-
ఏం తమాషా చేస్తున్నారా..!
విజయనగరం పూల్బాగ్/ అర్బన్: ఎస్సీ,ఎస్టీ కేసులంటే లెక్కలేదా.. అధికారులు తమాషా చేస్తున్నారా.. అని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మండిపడ్డారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ఎస్సీ, ఎస్టీల హక్కులకు భంగం కలిగించినా.. ఎస్సీ, ఎస్టీ నిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవన్నారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార బాధితులకు న్యాయం చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా పూసపాటిరేగ మండలం ఎరుకొండలో సాంఘిక బహిష్కరణకు గురైన కుటుంబాలకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఈ నెలాఖరునాటికి ఖర్చుచేసి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ నియామకాల్లో తప్పనిసరిగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని ఆదేశించారు. జిల్లాలో ఇంకా కుల వివక్ష కొనసాగడం దారుణమన్నారు. పోలీసు యంత్రాంగం, ఎస్సీ,ఎస్టీ బాధితులకు అండగా నిలబడకపోగా వారిపైనే కేసులు పెట్టడం శోచనీయమని తెలిపారు. అనంతరం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలుపరుస్తున్న కార్యక్రమాలను శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీసు, సాంఘిక సంక్షేమశాఖ, అటవీ, వ్యవసాయ, మత్య్స, పశుసంవర్థక , విద్యుత్, ఉద్యానవన, పంచాయతీరాజ్శాఖ, సర్వశిక్షాభియాన్ అధికారులు తమ శాఖల ప్రగతి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్యాదవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకీ చర్యలు చేపట్టామన్నారు. దళిత, గిరిజన విద్యార్థులకు సకాలంలో పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ ఉపకారవేతనాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న 126 మందికి రూ.60 లక్షల వివాహ ప్రోత్సాహకాన్ని అందించామని వివరించారు. ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6.6 శాతం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శోభ స్వాతిరాణి, ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు కె రాజారావు, సిరివేలు సోమ, సుధారాణి, రవీంద్ర, నరహరి వరప్రసాద్, ఎస్టీ కమిషన్ ఓఎస్డీ సుబ్బారావు, జేసీ–2 కె. నాగేశ్వరరావు, డీఆర్ఓ ఆర్ఎస్ రాజ్కుమార్, అడిషనల్ ఎస్పీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి కారెం శివాజీ, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి పూలమాలలు వేసి నివాaళులర్పించారు. -
సమస్యలివీ...పరిష్కరించండి
ఎస్సీ,ఎస్టీ ప్రజావాణిలో అర్జీదారులు చిత్తూరు (అగ్రికల్చర్): జిల్లాలోని ఎస్సీ,ఎస్టీలు శని వారం ప్రత్యేక ప్రజావాణిలో వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ -2 వెంకటసుబ్బారెడ్డి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్పోస్టులు జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ఆలిండియా ఎస్సీ,ఎస్టీ ఐక్యవేదిక నాయకులు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఎస్సీ,ఎస్టీల బ్యాక్లాగ్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. జేసీ-2కు వినతి చేసిన వారిలో ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.మునస్వామి తదితరులు ఉన్నారు. స్కాలర్షిప్పుల పెండింగ్ జిల్లాలో 4 నుంచి 8వతరగతి వరకు చదువుతున్న యానాది(ఎస్టీలు) విద్యా ర్థులకు ఉపకార వేతనాలను అందించాలని ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటయ్య కోరారు. ఇంటిపట్టాలిప్పించండి ఇంటి పట్టాలు ఇప్పించాలని చంద్రగిరి మండలం ముంగిలిపట్టు దళితవాడకు చెందిన కే.నారాయణస్వామి, చిరంజీవమ్మ వినతి చేశారు. ఇటీవల తహశీల్దార్ తమపై దుర్భాషలాడుతూ ఇంటిపట్టాలు అడిగితే క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారని, ఒక రోజు రాత్రిపూట చంద్రగిరి పోలీస్స్టేషన్లో పెట్టించారని తెలిపారు. నిష్కారణంగా తహశీల్దార్ తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకుని ఇళ్లపట్టాలిప్పించాలని వినతి చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement