battina brothers
-
ముగిసిన చేపమందు ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసింది. శనివారం ఉదయం 9 గంటల వరకు దాదాపు 75,567 మందికి చేపమందు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. క్యూ లైన్లలో మరో ఐదు వందల మంది వరకు ఇంకా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకూ క్యూ లైన్లో వేచి ఉన్న వారికి ప్రసాదం పంపిణీ చేయనున్నారు. మిగిలిన వారికి దూద్ బౌలిలోని తమ ఇంటి వద్ద పంపిణీ చేస్తామని బత్తిన కుటుంబ సభ్యులు చెప్పారు. పలు రాష్ట్రాల నుంచి ఆస్తమా రోగులు తరలివచ్చారు. దాదాపుగా 1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ బిక్షం రెడ్డి మాట్లాడుతూ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ ముగిసిందని తెలిపారు. ‘గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఎక్కువ మంది హజరయ్యారు. గత ఏడాది 59వేల మంది వస్తే.. ఈ ఏడాది దాదాపు 75వేల మంది వచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పంపిణీ చేశాం. పోలీస్ సిబ్బందికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు దొరకని వారు బత్తిన కుటుంబ సభ్యుల ఇండ్ల వద్ద తీసుకోవచ్చు’ అని చెప్పారు. -
చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభం
-
చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్: నాంపల్లి గ్రౌండ్స్లో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. అస్త్మా రోగులకు ఎన్నో ఏళ్లుగా బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు వేలాదిగా తరలి వచ్చారు. రోగులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మందు పంపిణీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేడు, రేపు నగరంలో చేప ప్రసాదం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: బత్తిని సోదరుల చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 8, 9 తేదీల్లో ప్రసాదం పంపిణీకి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6.30 వరకు ఆస్తమా బాధితులకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. దాదాపు లక్ష చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది మూడు లక్షల మంది వస్తారన్న అంచనాతో ప్రసాదాన్ని సిద్ధం చేసినట్టు నిర్వాహకుల్లో ఒకరైన బత్తిని హరినాథ్గౌడ్ తెలిపారు.