-
కిమ్ కంట కన్నీరు.. ఎందుకంటే..?
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కంటతడి పెట్టుకున్నారు. ఆ దేశంలో జననాల రేటు దారుణంగా క్షీణించడమే ఇందుకు కారణం. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. దయచేసి ఎక్కువ పిల్లల్ని కనండి అంటూ కన్నీరు కార్చారు. Kim Jong Un CRIES while telling North Korean women to have more babies. The dictator shed tears while speaking at the National Mothers Meeting as he urged women to boost the countries birth rate. pic.twitter.com/J354CyVnln — Oli London (@OliLondonTV) December 5, 2023 ఉత్తర కొరియా 1970-80లలో జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టింది. దానికితోడు 1990లో తీవ్ర కరువు ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జనాభా రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. ఉత్తరకొరియాలో జననాల సంఖ్య భారీ స్థాయిలో క్షీణించింది. 2023లో జననాల రేటు 1.8 ఉంది. ఉత్తర కొరియా జనాభా 2034 నుండి ఘణనీయంగా తగ్గిపోతుందని హ్యుందాయ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. 2070 నాటికి జనాభా 23.7 మిలియన్లకు తగ్గుతుందని అంచనా వేసింది. పక్కనే ఉన్న దక్షిణ కొరియాలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు ఉంది. పిల్లల సంరక్షణ, పిల్లల చదువులు, కార్పొరేట్ సంస్కృతి వంటి కారణాలు జననాల రేటుపై ప్రభావం చూపుతున్నాయి. జననాల సంఖ్యను పెంచడానికి కిమ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది పిల్లల కోసం ప్రిఫరెన్షియల్ ఉచిత హౌసింగ్ ఏర్పాట్లు, సబ్సిడీలు, ఉచిత ఆహారం, వైద్యం, గృహోపకరణాలు, విద్యాపరమైన ప్రోత్సాహకాలను అందిస్తోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న కుటుంబాల కోసం ప్రత్యేక రాయితీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: అదే రోజున పార్లమెంట్పై దాడి.! భారత్కు పన్నూ బెదిరింపులు -
ప్రభుత్వ వైద్యంపై భరోసా.. ఆచరణలో చూపుతున్న ఐఏఎస్, ఐపీఎస్లు
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): నాటి ఐటీడీఏ పీఓ, నేటి ఖమ్మం జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్దత్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తదితర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. చిన్నపాటి జ్వరమొస్తేనే కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మెరుగైన వైద్యం అందుతుందని మాటల్లో చెప్పడమే కాదు చేతల్లోనూ నిరూపిస్తున్నారు. తమ సతీమణులకు వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించడంపై అభినందలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రి అంటేనే ఇప్పటికీ చాలా మందిలో తెలియని అపనమ్మకం, రిస్క్ చేస్తున్నామా అనే ఆందోళన వెంటాడుతుంటాయి. అందుకే అప్పు చేసైనా సరే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యానికే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ఇదే సమయాన ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు జరిగేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యంపై చిన్నచూపు చూస్తున్న ప్రజల్లో అపోహలు తొలగించేలా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కృషి చేస్తుండడం విశేషం. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసి ప్రస్తుతం ఖమ్మం కలెక్టర్గా వీ.పీ. గౌతమ్ 2019 అక్టోబర్ 28న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో తన సతీమణికి ప్రసవం చేయించారు. అలాగే, 2020 ఆగస్టు 27న ఎస్పీ సునీ ల్దత్ కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో తన భార్యకు ప్రసవం చేయించారు. తాజాగా భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సైతం తన సతీమణి మాధవికి బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ప్రస వం చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభు త్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందాలంటూ చెబు తున్న మాటలను ఆచరణలో చూపించిన యువ అధికారులు ‘భేష్’ అనిపించుకున్నారు. ఖమ్మం అదనపు కలెక్టర్ కూడా.. ఖమ్మం అదనపు కలెక్టర్గా ఐఏఎస్ అధికారి స్నేహలత మొగిలి విధులు నిర్వర్తిస్తుండగా, ఆమె భర్త, ఐపీఎస్ అధికారి శబరీష్ భద్రాద్రి జిల్లా మణుగూరు ఏఎస్పీగా ఉన్నారు. ఈమేరకు స్నేహలత గతనెల 22న ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. ఆ మరుసటి రోజు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆస్పత్రికి వెళ్లి స్నేహలత శబరీష్ దంపతులను అభినందించారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రి ప్రత్యేకం ఏజెన్సీలో నిత్యం వందలాది మంది రోగులకు వైద్య సేవలను అందించే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి జిల్లాకే తలమానికంగా ఉంది. భద్రాచలం చుట్టు పక్కల ఉన్న ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సేవలందించటంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ముందంజలోనే నిలుస్తోంది. అత్యధికంగా సాధారణ ప్రసవాలు చేస్తుండడంతో పాటు నవజాత శిశువులు, ఇతరత్రా సేవలను అందించడానికి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. అదేవిధంగా నాలుగు మార్లు కాయకల్ప అవార్డు సొంతం చేసుకున్న ఘనత ఈ ఆస్పత్రి సొంతం. అలాంటి ఏరియా ఆస్పత్రిలో తమ కుటుంబీకులకు వైద్యం చేయించి ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో భరోసా కల్పించటానికి యువ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కృషి చేస్తున్నారు. గతంలో భద్రాచలం ఐటీడీఏ పీఓగా పనిచేసిన వీరపాండియన్ తల్లిదండ్రులు ఇదే ఆస్పత్రిలో వైద్య సేవలను పొందేవారు. ఇవన్నీ పక్కన పెడితే భద్రాద్రి రామయ్య సన్నిధిలో కుమార్తె లేదా కుమారుడు పుట్టాలనే ఆకాంక్ష కూడా పలువురు తల్లిదండ్రులను ఈ ఆస్పత్రికి నడిపిస్తోందని చెబుతారు. కార్పొరేట్ సౌకర్యాలు ఉన్నాయ్..వినియోగించుకోండి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భద్రా ద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. తన సతీమణికి మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పురిటి నొప్పులు రాగా, భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి ముక్కంటేశ్వరరావు, ఆస్పత్రి పర్యవేక్షకులు రామకృష్ణ పర్యవేక్షణలో వైద్యులు భార్గవి, దేవిక, నర్సులు కళ్యాణి, రాజ్యలక్ష్మి ప్రసవం చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో వసతులు, నిపుణులైన వైద్య సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. దీంతో తన సతీమణికి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవం చేయించినట్లు కలెక్టర్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో వెల్లడించారు. -
ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చింది. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంకు చెందిన నవ్య అనే మహిళ కాన్పు కోసం శుక్రవారం భద్రాచలంలోని సరోజిని ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. ఆమెకు నొప్పులు తీవ్ర స్థాయిలో రావడంతో వైద్యులు సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు. తొలుత కవలలు ఉన్నట్టు భావించినా.. ముగ్గురు మగ శిశువులు జన్మించారని, తల్లీ, ఇద్దరు బిడ్డలు క్షేమంగా ఉన్నారని డాక్టర్ సరోజిని తెలిపారు. మరో బిడ్డ కొంత అస్వస్థతగా ఉండడంతో వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. అస్వస్థతగా ఉన్న శిశువుకి వైద్యం అందిస్తున్న దృశ్యం -
ఒకే రోజు తల్లులైన అనుష్క, బబిత
నటి అనుష్క, రెజ్లర్ బబిత ఇద్దరూ ఒకే రోజు తల్లులు అయ్యారు. అనుష్కకు అమ్మాయి. బబితకు అబ్బాయి. ఎవరు పుట్టినా ఈక్వల్ ఈక్వల్ అని ముందు నుంచీ ఇద్దరూ అంటూనే ఉన్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటూ వచ్చారు. బబిత అసలు తన పెళ్లి రోజే ఆడబిడ్డ కోసం ‘ఎనిమిదో అడుగు’ వేసింది! ‘ఆడబిడ్డను సంరక్షిస్తాను, చదివిస్తాను, ఆడిస్తాను’ అని ప్రమాణం చేస్తూ అందుకు సంకేతంగా ఏడడుగుల తర్వాత ఎనిమిదో అడుగు వేసింది. అనుష్క అయితే ఆరో నెలలో.. ‘అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఒకటే. అబ్బాయి పుట్టడం స్పెషలేం కాదు’ అని ఇన్స్టాగ్రామ్లో ఒక శక్తిమంతమైన పోస్ట్ పెట్టారు. ఈ బెస్ట్ మమ్మీల జెండర్ ఈక్వాలిటీ ఆదర్శవంతమైనది. ‘ఎనిమిదో అడుగు’లాంటిది. జనవరి 11న ముంబైలో అనుష్కా శర్మ, బబితా ఫోగట్ తల్లులయ్యారు. సాధారణ వ్యక్తి అయినా, సెలబ్రిటీ అయినా తల్లి తల్లే. అయితే ఈ తల్లులు ప్రత్యేకమైనవారు. సమాజానికి ఆదర్శప్రాయంగా ఉన్నవారు. తల్లి కాబోతున్నట్లు తెలిసిన నాటి నుంచీ బబిత, అనుష్క ‘ఏ బిడ్డయినా ఒక్కటే’ అని ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. ‘ఆడపిల్ల తక్కువ కాదు, మగపిల్లాడు ఎక్కువా కాదు. ఇద్దర్నీ సమానంగా చూడాలి. సమానంగా పెంచాలి’ అని పోస్ట్లు పెడుతూ వస్తున్నారు. మరి ప్రముఖులు, డబ్బున్నవాళ్లు పెంచినట్లుగా సగటు తల్లిదండ్రులు ఆడపిల్లని మగపిల్లాడితో సమానంగా పెంచగలరా? అని సోషల్ మీడియాలో వీళ్లకు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ‘‘పెద్ద తల్లి అయినా, పేద తల్లి అయినా ఒకటే. తల్లి ప్రేమలో తేడా ఉండదు. తేడా చూపించకూడదు’’ అని బబిత, అనుష్కల సమాధానం. ఈ ప్రశ్నలూ సమాధానాల వరకూ ఎందుకు? ఆడపిల్ల అని ఇంట్లోనే ఉంచేస్తే బబిత రెజ్లర్ అయి ఉండేవారా? దేశానికి మెడల్స్ సాధించుకుని వచ్చేవారా? అనుష్క నటి, నిర్మాత అయి ఉండేవారా? బబిత (31), అనుష్క (32) ఇంచుమించు ఒక ఈడు వారు. పురుషాధిక్య ప్రపంచంలోని అవరోధాలను దాటుకుని తమకంటూ ఒక గుర్తింపుతో నిలబడినవారు. అనుష్క అయోధ్య అమ్మాయి. బబితది హర్యానా. బబిత పేదరికం గురించి తెలిసిందే. అనుష్క కూడా అంత తేలిగ్గా ఏమీ ఇప్పటి తన స్థానానికి చేరుకోలేదు. బాలీవుడ్ బ్యాక్గ్రౌండ్ లేదు. తండ్రి మిలటరీ ఆఫీసర్, తల్లి గృహిణి. ఇక చూడండి.. సంప్రదాయం నుంచి గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఎంత కష్టమో. అందుకే ఈ ఇద్దరి మాట విలువైనది. తొలిసారి తల్లులు కాబోతున్న వారికి, ఇప్పటికే తల్లులైనవారికీ శిరోధార్యమైనది. తల్లి సపోర్ట్ ఉంటేనే తండ్రీ ఆడపిల్లల్ని వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా పెంచగలడు. ∙∙∙ సీమంతం జరిగేటప్పుడు బబిత ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆ వేడుకలో ఆమె రెండు కేక్లను కట్ చేశారు. ఒకటి బ్లూ కలర్ కేక్. ఇంకొకటి పింక్ కలర్ కేక్. బ్లూ మగపిల్లవాడికి. పింక్ ఆడపిల్లలకు. ఎంత అందమైన భావన. పెళ్లిలో కూడా బిబిత, ఆమె భర్త సుహాగ్ ఏడడుగుల తర్వాత ఎనిమిదో అడుగు వేశారు! ఆ ఎనిమిదో అడుగును బబితే భర్త చేత వేయించింది. ఆడబిడ్డను చదివిస్తానని, సంరక్షిస్తానని, ఆడుకోనిస్తానని ఆ దంపతులు చేసిన ప్రమాణానికి సంకేతం ఆ ఎనిమిదో అడుగు. అనుష్కకు కూడా ఇంత అందంగానే ఆలోచించారు. తను ఆరో నెల గర్భిణిగా ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. ‘ఎవర్ని కోరుకుంటున్నారు? మగబిడ్డనా, ఆడపిల్లనా?’ అని అభిమానులు ఆమెను అడుగుతుండేవారు. ఆ ప్రశ్నలకు సమాధానమే ఆ పోస్ట్. ‘‘మన సమాజంలో మగ బిడ్డ పుట్టడం ఒక ప్రత్యేక విషయం. ఈ దృష్టిని మనం వదులుకోవాలి. ఆడపిల్లల్ని రెస్పెక్ట్ చేసేలా మగపిల్లల్ని పెంచడం.. అదీ మనకు ఉండాల్సిన ప్రత్యేకత. తల్లిదండ్రుల బాధ్యత కూడా. మహిళలు సురక్షితంగా, భద్రంగా మసులుకునేలా అబ్బాయిని పెంచాలి. అప్పుడు మనకు అబ్బాయి ఉండటం గొప్ప అవుతుంది’’ అని ఆ పోస్ట్లో అనుష్క రాశారు. సందేహం లేదు అనుష్క ఆశించినట్లు బబిత కొడుకు పెరుగుతాడు. బబిత కోరుకున్నట్లు అనుష్క కూతురు ఈక్వల్ ఈక్వల్గా పెరుగుతుంది. -
