-
రూ.3500 కోట్లను సమీకరించిన భారతీ ఎయిర్టెల్
దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ హోల్డింగ్ కంపెనీ భారతీ టెలికాం రూ.3500 కోట్లను సమీకరించింది. వాణిజ్య పేపర్ల జారీ చేయడం ద్వారా ఈ మొత్తం నిధులను సమీకరించినట్లు కంపెనీ ఒక ప్రకనటలో తెలిపింది. 3నెలల మెచ్యూరిటితో సగటున 6.16శాతం ఆఫర్ చేసింది. సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి వినియోగిస్తామని కంపెనీని తెలిపింది. ‘‘రేట్ల మేన్జ్, ఇప్పటికే ఉన్న పోర్ట్ఫోలియో రీఫైనాన్సింగ్ నిర్వహించడానికి కంపెనీ చేసే సాధారణ ట్రెజరీ కార్యకలాపాలు ఇవి.’’ అని భారతీ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. క్యూఐపీ, ఓవర్సీస్ కన్వర్టబుల్ బాండ్ల జారీతో ఇప్పటికే ఈ ఏడాదిలో భారతీ ఎయిర్టెల్ 3బిలియన్ డాలర్లను సమీకరించింది. ఎయిర్టెల్లో భారతి టెలికాం 38.79 శాతం వాటాను కలిగింది. మార్చి 31 ముగిసిన త్రైమాసికం నాటికి కంపెనీకి మొత్తం రూ.88,251 కోట్ల నికర రుణాన్ని కలిగి ఉంది. లీజ్ ఆబ్లికేషన్తో కలుపుకుంటే కంపెనీ మొత్తం రుణాలు రూ.1.18లక్షల కోట్లకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం... ఏప్రిల్ 17, మే 15 మధ్య తేదిల్లో 3 నెలల కమర్షియల్ పేపర్ల వడ్డీ రేట్లపై 220 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఆర్బీఐ ఈ శుక్రవారం మే 22న పాలసీ రేటును శుక్రవారం 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన తరువాత కమర్షియల్ పేపర్లపై వడ్డీ రేటు మరింత తగ్గే అవకాశం ఉంది. భారతీ ఎయిర్టెల్ సమీకరించిన మొత్తం నగుదు ప్రధానంగా స్వల్పకాలిక ఫైనాన్సింగ్ అవసరాలను తీర్చేందుకు, ఇప్పటికే ఉన్న అప్పుల చెల్లింపులకు వినియోగించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు రోహణ్ దమీజా తెలిపారు. -
ఎయిర్టెల్కు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారీ నష్టాలకు తోడు ఇటీవలి ఏజీఆర్ వివాదంతో ఇబ్బందులు పడుతున్న ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్స్కు అనుగుణంగా ప్రవర్తించలేదన్న ఆరోపణలతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ భారతి ఎయిర్టెల్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎగుమతుల ప్రోత్సాహక పథకాల (ఇపీసీజీ) పథకం కింద ఎగుమతి నిబంధలను నెరవేర్చకపోవడంతో భారతి ఎయిర్టెల్ను విదేశీ వాణిజ్య రెగ్యులేటరీ ఈ జాబితాలో చేరింది. ఎగుమతి ప్రోత్సాహక మూలధన వస్తువుల పథకం కింద ఎగుమతి బాధ్యతను నెరవేర్చడంలో ఎయిర్టెల్ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్టెల్ను "తిరస్కరించిన ఎంట్రీ లిస్ట్" లో ఉంచినట్లు తెలిపాయి. దీంతో కంపెనీలు తమ దిగుమతి లైసెన్స్ను కోల్పోతాయి. మరోవైపు అవసరం లేని కారణగా 2018 ఏప్రిల్ నుండి అలాంటి లైసెన్స్ తీసుకోలేదని ఎయిర్టెల్ వివరించింది. అయినప్పటికీ గత లైసెన్సులన్నీ ముగిసిన నేపథ్యంలో కొత్త లెసెన్స్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. అయితే ఏ వస్తువులు (ఎగుమతి, దిగుమతి) ఈ లైసెన్సుల కిందికి వస్తాయనేది వెల్లడించలేదు ఈపీసీజీ పథకం కింద, ఎగుమతిదారుడు కొంతవరకు కేపిటల్ గూడ్స్ను సుంకాలేవీ లేకుండానే దిగుమతి చేసుకునే వీలుంటుంది. అలాగే ఎగుమతులకు సంబంధించిన ప్రక్రియలో సాంకేతికతను పెంచుకోవడం కోసం అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. కాగా 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లపాటు అమలులో ఉండేలా కొత్త వాణిజ్య విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కసరత్తును చేస్తోంది. -
ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తమ వినియోగదారులకు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకువచ్చింది. రూ. 279 రూ. 379 రీచార్జ్తో రెండు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను ఎయిర్టెల్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఈ రీఛార్జ్లో ఆన్లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లను అందిస్తుంది. వీటికి ఉచిత సబ్స్క్రిప్షన్తోపాటు నాలుగు లక్షల జీవిత బీమాను అందిస్తోంది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రూ. 279 రిఛార్జ్ చేసుకుంటే రోజూ 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. ఈ ప్యాక్ గడువు 28 రోజులని తెలిపింది. అలాగే రూ. 379 రీచార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ కాల్స్, కేవలం 6 జీబీ డేటా, 900 ఎస్ఎంఎస్లు మాత్రమే పొందడానికి వీలు ఉంటుంది. ఈ ప్లాన్ గడువు 84 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్లు ఎయిర్టెల్ నెట్వర్క్తోపాటు ఇతర అన్ని నెట్వర్క్లకు వర్తిస్తుంది. రూ.379 రీచార్జ్ ఫాస్టాగ్ కొనుగోలుపై రూ.100 క్యాష్బ్యాక్ను కస్టమర్లకు అందిస్తోంది. వీటితోపాటు వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇటీవలే ఎయిర్టెల్ వినియోగదారులకు భారీగా కోత విధించగా.. తాజాగా రెండు కొత్త ప్లాన్లను ప్రకటించి యూజర్లకు కొంత ఊరటనిచ్చింది. ఇటీవల అన్ని టెలికాం సంస్థలు ప్రీపెయిడ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. తమ కంపెనీ నష్టాలను పూడ్చేందుకే ఈ ధరలను పెంచుతున్నట్లు సదరు టెలికాం సంస్థలు పేర్కొన్నాయి. ఇక కొత్త ఎయిర్టెల్ ప్లాన్.. జియో, వొడాఫోన్ ఆఫర్లతో పోల్చితే మెరుగ్గానే ఉంది. జియో కూడా ప్రస్తుతం ఇలాంటి ఆఫర్నే అందిస్తుండగా ఆఫ్-నెట్ కాల్స్ చేసుకోడానికి ఐయూసీ ఛార్జీలు చెల్లించాలనే షరతు ఉంది. -
జియో దెబ్బ : ఎగిసిన ఎయిర్టెల్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ మళ్లీ ఫాం లోకి వస్తోంది. టెలికాం మార్కెట్లోకి జియో ఎంట్రీతో టారిప్ వార్లో భారీగా కుదేలైన భారతీ ఎయిర్టెల్ షేర్లు బిఎస్ఇలో సోమవారం 4 శాతం పెరిగి 19 నెలల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. దీంతో ఎయిర్టెల్ రూ .2 లక్షల కోట్ల (ట్రిలియన్) మార్కెట్ వాల్యుయేషన్ మార్క్ను తిరిగి దక్కించుకుంది. రిలయన్స్ జియో 6 పైసల వడ్డన ప్రకటించిన తరువాత నుంచి భారతి ఎయర్టెల్ వరుసగా ఐదవరోజు కూడా లాభపడింది. దీంతో షేరు ధర మార్చి 2018 నుండి అత్యధిక స్థాయిని తాకింది. గత ఒక వారంలో 2 శాతం లాభంతో పోలిస్తే, 16 శాతం ర్యాలీ చేసింది. దీంతో కంపెనీ 27,662 కోట్ల రూపాయల మార్కెట్ అదనంగా చేకూరింది. గత వారం, రిలయన్స్ జియో ఆఫ్-నెట్ కాల్లకు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని తెలిపింది. వినియోగదారుల నుండి ఇంటర్ కనెక్షన్ వినియోగ ఛార్జీలను (ఐయుసీ) ప్రకటించడంతో రిలయన్స్ జియో వినియోగదారుల ఆగ్రహానికి గురవుతోంది. తద్వారా ఇప్పటివరకు ఉచితంగా అందించిన వాయిస్ కాల్ సేవపై ఇపుడు ఛార్జీ వసూలు చేస్తుంది. ఈ చర్య ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు సానుకూలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్న సంగతి తెలిసిందే. -
పోస్ట్–పెయిడ్ ఆఫర్లను తగ్గిస్తున్న ఎయిర్టెల్..!
న్యూఢిల్లీ: దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్.. చౌక పోస్ట్–పెయిడ్ ప్యాకేజీల నుంచి క్రమంగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఖాతాదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పెంచే చర్యల్లో భాగంగా రూ.499 దిగువన ఉన్నటువంటి ఆఫర్ల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే రూ.299 ప్లాన్ను పక్కనపెట్టిన ఎయిర్టెల్.. క్రమంగా రూ.349, రూ.399 ప్యాకేజీల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తోందని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో ఈ రంగంలో మూడేళ్లపాటు కొనసాగిన తీవ్రపోటీ ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటోందని విశ్లేíషిస్తున్నారు. 2018 డిసెంబర్ నాటికి ఈ సంస్థకు 28.4 కోట్ల కస్టమర్ బేస్ ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement