళ్ల సత్తా.. నంబర్1 అశూ! ఇక కోహ్లి ఏకంగా
ICC Test Rankings- Ravichandran Ashwin- Virat Kohli: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి నంబర్ 1 బౌలర్గా అవతరించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాకింగ్స్లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు.. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ర్యాంకింగ్స్లో ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకాడు. తద్వారా 13వ ర్యాంకు సాధించాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సైతం బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 44వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో సత్తా చాటి ఈ మేరకు టీమిండియా ఆటగాళ్లు ఆయా విభాగాల్లో ర్యాంకులు సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అశ్విన్ సొంతగడ్డపై ఆసీస్తో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో అశ్విన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా 25 వికెట్లు కూల్చి టీమిండియా ట్రోఫీ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. మొత్తంగా 25 వికెట్లు తీయడంతో పాటు 86 పరుగులు సాధించిన అశూ.. మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(22 వికెట్లు, 135 పరుగులు)తో కలిసి సంయుక్తంగా ఈ అవార్డు పంచుకున్నాడు. కాగా బీజీటీ-2023 నేపథ్యంలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ను వెనక్కి నెట్టి నంబర్1గా అవతరించిన అశ్విన్.. మధ్యలో పాయింట్లు కోల్పోయి అతడితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆసీస్తో ఆఖరి టెస్టులో 7 వికెట్లు తీసి మళ్లీ నంబర్ 1 ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 1205 రోజుల నిరీక్షణకు తెరదించి కోహ్లి టీమిండియా స్టార్ బ్యాటర్, రన్మెషీన్ దాదాపు మూడున్నరేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టెస్టుల్లో సెంచరీ సాధించాడు. ఆసీస్తో ఆఖరిదైన అహ్మదాబాద్ మ్యాచ్లో అంతర్జాతీయ కెరీర్లో 75, టెస్టుల్లో 28వ శతకం సాధించాడు. దీంతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 13వ స్థానానికి చేరుకున్నాడు. కోహ్లి కంటే ముందు వరుసలో ఉన్న రిషభ్ పంత్ 9, రోహిత్ శర్మ 10వ ర్యాంకుతో టాప్-10లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాడు. చదవండి: Ban Vs Eng 3rd T20: ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్ అదుర్స్ WTC Final: కేఎస్ భరత్ స్థానానికి ఎసరు పెట్టిన టీమిండియా దిగ్గజం! అతడే సరైనోడు! అవునా.. నిజమా?!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement