breaking news
additaional
-
వారికి సింగపూర్ బంపర్ ఆఫర్
సింగపూర్ : కరోనా మహమ్మారి సమయంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. ఈ సంక్షోభ సమయంలో బిడ్డను కనబోతున్న తల్లిదండ్రులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. వారికి అదనపు సహాయాన్ని అందజేయనున్నామని ఆ దేశ ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి హెంగ్ స్వీ కీట్ సోమవారం (అక్టోబర్ 5) వెల్లడించారు. ప్రజల ఆదాయ క్షీణత సంతానోత్పత్తి రేటును మరింత దెబ్బతీసే అవకాశం ఉందనే అంచనాలతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కరోనా వ్యతిరేక పోరాటంలో తాము స్థిరంగా ఉన్నామని ప్రకటించారు. ఈ మేరకు పార్లమెంటులో ఆర్థిక మంత్రి ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఉద్యోగ తొలగింపులు, వేతన కోతల మధ్య ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నం, బిడ్డ కోసం చూస్తున్న తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడానికి సింగపూర్ ఒక్కసారి చెల్లింపును అందించనుంది. ఇది ప్రస్తుతం అమలు చేస్తున్న బేబీ బోనస్లకు అదనమని మంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదు. అయితే బేబీ బోనస్ కింద ఇప్పటికే అర్హతగల తల్లిదండ్రులకు 10వేల డాలర్ల వరకు ప్రయోజనాలను అందిస్తున్నసంగతి తెలిసిందే. కోవిడ్-19 సమయంలో ఉపాధి లేక, ఆదాయాలు క్షీణించడంతో భార్యభర్తలు, పిల్లల్ని కనే ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నారనే నివేదికల మధ్య సింగపూర్ సత్వర చర్యలకు దిగింది. సింగపూర్ సంతానోత్పత్తి రేటు 2018లో ఎనిమిదేళ్ల కనిష్టాన్ని తాకింది. కాగా దేశంలో ఇప్పటివరకు 57 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా మరణించిన వారి సంఖ్య 27. -
రూ.14 కోట్లతో 238 అదనపు తరగతి గదులు
మామిడికుదురు : జిల్లాలో 238 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు చేశామని సర్వశిక్షా అభియా¯ŒS ప్రాజెక్టు అధికారి ఎం.శేషగిరి తెలిపారు. స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో ‘బడి రుణం తీర్చుకుందాం’ కార్యక్రమంపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. మార్చి నెలాఖరుకు నూతన భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన ‘బడి రుణం తీర్చుకుందాం’ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఇప్పటివరకూ రూ.1.80 కోట్ల విలువైన మెటీరియల్, విరాళాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమం అమలులో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రెండు విడతలుగా 513 గ్రామాల్లోని ఒక్కో పాఠశాలను ఎంపిక చేసి 40 మంది విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయులకు నాలుగు అంశాలపై శిక్షణ ఇచ్చామన్నారు. శిక్షణ పొందినవారు ఆయా గ్రామాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, బాలింతలు, గర్భిణులు తీసుకోవల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఇ¯ŒSచార్జ్ ఏఎస్ఓ పవ¯ŒSకుమార్, ఎంఈఓ పీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.