-
ఆంధ్ర ఆటగాడు అమెరికా తరఫున...
ఆంధ్రప్రదేశ్కు చెందిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ దువ్వారపు శివకుమార్ అమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. శుక్రవారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్ బరిలోకి దిగిన అతనికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. సిద్ధాంతంకు చెందిన శివకుమార్ ఆంధ్ర తరఫున 42 రంజీ మ్యాచ్లలో 1061 పరుగులు చేసి 133 వికెట్లు పడగొట్టాడు. అతను 40 వన్డేలు, 16 టి20లు కూడా ఆడాడు. కోహ్లి కెప్టెన్సీలో 2008లో అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడినా ఉన్నా...అతనికి మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. ఆఖరిసారిగా 2018లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన శివకుమార్ అమెరికాకు వలస వెళ్లాడు. కనీసం మూడేళ్లు నివాసం ఉండాలన్న ఐసీసీ నిబంధన పూర్తి చేసుకున్న అనంతరం ఇటీవలే 32 ఏళ్ల శివకుమార్కు టీమ్లో చోటు లభించింది. చదవండి: IRE Vs NZ: కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు
క్రైస్ట్చర్చ్: ఒకవైపు తరచూ గాయాల బారిన పడుతుండటం... మరోవైపు కాబోయే భార్యతో అమెరికాలో స్థిరపడే అవకాశం రావడం... వెరసి న్యూజిలాండ్ ఆల్రౌండర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని... క్లబ్ క్రికెట్లో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)తో అండర్సన్ మూడేళ్లపాటు ఒప్పందం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టి20 మ్యాచ్ల్లో పాల్గొన్న అండర్సన్ మొత్తం 2,277 పరుగులు చేశాడు. 90 వికెట్లు తీశాడు. ‘ఈ నిర్ణయాన్ని సులువుగా తీసుకోలేదు. రాబోయే కాలంలో ఏం చేయాలనుకుంటున్నానో ఇప్పుడే నిర్ణయించుకున్నాను. నా కాబోయే భార్య మేరీ మార్గరెట్ అమెరికాలో పుట్టి పెరిగింది. నా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. మేజర్ లీగ్ క్రికెట్ రూపంలో అమెరికాలో ఉండేందుకు, వీలైతే అక్కడే స్థిరపడేందుకు నాకు అవకాశం లభించింది. దాంతో భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని 29 ఏళ్ల అండర్సన్ తెలిపాడు. 2014 జనవరి 1న విండీస్పై అండర్సన్ 36 బంతుల్లో సెంచరీ సాధించి వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. 2015లో వెస్టిండీస్పైనే డివిలియర్స్ 31 బంతుల్లోనే శతకం బాది ఈ రికార్డును బద్దలు కొట్టాడు. -
యూ ఇడియట్.. సిడ్నీ టెస్టు చూడలేదా..!
సెలబ్రిటీల వైఖరి భిన్నంగా తోచినప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వేయడం, వారిని ట్రోల్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, విపిన్ తివారి అనే వ్యక్తి ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజాను అనవసర కామెంట్ చేసి తిట్లు తిన్నాడు. ‘హేర్ స్టైల్ బాగుందా.. ఇంకా ఏవైనా సలహాలు ఇవ్వండి’ అని జడేజా గురువారం ఇన్స్టాగ్రామ్లో తన అభిమానులను కోరాడు. విపిన్ తివారి అనే యూజర్ ‘ఇన్స్టాగ్రామ్లో టైమ్ వేస్ట్ చేసే బదులు కాస్త ఆటపై దృష్టి పెట్టు’ అని ట్రోల్ చేసేందుకు యత్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన జడేజా.. ‘మీ ఇంట్లో టీవీ లేదా ఇడియట్. సిడ్నీ టెస్టు మ్యాచ్ చూడలేదా’ అంటూ వ్యాఖ్యానించాడు. కాగా, జడేజాకి అతని అభిమానులు మద్దతుగా నిలిచారు. ‘జడ్డూ భాయ్.. అలాంటి ఇడియట్ కామెంట్స్ పట్టించుకోవద్దు. నీ ఆట గురించి తెలియని వారికి రిప్లై ఇవ్వాల్సిన పనిలేదు’ అని చెప్పారు. జడేజా తీరుతో ఉలిక్కిపడిన తివారీ మాట మార్చాడు. ‘రిప్లై ఇచ్చినందుకు థాంక్స్. నా కామెంట్కు స్పందిస్తారో లేదోనని అలా చేశా. జస్ట్ ఫర్ ఫన్. నువ్వు ఇండియన్ టీమ్లో గొప్ప ఆల్రౌండర్వి. మన టీమ్కు చాలా అవసరం’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టెస్టుల్లో పాల్గొన్న జడేజా మంచి ప్రదర్శన చేశాడు. 7 వికెట్లు తీశాడు. చివరి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 81 పరుగులు సాధించాడు. ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్లో బౌలర్గా 5 స్థానంలో, ఆల్రౌండర్గా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. -
సమాధానం దొరికిందా?
భారత్కు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా జట్టు నిరీక్షణ ఇది. కపిల్దేవ్ రిటైర్ అయిన తర్వాత ఎంతో మందిని పరీక్షించారు. రకరకాల ఆటగాళ్లను తెచ్చి అవకాశాలు కల్పించారు. కానీ ఇప్పటికీ ఆ లోటు తీరలేదు. కానీ ధర్మశాలలో న్యూజిలాండ్తో తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చూసిన తర్వాత భారత పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కష్టాలకు సమాధానం దొరికిందేమో అనిపిస్తోంది. ఒక్క మ్యాచ్లో మంచి ప్రదర్శనకే అతడిని పూర్తిగా ఆల్రౌండర్ అనడం తొందరపాటే కావచ్చు. కానీ పాండ్యా గత ఆరు నెలల కాలంలో పడిన కష్టం, మార్చుకున్న శైలి, తొలి వన్డేలో బౌలింగ్ చేసిన తీరు చూస్తే... అన్నీ మంచి శకునాలుగానే కనిపిస్తున్నాయి. సాక్షి క్రీడావిభాగం పది నెలల క్రితం... ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలో భారత్ టి20 మ్యాచ్ ద్వారా హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన తొలి ఓవర్లో వరుసగా మొదటి మూడు బంతులూ వైడ్లు వేశాడు. ఓ సిక్సర్, ఓ ఫోర్ ఇచ్చాడు. మరో రెండు వైడ్లతో కలిపి మొత్తం ఓవర్ పూర్తి చేయడానికి 11 బంతులు వేశాడు. ఆ మ్యాచ్లో అతను మూడు ఓవర్లలో ఏకంగా 37 పరుగులు ఇచ్చాడు. అయినా ధోనికి పాండ్యా మీద విశ్వాసం ఉంది. ఐపీఎల్లో తన ప్రదర్శనను రెండేళ్లపాటు చూసిన ఎవరికై నా పాండ్యా మీద నమ్మకం ఉంటుంది. అదే నమ్మకం వల్ల అతను టి20 ప్రపంచకప్ వరకూ భారత్ ఆడిన 16 టి20ల్లోనూ బరిలోకి దిగాడు. నిజానికి అతను హిట్టింగ్ బాగా చేయగల బ్యాట్స్మన్. అవసరమైతే మీడియం పేసర్గా రెండు మూడు ఓవర్లు బౌలింగ్ చేయగలడు. ఇంతకాలం పాండ్యా పాత్ర ఇదే. ఐపీఎల్లోనూ కొత్త బంతితో ఎప్పుడూ బౌలింగ్ చేయలేదు. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత భారత జట్టు జింబాబ్వేలో పర్యటించింది. నిజానికి ఆ పర్యటనకు పాండ్యా వెళతాడనే అనుకున్నారు. కానీ ఐపీఎల్లో పేలవ ఫామ్ కారణంగా భారత జట్టులోకి రాలేదు. కట్ చేస్తే... ఆదివారం ధర్మశాలలో న్యూజిలాండ్తో భారత్ తొలి వన్డే. ఉమేశ్ యాదవ్ తొలి ఓవర్ పూర్తి కాగానే ధోని బంతిని పాండ్యా వైపు విసిరాడు. ఇది అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. తొలి ఐదు బంతుల్లో గప్టిల్ మూడు ఫోర్లు కొట్టాడు. అయితే మూడూ మంచి బంతులే. ఎడ్జలు తీసుకుని బౌండరీకి వెళ్లాయి. దీంతో ధోని అదనంగా మరో స్లిప్ తెచ్చాడు. ఆఖరి బంతికి స్లిప్స్లోనే క్యాచ్ ఇచ్చి గప్టిల్ వెనుదిరిగాడు. పాండ్యా పది నెలల క్రితం వేసిన తొలి ఓవర్కీ ఈ ఓవర్కీ ఏ మాత్రం సంబంధం లేదు. ఈసారి ఆత్మవిశ్వాసం కనిపించింది. ఫలితంతో సంబంధం లేకుండా అతను బంతులు వేయాల్సిన విధానం గురించి మాత్రమే ఆలోచించాడు. ఫలితం... ఏ ఆటగాడైనా కలలుగనే అరంగేట్రం. ఆడిన తొలి వన్డేలోనే మూడు వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. లెగ్ స్పిన్నర్గా మొదలై... నిజానికి పాండ్యా కెరీర్ బ్యాట్స్మన్గానే మొదలైంది. అయితే అడపాదడపా లెగ్ స్పిన్ వేసేవాడు. అరుుతే ఓ రోజు నెట్స్లో అనుకోకుండా పేస్ బౌలింగ్ వేశాడు. అప్పటికి తను ఇంకా క్లబ్ క్రికెటర్ మాత్రమే. 2013లో ఓ క్లబ్ గేమ్ ద్వారానే పాండ్యాలోని పేస్ బౌలర్ బయటకు వచ్చాడు. పిచ్ మొత్తం పచ్చికతో ఉంది. జట్టులో సరైన పేసర్లు లేరు. దీంతో పాండ్యాకు కొత్త బంతి ఇచ్చారు. అతను ఏకంగా ఎనిమిది వికెట్లు తీసి మ్యాచ్ గెలిపించాడు. బరోడా రంజీ కోచ్ సనత్ కుమార్ ఇది చూశారు. దీంతో హార్దిక్ను పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా మార్చే ప్రయత్నం చేశారు. 2015 ఐపీఎల్లో ముంబై ఇండియన్స జట్టులో ప్రదర్శన ద్వారా పాండ్యా కెరీర్ ఒక్కసారిగా మారిపోరుుంది. అరుుతే కేవలం భారీ హిట్టింగ్ చేయగల బ్యాట్స్మన్గానే అతనికి గుర్తింపు లభించింది. నిజానికి పాండ్యా తన పేస్ బౌలింగ్ను సీరియస్గా తీసుకోలేదు. దీనికి కారణం గాయాలు. 2013లో తను పేస్ బౌలర్గా మారిన తర్వాత కనీసం నెలకు ఒకసారైనా ఏదో ఒక గాయం బారిన పడ్డాడు. ఫిట్నెస్ పెరిగింది పాండ్యా ఈ ఏడాది ఐపీఎల్లో పేలవంగా ఆడాడు. భారత టి20 ఆటగాడిగా జట్టులో కీలకంగా మారాల్సిన హార్దిక్... ఆడిన 11 మ్యాచ్లలో కేవలం 44 పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ విఫలమై మూడు వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో భారత ద్వితీయశ్రేణి జట్టులోనూ తనకు చోటు దక్కలేదు. ఈ దశలో తన కెరీర్ వెనకబడిందని భావించిన పాండ్యా... మళ్లీ బేసిక్స్ నుంచి మొదలుపెట్టాడు. ఈసారి ఆట కంటే ఎక్కువగా ఫిట్నెస్పై దృష్టిపెట్టాడు. ‘ఎ’ జట్టుతో పాటు ఆస్ట్రేలియా వెళ్లినా పెద్దగా రాణించలేదు. అరుుతే అక్కడ కూడా ఫిట్నెస్నే ప్రధాన ఎజెం డాగా పెట్టుకున్నాడు. ప్రయోగాల వేళ... నిజానికి పాండ్యా వన్డే జట్టులోకి వస్తాడనే ఆలోచన ఎవరిలోనూ లేదు. అరుుతే ఇంగ్లండ్లో వచ్చే ఏడాది చాంపియన్స ట్రోఫీని నిలబెట్టుకోవాలనే అజెండాతో ప్రస్తుతం భారత్ మ్యాచ్లు ఆడుతోంది. ఆ మెగా టోర్నీకి ముందు ఉన్న ఎనిమిది వన్డేల ద్వారా రకరకాల ఆటగాళ్లను పరీక్షించదలుచుకున్నాడు. ఇంగ్లండ్లో మ్యాచ్లు గెలవాలంటే కచ్చితంగా జట్టులో ఓ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉండాలి. ప్రస్తుతం స్టువర్ట్ బిన్నీ కాకుండా దేశవాళీ క్రికెట్లో కనిపిస్తున్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయం హార్దిక్ పాండ్యా. దీంతో జట్టులో చోటు దక్కింది. నెట్స్లో తను బంతులు వేసిన తీరు కెప్టెన్ ధోనితో పాటు కోచ్ కుంబ్లేను కూడా ఆకర్షించింది. పాండ్యా బంతిని బాగా స్వింగ్ చేయగలడు. కానీ ఈసారి ఏకంగా 140 కిలోమీటర్లను మించిన వేగంతోనూ బంతులు వేశాడు. ఇది ధోనికి పెద్ద రిలీఫ్ ఇచ్చిం ది. ‘తుది జట్టులో ఉండే ముగ్గురు సీమర్లలో అతను ఒకడిగా ఎదిగితే మాకు చాలా సమస్యలు తగ్గిపోతారుు. చాలా మంది బౌలర్లు బంతిని స్వింగ్ చేయలేని పిచ్లపై కూడా పాండ్యా బంతిని బాగా స్వింగ్ చేస్తాడు. తొలి వన్డేలో అతని బంతుల్లో వేగం కూడా పెరిగింది. ఒకసారి కొత్త బంతి ఇచ్చి చూడాలని భావించాం. అతను కొత్త బంతిని బాగా వాడితే... బుమ్రాను మధ్య ఓవర్లలో, స్లాగ్ ఓవర్లలో వాడుకోవచ్చు. ఇదే తరహాలో పాండ్యా బౌలింగ్ చేస్తే చాంపియన్స ట్రోఫీ సమయానికి అతనే మా మొదటి పేసర్ కూడా కావచ్చు’ అంటూ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. రానున్న మ్యాచ్లు కీలకం వచ్చే ఏడాది చాంపియన్స ట్రోఫీకి తుది జట్టులో బెర్త్ పాండ్యాకు కచ్చితంగా ఖరారరుుందని చెప్పలేం. రాబోయే మ్యాచ్లలో అతను బౌలర్గా ఎలాంటి ప్రభావం చూపుతాడనే అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. మిగిలిన మ్యాచ్లు జరిగే వికెట్లు కూడా ధర్మశాల తరహాలో పేసర్లకు సహకరించకపోవచ్చు. అరుుతే తొలి వన్డే ఇచ్చిన ఆత్మవిశ్వాసం పాండ్యాను ముందుకు తీసుకువెళుతుంది. 38 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోజునే.. పాండ్యా కూడా తొలి అంతర్జాతీయ వన్డే ఆడాడు. తన క్యాప్ కూడా ఆ దిగ్గజం చేతుల మీదుగానే అందుకున్నాడు. మరి ఆ దిగ్గజం వారసుడి కోసం రెండు దశాబ్దాలుగా భారత్ చేస్తున్న ప్రయత్నాలకు సమాధానంగా హార్దిక్ పాండ్యా ఎదుగుతాడా..? రాబోయే పదిహేను రోజుల్లోనే దీనికి సమాధానం దొరుకుతుంది. -
50 టెస్టులాడాకే అంచనాకు రావాలి: కపిల్ దేవ్
బెంగళూరు: అంతర్జాతీయ క్రికెట్లో ఓ ఆటగాడిని ఆల్రౌండర్గా తేల్చేందుకు అతడు కనీసం 50 టెస్టులైనా ఆడాల్సి ఉంటుందని విఖ్యాత క్రికెటర్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. అంతేకానీ రెండు, మూడు సిరీస్లు మెరుగ్గా రాణించినంత మాత్రాన ఒక ఆటగాడిని ఆల్రౌండర్గా పరిగణించలేమని ఆయన అన్నారు. ‘ఓ ఆటగాడిని ఉత్తమ ఆల్రౌండర్ కేటగిరీలో చేర్చాలంటే అతడికి కనీసం 50 టెస్టులాడే అవకాశం ఇవ్వాలి. అప్పుడే అతడి గురించి ఓ అంచనాకు రావాలి. అంతేకానీ స్వల్ప కాలంలోనే అతడిపై ఓ అంచనాకు రావడం సరికాదు. అరుుతే ప్రస్తుత తరం ఆల్రౌండర్లకు చాలా నైపుణ్యం ఉంది. వారిని గౌరవించాల్సిందే’ అని కపిల్ చెప్పారు. ఫాస్ట్ బౌలింగ్తో కూడిన అత్యుత్తమ ఆల్రౌండర్లలో తానే చివరి వాడినని స్పష్టం చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement