breaking news
benefited
-
పొగాకు రైతుకు రూ.130 కోట్ల లబ్ధి
సాక్షి, అమరావతి: పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. వ్యాపారులతో పోటీపడి మార్క్ఫెడ్ పొగాకు కొనుగోలు చేస్తుండటంతో పంట ధర పెరుగుతోంది. దీంతో రైతుకు మంచి రేటు వస్తోంది. జూన్ నెలాఖరు వరకు ముప్పుతిప్పలు పెట్టిన వ్యాపారులు ప్రభుత్వ జోక్యంతో పంట కొనుగోలుకు ముందుకొస్తున్నారు. ►అకాల వర్షాల కారణంగా తెగుళ్లు సోకి ఈ సీజనులో పొగాకు దిగుబడి తగ్గింది. కేంద్ర ప్రభుత్వం టుబాకో బోర్డు ఆధ్వర్యంలో వేలం కేంద్రాలను ప్రారంభించినా కోవిడ్ కారణంగా ఎగుమతులు ఆగిపోవడంతో స్థానిక వ్యాపారులు సిండికేట్గా మారి రైతుల నుంచి చౌకగా కొనుగోళ్లకు ప్రయత్నించారు. ►కొందరు రైతులు లోగ్రేడ్ పొగాకును కిలో రూ.60 నుంచి రూ.70లోపే విక్రయించారు. ఇలా మూడు నెలల వ్యవధిలో రైతుల నుంచి 45 మిలియన్ కిలోల పొగాకును వ్యాపారులు కొనుగోలు చేశారు. నష్టపోతున్న పొగాకు రైతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు పరిస్ధితి వివరించడంతో వెంటనే స్పందించి కొనుగోలు బాధ్యతను మార్క్ఫెడ్కు అప్పగించారు. ►జూలై మొదటి వారం నుంచి మార్క్ఫెడ్ అన్ని వేలం కేంద్రాల్లో వ్యాపారులతో పోటీపడి పొగాకు కొనుగోలు చేయడంతో ఇప్పటివరకు 49 మిలియన్ కిలోల పొగాకును రైతులు అమ్ముకోగలిగారు. ప్రభుత్వ జోక్యం కారణంగా కొన్ని రకాల పొగాకుకు కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు ధర పెరగడంతో రైతులు లబ్ధి పొందారు. ‘లోగ్రేడ్ పొగాకు ధర కిలో రూ.40 – రూ.50 లోపే పలకడంతో విక్రయించలేక ఇంటికి తెచ్చా. లారీ కిరాయిల కోసం రూ.వేలల్లో ఖర్చయింది. చివరి ఆశగా ముఖ్యమంత్రి జగన్ను కలసి మా దుస్థితిని వివరించడంతో రెండు రోజుల్లోనే అధికారులతో సమావేశం నిర్వహించి పొగాకు రైతుకు అండగా నిర్ణయం తీసుకున్నారు. మార్క్ఫెడ్కు అధిక రేటుకు అమ్ముకుంటున్నాం. ఆ డబ్బుతో మళ్లీ సాగుకు సమాయత్తం అవుతున్నాం’ –రావూరి శ్రీకాంత్, కలిగిరి, నెల్లూరు జిల్లా. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో పొగాకు రైతులు రూ.130 కోట్ల వరకు లబ్ధి పొందనున్నారు. వ్యాపారులతో పోటీపడి మార్క్ఫెడ్ పొగాకు కొనుగోలు చేస్తుండటంతో ధరలు పెరిగాయి. దేశంలో మొదటిసారిగా పొగాకు విక్రయాల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది – మారెడ్డి సుబ్బారెడ్డి (ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు) -
కేంద్రంలో చక్రం తిప్పేందుకే..
సాక్షి, మహబూబాబాద్: సీఎం కేసీఆర్ కేంద్రంలో చక్రం తిప్పేందుకే లోక్సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కేంద్రంలో కీలకంగా మారితే రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావచ్చనే లక్ష్యంతోనే 16 స్థానాలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో ఆదివారం ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అధ్యక్షతన పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్యనాయకులతో లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో వార్వన్సైడే ఉందికానీ మెజార్టీ కోసమే పాటుపడుతున్నామన్నారు. 16 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డీలా పడిపోయిందని మళ్లీ కోలుకునే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పరిస్థితి చూసి చెందిన డీకే అరుణ, ఆనందభాస్కర్ లాంటి నాయకులు పార్టీని వీడారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల కార్యకర్త ఇంటికి వెళ్లి కూడా ఓటు అడుగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ దేనికి కూడా పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి కన్పించడంలేదన్నారు. దేశంలో ఎక్కవ లేని పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 4న సీఎం సభ.. వచ్చేనెల 4న మానుకోట జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభ విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మానుకోట నియోజకవర్గం నుంచే 50వేల మందికి పైగా రావాలన్నారు. ఎక్కువ ఓట్లు వచ్చిన మండలం, గ్రామాలను దత్తత తీసుకుంటామని తెలిపారు. ఎంపీ సీతారాంనాయక్కు మంచి భవిష్యత్ ఉంటుందని సీఎం చెప్పారని బాధపడొద్దని అన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి ఎక్కువ నిధుల కోసమే సీఎం తాపత్రయపడుతున్నారని తెలిపారు. విభజన చట్టంలోని అంశాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. మానుకోట జిల్లా రూపురేఖలు మారుతాయని తెలిపారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలను కీలకంగా తీసుకోవాలన్నారు. టీఆర్ఎస్కు పోటీ లేదని మెజార్టీ కోసం కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత మాట్లాడుతూ.. సమయం తక్కువగా ఉన్నందున కార్యకర్తలు ప్రచారం ముమ్మరం చేయాలని కోరారు. ఆడబిడ్డగా ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు. ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ.. మానుకోట నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మార్నేని వెంకన్న, పాల్వాయి రాంమోహన్రెడ్డి, భరత్కుమార్రెడ్డి, ఎం.రమేష్, నెహూర్రెడ్డి, మురళి, శ్రీకాంత్రెడ్డి, ఫరీద్, డోలి లింగుబాబు, డాక్టర్ నెహ్రూనాయక్, ముత్యం వెంకన్న, కెఎస్ఎన్రెడ్డి, ఎం రంగారావు ఖాసీం, చిట్యాల జనార్దన్, గడ్డం అశోక్, రఘు, బాలాజీ నాయక్, తేళ్ల శ్రీను, ఆవుల వెంకన్న పాల్గొన్నారు. 16 సీట్లు టీఆర్ఎస్వే .. దామెర: 16 సీట్లు..కారు..కేసీఆర్వే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం పరకాల నియోజకవర్గ స్థాయి ఎంపీ ఎన్నికల సన్నాహాక సమావేశం మండలకేంద్రం సమీపంలోని సైలానా బాబా దర్గ ఎదురుగా పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలుచుకోవాలని తదనుగుణంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. 16 సీట్లు గెలుచుకొని కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ద్వారా టీఆర్ఎస్ పార్టీ కీలకంగా మారి కేసీఆర్ ప్రధాని అవ్వాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీలో నిలిచిన పసునూరి దయాకర్ కు పరకాల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. 70 ఏళ్ళ కాంగ్రెస్ చేయని అభివృద్ధి ఐదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిందన్నారు. రైతుల గురించి ఎప్పుడైనా గత ప్రభుత్వాలు ఆలోచించిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాగానే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ద్వారా పరకాల నియోజక వర్గానికి నీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ 16 సీట్లు గెలిచి కేంద్రంలో కీలకంగా మారి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను, ఖాజీపేట్ రైల్వే డివిజన్ను, టెక్స్టైల్ పార్కుకు నిధులను సాధించుకోవచ్చునని పేర్కొన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే కేసీఆర్ పాలన ఆందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ మాట్లాడుతూ మొదటిసారిగా గెలిచిన తాను కొంత వరకు పనులు చేయడం జరిగిందని, కేసీఆర్ తనపై నమ్మకంతో రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగిందని అధినేత నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని తనను భారీ మెజారితో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కొంపెల్లి ధర్మరాజు, ఎర్రబెల్లి ప్రదీప్రావు, పులి సారంగపాణి, జాకీర్ అలీ, పోలీస్ధర్మారావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, సదానందం, నాగిరెడ్డి, దామెరుప్పుల శంకర్, కృపాకర్ రెడ్డి, రాజ్కుమార్, రమణారెడ్డి,గట్ల విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు.. కాంగ్రెస్ పార్టీ జెడ్పీఫ్లోర్ లీడర్ మూలగుండ్ల వెంకన్న పలువురు సర్పంచ్లు సుష్మా , వెంకన్నతో పాటు పలువురు ముఖ్య నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త పాత అనే తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తామన్నారు. కాని పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని మెజారిటీ కోసమే పాటుపడాలని పిలుపునిచ్చారు. -
'విభజనతో సీమాంధ్రకు మేలే జరిగింది'
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు పద్మరాజు,గంగాభవాని విమర్శించారు.అందుకే కాంగ్రెస్ నేతలను ఇష్టానుసారం ఆయన పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ త్వరలో వికటిస్తుందని వారు జోస్యం చెప్పారు. బుధవారం హైదరాబాద్లో వారిరువురు మాట్లాడుతూ... అవకాశవాదం,స్వార్థంతోనే నేతలు కాంగ్రెస్ వీడుతున్నారని వారు విమర్శించరు. అయితే కేడర్ మాత్రం పార్టీ వీడటం లేదన్న సంగతిని వారు ఈ సందర్బంగా గుర్తుచేశారు. తాను అధికారంలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్లా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అంటున్నారని, కానీ రానున్న తమ ప్రభుత్వ పాలనలో సీమాంధ్ర ప్రాంతం సింగపూర్ తలదన్నేలా అభివృద్ధి చెందుతుందని పద్మరాజు, గంగాభవానిలు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో అత్యధిక తీర ప్రాంతం గల సీమాంధ్ర అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు ఈర్ష్య పడతాయన్నారు. విభజనతో సీమాంధ్రకు మేలే జరిగిందని వారు స్పష్టం చేశారు.