-
పశ్చిమలోకి అశ్వారావుపేట
జంగారెడ్డిగూడెం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన అనంతరం వాటి సరిహద్దు ప్రాంతాల్లో భౌగోళికంగా ఏర్పడిన సమస్యలను సరిచేసేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. సరిహద్దు గ్రామాల మార్పు, చేర్పులకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రానికి నివేదికలు పంపించినట్టు అధికార వర్గాల భోగట్టా. ఇందుకు కేంద్రం అనుమతి ఇస్తే మన జిల్లాతోపాటు పొరుగున ఉన్న తూర్పు గోదావరి జిల్లా ముఖచిత్రం మారుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న అశ్వారావుపేట, ఆ మండల పరిధిలోని ఆసుపాక, ఊట్లపల్లి, నారాయణపురం, గుమ్మడివల్లి గ్రామాలను మన జిల్లాలో విలీనం చేసేలా.. రాష్ట్ర విభజన సందర్భంగా భద్రాచలం మండలం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన గుండాల, పురుషోత్తపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలిపేలా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై త్వరలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయనుందని సమాచారం. సమస్యల పరిష్కారానికే.. రాష్ట్ర విభజన సందర్భంగా భద్రాచలం మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు, బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు మన జిల్లాలో విలీనమయ్యాయి. అయితే, కుక్కునూరు నుంచి జీలుగుమిల్లి వరకు గల ప్రధాన రహదారి, దానిని ఆనుకుని ఉన్న గ్రామాలు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. కుక్కునూరు చేరుకోవాలంటే.. తెలంగాణ పరిధిలోగల అశ్వారావుపేట, ఆసుపాక, ఊట్లపల్లి, నారాయణపురం, గుమ్మడివల్లి గ్రామాల మీదుగా వెళ్లాల్సి ఉంది. ఈ పరిస్థితి వాహనాల రాకపోకలు, రెవెన్యూ విషయాల్లో సరిహద్దు సమస్యలకు కారణమవుతోంది. ఈ దృష్ట్యా ఆ ఐదు గ్రామాలను మన జిల్లాలో విలీనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇందుకు ప్రతిగా.. తూర్పుగోదావరి జిల్లాలో కలిసిన గుండాల, పురుషోత్తపట్నం, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలిపేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చినట్టు చెబుతున్నారు. జాతీయ రహదారి సమస్య ఆంధ్రా–తెలంగాణ సరిహద్దులు సక్రమంగా లేకపోవడంతో జాతీయ రహదారి సమస్య కూడా తలెత్తింది. భద్రాచలం నుంచి కొవ్వూరు వరకు గల ప్రధాన మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారిగా గుర్తించింది. భద్రాచలం, కుక్కునూరు ప్రాంతాల్లోని రహదారి మినహా అశ్వారావుపేట వరకు గల మార్గమంతా తెలంగాణలో ఉంది. అంతేగాక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు వెళ్లాలంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయిన అశ్వారావుపేట, వినాయకపురం, నారాయణపురం, ఆసుపాకల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఒక రాష్ట్రంలోని గ్రామాలకు మరో రాష్ట్ర సరిహద్దులను దాటుకుని వెళ్లాల్సి రావడంతో çసమస్య తలెత్తుతోంది. నియోజకవర్గం ఏర్పాటులోనూ.. నియోజకవర్గం ఏర్పాటు విషయంలోనూ సమస్యలు తలెత్తడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలు, గ్రామాలను పరస్పరం మార్చుకునేందుకు అంగీకరించినట్టు చెబుతున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే విలీన మండలాలు, కొత్తగా కలిసే మండలాలు, గ్రామాలతో మన జిల్లా నైసర్గిక స్వరూపం మారుతుంది. -
7 టన్నుల బెల్లం స్వాధీనం
ఖమ్మం జిల్లా: అశ్వారావుపేటలో అక్రమంగా నిల్వ ఉంచిన 7 టన్నుల బెల్లంను మంగళవారం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెల్లంను అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో నాలుగు కిరాణా షాపులపై దాడి చేశారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంత పనిచేశావమ్మా !
- - పసిబిడ్డ గొంతు కోసి, తనూ కోసుకున్న తల్లి - అంతలోనే పుట్టుకొచ్చిన మమకారం - బిడ్డను రక్షించాలంటూ వీధుల్లోకి పరుగులు - తల్లికి తప్పిన ప్రమాదం - విషమ స్థితిలోనే బాబు అశ్వారావుపేట : తల్లి క్షణికావేశం పసిబిడ్డ ప్రాణాలనే బలిగొనేందుకు, తానూ తనువు చాలించేందుకు పురిగొల్పింది. వెంటనే తేరుకుని బిడ్డ ప్రాణాలకు బతికించాలని ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. వీధుల వెంట పెరుగెత్తింది. కలకలం రేపిన ఈ ఘటన అశ్వారావుపేట మండలంలోని గాండ్లగూడెం తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన హలావత్ ప్రియాంక, అదే గ్రామానికి చెందిన భూక్యా చిట్టిబాబు ఏడాదిన్నర క్రితం ఒకరినొకరు ఇష్టపడటంతో ఇరువురి కుటుంబ సభ్యులు వారికి వివాహం జరిపించారు. వీరికి మూడు నెలల క్రితం ఒక బాబు జన్మించాడు. చిట్టిబాబు అదే గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మూడు రోజుల క్రితం భార్యాభర్తలు గొడవపడ్డారు. అప్పటి నుంచి ఇద్దరూ ముభావంగా ఉంటున్నారు. కాగా గురువారం ఉదయం చిట్టిబాబు పనికి వెళ్లే సమయానికి అన్నం, కూర వండలేదని ఆగ్రహించి వెళ్లిపోయాడు. దీంతో మనస్థాపానికి గురైన ప్రియాంక ఇంటిలోని బ్లేడుతో కన్నకొడుకు మెడను కోసి, తను కూడా మెడను కోసుకుంది. రక్తస్రావం అధికం కావడంతో మూడు నెలల పండంటి పసికందు ఆర్తనాదాలు అమ్మతనాన్ని గుర్తు చేశాయి. వెంటనే తన బిడ్డను కాపాడండంటూ కేకలు వేస్తూ ఇంటిలో నుంచి బయటకు పరుగులు పెట్టింది. రక్తమోడుతున్న తల్లీబిడ్డలను చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా నిష్చేష్టులయ్యారు. వెంటనే తేరుకుని ఇద్దరి గొంతులకు గుడ్డలు చుట్టి అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి తల్లికి ప్రమాదం లేదని చెప్పారు. లేత శరీరం కావడంతో బాబు గొంతు అధికంగా తెగిందని.. శ్వాస అందకపోవడంతో ఆక్సిజన్ అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించాలని సూచించారు. కాగా అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ లేకపోవడంతో దాదాపు గంటకు పైగా బాలుడిని ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలోనే ఉంచారు. అనంతరం 108 ద్వారా సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి నుంచి అంబులెన్స్ ద్వారా ఖమ్మం తరలించారు. బాలుడి పరిస్థితి ఇంకా విషయంగానే ఉందని బంధువులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement