breaking news
Bhavani devi
-
Asian Games 2023, Fencing: క్వార్టర్ ఫైనల్లో భవానీ దేవి ఓటమి..
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఫెన్సర్ భవానీ దేవి కథ ముగిసింది. మహిళల వ్యక్తిగత సేబర్ విభాగం క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన యాకీ షావో చేతిలో 7-15 తేడాతో భవానీ ఓటమి పాలైంది. దీంతో తొలి ఆసియా క్రీడల పతకానికి అడుగుదూరంలో భవానీ దేవి నిలిచిపోయింది. క్వార్టర్స్ మొదటి పీరియడ్ ఆరంభంలో మూడు టచ్లతో అదరగొట్టిన భవానీ.. ఆ తర్వాత ప్రత్యర్ధి యాకీ షావో అద్బుతమైన కమ్బ్యాక్ బ్యాక్ ఇచ్చింది. యాకీ షావో వరుస టచ్లతో 8-3 అధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో పీరియడ్లో కూడా యాకీ షావో తన అధిపత్యాన్ని కొనసాగించింది. రెండో పీరియడ్లో చైనీస్ ఫెన్సర్ 6 టచ్లు చేయగా.. భవానీ దేవీ 4 టచ్లు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కాగా అంతకముందు 2021లో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్గా భవానీ దేవి చరిత్ర సృష్టించింది. చదవండి: ODI World Cup 2023: వరల్డ్కప్కు జట్టును ప్రకటించిన శ్రీలంక.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ -
భవానీదేవికి కాంస్యం
న్యూఢిల్లీ: భారత ఫెన్సర్ భవానీదేవి ఆసియా ఫెన్సింగ్ చాంపియన్షిప్లో చరిత్ర సృష్టించింది. చైనాలోని వూగ్జీలో జరుగుతున్న ఈ టోరీ్నలో ఆమె కాంస్యం సాధించడం ద్వారా ఈ పోటీల్లో పతకం గెలిచిన తొలి భారత ఫెన్సర్గా ఘనతకెక్కింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో (సబ్రే ఈవెంట్) 29 ఏళ్ల భవాని 14–15తో ఉజ్బెకిస్తాన్కు చెందిన జేనబ్ దేబెకొవా చేతిలో తుదికంటా పోరాడి ఓడింది. ఫలితం నిరాశపరిచినా ఆమె శ్రమకు కాంస్య పతకం లభించింది. ఈ టోర్నీలో భారత ఫెన్సర్ సంచలన విజయాలతో సెమీస్లోకి దూసుకొచి్చంది. క్వార్టర్ ఫైనల్లో భవాని 15–10తో ప్రపంచ చాంపియన్ ఫెన్సర్ మిసాకి ఎముర (జపాన్)ను కంగుతినిపించింది. మిసాకి గతేడాది కైరోలో జరిగిన ప్రపంచ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకం సాధించింది. ఈ మేటి ప్రత్యరి్థతో గతంలో తలపడిన ప్రతీసారి ఓటమి పాలైన భవానీ ఈ ఈవెంట్లో అద్భుత విజయం సాధించింది. ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్ కూడా అయిన భవాని ప్రిక్వార్టర్స్లోనూ తనకన్నా మెరుగైన మూడో సీడ్ ప్రత్యర్థి ఒజాకి సెరి (జపాన్)ని 15–11తో ఓడించింది. -
కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణం
లండన్: కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు రెండో స్వర్ణ పతకం లభించింది. పురుషుల ఈపీ టీమ్ ఈవెంట్లో చింగాఖమ్ సింగ్, సునీల్ కుమార్, ఉదయ్వీర్ సింగ్, సదాశివన్లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ 45–44తో స్కాట్లాండ్ను ఓడించింది. మహిళల సేబర్ టీమ్ ఈవెంట్లో భవాని దేవి, జగ్మీత్ కౌర్, క్రిస్టీ జోష్నా జోస్, ఖుషీ వబికలతో కూడిన భారత జట్టు కాంస్య పతకాన్ని గెల్చుకుంది. ఇదే టోర్నీలో మహిళల సేబర్ వ్యక్తిగత విభాగంలో భవాని దేవి స్వర్ణ పతకాన్ని సాధించింది. చదవండి: Ind Vs Zim ODI Series: టీమిండియా కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్.. -
కామన్వెల్త్లో భారత ఫెన్సర్కు స్వర్ణం
లండన్: ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. ఇప్పుడు అక్కడే కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్షిప్ జరుగుతుండగా ఇందులోనూ భారత ఫెన్సర్ సత్తా చాటింది. చెన్నైకి చెందిన భవానీ దేవి అద్భుత ప్రదర్శనతో స్వర్ణం నిలబెట్టుకుంది. టైటిల్ నిలబెట్టుకునే క్రమంలో 42వ ర్యాంకర్ భవాని 15–10తో రెండో సీడ్ వెరొనికా వాసిలెవా (ఆస్ట్రేలియా)ను కంగుతినిపించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్గా ఘనత వహించిన ఆమె పసిడి పోరులో చక్కని ప్రతిభ కనబరిచింది. ఈ ఏడాది ఆరంభంలో తడబాటుకు గురైన ఆమె ఈ చాంపియన్షిప్లో మాత్రం నిలకడైన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. తొలుత ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ కప్లో 23వ స్థానంలో నిలిచి నిరాశ పడింది. అనంతరం జూలైలో కైరోలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఈ ఏడాది భవానీ దేవి పాల్గొన్న పదో అంతర్జాతీయ ఈవెంట్ ఈ కామన్వెల్త్ చాంపియన్షిప్ కాగా ఇందులో విజేతగా నిలవడం సంతోషాన్నిచ్చిందని ఆమె పేర్కొంది. ‘ఫైనల్ పోటాపోటీగా సాగింది. హోరాహోరీ పోరులో స్వర్ణం గెలుపొందడం ఆనందంగా ఉంది. ఇదే జోరును ఇకపై కొనసాగిస్తాను’ అని భవాని తెలిపింది. -
ఫెన్సర్ భవానీ దేవికి క్రీడా శాఖ చేయూత
ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న తొలి భారతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన భవానీ దేవి (తమిళనాడు) వచ్చే ఏడాది నాలుగు అంతర్జాతీయ టోర్నమెంట్లలో బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలలో పాల్గొనేందుకు భవానీ దేవికి రూ. 8 లక్షల 16 వేలు కేంద్ర క్రీడా శాఖ మంజూరు చేసింది. జార్జియాలో వచ్చే జనవరి 14 నుంచి 16 వరకు జరిగే ప్రపంచకప్ టోర్నీతో భవానీ దేవి సీజన్ మొదలవుతుంది. ఆ తర్వాత బల్గేరియాలో, గ్రీస్లో, బెల్జియంలో జరిగే ప్రపంచకప్ టోర్నీలలోనూ ఆమె పోటీపడుతుంది. వైల్డ్ కార్డుతో ఆస్ట్రేలియన్ ఓపెన్లో... మెల్బోర్న్లో వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 30 వరకు జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఐదుసార్లు రన్నరప్ ఆండీ ముర్రే (బ్రిటన్) వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో ముర్రే చివరిసారిగా 2019లో ఆడాడు. అనంతరం తుంటి గాయంతో బాధపడ్డాడు. గాయం నుంచి కోలుకొని ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడాల్సి ఉండగా... కరోనా బారిన పడటంతో బరిలోకి దిగలేదు. చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్.. -
ఆమె కత్తి మహా పదును.. ఏకంగా రూ.10 కోట్లు దాటింది
-
ఆమె కత్తి మహా పదును.. ఏకంగా రూ.10 కోట్లు దాటింది
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు(సెప్టెంబర్ 17)ను పురస్కరించుకుని వివిధ సందర్భాల్లో ఆయనకు బహుమతులుగా అందిన వస్తువుల ఈ-వేలం శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారుల పరికరాలు, దుస్తులు కూడా వేలానికి ఉంచారు. ఈ క్రమంలో విశ్వక్రీడల్లో భారత్ తరఫున ఫెన్సింగ్లో పోటీ పడ్డ తొట్టతొలి మహిళగా చరిత్ర సృష్టించిన భవానీ దేవి మరోసారి వార్తల్లో నిలిచింది. ఒలింపిక్స్లో ఆమె ఉపయోగించిన కత్తి(ఫెన్స్)కి ఈ-వేలంలో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఆమె కత్తిని రూ. 60లక్షల బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.10 కోట్లను దాటింది. పారాలింపిక్స్లో స్వర్ణం పతక విజేత షట్లర్ కృష్ణ నాగర్, మరో షట్లర్ సుహాస్ యతిరాజ్(రజత పతక విజేత)లు ఉపయోగించిన రాకెట్ల ధర కూడా రూ.10 కోట్లకు చేరింది. ఇక, టోక్యో ఒలింపిక్స్లో దేశానికి తొలి స్వర్ణం అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఉపయోగించిన ఈటెను రూ. కోటి బేస్ ధరతో వేలానికి పెట్టగా.. ప్రస్తుతం రూ.1.20 కోట్ల వద్ద కొనసాగుతోంది. ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా ఒలింపియన్గా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు రాకెట్కు రూ. 80లక్షల బేస్ధరతో వేలం నిర్వహిస్తుండగా.. ప్రస్తుతం రూ. 90లక్షలు దాటింది. బాక్సింగ్ సంచలనం లవ్లీనా చేతి గ్లౌజులను రూ. 80 లక్షల బేస్ప్రైజ్ వద్ద వేలం ప్రారంభించగా.. ప్రస్తుతం రూ.1.80 కోట్ల వద్ద కొనసాగుతోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారిక వెబ్సైట్లో (pmmementos.gov.in) ఈ వేలం ఇవాల్టి నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ వేలం ద్వారా సమకూరే నిధులను నమామి గంగే కార్యక్రమం కోసం వెచ్చించనున్నారు. చదవండి: టీ20ల చరిత్రలో అరుదైన ఘనత.. ఆ జాబితాలో ఇద్దరూ విండీస్ యోధులే -
టోక్యో నాకు పాఠాలు నేర్పింది: ఫెన్సర్ భవానీ దేవి
విశ్వక్రీడల్లో పోటీపడిన తొలి భారత ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి తనకు టోక్యో ఒలింపిక్స్ చక్కని పాఠాలు నేర్పిందని తెలిపింది. ‘రియో ఒలింపిక్స్ అనంతరం కష్టపడితేనే టోక్యో అవకాశం దక్కింది. ఇకపై మరింతగా చెమటోడ్చితేనే భవిష్యత్తులో రాణించవచ్చు. çముఖ్యంగా నేను నా టెక్నిక్ను మెరుగు పర్చుకోవాలి. నా ఆటతీరును సమీక్షించుకున్నాక అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకుంటాను’ అని 27 ఏళ్ల భవానీ వివరించింది. -
ఫెన్సర్ భవానీ దేవి క్షమాపణలు.. స్పందించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో భారత్ తరఫున ఫెన్సింగ్లో పోటీపడ్డ మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించిన భవానీ దేవి.. రెండో రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ మేనన్ బ్రూనెట్ చేతిలో 7-15 తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె యావత్ దేశానికి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలిపింది. 'శక్తిసామర్థ్యాల మేరకు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయా. నన్ను క్షమించండి. ప్రతి ముగింపు ఓ ప్రారంభానికి నాంది. శిక్షణను కొనసాగిస్తా. 2024 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకు సాగుతా' అని ట్వీట్ చేసింది. భవానీ దేవి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. Big Day 🤺 It was Excitement & Emotional. I won the First Match 15/3 against Nadia Azizi and become the First INDIAN Fencing Player to win a Match at Olympic but 2nd Match I lost 7/15 against world top 3 player Manon Brunet. I did my level best but couldn't win. I am sorry 🙏 🇮🇳 pic.twitter.com/TNTtw7oLgO — C A Bhavani Devi (@IamBhavaniDevi) July 26, 2021 You gave your best and that is all that counts. Wins and losses are a part of life. India is very proud of your contributions. You are an inspiration for our citizens. https://t.co/iGta4a3sbz — Narendra Modi (@narendramodi) July 26, 2021 ఆమె ట్వీట్కు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శక్తిమేరకు పోరాడావంటూ ట్విట్టర్ వేదికగా అభినందించారు. 'మీ అత్యుత్తమ సామర్థ్యం మేరకు పోరాడారు. మాకదే ముఖ్యం. గెలుపోటములు జీవితంలో ఒక భాగం. మీ సేవలకు భారత్ గర్విస్తోంది. మన దేశ పౌరులందరికీ మీరు స్ఫూర్తిగా ఉండిపోతారు' అంటూ ప్రధాని ఆమెకు అండగా నిలిచారు. తమిళనాడుకు చెందిన చందలవాడ ఆనంద సుందరామన్ భవానీ దేవి అరంగేట్రం ఒలింపిక్స్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశారు. తొలి రౌండ్లో నడియా అజిజిపై 15-3 తేడాతో గెలిచి ఔరా అనిపించారు. ఒలింపిక్స్ ఫెన్సింగ్లో ఓ మ్యాచ్లో గెలిచిన తొలి భారతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. -
కత్తి దూసేనా...
ఒలింపిక్స్ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోతున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన భవానీ దేవి పోరాటం నేడు మొదలుకానుంది. మహిళల వ్యక్తిగత సేబర్ ఈవెంట్ తొలి రౌండ్లో ఆమె పోటీపడనుంది. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ ఈవెంట్లో భవానీ దేవి పతకం రేసులో నిలవాలంటే కనీసం సెమీఫైనల్కు చేరుకోవాల్సి ఉంటుంది. మహిళల సేబర్ తొలి రౌండ్: భవానీ దేవి vs నదియా (ట్యునీషియా); ఉదయం గం. 5:30 నుంచి ఆ ఇద్దరిపైనే ఆశలు... పోటీల తొలి రెండు రోజులు భారత షూటర్లు నిరాశ పరిచారు. ఒక్కరు కూడా పతకం నెగ్గలేకపోయారు. మూడో రోజు పురుషుల స్కీట్ విభాగంలో అంగద్ వీర్ బాజ్వా, మేరాజ్ అహ్మద్ ఖాన్ పతకాల కోసం బరిలో ఉన్నారు. సోమవారం క్వాలిఫయింగ్–2లో వీరిద్దరు కనబరిచిన స్కోరు ఆధారంగా ఫైనల్ చేరుకుంటారో లేదో ఆధారపడి ఉంది. 30 మంది క్వాలిఫయింగ్లో పోటీపడుతుండగా టాప్–6 షూటర్లు మాత్రమే ఫైనల్కు అర్హత సాధిస్తారు. అంగద్ వీర్ బాజ్వా, మేరాజ్ అహ్మద్ ఖాన్ (పురుషుల స్కీట్ క్వాలిఫయింగ్–2; ఉదయం గం. 6:30 నుంచి)... ఫైనల్ (మధ్యాహ్నం గం. 12:20 నుంచి) -
నాన్న పూజారి.. అమ్మ నగలు అమ్మితే 6 వేలు.. ఇప్పుడిలా!
సాక్షి, వెబ్డెస్క్: వెయిట్ లిఫ్టింగ్... హాకీ.. రెజ్లింగ్.. జిమ్నాస్టిక్స్.. షూటింగ్.. బ్యాడ్మింటన్.. ఇలా ప్రతి విభాగంలోనూ భారత్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు భారతీయ మహిళా మణులు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్-2020లో రజత పతకం సాధించి భారత్కు తొలి పతకం అందించిన ‘వెండి కొండ’గా నీరజనాలు అందుకుంటోంది వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను. ఇక బ్యాడ్మింటన్లో పీవీ సింధు, మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ (58 కేజీల విభాగం)లో సాక్షి మాలిక్ గతంలో పతకాలు సాధించారు. అయితే, ఈ క్రీడలన్నింటికీ భిన్నంగా వినూత్న మార్గాన్ని ఎంచుకుంది సీఏ భవానీ దేవి. ఎవరికీ అంతగా పరిచయం లేని ‘ఫెన్సింగ్’ క్రీడాంశాన్ని ఎంపిక చేసుకోవడమే గాకుండా.. ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్గా ఆమె చరిత్ర సృష్టించింది. సగటు మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి నుంచి ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనే స్థాయికి చేరిన భవానీ దేవి గురించిన ఆసక్తికర అంశాలు మీకోసం. 11 ఏళ్ల వయస్సులోనే.. సీఏ భవానీ దేవి పూర్తి పేరు.. చదలవాడ ఆనంద సుందరరామన్ భవానీ దేవి. స్వస్థలం చెన్నై. ఆమె తండ్రి ఆలయ పూజారి. తల్లి గృహిణి. మరుగు ధనుష్కోడి గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యనభ్యసించిన భవానీ దేవి.. పదకొండేళ్ల వయస్సు నుంచే ఫెన్సింగ్ వైపు ఆకర్షితురాలైంది. ఎపీ, ఫాయిల్, సబ్రే.. ఈ మూడు విభాగాల్లో సబ్రేను తన క్రీడాంశంగా ఎంచుకుంది. తొలిసారే చేదు అనుభవం.. పద్నాలుగేళ్ల వయస్సులో టర్కీలో జరిగిన పోటీల్లో తొలి సారిగా భారత్ తరఫున అంతర్జాతీయ క్రీడల్లో భవానీ దేవి పాల్గొంది. అయితే, దురదృష్టవశాత్తూ.. మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన కారణంగా ఆ టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో మలేషియాలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్షిప్-2009లో పాల్గొన్న భవానీ దేవి.. తొలిసారిగా పతకం సాధించింది. ఆ తర్వాత 2010లో ఇంటర్నేషనల్ ఓపెన్, కాడెట్ ఏసియన్ చాంపియన్షిప్-2010, కామన్వెల్త్ చాంపియన్షిప్-2021, 2015 అండర్-15 ఏసియన్ చాంపియన్షిప్, ఫ్లెమిష్ ఓపెన్లో కాంస్య పతకాలు, అండర్-23 ఏసియన్ చాంపియన్షిప్-2014లో రజతం గెలుచుకుంది. కెరీర్లో మొత్తంగా తొమ్మిది నేషనల్ టైటిళ్లు సాధించిన భవానీ దేవి ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఎన్నో కష్టనష్టాలకోర్చిన ఆమె ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్లో పోటీపడే అవకాశం దక్కించుకుంది. భవానీ దేవి ఎదుర్కొన్న ఆటంకాలు, అవరోధాల గురించి ఆమె మాటల్లోనే... Olympics 2020 is just 2 days away and this will be the first time India will be participating in Fencing. I am thankful to the government of India, @IndiaSports, @Media_SAI for all their support. pic.twitter.com/mDirL8QeiG — C A Bhavani Devi (@IamBhavaniDevi) July 21, 2021 అమ్మ నాకోసం తన నగలు అమ్మింది.. ‘‘పదకొండేళ్లు ఉన్నపుడు తొలిసారి స్కూళ్లో ఫెన్సింగ్ను ఎంచుకున్నాను. ఎందుకో నాకు ఆ పేరే కొత్తగా, ప్రత్యేకంగా అనిపించేది. రోజురోజుకీ ఆసక్తి పెరిగిపోయింది. అయితే నాతో పాటు ఈ క్రీడను ఎంచుకున్న అమ్మాయిలు మధ్యలోనే డ్రాప్ అయ్యేవారు. కానీ నేను సీరియస్గా తీసుకున్నా. ముఖ్యంగా మా అమ్మానాన్నల ప్రోత్సాహం మరువలేనిది. ‘‘నీకు ఏదైతే నచ్చుతుందో అదే బాటలో నడువు’’ అని ఎల్లప్పుడూ అండగా ఉండేవారు. కేవలం మాటలకే పరిమితం కాలేదు వాళ్లు. మా నాన్న పూజారి. అమ్మ గృహిణి. నా తొలి ఫెన్సింగ్ కిట్ కొనడానికి అమ్మ తన నగలు అమ్మింది. 6 వేల రూపాయలు వచ్చాయి. అంతటితో వారి ప్రయత్నం ఆగిపోలేదు. స్పాన్సర్లను వెతకడానికి గంటల తరబడి వివిధ ఆఫీసుల్లో వేచి చూసేవారు. నిరాశతో ఇంటికి వచ్చినా.. చిరునవ్వు చెరగనీయక మంచి రోజులు వస్తాయంటూ వెన్నుతట్టేవారు. వారి ఆశలు, ఆశయం నెరవేర్చాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. అయితే ఎంత కష్టపడినా ఫలితం ఉండేది కాదు. మెంటార్ ఉంటే బాగుంటుందని భావించాను. అప్పుడే ఓ వ్యక్తి మా జీవితాల్లోకి వచ్చారు. ఆయన వల్లే అండర్-19 నేషనల్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించాను. అయితే, విదేశీ పర్యటనల ఖర్చులు భరించే స్థోమత లేక 2013లో ఫెన్సింగ్ను వదిలేద్దామనుకున్నా. అప్పటికే నా కోసం రూ. 10 లక్షల లోన్ తీసుకున్నారు. ‘‘అమ్మ.. ఇంతకంటే నాకోసం మీరు కష్టపడవద్దు. మన కుటుంబం ఈ దీన పరిస్థితిలో ఉండటం చూడలేను’’ అని అమ్మతో చెప్పాను. కానీ తను మత్రం.. ‘‘శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా వస్తుంది’’ అని నన్ను ఓదార్చింది. నాలో విశ్వాసం నింపింది. గట్టిగా ఏడ్చేశాను... అమ్మ భయపడిపోయింది 2014 నుంచి కఠోర సాధన చేశాను. ఏసియన్ చాంపియన్షిప్లో ఫెన్సింగ్ విభాగంలో తొలి పతకం(రజతం) సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్గా చరిత్ర సృష్టించాను. అయినా, కష్టాలు వీడలేదు. ఆర్ధిక పరిస్థితి రోజురోజుకీ దిగజారింది. విదేశాల్లో జరిగే టోర్నీలకు వెళ్లలేని దుస్థితి. అందుకే అప్పటి సీఎం జయలలిత మేడంకి లేఖ రాశాను. ఆమె నన్ను తన నివాసానికి పిలిపించి, ఖర్చులన్నీ భరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి అదృష్టం వరించింది. ఇక టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడం నా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం. ఈ వార్త వినగానే గట్టిగా ఏడ్చేశాను. అమ్మ భయపడిపోయింది. మర్లే పర్లేదు బేటా.. వచ్చేసారి నీకు అవకాశం వస్తుందిలే అని నన్ను బుజ్జగించింది. అసలు విషయం చెప్పిన తర్వాత తన ఆనందానికి అవధుల్లేవు. ఇటీవలి చాంపియన్షిప్ గెలిచిన తర్వాత 10 లక్షల లోన్ తిరిగి కట్టగలిగాను. మా అమ్మ వాళ్ల కోసం ఒక ఇల్లు కొనడం నా ముందున్న ఆశయం. నన్ను ఇంతదాకా తీసుకువచ్చిన నా కుటుంబం, శ్రేయోభిలాషులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. బంగారు పతకం సాధించి అమ్మను సగర్వంగా తలెత్తుకునేలా చేస్తాను’’ అని హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో భవానీ దేవి తన ప్రస్థానాన్ని పంచుకున్నారు. ఆమె కోరుకున్నట్లు స్వర్ణం సాధించి, విశ్వవేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం!! -
బాలాత్రిపుర సుందరీ నమోస్తుతే!