-
Basara Temple: చదువుల తల్లి నిలయంగా వెలుగొందుతూ..
బాసర(ముధోల్): దేశంలోనే రెండో సరస్వతీ దేవి ఆలయంగా బాసర పుణ్యక్షేత్రం అలరారుతోంది. గోదావరినది ఒడ్డున ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువుదీరిన ఈ క్షేత్రంలో అమ్మవారు నిత్యం పూజలందుకుంటారు. పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి తపస్సు చేస్తే జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వేదవ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ల ఇసుక తీసుకువచ్చి సరస్వతి, లక్ష్మి, మహాకాళి దేవత మూర్తులను ప్రతిష్టించాడు. చాళక్యరాజులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. సరస్వతీ ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. జిల్లా కేంద్రం నుంచి 70 కిలోమీటర్లు దూరంలో హైదరాబాద్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి నిత్యం మహారాష్ట్ర, నిజామాబాద్, నాందేడ్, ధర్మాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. రైలుమార్గం గుండా కూడా బాసరకు చేరుకోవచ్చు. మూడు గుప్పెళ్ల ఇసుకతో.. వ్యాసుడు గోదావరినది నుంచి మూడు గుప్పెళ్లతో ఇసుకను తెచ్చి మూడు విగ్రహాలను తయారు చేశా డు. ఇక అప్పటి నుంచి వ్యాసపురి, వాసర, అటుపై బాసరగా మార్పు చెందింది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు చేస్తారు. ఇసుకతో ఏర్పాటు చేసిన విగ్రహాలు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. ఇక విగ్రహాలపై ఉన్న పసుపును భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ ప్రసాదం వల్ల విజ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీన్ని బండారా అంటారు. వాల్మీకి మహర్షి ప్రతిష్ఠించినట్లుగా.. వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణం రాయడానికి ముందు సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి రామాయణం రాసాడని మరో ప్రతీతి. ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి, పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ఈ గుహకు దగ్గరగా ఒక గుహ ఉంది. ఈ గుహపై మాలుకుడు అనే మహర్షి తపస్సు చేసినట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న ఒక పెద్ద రాతిగుండును తడితే మరోవైపు ఒక్కో శబ్ధం వస్తుంది. ఈ రాతి గుండు లోపల సీతమ్మవారి నగలు ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. (క్లిక్ చేయండి: అలాంటి పిచ్చి డ్యాన్స్లు వద్దు.. గౌరమ్మ తల్లి గౌరవం కాపాడుదాం!) చాళక్యుల కాలంలో.. ప్రధాన దేవాలయాన్ని చాళక్యుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు లభించాయి. మందిరంలో శిల్ప సంపద లేకపోయినా పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి. ప్రధాన దేవాలయానికి తూర్పు భాగంలో దత్తమందిరం ఉంది. ఇక్కడ దత్త పాదుకలను చూడవచ్చు. దీనికి దగ్గర్లోనే మహాకాళి దేవాలయం ఉంది. అటుపై ఇక్కడే ఉన్న వ్యాసమందిరంలో వ్యాసభగవానుడి విగ్రహం, వ్యాస లింగాన్నీ చూడవచ్చు. మాఘశుద్ధ పంచమినాడు సరస్వతీ దేవి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. నిజామాబాద్, భైంసా నుంచి నిత్యం పదుల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. -
ఘనంగా వసంత పంచమి
బెల్లంపల్లి : వసంత పంచమిని పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో సోమవారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని సరస్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తల్లిదండ్రులు చిన్నారులను తీసుకువచ్చి అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితులు చిన్నారుల చిట్టి చేతులతో అక్షరాలు దిద్దించారు. భారీగా తరలివచ్చిన చిన్నారులతో శ్రీ సరస్వతీ శిశుమందిర్ సందడిగా మారింది. అనంతరం అక్షరాభ్యాసం చేయించిన తల్లి దండ్రులకు తీర్థ ప్రసాదాలను అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శరణాలయంలో అక్షరాభ్యాసం... తాండూర్ : వసంత పంచమి సందర్భంగా మండల కేంద్రంలోని సేవాజ్యోతి శరణాలయంలో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వనితా క్లబ్ సభ్యులు చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా సంయుక్త కార్యదర్శి మాచుకారి సంతోష్, వనితా క్లబ్ మండల అధ్యక్షురాలు రాచర్ల వాణి, ప్రధాన కార్యదర్శి బోనగిరి కవిత, కోశాధికారి పుల్లూరి రమ్య, శరణాలయం వ్యవస్థాపకులు గజ్జెల్లి శ్రీదేవి, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. -
19న శ్రీశైలంలో సామూహిక అక్షరాభ్యాసం
శ్రీశైలం: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో సోమవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ వారి సూచనల మేరకు అక్షరదీవెన పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆసక్తిగల తల్లిదండ్రులు, సంరక్షకులు దేవస్థానం పరిపాలనా కార్యాలయంలోని శ్రీశైలప్రభ విభాగంలో బాలబాలికల వివరాలను ఆదివారం సాయంత్రం 7 గంటల్లోగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అక్షరాభ్యాసంలో పాల్గొనే చిన్నారులకు పలక, బలపం ఉచితంగా బహూకరిస్తామన్నారు. -
ఈ ఏడాది అక్షర దీవెన లేదా..?
కడప కల్చరల్ : పేద, బడుగు వర్గాల పిల్లలకు విద్య పట్ల ఆసక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా అక్షర దీవెన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి జూన్ మాసంలో పాఠశాలలు ప్రారంభించిన సందర్భంగా వారం నుంచి పదిహేను రోజులలోపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది. ఇందులో భాగంగా స్థానిక దేవాదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో జిల్లా అంతటా ఎంపిక చేసిన దేవాలయాలలో అనుకున్న ముహూర్తానికి ఒకే సమయంలో ఆ చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించేవారు. దీనికి ప్రభుత్వం పెద్దగా నిధులు ఇచ్చేది కూడా లేదు. దేవాదాయశాఖ ఈఓలు తమతమ ఆలయాల పరిధిలో దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్విహ స్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన దేవాలయాల చుట్టుపక్కల మూడు నుంచి ఐదు సంవత్సరాలలోపు చిన్నారులను సమీకరించి ఆరోజున ఆలయంలో సరస్వతిమాత పూజ నిర్వహించి అర్చకులతో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించేవారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు, చిన్నారులకు విద్య పట్ల ఆసక్తి కలుగుతుంది. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుండడంతో నాలుగేళ్లుగా ఉత్సాహ భరితంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన పలకలు, బలపాలు, పుస్తకాలు, పెన్సిళ్లను స్థానిక దాత లు ఉచితంగా అందజేసేవారు. మరికొందరు దాతలు తీర్థ ప్రసాదాలను అందజే సేవారు. మొత్తంపై ప్రభుత్వానికి ప్రత్యేకించి ఖర్చంటూ ఏమీ లేకపోయినా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నిర్వహించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. జిల్లా అంతటా ఈ కార్యక్రమం కోసం పేద, బడుగు వర్గాల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకించి పెద్దగానిధులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు గనుక దాతల సహకారం తప్పక ఉంటుంది గనుక ఇకనైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. ఆదేశాలు లేవు.. అక్షర దీవెన నిర్వహిస్తున్న మాట నిజమే. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన కూడా ఉంది. ఈ సంవత్సరం పలు కార్యక్రమాల ఒత్తిడితో ప్రభుత్వం ఇంకా ఆదేశాలు జారీ చేయలేదు. వీలైనంత త్వరలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తాం. - శంకర్బాలాజీ, అసిస్టెంట్ కమిషనర్, జిల్లా దేవాదాయశాఖ కడప -
సామూహిక అక్షరాభ్యాసాలకు విశేష స్పందన
నరసరావుపేటరూరల్ : కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భక్తిభావాన్ని పెంపొందిస్తామని సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. శుక్రవారం ఆలయ ఆవరణలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసం, మహాసరస్వతి హోమంలో ఆయన పాల్గొన్నారు. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి ఆశ్వీరదించారు. అనంతరం త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ, ఏకాదశి సందర్భంగా శ్రీ మేధాదక్షిణామూర్తి పాదల చెంత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారభించామని, నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. జూలై 1నుంచి ప్రారంభించే వేదపాఠశాలలో 30 మంది విద్యార్థులకు, 8 రకాల కోర్సులను ఇక్కడ బోధిస్తామన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంజూరు చేసిన రూ.4కోట్లతో భవనాలు నిర్మిస్తామని, టీటీడీ సహకారంతో కొండపై మొక్కలు నాటనున్నట్టు చెప్పారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి ఇతర జిల్లాల నుంచి తల్లిదండ్రులతో వచ్చిన 300 మంది చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. వారందరికీ పలక, బలపం, పెద్దబాలశిక్ష, సరస్వతీ అమ్మవారి రూపం, కంకణం, ప్రసాదాలు అందజేశారు. అనంతరం తల్లిదండ్రులు తమ చిన్నారులతో సరస్వతీ యాగంలో పాల్గొన్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రామకృష్ణ కొండలరావు బహదూర్, ఈవో శ్రీనివాసరావు, ఎం ఈవో జి.జయకుమార్, సీఆర్పీలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
రోడ్డు ప్రమాదంలో పీఎస్ మృతి
అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement