breaking news
Attacks on Hindus
-
వికటించిన స్నేహం చిగురించేనా?
అంతర్జాతీయ పరిణామాలెప్పుడూ స్థిరంగా ఉండవు. నిన్న మొన్నటి వరకు భారత్ నుంచి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు పొందిన పొరుగుదేశంబంగ్లాదేశ్లో మారిన అంతర్గత రాజకీయ పరిస్థితులు భారత్కు ఆందోళనకరంగా మారాయి. అక్కడి హిందువులపై దాడులు జరగడం వికటించిన స్నేహానికి నిదర్శనం. పాకిస్తాన్ నుంచి తమ దేశానికి రావడానికి ఉన్న వీసా నిబంధనను కూడా బంగ్లాదేశ్ సడలించింది. దేశ ద్వారాలను బార్లా తెర వడం వల్ల ఉగ్ర మూకలు స్థిర నివాసం ఏర్పరచుకొనే ప్రమాదం ఉంది.భద్రతాపరంగా ఇది కూడా భారత్కు ఆందోళనకరమే. స్వతంత్ర దేశంగాబంగ్లాదేశ్ ఏర్పడటంలో భారత్ పోషించిన పాత్ర చరిత్రాత్మకం. అలాంటి బంధమున్న దేశంతో తగిన విధంగా స్పందించి పరిస్థితులను చక్కబెట్టాలి.బంగ్లాదేశ్లో ఆగస్ట్ మాసంలో జరిగిన రాజకీయ విపరిణామాల కారణంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనా కట్టుబట్టలతో దేశం నుంచి పారిపోయి భారత్లో తలదాచుకొంటున్నారు. అప్పటినుంచీ భారత్, బంగ్లాదేశ్ మధ్య దాదాపు 5 దశాబ్దాల పాటు కొనసాగుతూ వచ్చిన స్నేహ సంబంధాలు ఒక్కసారిగా దెబ్బతిన్నట్లయ్యింది. 1971లో పాకిస్తాన్తో యుద్ధం చేసి, స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు ఓ స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్ ఏర్పడటంలో భారత్ పోషించిన పాత్ర చారిత్రాత్మకం.అందుకు భారత్ ఎంతో త్యాగం చేసింది. ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్ పునర్ నిర్మాణంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది. తమకు స్వేచ్ఛను కల్పించినందుకు బంగ్లాదేశీయులకు సైతం భారత్ పట్ల గౌరవాభిమానాలు నిన్నమొన్నటి వరకు అవిచ్ఛిన్నంగా కొన సాగాయి.మారిన పరిస్థితులుఇరు దేశాల మధ్య చక్కటి స్నేహ సంబంధాలు కొనసాగుతున్న తరుణంలో... బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న పరిణామాలతో పరిస్థి తులు తలకిందులయ్యాయి. 17 కోట్ల జనాభా కలిగిన బంగ్లాదేశ్లో దాదాపు కోటిన్నరకు పైగా హిందువులు ఉన్నారు. బౌద్ధులు, క్రైస్తవులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. గత 4 నెలలుగా బంగ్లా దేశ్లోని హిందూ ఆలయాలు, హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వం ఈ దాడులను నిరోధించకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. బంగ్లాదేశ్లో చోటు చేసుకొంటున్న పరిణామాలపై విదేశీ (ఇండియా) మీడియా వక్రభాష్యం చెబుతోందంటూ యూనస్ ఈ హింసను సమర్థించుకోవటానికి తాపత్రయపడుతున్నారు. పొరుగునున్న బంగ్లాదేశ్ ఒక్కసారిగా ప్రత్యర్థిగా మారడాన్ని భారత్ నిశితంగానే పరిశీలిస్తోంది. పార్లమెంట్లో అధికార బీజేపీ సభ్యులు ఈ అంశంపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మ«థురకు ప్రాతినిధ్యం వహిస్తున్న సినీ నటి హేమ మాలిని హిందువులపై జరుగుతున్న దాడులను ఎత్తిచూపడంతో పాటు, సాధువు చిన్మయి కృష్ణదాస్ను అరెస్ట్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.ఆశ్చర్యకరంగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులతో తమకు సంబంధమే లేనట్టు వ్యవహరిస్తోంది. బంగ్లాదేశ్తో 2,216 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొంటున్న పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ సైతం... ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడం లేదు. ఆ ద్వేషమే భారత్ వ్యతిరేకతకు కారణంప్రధాన ప్రతిపక్షాలన్నీ బహిష్కరించిన జాతీయ ఎన్నికలలో ఈ ఏడాది గెలిచిన షేక్ హసీనా మూడవ పర్యాయం ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొన్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రతిఫలించని ఆ ఎన్నికలలో హసీనా గెలుపును మెజారిటీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని హసీనా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అవామీ లీగ్ పార్టీ ప్రముఖులు పెద్ద ఎత్తున అధికార దుర్విని యోగానికీ, అవినీతికీ పాల్పడ్డారన్న క్రోధంతో ప్రజలు ఉన్నారు. పైగా, దేశంలో నిరుద్యోగం పెరుగుతుండగా స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్లుఅందించాలన్న హసీనా ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల కోపం అగ్గి మీద గుగ్గిలం చల్లినట్లయింది. ఒక దశలో దేశాభివృద్ధి రేటులో ఆసియాలోనే అగ్రగామిగా ఉన్న తమ దేశం క్రమంగా హసీనా పరివారం అవినీతి, అసమర్థత కారణంగా పాతాళానికి పడిపోయిందన్న ఆగ్రహమూ ఏర్పడింది. ఈ అంశాలు బంగ్లా ‘యువత’ను వీధుల్లోకొచ్చి ఉద్యమించేందుకు పురిగొల్పాయి. సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించకుండా ఉద్యమకారుల్ని అణచివేయడానికి ప్రభుత్వం సిద్ధపడటంతో పరిస్థితి చేయిదాటింది. యువత తిరుగుబాటు చేసి ప్రధాని నివాసాన్ని ముట్టడించి పాల్పడిన విధ్వంసాన్ని యావత్ ప్రపంచం చూసి నివ్వెరపోయింది. సకాలంలో షేక్ హసీనా, ఆమె సోదరి ఇద్దరూ తప్పించుకొని భారత్ చేరుకోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చిన భారత్ను బంగ్లాదేశీయులు తప్పుపడుతున్నారు. భారత్పై వారు గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించడానికి అదే కారణమని చెప్పాలి. ఆ వ్యతిరేకత కాస్తా హిందువుల పట్ల ద్వేష భావంగా రూపాంతరంచెందింది. దాంతో ఉద్యమకారులు హసీనా నివాసంపై దాడి చేశాక దేశంలోని హిందువులపైన, హిందువుల ప్రార్థనా మందిరాలపైన విరుచుకుపడి విధ్వంసం సృష్టించారు. దేశం విడిచిన షేక్ హసీనాకు అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించగా, భారత్ మాత్రం సాదరంగా ఆహ్వానించి ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. హసీనా ప్రభుత్వం స్థానంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ఎంతవరకూ వెళ్లిందంటే బంగ్లాదేశ్ జాతి పితగా పిలిచే షేక్ హసీనా తండ్రి ముజీబుర్ రహమాన్ చిహ్నాలను తొలగిస్తోంది. కరెన్సీ నోట్లపై ఆయన బొమ్మ ఉన్నందున, పాత కరెన్సీని తొలగించి దాని స్థానంలో ఆయన బొమ్మ లేకుండా కొత్త కరెన్సీని మరో 6 నెలల్లో చలామణీలోకి తెస్తోంది. కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్ల మీద హసీనాపై చేపట్టిన తిరుగుబాటు చిత్రాలను ముద్రించనున్నట్లుబంగ్లా సెంట్రల్ బ్యాంకు ప్రకటించడం సంచలనం కలిగించింది.పాక్తో సన్నిహితంగా బంగ్లా పాకిస్తాన్ నుంచి తమ దేశానికి రావడానికి ఉన్న వీసా నిబంధనను బంగ్లాదేశ్ సడలించినట్లుగా వార్తలొచ్చాయి. ఇదొక అనూహ్య పరిణామం. ఒకవిధంగా, బంగ్లాదేశ్ తన కన్నును తానే పొడుచు కొన్నట్లు భావించాలి. పాకిస్తాన్తో స్నేహ సంబంధాలను నెరపు కోవడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ, తమ దేశ ద్వారాలను బార్లా తెరవడం వల్ల ఉగ్రవాద మూకలు దేశంలోకి ప్రవేశించి స్థిర నివాసం ఏర్పరచుకొనే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్, భారత సరిహద్దుల వెంబడి 3 బెటాలియన్ల రక్షణ దళాలను (బీఎస్ఎఫ్) మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది.నిజానికి గత నాలుగైదు నెలలుగా భారత్ దౌత్యపరంగా అనేక దేశాలకు మరింత చేరువైంది. చైనా అండ చూసుకొని తోక జాడించాలనుకొన్న ‘మాల్దీవులు’ మళ్లీ తప్పు సరిదిద్దుకొని భారత్కు స్నేహహస్తం చాచింది. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ మాసంలో రష్యా, ఆ తర్వాత నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలలో పర్యటించి ఆ దేశాలతో గల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్ఠం చేశారు. మరోపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆఫ్రికా దేశాలలో పర్యటించడం వల్ల ఆ దేశాలతో భారత్ వ్యాపార, వాణిజ్య సంబంధాలు విస్తరించాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. నేడు ప్రపంచంలోనే భారత్ ఓ బలీయమైన దేశంగా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధాలను నిలువరించగలిగిన సామర్థ్యం గల దేశంగా పరిగణించబడుతున్న తరుణంలో చిరకాల మిత్రదేశం బంగ్లాదేశ్తో వైరం ఏర్పడటం ఆందోళనకరమే. 142 కోట్ల ప్రజల భద్రతకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు పూచీ పడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. బంగ్లాదేశ్లో ఉన్న లక్షలాది మంది హిందువుల మనుగడ ప్రశ్నార్థకం కాకముందే భారత ప్రభుత్వం తగు విధంగా స్పందించి వారి పూర్తి రక్షణకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.- వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు- డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు -
బంగ్లాదేశ్లో ఆలయాలు, దుకాణాలపై దాడులు
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్లో శుక్రవారం హిందువుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే పలు ఆందోళనకర పరిణామాలు సంభవించాయి. హిందూ ఆలయాలపై దుండగులు దాడులు చేశారు. హిందువులపై దాడి చేయడంతోపాటు వారి దుకాణాల్లో లూటీకి పాల్పడ్డారు. ఆపైన ఇస్కాన్పై నిషేధం విధించాలంటూ ర్యాలీ చేపట్టారు. హిందువులు అత్యధికంగా నివసించే కొత్వాలి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం ప్రార్థనల అనంతరం చోటుచేసుకున్న ఘటనలివి. జమాతె ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)కి చెందినట్లుగా భావిస్తున్న కొందరు చిట్టగాంగ్లోని రాధా గోవింద, సంతానేశ్వరి మాత్రి ఆలయాలపై దాడులకు పాల్పడ్డారు. మైనారిటీ వర్గం ప్రజలపై దాడులు చేశారు. హిందువులు నిర్వహించే దుకాణాలను ధ్వసం చేశారు. భయాందోళనలకు గురైన బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. అనంతరం దుండగులు ఇస్కాన్ను నిషేధించాలంటూ ర్యాలీ చేపట్టారు. ఇన్ని జరుగుతున్నా స్థానిక పోలీస్, ఆర్మీ అధికారులు వారిని తమను కాపాడేందుకు ఏమాత్రం ప్రయతి్నంచకుండా ప్రేక్షకపాత్ర వహించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. చిన్మయ్ దాస్ అరెస్ట్పై హిందువులు నిరసనలు తెలపడంతో దాడులు మరింతగా పెరిగాయి. చిన్మయ్ దాస్ బ్యాంక్ అకౌంట్ నిలిపివేత హిందూ మత పెద్ద చిన్మయ్ దాస్కు చెందిన వివిధ బ్యాంకు అకౌంట్లను బంగ్లాదేశ్ ఆర్థిక విభాగం స్తంభింపజేసింది. రాజద్రోహం నేరం కింద ఈ నెల 25న పోలీసులు చిన్మయ్ దాస్ను అరెస్ట్ చేయడం తెలిసిందే. దాస్తోపాటు ఇస్కాన్ సంబంధిత వ్యక్తులకు చెందిన మరో 17 అకౌంట్లను కూడా నెల రోజుల పాటు సీజ్ చేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. ఈ బ్యాంకు అకౌంట్ల లావాదేవీలన్నిటినీ నిలిపివేయాలని, ఇప్పటి వరకు జరిగిన లావాదేవీల వివరాల్ని అందజేయాలని ఆదేశించినట్లు పేర్కొంది. హిందువుల రక్షణకు చర్యలు తీసుకోండి:భారత్ హిందువుల పెరిగిపోయిన దాడులు, బెదిరింపులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీలకు భద్రత కల్పించాలన్న బాధ్యతను నెరవేర్చాలని బంగ్లా ప్రభుత్వాన్ని గట్టిగా కోరింది. మైనారిటీలపై దాడులను మీడియా ఎక్కువ చేసి చూపుతోందంటూ కొట్టిపారేయవద్దని విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ బంగ్లా ప్రభుత్వానికి స్పష్టం చేశారు. హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామన్నారు. హిందూ మత పెద్ద చిన్మయ్ దాస్పై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.మైనారిటీల భద్రత బాధ్యత బంగ్లా ప్రభుత్వానిదే: జై శంకర్ బంగ్లాదేశ్లోని మైనారిటీల రక్షణ కల్పించాల్సిన ప్రాథమిక బాధ్యత అక్కడి ప్రభుత్వానిదేనని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ శుక్రవారం లోక్సభలో అన్నారు. హిందువుల ఆలయాలు, దుకాణాలు, నివాసాలపై పెరిగిపోయిన దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలంటూ అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని కూడా చెప్పారు. దుర్గా పూజ సమయంలో మంటపాలపై దాడులు జరుగుతున్న విషయాన్ని అక్కడి ప్రభుత్వానికి తెలపగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచి్చందని గుర్తు చేశారు. కోల్కతాలో ఇస్కాన్ ర్యాలీ చిన్మయ్ కృష్ణ దాస్నను బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కోల్కతాలోని అల్బర్ట్ రోడ్లో వరుసగా రెండో రోజు శుక్రవారం ఇస్కాన్కు చెందిన పలువురు ప్లకార్డులు చేబూని ‘కీర్తన్’నిర్వహించారు. దాస్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు
ఢాకా: బంగ్లాదేశ్లో దైవదూషణల వార్తల నేపథ్యంలో వారం రోజులుగా హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆదివారం రాత్రి రంగ్పూర్ జిల్లా పీర్గంజ్ ప్రాంతంలోని ఓ గ్రామంలో హిందువులకు చెందిన 66 ఇళ్లను దుండగులు ధ్వంసం చేయడంతోపాటు మరో 20 ఇళ్లను అగ్నికి ఆహుతి చేశారు. ఈ సందర్భంగా ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి 52 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం భారీగా గాలింపు చేపట్టినట్లు తెలిపారు. తాజాగా, ఓ యువకుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ దైవదూషణకు ఉద్దేశించిందంటూ ఆగ్రహంతో కొందరు వ్యక్తులు ఆ గ్రామంపై దాడికి పాల్పడ్డారని అధికారులు చెప్పారు. -
హిందువులపై దాడులు సహించం
కోహీర్: హిందువులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు స్పష్టం చేశారు. బుధవారం కోహీర్ మండలం కవేలి గిరిజా సంగమేశ్వర స్వామి ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన హిందూ మత సంస్థల నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హిందూ సంస్కృతి మహోన్నతమైందన్నారు. అనేక శతాబ్దాలుగా దాడులు, అవమానాలను భరిస్తూ వచ్చిందన్నారు. సహనానికి మారుపేరైన హిందువులపై ఇంకా ఇతర మతస్థులు దాడులకు పాల్పడడం దారుణమన్నారు. మండలంలోని గురుజువాడ గ్రామంలో ప్రచారం చేస్తున్న కార్యకర్తలపై ఇతర మతస్థులు దాడి చేసి గాయపరచడం సహించరాని విషయమన్నారు. నిందితులపై చర్య తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అవమానానికి గురైన చోటి నుంచి రథయాత్రను తిరిగి ప్రారంభించడానికి ఆవకాశం ఇవ్వడం లేదన్నారు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. దాడి చేసి గాయపరిచిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో వీహెచ్పీ రాష్ట్ర నాయకులు హేమంత్ సంగ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బల్వంత్ రావు, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు పన్యాల ప్రభాకర్, బజరంగ్ దళ్ విభాగ్ ప్రముఖ్ సుభాష్, ఓంకార్ ఎకాల్ విద్యాలయ ప్రముఖ్ శంకర్, నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లికార్జున్ పాటిల్, నాయకులు సుధీర్ బండారీ, శివకుమార్, విశ్వనాథ్, మొగులయ్య, సిద్ధేశ్వర్, నరేష్ పాల్గొన్నారు.