-
Asian Games 2023, Fencing: క్వార్టర్ ఫైనల్లో భవానీ దేవి ఓటమి..
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఫెన్సర్ భవానీ దేవి కథ ముగిసింది. మహిళల వ్యక్తిగత సేబర్ విభాగం క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన యాకీ షావో చేతిలో 7-15 తేడాతో భవానీ ఓటమి పాలైంది. దీంతో తొలి ఆసియా క్రీడల పతకానికి అడుగుదూరంలో భవానీ దేవి నిలిచిపోయింది. క్వార్టర్స్ మొదటి పీరియడ్ ఆరంభంలో మూడు టచ్లతో అదరగొట్టిన భవానీ.. ఆ తర్వాత ప్రత్యర్ధి యాకీ షావో అద్బుతమైన కమ్బ్యాక్ బ్యాక్ ఇచ్చింది. యాకీ షావో వరుస టచ్లతో 8-3 అధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో పీరియడ్లో కూడా యాకీ షావో తన అధిపత్యాన్ని కొనసాగించింది. రెండో పీరియడ్లో చైనీస్ ఫెన్సర్ 6 టచ్లు చేయగా.. భవానీ దేవీ 4 టచ్లు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కాగా అంతకముందు 2021లో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్గా భవానీ దేవి చరిత్ర సృష్టించింది. చదవండి: ODI World Cup 2023: వరల్డ్కప్కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ -
భవానీదేవికి కాంస్యం
న్యూఢిల్లీ: భారత ఫెన్సర్ భవానీదేవి ఆసియా ఫెన్సింగ్ చాంపియన్షిప్లో చరిత్ర సృష్టించింది. చైనాలోని వూగ్జీలో జరుగుతున్న ఈ టోరీ్నలో ఆమె కాంస్యం సాధించడం ద్వారా ఈ పోటీల్లో పతకం గెలిచిన తొలి భారత ఫెన్సర్గా ఘనతకెక్కింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో (సబ్రే ఈవెంట్) 29 ఏళ్ల భవాని 14–15తో ఉజ్బెకిస్తాన్కు చెందిన జేనబ్ దేబెకొవా చేతిలో తుదికంటా పోరాడి ఓడింది. ఫలితం నిరాశపరిచినా ఆమె శ్రమకు కాంస్య పతకం లభించింది. ఈ టోర్నీలో భారత ఫెన్సర్ సంచలన విజయాలతో సెమీస్లోకి దూసుకొచి్చంది. క్వార్టర్ ఫైనల్లో భవాని 15–10తో ప్రపంచ చాంపియన్ ఫెన్సర్ మిసాకి ఎముర (జపాన్)ను కంగుతినిపించింది. మిసాకి గతేడాది కైరోలో జరిగిన ప్రపంచ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకం సాధించింది. ఈ మేటి ప్రత్యరి్థతో గతంలో తలపడిన ప్రతీసారి ఓటమి పాలైన భవానీ ఈ ఈవెంట్లో అద్భుత విజయం సాధించింది. ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్ కూడా అయిన భవాని ప్రిక్వార్టర్స్లోనూ తనకన్నా మెరుగైన మూడో సీడ్ ప్రత్యర్థి ఒజాకి సెరి (జపాన్)ని 15–11తో ఓడించింది. -
కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణం
లండన్: కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణ పతకం లభించింది. పురుషుల ఈపీ టీమ్ ఈవెంట్లో చింగాఖమ్ సింగ్, సునీల్ కుమార్, ఉదయ్వీర్ సింగ్, సదాశివన్లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ 45–44తో స్కాట్లాండ్ను ఓడించింది. మహిళల సేబర్ టీమ్ ఈవెంట్లో భవాని దేవి, జగ్మీత్ కౌర్, క్రిస్టీ జోష్నా జోస్, ఖుషీ వబికలతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ఇదే టోర్నీలో మహిళల సేబర్ వ్యక్తిగత విభాగంలో భవాని దేవి స్వర్ణ పతకాన్ని సాధించింది. చదవండి: Ind Vs Zim ODI Series: టీమిండియా కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్.. -
కామన్వెల్త్లో భారత ఫెన్సర్కు స్వర్ణం
లండన్: ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. ఇప్పుడు అక్కడే కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్ జరుగుతుండగా ఇందులోనూ భారత ఫెన్సర్ సత్తా చాటింది. చెన్నైకి చెందిన భవానీ దేవి అద్భుత ప్రదర్శనతో స్వర్ణం నిలబెట్టుకుంది. టైటిల్ నిలబెట్టుకునే క్రమంలో 42వ ర్యాంకర్ భవాని 15–10తో రెండో సీడ్ వెరొనికా వాసిలెవా (ఆస్ట్రేలియా)ను కంగుతినిపించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్గా ఘనత వహించిన ఆమె పసిడి పోరులో చక్కని ప్రతిభ కనబరిచింది. ఈ ఏడాది ఆరంభంలో తడబాటుకు గురైన ఆమె ఈ చాంపియన్షిప్లో మాత్రం నిలకడైన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. తొలుత ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ కప్లో 23వ స్థానంలో నిలిచి నిరాశ పడింది. అనంతరం జూలైలో కైరోలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఈ ఏడాది భవానీ దేవి పాల్గొన్న పదో అంతర్జాతీయ ఈవెంట్ ఈ కామన్వెల్త్ చాంపియన్షిప్ కాగా ఇందులో విజేతగా నిలవడం సంతోషాన్నిచ్చిందని ఆమె పేర్కొంది. ‘ఫైనల్ పోటాపోటీగా సాగింది. హోరాహోరీ పోరులో స్వర్ణం గెలుపొందడం ఆనందంగా ఉంది. ఇదే జోరును ఇకపై కొనసాగిస్తాను’ అని భవాని తెలిపింది. -
ఫెన్సర్ భవానీ దేవికి క్రీడా శాఖ చేయూత
ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన భవానీ దేవి (తమిళనాడు) వచ్చే ఏడాది నాలుగు అంతర్జాతీయ టోర్నమెంట్లలో బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలలో పాల్గొనేందుకు భవానీ దేవికి రూ. 8 లక్షల 16 వేలు కేంద్ర క్రీడా శాఖ మంజూరు చేసింది. జార్జియాలో వచ్చే జనవరి 14 నుంచి 16 వరకు జరిగే ప్రపంచకప్ టోర్నీతో భవానీ దేవి సీజన్ మొదలవుతుంది. ఆ తర్వాత బల్గేరియాలో, గ్రీస్లో, బెల్జియంలో జరిగే ప్రపంచకప్ టోర్నీలలోనూ ఆమె పోటీపడుతుంది. వైల్డ్ కార్డుతో ఆస్ట్రేలియన్ ఓపెన్లో... మెల్బోర్న్లో వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 30 వరకు జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఐదుసార్లు రన్నరప్ ఆండీ ముర్రే (బ్రిటన్) వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ముర్రే చివరిసారిగా 2019లో ఆడాడు. అనంతరం తుంటి గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకొని ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడాల్సి ఉండగా... కరోనా బారిన పడటంతో బరిలోకి దిగలేదు. చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement