breaking news
Anmol Bishnoi
-
అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
-
అన్మోల్ బిష్ణోయ్కి 11 రోజుల ఎన్ఐఏ కస్టడీ
ఢిల్లీ: భారత్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అన్మోల్ బిష్ణోయ్కు పటియాలో కోర్టు 11 రోజుల ఎన్ఐఏ కస్టడీ విధించింది. 18కిపైగా కేసుల్లో నిందితుడుగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్ను విచారించేందుకు తమను అప్పగించాలని భారత్ సుదీర్ఘ న్యాయపోరాటం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విమానంలో అన్మోల్ బిష్ణోయ్ను భారత్కు పంపించింది. ఢిల్లీ ఎయిర్పోర్టులో అన్మోల్ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ పటియాల కోర్టు ఎదుట హాజరు పరిచింది. పలు కీలక కేసుల్లో నిందితుడిగా ఉన్న అన్మోల్ బిష్ణోయ్ను విచారించేందుకు 15రోజుల కస్టడీ కోరింది. అయితే, కోర్టు మాత్రం ఎన్ఐఏకు 11 రోజుల గడువు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ అన్మోల్ బిష్ణోయ్ను దర్యాప్తు చేపట్టనుంది. -
అమెరికా నుంచి భారత్కు గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్..
-
ఎన్ఐఏ కస్టడీకి అన్మోల్ బిష్ణోయ్
న్యూఢిల్లీ: అమెరికా నుంచి వచ్చిన గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ను ఢిల్లీలోని న్యాయస్థానం 11 రోజులపాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కస్టడీకి అప్పగిస్తూ బుధ వారం ఉత్తర్వులు జారీచేసింది. కరడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు సోదరుడైన అన్మోల్ను గత ఏడాది అరెస్ట్చేసిన అమెరికా మంగళవారం దేశం నుంచి బహిష్కరించి ప్రత్యేక విమానంలో భారత్కు తరలించింది. ఆ విమానం బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకోగానే ఎన్ఐఏ అధికారులు అరెస్ట్చేశారు. సాయంత్రం ఢిల్లీలోని పటియాలా కోర్టుల ప్రాంగణంలోని కోర్టులో జడ్జి ప్రశాంత్ శర్మ ఎదుట హాజరుపరిచారు. లోతుగా విచారించేందుకు తమకు 15 రోజులపాటు అన్మోల్ను అప్పగించాలని కోరారు. దీంతో 11 రోజులపాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ జడ్జి ప్రశాంత్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. నేరముఠాలకు, ఉగ్రవాద సంస్థలకు మధ్య సంబంధాల కేసులో అన్మోల్ను అరెస్ట్ చేసినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి చెప్పారు. 2024 అక్టోబర్లో మహారాష్ట్ర ఎన్సీపీ నేత, మాజీమంత్రి బాబా సిద్ధిఖీ హత్య, 2024 ఏప్రిల్లో ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు, 2022లో ప్రముఖ పంజాబీ యువ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతంలోనూ అన్మోల్పై గతంలో అభియోగాలు మోపారు. హత్యలు, బెదిరింపు వసూళ్లు చేసే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్స్టర్ సిండికేట్లో అన్మోల్ అరెస్ట్తో ఇప్పటిదాకా అరెస్టులు 19కి పెరిగాయి. -
యూఎస్లో అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కానీ హత్య కేసులో కాదు!
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ను అమెరికాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రస్తుతం అన్మోల్ను అయోవా రాష్ట్రంలో ఉన్న పొట్టావట్టమీ కౌంటీ జైలుకు తరలించింది. అయితే అక్రమ పత్రాలతో అమెరాకలోకి ప్రవేశించిన కేసులో అతడిని పోలీసీలు అరెస్ట్ చేశారు. అన్మోల్ బిష్ణోయ్ తమ నిర్భంధంలో ఉన్న విషయాన్ని కూడా అమెరికా ప్రభుత్వం భారత్కు తెలియజేసింది.ఈ క్రమంలో ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అమెరికాలోని ఎఫ్బీఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీతో టచ్లో ఉంది. అతడిని తమకు అప్పగించాలని ఎన్ఐఏ అభ్యర్థించింది. అయితే యూఎస్ అధికారులు అరెస్ట్ చేసింది భారత ప్రభుత్వం ఆరోపిస్తున్న కేసులకు సంబంధించినది కాదు కాబట్టి అతడిని ఇప్పల్లో భారత్కు అప్పగించే అవకాశం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించారు.కాగా అన్మోల్ బిష్ణోయ్ 2002లో పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిక్ హత్య కేసుతో సహా అనేక కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్ఖాన్ ఇంటివద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దానికి బాధ్యత వహిస్తూ అన్మోల్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు.బిష్ణోయ్ తరచుగా అమెరికా, కెనడా మధ్య ప్రయాణిస్తూ ఉంటాడు. పంజాబ్లోని ఫజిల్కాకు చెందిన బిష్ణోయ్ నకిలీ పాస్పోర్ట్తో భారత్ నుంచి పారిపోయి కెనడాలో ఉన్నట్లు గతంలో భావించారు. అతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ), భారత యాంటీ టెర్రర్ యూనిట్ దాఖలు చేసిన రెండు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఎన్ఐఏ దాఖలు చేసిన కేసులో ఆన్మోల్ను అప్పగించాలని ముంబై పోలీసులు కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. అతనిపై మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో చేర్చింది. మనీ లాండరింగ్ చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. అన్మోల్ బిష్ణోయ్పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అంతేగాకుండా సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. ఈక్రమంలో అతడి గురించి సమాచారం ఇచ్చినవారికి ఈ రివార్డు ఇస్తామని ఎన్ఐఏ తెలిపింది.


