breaking news
bittu
-
పిల్లలు చేసే విచిత్రం
సాయి ప్రణీత్, లిఖిత్, బిట్టు, నీరజ్ ముఖ్య తారలుగా జై రామ్కుమార్ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి సమర్పణలో మహ్మద్ అస్లాం నిర్మించిన ‘అంతా విచిత్రమ్’ పాటల విడుదల వేడుక హైదరాబాద్లో జరిగింది. జి.శ్రీను గౌడ్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు భోలే షావలి సంగీతం అందించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత అస్లాం మాట్లాడుతూ– ‘‘వినూత్నమైన కథాంశంతో రామ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను చూసి ఇంప్రెస్ అయిన ఎం. అచ్చిబాబు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు’’ అన్నారు. ‘‘పవన్కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి సూపర్ హీరోల ఫ్యాన్స్ అయిన కొందరు చిన్నారుల కథాంశమే ఈ చిత్రం’’ అన్నారు రామ్ కుమార్. చిన్నపిల్లలతో రూపొందిన ఈ చిత్రం విజయం సాధించాలని అతిథులుగా పాల్గొన్న రామ సత్యనారాయణ, సాయి వెంకట్, అనంతరాముడు ఆకాంక్షించారు. -
బకెట్లో పడి చిన్నారి మృతి
మహబూబ్నగర్(గోపాల్పేట్): బకెట్లో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా గోపాల్పేట మండలం నాగాపూర్లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డి, భార్గవి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు బిట్టు(2)ను మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ విషాదం జరిగింది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ మంచం పక్కనే ఉన్న నీళ్ల బకెట్లో పడి మృతి చెందాడు. బాలుడు బకెట్లో పడ్డ సంగతి ఆలస్యంగా తెలియడంతో అప్పటికే ఘోరం జరిగిపోయింది. చిన్నారి బిట్టు మృతితో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.