బస్టాప్ వెనుక ప్రసవం
జనగామ: నిండు గర్భిణి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో రెండు గంటలు నరకయాతన అనుభ వించింది. నొప్పులు తీవ్రమవుతున్నా వైద్యులు కనికరించలేదు. రక్తం తక్కువగా ఉందని... హన్మకొండకు తీసుకెళ్లమని చెప్పి చేతులెత్తేశారు. అంబులెన్స్ అందుబాటులో లేక ఆ గర్భిణి పురిటి నొప్పులతో విలవిల్లాడి పోయింది. చివరకు ప్రభుత్వాసుపత్రి పక్కనే రోడ్డుపైనున్న బస్టాప్ వెనుకకు వెళ్లి పడిపోయింది. అక్కడే ప్రసవించింది. మానవత్వానికి మచ్చ తెచ్చిన ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని చంపక్హిల్స్ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో జరిగింది. వైద్యసిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన షేక్ హుస్సేన్ తన భార్య షేక్ బీబీని నాలుగో కాన్పు కోసం ఆదివారం చంపక్హిల్స్ మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాని(ఎంసీహెచ్)కి తీసుకు వచ్చాడు. అంతకు ముందు సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా, వైద్యుల సూచన మేరకు 108 అంబులెన్స్లో ఎంసీహెచ్కు తరలించారు. ఉదయం 10 గంటలకు డాక్టర్ను సంప్రదిం చగా, కాన్పు కోసం మెటర్నిటీ వార్డుకు తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యురాలు, గర్భిణికి రక్తం తక్కువగా ఉన్నట్లు గుర్తించి వెంటనే హన్మకొండ మెటర్నిటీ దవాఖానాకు రెఫర్ చేశారు. మరోవైపు బీబీకి నొప్పులు తీవ్రమ య్యాయి. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ‘కాన్పు చేయండి.. ఏం జరిగినా మాదే బాధ్యత’ అంటూ వేడుకున్నా వైద్యులు పట్టించుకోలేదు. అంబులెన్స్ కోసం నిరీక్షణ హన్మకొండకు వెళ్లేందుకు బయటకు వచ్చిన గర్భిణికి అంబులెన్స్ కనిపించక పోవడంతో అక్కడే నిరీక్షించింది. గంటసేపు ఎదురు చూసి ప్రైవేట్ వాహనంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యు లు సిద్ధమయ్యారు. అప్పటికే తీవ్ర నొప్పులతో బాధపడుతున్న షేక్బీబీ... ఆస్పత్రి గేటుబయట బస్టాప్ వెనకకు వెళ్లింది. నిమిషం వ్యవధిలోనే అరుపులు, కేకలు వినిపించడంతో తల్లీ, భర్త అటు వైపు వెళ్లారు. పండంటి కొడుకును చేతిలో పట్టు కుని, అలాగే గోడకు కూర్చుని ఉన్న బీబీని చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నా బిడ్డను కాపా డండి అంటూ తల్లి కన్నీటిపర్యంతం కావడంతో డాక్టర్, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. తల్లిబిడ్డను ఎమర్జెన్సీవార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. ఎంసీహెచ్ ఘటనపై ఎంపీ కోమటిరెడ్డి ఆరా జనగామలో గర్భిణి ఆస్పత్రి బయటనే ప్రసవించిన సంఘటనపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరా తీశారు. ప్రసూతి కోసం ఆస్పత్రికి వచ్చే పేద కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఎంపీ కోమటిరెడ్డి సూచించారు. ఎంపీ స్థానిక నాయకుల ద్వారా బాధిత మహిళ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గర్భిణికి అధిక రక్తస్రావం కావడం వల్లే... గర్భిణి షేక్ బీబీకి అధిక రక్తస్రావం జరి గింది. హన్మకొండ ఆస్పత్రికి వెళ్లాలని రెఫర్ చేశాం. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్కు కరోనా పాజిటివ్ రావడంతో రక్తం యూనిట్లు ఇక్కడ దొరికే పరిస్థితి లేదు. అందుకే డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంబులెన్స్ కూడా సిద్ధం చేయగా, కుటుంబ సభ్యులు హన్మకొండకు వెళ్లేందుకు విముఖత చూపించి సిద్దిపేటకు వెళ్తామని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలోనే ఆమె బయటకు వెళ్లడంతో కాన్పు జరిగిపోయింది. ఇందులో మా నిర్లక్ష్యం లేదు. – డాక్టర్ పజారి రఘు, ఎంసీహెచ్ సూపరింటెండెంట్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
పాలమూరుకు ఎంత చేసినా తక్కువే..
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement