breaking news
Asifabad Assembly Constituency
-
గోండు సామ్రాజ్యంలో అక్కా చెల్లెళ్ళ పోటీ?.. ఆదివాసీలు ఎటువైపు!
ఎన్నికల్లో వేర్వేరు పార్టీల నుంచి బంధువులు పోటీ పడటం కొత్తేమీ కాదు. అన్నదమ్ములు, అక్కా తమ్ముళ్ళ ఇలా రక్త సంబంధీకులు కూడా చాలా చోట్ల పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కారు, హస్తం పార్టీల నుంచి అక్కా చెల్లెళ్ళ పోటీ పడబోతున్నారు. ఆ ఇద్దరు ఎవరో..యుద్ధంలో గెలిచేదెవరో చూద్దాం. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్ చేతిలో ఉన్న ఈ సీటు దక్కించుకోవడానికి అధికార బీఆర్ఎస్.. సీటు నిలుపుకోవడానికి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆరు నూరైనా ఆసిఫాబాద్ దక్కించుకోవాల్సిందేనని కేడర్ను సిద్ధం చేస్తున్నాయి. ఆదివాసీలైన గోండుల ప్రాబల్యం ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది వారే. అన్ని పార్టీలు ఆ వర్గం నుంచే అభ్యర్థిని బరిలో దించడం సర్వసాధారణం. అందుకే గోండుల సామ్రాజ్యంలో గులాబీ జెండాను ఎగురవేయడానికి అసిపాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కోవ లక్ష్మి 2014లో ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోవ లక్ష్మి తప్పకుండా విజయం సాధిస్తారని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. ఇదే సమయంలో కోవ లక్ష్మిని కట్టడి చేయడానికి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. కోవ లక్ష్మి మీద ఆమె స్వంత చెల్లెలిని బరిలో దించే ఆలోచన చేస్తోంది. ఆసిఫాబాద్ సర్పంచ్గా పనిచేసిన మర్సకోల సరస్వతిని అభ్యర్థిగా నిలిపేందుకు పావులు కదుపుతోంది. కోవ లక్ష్మి, మర్సకోల సరస్వతి మాజీ రాష్ట్ర మంత్రి కోట్నాక భీమ్రావు బిడ్డలు కావడం విశేషం. గులాబీ పార్టీ అక్క లక్ష్మికి టిక్కెట్ ఖరారు చేసింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి చెల్లెలు సరస్వతి దరఖాస్తు చేసుకున్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సరస్వతి అయితేనే కోవ లక్ష్మికి సరైన ప్రత్యర్థి అవుతారని భావిస్తున్నారు. అయితే కోవలక్ష్మి ఒకసారి ఎమ్మెల్యేగా, ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండటంతో ప్రజల్లో వ్యతిరేకత ఉందని టాక్ నడుస్తోంది. అక్క మీద ఉన్న వ్యతిరేకతే తనకు అనుకూలంగా మారుతుందని సరస్వతి భావిస్తున్నారట. అక్కడ మీద తాను తప్పకుండా విజయం సాధిస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి గతంలో ఒకసారి తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రజల్లో పలుకుబడి లేని చెల్లెలు తనకు పోటీయే కాదంటున్నారు కోవ లక్ష్మి. తాను సునాయసంగా విజయం సాధిస్తానని చెబుతున్నారు. ఆసిఫాబాద్లో ఉత్కంఠ రేపుతున్న అక్కా చెల్లెళ్ళ యుద్ధంలో ఆదివాసీలు ఎటువైపు నిలుస్తారో చూడాలి. -
అసిఫాబాద్లో వేడెక్కిన రాజకీయం!
పోడు భూములకు పట్టాలిచ్చారు. జల్ జంగల్ జమీన్పై హక్కులిచ్చారు. అయినా ఎమ్మెల్యే అత్రం సక్కుపై అదివాసీల్లో అసంతృప్తి అగ్గిరాజేస్తోంది. ఎమ్మెల్యే అత్రం సక్కుపై అదివాసీల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దాంతో అధిష్టానం జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి టికెట్ను ప్రకటిచింది. అప్పటి వరకు బీఆర్ఎస్కు ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుంతుందని కాంగ్రెస్, బీజేపీలు భావించాయి. కానీ కోవ లక్ష్మికి టికెట్ దక్కడంతో ప్రతిపక్షాల అంచనాలు తారుమారు అయ్యాయి. అయినా అక్కడ అధికార పార్టీకి ఉన్న వ్యతిరేత తమకు కలిసివస్తుందనే ఆశభావంతో ప్రతిపక్షాలు ఉన్నాయి. కోమురంభీం జిల్లా అసిఫాబాద్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం అదివాసీ పోరాట యోధుడు కోమురంభీం పుట్టిన పోరుగడ్డ ఇది. ఇక్కడి నుండి జల్, జంగల్, జమీన్ యుద్దం సాగించారు. నిజాంపై జోడేఘాట్లో సాగించిన పోరాటంలో కోమురం భీం అసువులు బాశారు. ఇంతటి చరిత్ర కలిగిన నియోజకవర్గంలో అసిఫాబాద్, వాంకిడి, తిర్యాని, కెరమేరి, నార్నూర్, గాదేగూడ జైనూర్, కేరమేరి, లింగపూర్, సిర్పూర్ యు, రెబ్బేన మండలాలు ఉన్నాయి. వీటిలో 2,06,709మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అదివాసీలు, లంబడాలు, బీసీలు, ఎస్సీ ఓటర్లు ఉన్నారు. అదివాసీల ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఎమ్మెల్యేగా అత్రం సక్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 171 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మిపై కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే సక్కు విజయం సాధించారు. ఆ తర్వాత మారిన సమీకరణాలతో అత్రం సక్కు కాంగ్రెస్ పార్టీని వీడీ బీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా అసిఫాబాద్లో మేడికల్ కళశాల ఏర్పాటు చేయించారు. అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో రోడ్డు రవాణా సౌకర్యం కల్పించారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్నా పోడు పట్టాలు సర్కారు పంపిణీ చేసింది.. కానీ ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేయడంలో విఫలం ఆయ్యారని అపవాదును ఎదుర్కోంటున్నారు. అనేక గూడాలలో తాగునీటి సమస్య ఉంది. అదేవిధంగా రోడ్లులేవు, వాగులపై వంతేనలు లేవు. లక్మాపూర్, కరంజీవాడ, గుండి వాగులపై వంతేనలు లేవు. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో అసుపత్రికి వెళ్లలేక ప్రాణాలు కోల్పోతున్నారు. కోమురం భీం ప్రాజెక్టు నిదులు సాధించలేకపోయారు. అసంపూర్తిగా ఉంది. దీనితో సాగునీరు అందడంలేదు. ఇలాంటి వైఫల్యాలతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిందట. గూడాల్లో అడుగుపెట్టలేని పరిస్థితులు ఉన్నాయట. బీఆర్ఎస్ నిర్వహించిన సర్వేలలో బీఅర్ఎస్కు వ్యతిరేకత బయట పడిందట. టిక్కెట్ ఇస్తే ఓటమి ఖాయమని తెలిందట. దాంతో అదిష్టానం కోవ లక్ష్మికి టికెట్ కట్టబెట్టింది. దాంతో అసిఫాబాద్లో ఎన్నికలు వేడెక్కాయి. అప్పటి వరకు ఎమ్మెల్యేకు ఉన్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందని భావించిన కాంగ్రెస్, బీజేపీలకు షాక్ తగిలింది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూసిన కాంగ్రెస్, బీజేపీకి కోవ లక్ష్మితో గట్టి పోటీ తప్పెలా లేదని అంటున్నారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సరస్వతి, గణేష్ రాథోడ్ సక్కు వైఫల్యాలపై ప్రజల్లోకి వెళుతున్నారు. వైఫల్యాల ఎమ్మెల్యేను ఓడించాలని కోరుతున్నారట. అదే విధంగా బీజేపీ నాయకుడు కోట్నాక విజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీకి మద్దతు కూడగడుతున్నారు.