breaking news
Anmol Bishnoi
-
అమెరికా నుంచి భారత్కు గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్..
-
అమెరికా నుంచి భారత్కు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్!
న్యూఢిల్లీ: పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా, మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య , బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రెండు కేసుల్లో ప్రధాన నిందితుడైన భారత్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా ప్రభుత్వం బుధవారం ప్రత్యేక విమానంలో భారత్కు తరలించింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత భారత దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు అన్మోల్ బిష్ణోయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఢిల్లీ పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. అనంతరం చట్టపరంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తమ ఆధీనంలో ఉన్న అన్మోల్ బిష్ణోయ్ ఫొటోను ఎన్ఐఏ తొలిసారి విడుదల చేసింది.పంజాబ్లోని ఫాజిల్కాకు చెందిన అన్మోల్ బిష్ణోయ్ తన నేర సామ్రాజ్యాన్ని విదేశాల నుంచి నడిపించాడు. 2022లో సిద్ధూ (Sidhu Moosewala) మూసేవాలాను మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా మార్గం మధ్యలో అడ్డగించిన దుండగులు అతడిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సిద్దూమూసేవాలా హత్యకేసులో అన్మోల్ ప్రధాన నిందితుడు.సిద్ధూమూసే వాలా హత్య అనంతరం అన్మోల్ బిష్ణోయ్ ఫేక్ పాస్పోర్టుతో భారత్ నుంచి అమెరికా వెళ్లాడు. అక్కడి పోలీసులు అన్మోల్ బిష్ణోయ్ను అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో పలు నేరాల్లో అన్మోల్ ప్రమేయం ఉండడంతో అమెరికా ప్రభుత్వం అతడికి జైలు శిక్ష విధించింది. నాటి నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో 18 కేసుల్లో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో అన్మోల్ను విచారణ నిమిత్తం అతడిని తమకు అప్పగించాలని భారత్ సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో అమెరికా అన్మోల్ను బహిష్కరించడం, ఆపై భారత్కు తరలించడంతో మార్గం సుగమమైంది. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న అన్మోల్ను ఎన్ఐఏ అతనిపై మొత్తం నమోదైన కేసులపై దర్యాప్తు చేపట్టనుంది. అన్మోల్తో పాటు మోస్ట్ వాటెండ్ లిస్టులో ఉన్న 199 మందిని సైతం అమెరికా భారత్కు అప్పగించింది. -
యూఎస్లో అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కానీ హత్య కేసులో కాదు!
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ను అమెరికాలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రస్తుతం అన్మోల్ను అయోవా రాష్ట్రంలో ఉన్న పొట్టావట్టమీ కౌంటీ జైలుకు తరలించింది. అయితే అక్రమ పత్రాలతో అమెరాకలోకి ప్రవేశించిన కేసులో అతడిని పోలీసీలు అరెస్ట్ చేశారు. అన్మోల్ బిష్ణోయ్ తమ నిర్భంధంలో ఉన్న విషయాన్ని కూడా అమెరికా ప్రభుత్వం భారత్కు తెలియజేసింది.ఈ క్రమంలో ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అమెరికాలోని ఎఫ్బీఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీతో టచ్లో ఉంది. అతడిని తమకు అప్పగించాలని ఎన్ఐఏ అభ్యర్థించింది. అయితే యూఎస్ అధికారులు అరెస్ట్ చేసింది భారత ప్రభుత్వం ఆరోపిస్తున్న కేసులకు సంబంధించినది కాదు కాబట్టి అతడిని ఇప్పల్లో భారత్కు అప్పగించే అవకాశం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించారు.కాగా అన్మోల్ బిష్ణోయ్ 2002లో పంజాబీ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్దిక్ హత్య కేసుతో సహా అనేక కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్ఖాన్ ఇంటివద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది. దానికి బాధ్యత వహిస్తూ అన్మోల్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు.బిష్ణోయ్ తరచుగా అమెరికా, కెనడా మధ్య ప్రయాణిస్తూ ఉంటాడు. పంజాబ్లోని ఫజిల్కాకు చెందిన బిష్ణోయ్ నకిలీ పాస్పోర్ట్తో భారత్ నుంచి పారిపోయి కెనడాలో ఉన్నట్లు గతంలో భావించారు. అతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ), భారత యాంటీ టెర్రర్ యూనిట్ దాఖలు చేసిన రెండు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఎన్ఐఏ దాఖలు చేసిన కేసులో ఆన్మోల్ను అప్పగించాలని ముంబై పోలీసులు కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. అతనిపై మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో చేర్చింది. మనీ లాండరింగ్ చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. అన్మోల్ బిష్ణోయ్పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అంతేగాకుండా సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. ఈక్రమంలో అతడి గురించి సమాచారం ఇచ్చినవారికి ఈ రివార్డు ఇస్తామని ఎన్ఐఏ తెలిపింది.


