-
ముగిసిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి సీబీఐ కస్టడీ..
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డిహత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల సీబీఐ కస్టడీ ముగిసింది. అనంతరం నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు తరలించారు. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం ఇద్దరిని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 29 వరకు వైఎస్ భాస్కర్రెడ్డికి.. 26 వరకు ఉదయ్కు సీబీఐ కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ను విధించింది. కోర్టు ఆదేశాలతో భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డిలను హైదరాబాద్లోని చంచల్గూడ జైలుకు అధికారులు తరలించారు. -
వివేకా రెండో భార్య షమీమ్ సంచలన స్టేట్మెంట్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన రెండో భార్య షమీమ్ స్టేట్మెంట్ను సీబీఐ అధికారులు తీసుకున్నారు. ఈ సందర్బంగా సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో షమీమ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో షమీమ్.. సీబీఐకి మూడు పేజీల స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్లో వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. ఇక, స్టేట్మెంట్లో వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలను షమీమ్ వివరించారు. షమీమ్ తన స్టేట్మెంట్లో 2010 అక్టోబర్ 3న వివేకాతో తనకు వివాహం జరిగిందన్నారు. 2015లో తమకు షేహన్ షా(కొడుకు) జన్మించినట్టు స్పష్టం చేశారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతా రెడ్డి బెదిరించేది. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా.. నాతో ఫోన్లో మాట్లాడారు. బెంగళూరు భూ సెటిట్మెంట్లో 8 కోట్లు వస్తాయని వివేకా చెప్పారు. మా వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు, మమ్మల్ని దూరం పెట్టారు. షేహాన్ షాను రాజకీయంగా పైకి తీసుకొస్తా అని వివేకా చెప్పేవారు. పలు మార్లు శివ ప్రకాష్ రెడ్డి నన్ను బెదిరించారు. ఆ కారణంగానే చనిపోయాడని తెలిసినా రాలేకపోయాను. అన్యాయంగా వివేకా చెక్ పవర్ను తొలగించారు అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ‘వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయ్’ -
అయినా.. సీబీఐ తీరు మారలేదు
సాక్షి, అమరావతి: ‘న్యాయం జరగటమే కాదు. న్యాయం జరుగుతున్నట్లు కనిపించాలి’ ‘ఈ కేసులో రాజకీయ కోణాన్ని నిరూపించే ఒక్క ఆధారాన్ని కూడా సీబీఐ సేకరించలేదు. సీబీఐ దర్యాప్తు సమగ్రంగా లేదు’... ఇవీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల రెండు సందర్భాల్లో దేశ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు. సీబీఐ విచారణ తీరుపై ఈ వ్యాఖ్యలు చేయటంతోనే సుప్రీంకోర్టు సరిపెట్టలేదు. దర్యాప్తు ఎలా చేయాలో స్పష్టత ఇస్తూ... దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించింది కూడా. సీబీఐ అన్ని కోణాలనూ దర్యాప్తు చేయటం లేదని, కొందరిని దోషులుగా తేల్చాలన్న నిర్ణయాన్ని ముందే తీసేసుకుని దానికి తగ్గట్టుగా దర్యాప్తు చేస్తున్నట్లు కనిపిస్తోందని కేసులో నిందితుడైన శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ వేశారు. దానిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ పైవ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశిస్తూ పిటిషనర్కు ఊరటనిచ్చింది. దాని ప్రకారమే ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం కొత్తగా ఏర్పాటైంది. కానీ మునుపటి దర్యాప్తు అధికారి ఎక్కడైతే ఆగారో అక్కడి నుంచి దర్యాప్తు చేస్తున్నట్టుగా ఈ బృందం నేరుగా వైఎస్ అవినాశ్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నట్టు గడిచిన రెండుమూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. మరి ఇలాగైతే సుప్రీంకోర్టు తీర్పువల్ల పిటిషనర్కు ఏం ఊరట కలిగినట్టు? అసలు పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలన్న ఉద్దేశంతోనే కదా సుప్రీంకోర్టు కొత్త బృందాన్ని ఏర్పాటు చేయమన్నది. మరి ఆ బృందం కనీసం ఆ అంశాలవైపు చూడకుండా పాత దర్యాప్తుకు కొనసాగింపుగా చేసుకుంటూ పోతే ఏమనుకోవాలి? సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని సీబీఐ ఖాతరు చేయాల్సిన అవసరం లేదా? వివేకానందరెడ్డి హత్యకు బలమైన కారణాలుగా భావిస్తూ తులసమ్మ లేవనెత్తిన నాలుగు కీలక కోణాలను అసలు పట్టించుకోవడమే లేదెందుకు? ఇలాగైతే బాధ/æతులకు న్యాయం జరుగుతుందా? దర్యాప్తు అసమగ్రం.. దర్యాప్తు బృందాన్ని మార్చడమే నిదర్శనం ఓ కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడం అత్యంత అరుదు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సుప్రీంకోర్టు అటువంటి అసాధారణ నిర్ణయాన్నే తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు సమగ్రంగా లేదని భావించటంతో... న్యాయసూత్రాల ఆధారంగా దర్యాప్తు ఎలా చేయాలో చెప్పటమే కాక, దర్యాప్తు అధికారిగా ఉన్న అదనపు ఎస్పీ రామ్సింగ్ను తొలగించమని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వంలో ఎస్పీ వికాస్ సింగ్, అదనపు ఎస్పీ ముకేశ్ కుమార్లతో కొత్త బృందాన్ని సీబీఐ నియమించింది. పాత బృందం తప్పటడుగుజాడల్లోనే... పాత దర్యాప్తు బృందాన్ని మార్చమని సుప్రీంకోర్టు చెప్పిందంటేనే ... ఆ బృందం చేసిన దర్యాప్తు సక్రమంగా లేదని కదా!. వివేకాను హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్గా మార్చి, అతని వాంగ్మూలం ఆధారంగానే పాత దర్యాప్తు బృందం విచారణ కొనసాగించింది. ఆ దర్యాప్తు నివేదికలో ఎలాంటి ఆధారాలూ లేవని సుప్రీంకోర్టు చెప్పింది. దానర్థం అప్పటివరకు దర్యాప్తులో పట్టించుకోని కొత్త కోణాలను గుర్తించి, తగిన సాక్ష్యాలను సేకరించమని సుప్రీం కోర్టు చెప్పినట్టే కదా!. కానీ అది సీబీఐకి వినిపించలేదు. సీబీఐ కొత్త దర్యాప్తు బృందం కూడా హంతకుడైన దస్తగిరి వాంగ్మూలం చూట్టూనే దర్యాప్తును పరిమితం చేస్తోంది. అసలు వాస్తవాల జోలికి పోవటమే లేదు. దానికి తార్కాణాలివిగో... కనీసం విచారించకుండానే అరెస్టులా...!? ఉదయ్ కుమార్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డిలను సీఐబీ అరెస్టు చేసిన తీరు సహజ న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే ఏ నిందితుడినైనా విచారించకముందు అరెస్టు చేయటమనేది ఉండదు. కానీ ఈ దర్యాప్తు బృందం వారిని విచారించకుండానే అరెస్టు చేసేసింది. తాను విచారణకు సిద్ధంగా ఉన్నానని, పూర్తిగా సహకరిస్తానని భాస్కర్రెడ్డి మొదటి నుంచీ చెబుతున్నారు. పాత దర్యాప్తు బృందం ఓసారి ఆయన్ను విచారణకు రావాలని ఫోన్ చేసి పిలిచింది. దాంతో కడప జైలు వద్ద సీబీఐ అధికారుల కార్యాలయానికి వెళ్లారు. చాలాసేపు నిరీక్షించినా సీబీఐ ఆయన్ని విచారణకు పిలవ లేదు. పైగా నోటీసులివ్వకుండా ఎందుకు వచ్చారన్నట్టు మాట్లాడారు. వైఎస్ భాస్కర్రెడ్డి పుట్టినరోజు, పెళ్లి రోజు ఒకేరోజు. గత 20ఏళ్లుగా ఆ రోజున తీర్థయాత్రకు వెళుతున్నారు. ఈ ఏడాది కూడా సీబీఐ అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుని వెళ్లారు. అంటే సీబీఐ అధికారుల విచారణకు ఆయన మొదటి నుంచీ పూర్తిగా సహకరిస్తూనే ఉన్నారు. అటువంటి భాస్కర్రెడ్డిని కొత్త దర్యాప్తు బృందం కనీసం విచారించకుండానే నేరుగా వచ్చి అరెస్టు చేయడం విస్మయపరుస్తోంది. నోటీసులిచ్చి విచారించిన తరువాతే తదుపరి చర్యలు తీసుకోవాలన్న కనీస నిబంధనను కూడా పట్టించుకోలేదు. పైగా ఆయన విచారణకు సహకరించడం లేదని కోర్టులో చెప్పటం చూస్తే... విచారణ ఏ రీతిన సాగుతోందో అర్థమవుతుంది. అసలు ఆయన్ని విచారించేందుకు నోటీసే ఇవ్వని సీఐబీ ఆయన విచారణకు సహకరించడం లేదని ఎలా చెబుతుంది? పైగా వైఎస్ భాస్కర్రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేశాక.. విచారణ కోసం 10 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరడం ఉద్దేశపూర్వకంగా వేధించటానికేనని స్పష్టంకాక మానదు. – ఉదయ్ కుమార్రెడ్డిని కూడా అదే రీతిలో... ఈ కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా చెప్పాలని దర్యాప్తులో భాగంగా రామ్సింగ్ తనను వేధించారని గతంలో ఉదయ్కుమార్ రెడ్డి ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో కొత్త దర్యాప్తు బృందం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని ఎవరైనా భావిస్తారు. కానీ కొత్త బృందం ఉదయ్ని కనీసం విచారించకుండా... ఆయన ఆరోపణకు ఆధారం ఏమిటో అడగకుండా పులివెందులలోని ఆయన ఇంటికి నేరుగా వచ్చి... తమతో కడప రావాలని చెప్పి దార్లో అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్కు తరలించారు. ఒక్క కొత్త ఆధారాన్ని సేకరించనే లేదు... సుప్రీం కోర్టు కొత్త దర్యాప్తు బృందాన్ని నియమించమని ఆదేశించిందంటే... పాత దర్యాప్తు బృందం సరిగా విచారించ లేదని తేల్చినట్టే. కాబట్టి కొత్త బృందం ఈ కేసులో అప్పటివరకు విస్మరించిన కోణాలేమైనా ఉంటే వాటిని పరిశీలించాలి. అప్పటివరకు వెలుగుచూడని సాక్ష్యాలుంటే వెలికితీయాలి. కానీ డీఐజీ చౌరాసియా నేతృత్వంలో బృందం ఈ అంశాలు వేటినీ పట్టించుకోనే లేదు. ఈ కేసులో ఒక్క కొత్త ఆధారాన్నీ సేకరించలేదు. సాక్షులెవరినీ విచారించనేలేదు. అంతకుముందు రామ్సింగ్ బృందం ఏకపక్షంగా చేసిన దర్యాప్తునకు కొనసాగింపుగానే వ్యవహరిస్తోంది. ఆ తప్పటడుగుల్లోనే నడుస్తోంది. అంటే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తిని బేఖాతరు చేస్తోంది. రాజకీయ కోణానికి ఆధారాలేవి? వివేకా హత్య వెనుక రాజకీయ కోణం ఉందని నిరూపించే ఒక్క ఆధారాన్నీ సీబీఐ చూపించలేకపోయిందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కొత్త దర్యాప్తు బృందం కూడా ఆ దిశగా ఒక్క సాక్ష్యాన్ని కూడా సేకరించనే లేదు. కానీ భాస్కర్రెడ్డి అరెస్టు రిమాండ్ రిపోర్ట్లో మాత్రం రాజకీయ అంశాలను ఏకపక్షంగా ప్రస్తావించేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ వివేకానందరెడ్డి గతంలో భాస్కర్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొనడం హాస్యాస్పదమే. పాత బృందం ఇదే మాట అంటే అసలు రాజకీయ కోణం ఉన్నదనడానికి ఆధారాలేవని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దానికి ఒక్క ఆధారమూ చూపకుండానే ఈ బృందం కూడా అవే వ్యాఖ్యలను ఏకంగా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిందంటే ఏమనుకోవాలి? భాస్కర్రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యమూ లేదు... ఈ కేసులో భాస్కర్రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పనే లేదన్నది కీలకం. పైగా వైఎస్ అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డిల ప్రమేయం ఉనట్టుగా చెప్పాలని తమను సీబీఐ వేధిస్తోందని పలువురు సాక్షులు పేర్కొన్నారు. భాస్కర్రెడ్డిని ఏ ప్రాతిపదికన అరెస్టు చేశారంటే... దస్తగిరి అప్రూవర్గా ఇచ్చిన వాంగ్మూలాన్నే చూపిస్తుండటం చిత్రాతిచిత్రం. ఎందుకంటే వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేసింది దస్తగిరి. ‘నేనే నరికి చంపా’ అని అంగీకరించింది దస్తగిరి. అలాంటి దస్తగిరిని అప్రూవర్గా మార్చడమే సీబీఐ చేసిన పెద్ద పొరపాటు. ఇక దస్తగిరిని ఢిల్లీ తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి మరీ అప్రూవర్గా మార్చారని ఈ కేసులో మరో నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి గతంలోనే చెప్పారు. మరోవైపు ఈ కేసులో ఇతర నిందితులను అరెస్టు చేస్తూ... వారికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని వాదిస్తున్న సీబీఐ... వివేకానందరెడ్డిని స్వయంగా హత్యచేశానని ఒప్పుకున్న నిందితుడు దస్తగిరి బెయిల్ పిటీషన్ను వ్యతిరేకించకపోవడం విడ్డూరమే. ఈ అంశాలన్నింటినీ కొత్త దర్యాప్తు బృందం కనీసం విశ్లేషించనే లేదు. హంతకుడైన దస్తగిరి బయట తిరుగుతుంటే... అప్రూవర్గా అతనిచ్చిన అహేతుకమైన వాంగ్మూలం ఆధారంగా పలువురిని అరెస్టు చేస్తుండటమే విస్మయకరం. ఆ నాలుగు కోణాల్లో దర్యాప్తే చేయని సీబీఐ! ఈ కేసులో సీబీఐ అరెస్టు చేసిన శివశంకర్రెడ్డి భార్య తులసమ్మ కీలకమైన నాలుగు అంశాలను ప్రస్తావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కోణాల్లో దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న ఆమె వాదనను న్యాయస్థానం నమోదు చేసింది కూడా. ఆమె లేవనెత్తిన అంశాలు ఇవీ... 1. వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహంతో ఆ కుటుంబంలో ఆర్థిక విభేదాలు తలెత్తాయి. 2. వివేకానందరెడ్డికి కొందరితో ఉన్న ఆర్థిక లావాదేవీలు, సెటిల్మెంట్ వ్యవహారాలున్నాయి. 3. వివేకానందరెడ్డి అక్రమ లైంగిక సంబంధాలున్నాయి. దీనిపై ఆయన పట్ల కొందరు వ్యక్తిగత కక్ష పెంచుకున్నారు. 4. వివేకా రాజకీయ వారసత్వం కోసం ఆయన సొంత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలున్నాయి. కాకపోతే ఈ అంశాలపై కొత్త సీబీఐ బృందం కనీసం దృష్టి కూడా పెట్టలేదు. -
భాస్కర్రెడ్డిని కస్టడీకి ఇవ్వండి..సీబీఐ కోర్టులో దర్యాప్తు సంస్థ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన భాస్కర్రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పాటు ఉదయ్కుమార్ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై కూడా సోమవా రం సీబీఐ కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా, 2019 మార్చి 15న వివేకానందరెడ్డి మృతదేహం రక్తపు మడుగులో బాత్రూమ్లో లభ్యమైందని, ఈ హత్య వెనుక భారీ కుట్ర ఉందని సీబీఐ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్లో ఇంకా ఏం చెప్పిందంటే.. వివేకాతో వారికి పలు విభేదాలు ‘వివేకానందరెడ్డితో భాస్కర్రెడ్డికి, శివశంకర్రెడ్డికి పలు విభేదాలు ఉన్నాయి. 2017లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన వివేకా ఓడిపోయారు. ఈ ఓటమికి పై ఇద్దరే కారణమని వివేకా తీవ్ర ఆగ్రహంతో ఉండేవారు. హత్య చేసిన వారు కూడా భాస్కర్రెడ్డికి, శివశంకర్రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఈ కేసులో భాస్కర్రెడ్డి సహా పలువురు కీలక వ్యక్తులు ఉన్నారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. హంతకులకు రూ.40 కోట్లు ఇస్తానని శివశంకర్రెడ్డి హామీ ఇచ్చాడని దస్తగిరి చెప్పాడు. హత్య చేసే ప్రక్రియలో ఏ–1, ఏ–2, ఏ–3, ఏ–4 లను వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న చూశాడు. ఆ రోజు రాత్రి సుమారు 1.58 గంటల సమయంలో సునీల్యాదవ్ భాస్కర్రెడ్డి ఇంటి వద్ద ఉన్నట్లు అతని మొబైల్ లొకేషన్ చూపించింది. ఇది విచారణలో తేలింది. భాస్కర్రెడ్డి ఇతరులతో మాట్లాడినట్లు.. వారు అంతా చూసుకుంటారని హత్య తర్వాత ఎర్ర గంగిరెడ్డి.. ఇతర నిందితులకు చెప్పాడు. అ తర్వాత వివేకా గుండెపోటుతో చనిపోయారని.. భాస్కర్రెడ్డి, అవినాశ్రెడ్డి, శివశంకర్రెడ్డి, ఉదయ్కుమార్ కథ అల్లారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. అవినాశ్రెడ్డి.. అతని పీఏ రాఘవరెడ్డి ఫోన్ నుంచి సీఐ శంకరయ్యకు కాల్ చేశారు. వివేకా మృతి చెందారని చూసిన తర్వాతే అవినాశ్ ఫోన్ చేసినట్లు ఇదే ఆధారం. సాధారణ మరణం అని చెప్పడం కోసమే ఇదంతా చేశారు. ఆ తర్వాత రక్తపు మరకలను తుడిచి వేశాక మృతదేహాన్ని బెడ్రూంలోకి మార్చారు. ఈ హత్యలో వైఎస్ భాస్కర్రెడ్డి కీలక పాత్ర పోషించారు. మా విచారణలోనూ భాస్కర్రెడ్డి సహకరించలేదు. అందువల్ల కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నాం’ అని సీబీఐ కోరింది. -
నిజామాబాద్: గత ఎన్నికల్లో సీట్లు గెలిచినప్పటికీ.. సిట్టింగ్లలో టెన్షన్
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు అనుగుణంగా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐప్యాక్ బృందంతో జిల్లాలో నెలల తరబడి అన్ని అంశాలపై ఎమ్మెల్యేల గురించి సమగ్రంగా సర్వే చేయించారు. ఇందుకు సంబంధించిన నివేదికపై కేసీఆర్ పోస్ట్మార్టం చేస్తున్నారు. సాక్షి, నిజామాబాద్: ఆది నుంచి టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో గత శాసనసభ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిచినప్పటికీ, కేవలం మూడు నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం కల్వకుంట్ల కవిత ఓటమి నేపథ్యంలో జిల్లాపై సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడి సర్వే నివేదికలపై, కొందరు ఎమ్మెల్యేల గు ట్టుమట్లపై ప్రత్యేక పరిశీలన చేయనున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఆశావహుల బలాలు, బలహీనతలను కూడా బేరీజు వేసుకుంటూ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలి, నడవడిక, అక్రమాలు, పర్సంటేజీలు, కేడర్కు అందుబాటులో లేని పరిస్థితి, భూదందాలు, దాడులు చేయించడం తదితర అంశాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఒ క ఎమ్మెల్యే అయితే ఏకంగా పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులనే విచ్చలవిడిగా బెదిరింపులకు గురిచేసిన అంశాలను సైతం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లా నుంచి కొందరు సిట్టింగ్లను మార్చాల నే నేపథ్యంలో అన్ని రకాల అంశాలను క్రో డీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సమీకరణాలివి.. బాన్సువాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ నేత, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడైన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఈసారి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆదినుంచి క్షేత్రస్థాయిలో తిరుగులేని పట్టు కలిగి ఉన్న భాస్కర్రెడ్డి కి ఈ స్థానం కేటాయిస్తే ఎలా ఉంటుందనే విషయమై కూడా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మూ ర్ నియోజకవర్గం విషయానికి వస్తే ఎమ్మెల్యే పలుసార్లు స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరింపులకు గురి చేసినట్లు సోషల్ మీడియాలో ఆడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై కూడా సర్వేలో పూర్తివివరాలు సేకరించినట్లు సమాచారం. ఈసారి ఆర్మూర్ శాసనసభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అర్వింద్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్థానంలో సిట్టింగ్ను కొనసాగించాలా లేక అర్వింద్ సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలితకు టిక్కెట్టు కేటాయించాలా అనే విషయమై కూడా లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కవితను బరిలోకి దింపుతారనే చర్చ పార్టీ వర్గాల్లో, స్థాని క ప్రజాప్రతినిధుల్లో జరుగుతోంది. ఇక నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం విషయానికి వస్తే గణేష్ గుప్తా పనితీరు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రత్యర్థులు ఎవరెవరుంటారు.. గెలుపోటముల పరిస్థితి ఏమిటనే విషయమై లెక్క లు వేసి సర్వే నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బలాబలాల బేరీజు.. ఈ సర్వే నేపథ్యంలో జిల్లాలో ఎవరెవరికి టిక్కెట్ల కోత పెట్టాలనే విషయమై నిర్ణయించనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరెవరు పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరితో పోటీ ఎలా ఉంటుందనే విషయమై కూడా వివరాలు సేకరించారు. టీఆర్ఎస్ కార్యకర్తల్లో, ఉద్యమకారుల్లో పార్టీ నాయకులపై ఉన్న అభిప్రాయాలను కూడా సేకరించినట్లు తెలిసింది. ఇక ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీ చేయాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్న నేపథ్యంలో సదరు అంశంపైనా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ పోటీ చేస్తే ఆ ప్రభావం జిల్లాలో ఎలా ఉంటుందనే విషయమై కూడా వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద ఐప్యాక్ సర్వేపై కేసీఆర్ మదింపు చేస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ల్లో టెన్షన్ నెలకొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement