breaking news
ACC Mens Asia Cup Rising Stars 2025
-
ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్లో పాకిస్తాన్ విజయం
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 ఛాంపియన్స్గా పాకిస్తాన్ షాహీన్స్ నిలిచింది. ఆదివారం దోహ వేదికగా బంగ్లాదేశ్-ఎ జట్టుతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పాకిస్తాన్ సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తద్వారా వరుసగా మూడో ఆసియాకప్ కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ను పాక్ కైవసం చేసుకుంది.ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 125 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఆరంభంలో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మాజ్ సదాకత్ (18 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 23) , అరఫాత్ మిన్హాస్( 23 బంతుల్లో 4 ఫోర్లతో 25) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.ఆఖరిలో సాద్ మసూద్ (26 బంతుల్లో 38) దూకుడుగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. బంగ్లాదేశ్-ఎ బౌలర్లలో రిపన్ మోండల్ మూడు వికెట్లు పడగొట్టగా.. రకిబుల్ హసన్ రెండు, మెహెరోబ్, జిషన్ అలామ్, అబ్దుల్ గఫర్ సక్లెయిన్ తలా వికెట్ సాధించారు.స్కోర్లు సమం..అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. చేజింగ్లో హబీబుర్ రెహమాన్ సోహన్(23) మెరుపు వేగంతో ఆడడంతో మ్యాచ్ త్వరగా ముగిసిపోతుందని అంతా భావించారు. కానీ ఆ తర్వాతే బంగ్లా వికెట్ల పతనం మొదలైంది. 53 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రకిబుల్ హసన్(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 24), అబ్దుల్ గఫర్(16) దూకుడుగా ఆడడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో సూపర్ ఓవర్తో ఫలితం తేల్చాలని అంపైర్లు నిర్ణయించారు.సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మూడు బంతుల్లో రెండు వికెట్ల నష్టానికి 6 పరుగులకే చేసింది. సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం రెండు వికెట్లు పడితే ఆలౌటైనట్లు పరిగణిస్తారు. అహ్మద్ డానియల్ మరోసారి అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడు.బంగ్లా నిర్ధేశించిన 7 పరుగుల లక్ష్యాన్ని పాక్ నాలుగు బంతుల్లో చేధించింది. పాక్ విజయంలో కీలక పాత్ర పోషించిన అహ్మద్ దనియాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. ఓపెనర్ మాజ్ సదఖత్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.చదవండి: Prithvi Shaw: కెప్టెన్గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన -
కొంప మునిగిన తర్వాత ఇంకేంటి?: కోచ్పై మాజీ క్రికెటర్ ఫైర్
ఏసీసీ పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భారత్కు ఘోర పరాభవం ఎదురైంది. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడి జితేశ్ శర్మ సేన ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో బారత జట్టు యాజమాన్యం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.ఇందుకు ప్రధాన కారణంగా సూపర్ ఓవర్లో భారత జట్టు అనుసరించిన వ్యూహమే. దోహా వేదికగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీ తొలి సెమీ ఫైనల్లో భారత్-‘ఎ’- బంగ్లాదేశ్- ‘ఎ’ జట్లు శుక్రవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 194 పరుగులుబంగ్లా ఓపెనర్ హబీబుర్ రెహ్మాన్ సోహన్ (46 బంతుల్లో 65)తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఎస్ఎం మెహెరాబ్ (18 బంతులు 48 నాటౌట్), యాసిర్ అలీ (9 బంతుల్లో 17 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 194 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే, సూయశ్ శర్మ, రమణ్దీప్ సింగ్, నమన్ ధిర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.సరిగ్గా అదే స్కోరుఇక భారీ లక్ష్య ఛేదనను భారత్ ఘనంగానే ఆరంభించింది. ఓపెనర్లులో వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో 38 పరుగులతో సత్తా చాటగా.. ప్రియాన్ష్ ఆర్య 23 బంతుల్లో 44 పరుగులు సాధించాడు. అయితే, వన్డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (7) మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.ఇలాంటి తరుణంలో కెప్టెన్ జితేశ్ శర్మ (23 బంతుల్లో 33), నేహాల్ వధేరా (29 బంతుల్లో 32 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. వీరికి తోడు రమణ్దీప్ సింగ్ (17), అశుతోశ్ శర్మ (13) ఫర్వాలేదనిపించగా.. విజయానికి ఆఖరి బంతికి నాలుగు పరుగులు అవసరం కాగా.. హర్ష్ దూబే మూడే పరుగులు తీశాడు.సూపర్ ఓవర్లో..దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. అయితే, సూపర్ ఓవర్లో కెప్టెన్ జితేశ్ శర్మ, అశుతోశ్ శర్మ బ్యాటింగ్కు వెళ్లారు. ఓపెనర్లు వైభవ్, ప్రియాన్షులను కాదని వీరిని పంపిన యాజమాన్యం అందుకు బదులుగా భారీ మూల్యమే చెల్లించింది. జితేశ్ తొలి బంతికే బౌల్డ్ కాగా.. రెండో బంతికి అశుతోశ్ పెవిలియన్ చేరాడు. ఇక సూయశ్ శర్మ బౌలింగ్లో వైడ్ రావడంతో పరుగు ఖాతాలో వేసుకున్న బంగ్లా గెలుపు జెండా ఎగురవేసి.. ఫైనల్కు దూసుకువెళ్లింది.ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్లో భారత్ అనుసరించిన వ్యూహంపై టీమిండియా మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్-‘ఎ’ జట్టు కోచ్ అసలేం ఆలోచిస్తున్నాడంటూ సునిల్ జోషిపై మండిపడ్డాడు. వైభవ్ ఏం తప్పు చేశాడని బ్యాటింగ్కు పంపలేదంటూ ఫైర్ అయ్యాడు.ఇప్పటికే కొంప మునిగింది కదా!కామెంట్రీలో భాగంగా.. ‘‘ఇప్పటికీ భారత్-‘ఎ’ నాయకత్వ బృందం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఇంకా తామేదో చేస్తున్నట్లు వారు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీనికి ఎందుకు బ్యాటింగ్కు పంపలేదు?భారత్-‘ఎ’ హెడ్కోచ్ సునిల్ జోషి.. ఇప్పుడు డగౌట్లో కూర్చుకుని ఏం రాసుకుంటున్నాడు? ఇప్పటికే కొంప మునిగింది కదా!’’ అంటూ మణిందర్ సింగ్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా బంగ్లా చేతిలో ఓటమితో భారత్ నిష్క్రమించగా.. శ్రీలంకపై గెలిచి పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య ఆదివారం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ -2025 టైటిల్ పోరు జరుగుతుంది. ఇందుకు దోహా వేదిక.చదవండి: అందుకే సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని పంపలేదు: జితేశ్ శర్మ -
Asia T20 Cup: ఫైనల్కు దూసుకెళ్లిన పాకిస్తాన్
ఏసీసీ పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్కు ఫైనల్కు దూసుకువెళ్లింది. ఆఖరి ఓవర్ వరకు శ్రీలంక (Pak A vs SL A)తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఐదు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. దోహా వేదికగా నవంబరు 14న మొదలైన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది.శుక్రవారం నాటి తొలి సెమీ ఫైనల్లో భారత్-‘ఎ’ జట్టుపై గెలిచి బంగ్లాదేశ్-‘ఎ’ ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్- ‘ఎ’- శ్రీలంక- ‘ఎ’ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 153 పరుగుల నామమాత్రపు స్కోరు సాధించింది.దానియాల్ మెరుపు ఇన్నింగ్స్పాక్ ఓపెనర్లు మొహమ్మద్ నసీమ్ (16), మాజ్ సదాకత్ (23) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ యాసిర్ ఖాన్ (6), ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన మొహమ్మద్ ఫరీక్ (7), కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ (6) పూర్తిగా విఫలమయ్యారు. షహీద్ అజాజ్ (7) కూడా ఫెయిలయ్యాడు.ఇలాంటి దశలో వికెట్ కీపర్ బ్యాటర్ ఘాజి ఘోరి (36 బంతుల్లో 39 నాటౌట్), సాద్ మసూద్ (22) మెరుగ్గా రాణించగా.. అహ్మద్ దానియాల్ (8 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా పాక్ 153 పరుగులు స్కోరు చేయగలిగింది. లంక బౌలర్లలో ప్రమోద్ మధుషాన్ నాలుగు, త్రవీణ్ మాథ్యూ మూడు వికెట్లతో చెలరేగగా.. మిలాన్ రత్మనాయకె, కెప్టెన్ దునిత్ వెల్లలగే చెరో వికెట్ పడగొట్టారు.పేకమేడలా కుప్పకూలిందినామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక శుభారంభమే అందుకుంది. ఓపెనర్లు లసిత్ క్రూస్పులె (7 బంతుల్లో 27) వేగంగా ఆడగా.. విషేన్ హలాంబగే (27 బంతుల్లో 29) ఫర్వాలేదనిపించాడు. అయితే, పాక్ బౌలర్ల ధాటికి లంక మిడిలార్డర్ పేకమేడలా కుప్పకూలింది. నిషాన్ మధుష్క (6), నువానిడు ఫెర్నాండో (5), సాహన్ అరాచిగే (5), కెప్టెన్ వెల్లలగే (2), రమేశ్ మెండిస్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు.క్లిష్ట పరిస్థితుల్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్ మిలాన్ రత్ననాయకె పోరాట పటిమ కనబరిచాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 40 పరుగులు చేశాడు. కానీ మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు. ప్రమోద్ (7), త్రవీణ్ మాథ్యూ (4 నాటౌట్), గరుక సంకేత్ (1) చేతులెత్తేశారు. విజయానికి ఐదు పరుగుల దూరంలోఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 148 పరుగులు చేసిన శ్రీలంక.. విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా పాక్ ఫైనల్కు దూసుకువెళ్లింది. బంగ్లాదేశ్-‘ఎ’- పాకిస్తాన్- ‘ఎ’ మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సెమీస్లో బ్యాట్, బాల్తో రాణించిన సాద్ మసూద్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. పాక్ బౌలర్లలో మసూద్, సూఫియాన్ ముకీమ్ చెరో మూడు వికెట్లు కూల్చగా.. ఉబైద్ షా, షాహిద్ అజీజ్, అహ్మద్ దానియాల్ తలా ఒక వికెట్ తీసి.. పాక్ ఫైనల్ చేరడంలో తమ వంతు పాత్ర పోషించారు.చదవండి: IND vs BAN అందుకే సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని పంపలేదు: జితేశ్ శర్మ -
అందుకే సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని పంపలేదు: జితేశ్ శర్మ
ఆసియా క్రికెట్ మండలి పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భారత-‘ఎ’ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్-‘ఎ’ జట్టుతో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో జితేశ్ శర్మ సేన ఓటమిపాలైంది. దీంతో ఈ టీ20 ఈవెంట్లో కనీసం ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన దుస్థితి వచ్చింది.బంగ్లా చేతిలో భారత్ ఓటమిదోహా వేదికగా ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు (IND A vs BAN A) ‘సూపర్ ఓవర్’ ద్వారా భారత్ను ఓడించింది. సూపర్ ఓవర్లో ఆడిన 2 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయిన భారత్ ‘0’కే పరిమితం కాగా... బంగ్లాదేశ్ 1 పరుగు చేసి విజయాన్నందుకుంది.వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. హబీబుర్ రహమాన్ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్స్లు) హాఫ్ సెంచరీ చేయగా.... మెహ్రాబ్ హుసేన్ (18 బంతుల్లో 48 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్లు) దూకుడు ప్రదర్శించాడు.సరిగ్గా 194 పరుగులేభారత బౌలర్లలో గుర్జీప్నీత్ సింగ్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 194 పరుగులే సాధించింది. ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్లు), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 15 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్లు), జితేశ్ శర్మ (Jitesh Sharma- 23 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్స్లు) మెరుపులు మెరిపించారు.Top-class innings from Vaibhav Sooryavanshi! 💥Watch India A take on Bangladesh A in the semi-final, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #DPWorldAsiaCupRisingStars2025 pic.twitter.com/7rSQRproSI— Sony Sports Network (@SonySportsNetwk) November 21, 2025 నేహల్ వధేరా (29 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 2 ఓవర్లలో భారత్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిపాన్ మోండోల్ (1/35) ఐదు పరుగులే ఇచ్చాడు.విజయం కోసం ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన భారత్ తొలి 5 బంతుల్లో 12 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి హర్ష్ దూబే, వధేరా కలిసి కష్టంగా 2 పరుగులు పూర్తి చేశారు. అయితే కీపర్ అక్బర్ ఘోర వైఫల్యంతో భారత్కు మూడో పరుగు కూడా వచ్చింది.సూపర్ ఓవర్లో అంతా తలకిందులు.. చావోరేవో తేల్చుకోవాల్సిన సూపర్ ఓవర్లో భారత జట్టు యాజమాన్యం ఆశ్చర్యకరంగా వైభన్ సూర్యవంశీని కాదని జితేశ్ శర్మ, రమణ్దీప్ల సింగ్లతో ఓపెనింగ్ చేయించింది. మోండోల్ వేసిన తొలి బంతికి జితేశ్, రెండో బంతికి అశుతోష్ అవుట్ కావడంతో ఇన్నింగ్స్ ‘సున్నా’ వద్ద ముగిసింది.వైభవ్ను ఎందుకు పంపలేదు?ఆ తర్వాత తొలి బంతికి వికెట్ తీసిన సుయాశ్ శర్మ, తర్వాతి బంతిని వైడ్గా వేయడంతో బంగ్లాదేశ్ గెలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సూపర్ ఓవర్లో అనుసరించిన వ్యూహంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. విధ్వంసకర వీరుడైన వైభవ్ను ఓపెనర్గా ఎందుకు పంపలేదంటూ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు మండిపడ్డారు. భారత్ ఓటమికి ఒకరకంగా ఇదే ప్రధాన కారణమనే చర్చ లేవనెత్తారు.ఓటమికి బాధ్యత నాదేఈ నేపథ్యంలో భారత కెప్టెన్ జితేశ్ శర్మ స్పందించాడు. ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ.. ‘‘ఈ మ్యాచ్ ద్వారా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఓటమికి బాధ్యత నాదే. సీనియర్ ఆటగాడిగా మ్యాచ్ను సరైన రీతిలో ముగించి ఉండాల్సింది.నేర్చుకునే దశలో ఇదొక భాగమే కానీ.. ఓటమి కాదు. ఏదో ఒకరోజు ఈ జట్టులోని ఆటగాళ్లే భారత జట్టుకు ప్రపంచకప్ అందించవచ్చు. వాళ్ల ప్రతిభకు ఆకాశమే హద్దు. మాకు ఇదొక అనుభవం.ఇక్కడ వికెట్ కీలక పాత్ర పోషించింది. ఇలాంటి పిచ్లపై ఎలా ఆడాలో మాకు తెలుసు. అయితే, పందొమ్మిదో ఓవర్లో బంగ్లా బౌలర్ అద్భుతంగా బౌల్ చేశాడు. అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. 20 ఓవర్ల ఆట మా నియంత్రణలోనే ఉంది. కానీ ఆఖర్లో చేదు ఫలితం వచ్చింది’’ అని జితేశ్ శర్మ పేర్కొన్నాడు.డెత్ ఓవర్లలో మేము బెస్ట్ఇక సూపర్ ఓవర్లో రెగ్యులర్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్యలను పంపకపోవడంపై స్పందిస్తూ.. ‘‘వాళ్లిద్దరు పవర్ప్లేలో మాస్టర్లు అని నాకూ తెలుసు. అయితే, డెత్ ఓవర్లలో నేను, అశుతోశ్, రమణ్ హిట్టింగ్ ఆడగలము. అందుకే సూపర్ ఓవర్లో మేమే బ్యాటింగ్కు వెళ్లాలని భావించాం. ఇది జట్టు నిర్ణయం. పూర్తిగా నా నిర్ణయం’’ అని జితేశ్ శర్మ స్పష్టం చేశాడు.చదవండి: SMAT: హైదరాబాద్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? -
వైభవ్ మెరుపులు వృధా.. ఆసియా కప్ సెమీస్లో టీమిండియా ఓటమి
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో (ACC Men's Asia Cup Rising Stars 2025) భాగంగా భారత్-ఏ-బంగ్లాదేశ్-ఏ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 21) జరిగిన తొలి సెమీఫైనల్ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగింది. దోహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ సూపర్ ఓవర్లో విజయం సాధించి, ఫైనల్కు దూసుకెళ్లింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమానమైన స్కోర్లు చేయగా మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఖాతా తెరవకుండానే 2 వికెట్లూ కోల్పోగా.. సుయాశ్ శర్మ వైడ్ వేసి బంగ్లాదేశ్ను గెలిపించాడు. పాకిస్తాన్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఇవాళ రాత్రే జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో బంగ్లాదేశ్-ఏ నవంబర్ 23న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.బంగ్లాదేశ్ భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఓపెనర్ హబిబుర్ రెహ్మాన్ సోహన్ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), మెహ్రబ్ (18 బంతుల్లో 48 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది.భారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ (4-0-39-2), హర్ష్ దూబే (4-0-22-1), సుయాశ్ శర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. రమన్దీప్ సింగ్ (2-0-29-1), నమన్ ధిర్ (2-0-33-1) పర్వాలేదనిపించారు.వైభవ్ మెరుపులు వృధాభారీ లక్ష్య ఛేదనలో భారత్కు మెరుపు ఆరంభం లభించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 38; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు వృధా అయ్యాయి. జితేశ్ శర్మ (33), నేహల్ వధేరా (32 నాటౌట్), ఆఖర్లో రమన్దీప్ (17), అశుతోష్ శర్మ (13) సత్తా చాటడంతో అతి కష్టం మీద నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమమయ్యాయి.అయితే సూపర్ ఓవర్లో భారత్ బొక్క బోర్లా పడింది. తొలి రెండు బంతులకు వికెట్లు జితేశ్, అశుతోష్ ఔట్ కావడంతో ఖాతా కూడా తెరవలేకయింది. అనంతరం బంగ్లాదేశ్ సైతం తొలి బంతికే వికెట్ కోల్పోగా.. రెండో బంతిని సుయాశ్ శర్మ వైడ్గా వేయడంతో బంగ్లాదేశ్ గెలుపొందింది. చదవండి: భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన -
టీమిండియాతో సెమీఫైనల్.. బంగ్లాదేశ్ భారీ స్కోర్
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో (ACC Men's Asia Cup Rising Stars 2025) ఇవాళ (నవంబర్ 21) తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది. దోహా వేదికగా భారత్-ఏ-బంగ్లాదేశ్-ఏ (India A vs Bangladesh A) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బంగ్లాదేశ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్ హబిబుర్ రెహ్మాన్ సోహన్ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో మెహ్రబ్ (18 బంతుల్లో 48 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో జిషన్ ఆలమ్ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జవాద్ అబ్రార్ (13), యాసిర్ అలీ (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. ఆ జట్టు కెప్టెన్ అక్బర్ అలీ 9, మహిదుల్ ఇస్లాం 1 పరుగు చేయగా.. అబూ హైదర్ డకౌటయ్యాడు.భారత బౌలర్లలో విజయ్కుమార్ వైశాక్ (4-0-51-0) భారీ పరుగులు సమర్పించుకోగా.. గుర్జప్నీత్ సింగ్ (4-0-39-2), హర్ష్ దూబే (4-0-22-1), సుయాశ్ శర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. రమన్దీప్ సింగ్ (2-0-29-1), నమన్ ధిర్ (2-0-33-1) పర్వాలేదనిపించారు.వైభవ్ మెరుపులు కూడా మొదలయ్యాయి..!అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసాన్ని ప్రారంభించాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (7 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కూడా భారీ షాట్లు ఆడుతున్నాడు. ఫలితంగా భారత్ 3.3 ఓవరల్లో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. -
మళ్లీ భారత్ × పాకిస్తాన్ ఫైనల్?
మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్లో సెమీఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. గ్రూపు-ఎ నుంచి బంగ్లాదేశ్-ఎ, శ్రీలంక-ఎ.. గ్రూపు-బి నుంచి పాకిస్తాన్, భారత్ జట్లు సెమీస్కు అర్హత సాధించాయి. తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్, భారత జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టాలని భారత్ పట్టుదలతో ఉంది.ఇక సెకెండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్ షాహీన్స్, శ్రీలంక అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ రెండు సెమీస్ మ్యాచ్లు శుక్రవారం(నవంబర్ 21) దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.పాక్ జోరు..కాగా ఈ ఖండాంతర టోర్నమెంట్లో దాయాది పాకిస్తాన్ ఇప్పటివరకు అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. లీగ్ స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్లలోనూ పాక్ విజయం సాధించింది. భారత్-ఎతో జరిగిన మ్యాచ్లో కూడా పాక్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 8 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. మాజ్ సదాకత్ (79 పరుగులు, 2 వికెట్లు) ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు.పాకిస్తాన్ వర్సెస్ భారత్ ఫైనల్?కాగా తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై విజయం సాధించడం జితేశ్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుకు నల్లేరు మీద నడకే. ఇండియా జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య, నమన్ ధీర్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు.బౌలింగ్లో కూడా యష్ ఠాకూర్, యుద్దవీర్ సింగ్ వంటి యువ సంచలనాలు సత్తా చాటుతున్నారు. మరోవైపు పాక్ కూడా సూపర్ ఫామ్లో ఉండడంతో శ్రీలంకను ఓడించడం దాదాపు ఖాయమనే చెప్పాలి. దీంతో మరోసారి ఫైనల్ పోరులో పాక్-భారత్ తలపడే అవకాశముంది.చదవండి: IND vs SA: టీమిండియా కెప్టెన్గా ఎవరూ ఊహించని ప్లేయర్? -
వైభవ్ తుపాన్ ఎలా ఆపేది?
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. యూఏఈ-ఎతో జరిగిన తొలి మ్యాచ్లో విధ్వంసకర శతకం(42 బంతుల్లో 144 పరుగులు)తో చెలరేగిన వైభవ్.. ఆ తర్వాత పాక్పై కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.ఈ టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు 14 ఏళ్ల వైభవ్.. 189 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అతడి స్ట్రైక్ రేటు ఏకంగా 270.00 ఉండడం గమనార్హం. ఇక మంగళవారం ఒమన్తో జరగనున్న కీలక మ్యాచ్లో కూడా సత్తాచాటాలని సూర్యవంశీ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే వైభవ్ బ్యాటింగ్కు అభిమానులే కాదు ఒమన్ ఓపెనింగ్ బ్యాటర్ ఆర్యన్ బిష్ట్ సైతం పిధా అయిపోయాడు. వైభవ్ లాంటి టాలెంట్ ఉన్న ఆటగాడని తను ఇప్పటివరకు చూడలేదని అతడు కొనియాడాడు."గతంలో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ను టీవీలో చూశాం. ఇప్పుడు మేము అతడికి ప్రత్యర్ధిగా ఆడబోతున్నాం. . సూర్యవంశీని కలిసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అతడి నుంచి చాలా విషయాలు నేర్చకునే ప్రయత్నం చేస్తాను. కేవలం 14 ఏళ్ల వయస్సులో అంతటి భారీ సిక్స్లు కొట్టడం నిజంగా గ్రేట్. వైభవ్కు అద్భుతమైన టాలెంట్ ఉంది. అతడు కచ్చితంగా త్వరలో సీనియర్ జట్టుకు ఆడుతాడు. అయితే ఈ మ్యాచ్లో అతడు దూకుడుకు కళ్లేం వేసేందుకు ప్రయత్నిస్తామని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్యన్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సెమీఫైనల్కు అర్హత సాధిస్తోంది. ఇప్పటికే గ్రూపు-బి నుంచి పాకిస్తాన్ సెమీఫైనల్కు అర్హత సాధించింది.చదవండి: చెప్పిందే చేశానన్న పిచ్ క్యూరేటర్.. గంభీర్ చర్య వైరల్ -
పాక్ ప్లేయర్కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైభవ్ సూర్యవంశీ
నిన్న (నవంబర్ 16) జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో భారత్ పాకిస్తాన్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా.. పాక్ బౌలర్లు షాహిద్ అజిజ్ (3-0-24-3), సాద్ మసూద్ (4-0-31-2), మాజ్ సదాఖత్ (3-1-12-2), ఉబైద్ షా (4-0-24-1), అమ్మద్ దనియాల్ (3-0-21-1), సూఫియాన్ ముఖీమ్ (2-0-24-1) ధాటికి 19 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది.భారత ఇన్నింగ్స్కు చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (28 బంతుల్లో 45; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని అందించినా, ఆతర్వాత వచ్చిన ఆటగాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు. వన్డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (35) ఓ మోస్తరు పోరాటం చేయగా.. మిగతా ఆటగాళ్లలో ప్రియాంశ్ ఆర్య (10), రమన్దీప్ సింగ్ (11), హర్ష్ దూబే (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ జితేశ్ శర్మ (5), నేహల్ వధేరా (8), యశ్ ఠాకూర్ (2), గుర్జప్నీత్ సింగ్ (1 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. అశుతోష్ శర్మ, సుయాశ్ శర్మ డకౌటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మాజ్ సదాఖత్ (79 నాటౌట్) మెరుపు అర్ధ శతకంతో పాక్ను గెలిపించాడు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మకు తలో వికెట్ దక్కింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్ను రేపు (నవంబర్ 18) ఒమన్తో ఆడుతుంది. అంతకుముందు భారత్ తొలి మ్యాచ్లో యూఏఈపై 148 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ పూనకాలెత్తిపోయాడు. కేవలం 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 144 పరుగులు చేశాడు.మాటలోనూ చిచ్చరపిడుగే..!14 ఏళ్ల కుర్ర వైభవ్ ఆటలోనే కాదు మాటలోనూ చిచ్చరపిడుగే అని నిన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో నిరూపించాడు. ఈ మ్యాచ్లో పాక్ బౌలర్ ఉబైద్ షా వైభవ్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. తనదైన శైలిలో జవాబిచ్చాడు. భారత ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఉబైద్ షా వైభవ్వైపు సీరియస్గా చూడగా.. వెళ్లి పని చూడు అన్న అర్దం వచ్చేలా కౌంటరిచ్చాడు. అంతటితో ఆగకుండా మరుసటి బంతిని బౌండరీకి తరలించి పాక్ బౌలర్కు తన దమ్మును చూపాడు. చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన బవుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే -
IND vs PAK: 8 వికెట్ల తేడాతో టీమిండియాపై పాక్ విజయం
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025లో భారత్–పాక్ మధ్య జరిగిన హై–వోల్టేజ్ పోరులో పాకిస్థాన్ యువ జట్టు ఆధిపత్యం చాటుకుంది. టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి పాక్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో మరో విలువైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్–2025 టోర్నమెంట్లో అత్యంత ఆసక్తికరమైన పోరు జరిగింది. యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో నేడు (ఆదివారం) భారత్–పాకిస్థాన్ జట్లు పరస్పరం తలపడ్డాయి కానీ ఈ కీలక మ్యాచ్ను గెలిచి పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ సమీకరణలను సులభం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతుందనిపించినా మధ్య ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనైంది. దాంతో నిర్ణీత 19 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ ధాటిగా ఆడి మ్యాచ్ను వేగంగా తమ వైపుకు తిప్పుకున్నారు. ఫలితంగా పాకిస్థాన్ జట్టు కేవలం 13.2 ఓవర్లలోనే నిర్ణీత లక్ష్యాన్ని చేధించింది.పాక్ A జట్టు ఓపెనర్ మాజ్ సదాఖత్ (79*) పరుగులతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో పాకిస్థాన్ సెమీస్కు క్వాలిఫై అయింది. రెండో బెర్తు కోసం భారత్ Aతో పాటు ఒమన్ A బరిలో ఉంది. ఈ నెల 18న తదుపరి మ్యాచ్లో ఒమన్తోనే భారత్ A తలపడనుంది. ఆ మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్ సెమీస్కు వెళ్లిపోతుంది. -
శతక్కొట్టిన వైభవ్, జితేశ్ శర్మ మెరుపులు.. భారత్ ఘన విజయం
ఆసియా క్రికెట్ మండలి పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భారత్-‘ఎ’ జట్టు శుభారంభం అందుకుంది. దోహా వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టును ఏకంగా 148 పరుగుల తేడాతో చిత్తు చేసి జయభేరి మోగించింది. Vaibhav Sooryavanshi is a superstar. Period. 🔥📹 | A statement century from our Boss Baby to set the tone 🤩 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/K0RIoK4Fyv— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో భాగంగా వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్- యూఏఈ (IND A vs UAE) జట్లు శుక్రవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 297 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.శతక్కొట్టిన వైభవ్, జితేశ్ శర్మ మెరుపులుఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) భారీ, విధ్వంసకర శతకం (42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్లు- 144)తో విరుచుకుపడగా.. జితేశ్ శర్మ (Jitesh Sharma) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో నంబర్ బ్యాటర్గా వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 32 బంతులు ఎదుర్కొని ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్స్లు బాది 83 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.With the captain joining the party, it only got better Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/7QNbpB0ecd— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025మిగిలిన వాళ్లలో వన్డౌన్ బ్యాటర్ నమన్ ధీర్ (23 బంతుల్లో 34) ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (10) రనౌట్ కాగా.. నేహాల్ వధేరా (14) నిరాశపరిచాడు. ఆఖర్లో రమణ్దీప్ సింగ్ (8 బంతుల్లో 6) జితేశ్తో కలిసి అజేయంగా నిలిచాడు. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్ ఫరాజుద్దీన్, అయాన్ ఖాన్, ముహమ్మద్ అర్ఫాన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.కుప్పకూలిన టాపార్డర్ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఆది నుంచే తడబడింది. భారత బౌలర్ల ధాటికి టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు మయాంక్ రాజేశ్ కుమార్ (18), కెప్టెన్ అలిషాన్ షరాఫు (3) నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ అహ్మద్ తారిక్ డకౌట్ అయ్యాడు.Ramandeep Singh’s brilliance in the field sends the UAE skipper packing 🚶♂️ Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/PQ5jimFpFG— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025సొహైబ్ మెరుపు అర్ధ శతకం వృథాఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ సొహైబ్ ఖాన్ మెరుపు అర్ధ శతకం (41 బంతుల్లో 63) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్లో నమన్ ధీర్కు క్యాచ్ ఇవ్వడంతో సొహైబ్ మెరుపులకు తెరపడింది. ఆ తర్వాత వచ్చిన వాళ్లలో హర్షిత్ కౌశిక్ డకౌట్ కాగా.. వికెట్ కీపర్ సయీద్ హైదర్ (20), ముహమ్మద్ అర్ఫాన్ (26) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో అయాన్ ఖాన్ 2, ముహమ్మద్ ఫరాజుద్దీన్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి కేవలం 149 పరుగులు మాత్రమే చేసిన యూఏఈ.. భారత్-‘ఎ’ జట్టు చేతిలో భారీ ఓటమి చవిచూసింది. 148 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. గుర్జప్నీత్ సింగ్ మూడు వికెట్లుభారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్కు మూడు వికెట్ల తో సత్తా చాటగా.. హర్ష్ దూబే రెండు, రమణ్దీప్ సింగ్ , యశ్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. సెంచరీ వీరుడు వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆదివారం నాటి తదుపరి మ్యాచ్లో భారత్- పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకుంటుంది.చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో ఇంత వరకు ఏ బ్యాటర్కూ సాధ్యం కాని ఘనత సాధించాడు. అతి పిన్న వయసులో.. 35 కంటే తక్కువ బంతుల్లోనే రెండుసార్లు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు.ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మ్యాచ్ సందర్భంగా వైభవ్ శుక్రవారం ఈ ఫీట్ నమోదు చేశాడు. దోహా వేదికగా జరుగుతున్న ఈ టీ20 ఈవెంట్లో భారత్-‘ఎ’ జట్టు.. యూఏఈతో మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది.వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్భారత ఓపెనర్లలో ప్రియాన్ష్ ఆర్య (10) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 32 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 144 పరుగులు సాధించాడు. వైభవ్ ఇన్నింగ్స్లో ఏకంగా 11 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండటం విశేషం.Vaibhav Sooryavanshi is a superstar. Period. 🔥📹 | A statement century from our Boss Baby to set the tone 🤩 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/K0RIoK4Fyv— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025 అయితే, యూఏఈ బౌలర్ ముహమ్మద్ ఫరాజుద్దీన్ బౌలింగ్లో అహ్మద్ తారిక్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్.. విధ్వంసకర ఇన్నింగ్స్ ముగిసిపోయింది. ఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీకి పొట్టి ఫార్మాట్లో ఇది రెండో శతకం. అంతేకాదు రెండో ఫాస్టెస్ట్ సెంచరీ కూడా! ఈ క్రమంలోనే పద్నాలుగేళ్ల ఈ బిహారీ పిల్లాడు సరికొత్త చరిత్ర లిఖించాడు.Naye India ka Naya Superstar. 💙 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/Ht7z25zMVs— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025ఏకైక బ్యాటర్గా ప్రపంచ రికార్డుకాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్కు ఆడిన వైభవ్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే శతకం బాదిన విషయం తెలిసిందే. అప్పుడు అతడి వయసు పద్నాలుగేళ్ల 32 రోజులు మాత్రమే. ఇక తాజాగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో భాగంగా వైభవ్ 32 బంతుల్లోనే శతక్కొట్టి తన రికార్డును తానే సవరించాడు.పద్నాలుగేళ్ల 232 రోజుల వయసులో తన రెండో టీ20 సెంచరీ చేసిన వైభవ్.. అతి పిన్న వయసులో.. 35 కంటే తక్కువ బంతుల్లోనే రెండుసార్లు శతక్కొట్టిన ఏకైక బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతేకాదు.. భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా రిషభ్ పంత్ రికార్డు సవరించాడు.టీ20లలో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్లు వీరే🏏ఉర్విల్ పటేల్- 2024లో గుజరాత్ తరఫున త్రిపురతో మ్యాచ్లో 28 బంతుల్లో🏏అభిషేక్ శర్మ- 2024లో పంజాబ్ తరఫున మేఘాలయపై 28 బంతుల్లో🏏రిషభ్ పంత్- 2018లో ఢిల్లీ తరఫున హిమాచల్ ప్రదేశ్పై 32 బంతుల్లో🏏వైభవ్ సూర్యవంశీ- 2025లో భారత్ తరఫున యూఏఈపై 32 బంతుల్లో శతకంభారత్ భారీ స్కోరుఇదిలా ఉంటే.. యూఏఈతో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ (144)తో పాటు కెప్టెన్ జితేశ్ శర్మ కూడా అదరగొట్టాడు. కేవలం 32 బంతుల్లోనే 83 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వారిలో నమన్ ధీర్ (34) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 297 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో ముహమ్మద్ ఫరాజుద్దీన్, అయాన్ అఫ్జల్ ఖాన్, ముహమ్మద్ అర్ఫాన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. చదవండి: IND vs SA: ముందుగానే ముగిసిన తొలిరోజు ఆట.. భారత్దే పైచేయి! -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 32 బంతుల్లోనే శతక్కొట్టి..
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి అద్బుత ప్రదర్శనతో దుమ్ములేపాడు. ఆసియా క్రికెట్ మండలి (ACC) పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.ఈ టీ20 ఈవెంట్లో భాగంగా భారత్-‘ఎ’ జట్టు తమ తొలి మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తలపడుతోంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఐపీఎల్ సెన్సేషన్ ప్రియాన్ష్ ఆర్య వేగంగా ఆడే (6 బంతుల్లో 10) ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు.కేవలం పదహారు బంతుల్లోనేఈ క్రమంలో మరో ఓపెనర్, భారత చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. వన్డౌన్ బ్యాటర్ నమన్ ధీర్తో కలిసి.. స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. కేవలం పదహారు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత జోరును మరింత పెంచాడు.Vaibhav Sooryavanshi is putting on a fireworks show 🎇 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/1gNEz5UwHb— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 2025 ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూప్రత్యర్థి జట్టు బౌలింగ్ను చితక్కొడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ లెఫ్టాండర్ కేవలం 32 బంతుల్లోనే వంద పరుగులు మార్కు అందుకుని మరోసారి సత్తా చాటాడు. వైభవ్ శతక ఇన్నింగ్స్లో పది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో అతడికి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. Welcome to the Boss Baby’s world 🥵Vaibhav Sooryavanshi clears the boundary like it’s nothing 🤌 Watch #INDvUAE in the #DPWorldAsiaCupRisingStars2025, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV pic.twitter.com/8Qha1Edzab— Sony Sports Network (@SonySportsNetwk) November 14, 202510 ఓవర్లలోనేవైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్కు తోడు.. నమన్ ధీర్ కూడా మెరుపులు (21 బంతుల్లో 33) మెరిపించడంతో 10 ఓవర్లలోనే భారత్ కేవలం వికెట్ నష్టపోయి 149 పరుగులు చేయడం మరో విశేషం. ఇక 12వ ఓవర్ తొలి బంతికి ముహమ్మద్ ఆర్ఫాన్ బౌలింగ్లో ముహమ్మద్ రోహిద్ ఖాన్కు నమన్ క్యాచ్ ఇవ్వడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కాగా వైభవ్, నమన్ రెండో వికెట్కు 57 బంతుల్లో 163 పరుగులు జోడించడం విశేషం. నమన్ స్థానంలో కెప్టెన్ జితేశ్ శర్మ నాలుగో నంబర్ బ్యాటర్గా క్రీజులోకి వచ్చాడు. తుఫాన్ ఇన్నింగ్స్కు తెరకాగా 12.3 ఓవర్లో ముహమ్మద్ ఫరాజుద్దీన్ బౌలింగ్లో అహ్మద్ తారిక్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్కు తెరపడింది. మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ 11 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో 144 పరుగులు సాధించి.. మూడో వికెట్గా వెనుదిరిగాడు. ఫలితంగా 13 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 199 పరుగుల వద్ద నిలిచింది.చదవండి: గంభీర్ ఊహించని ప్రయోగం.. భారత క్రికెట్ చరిత్రలోనే -
‘పసికూన’పై ప్రతాపం.. బోణీ కొట్టిన పాకిస్తాన్
ఆసియా క్రికెట్ మండలి నిర్వహిస్తున్న ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్- 2025 ( Asia Cup Rising Stars) టోర్నమెంట్ శుక్రవారం మొదలైంది. దోహా వేదికగా తొలి మ్యాచ్లో పాకిస్తాన్- ‘ఎ’- ఒమన్ జట్లు తలపడ్డాయి. వెస్ట్ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన ఒమన్ తొలుత బౌలింగ్ చేసింది.పరుగుల విధ్వంసంఈ క్రమంలో ఆదిలోనే ఓపెనర్ మొహమ్మద్ నయీమ్ (6) వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. మరో ఓపెనర్ మాజ్ సదాకత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 54 బంతుల్లోనే ఐదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు బాది పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి 96 పరుగులు చేసిన సదాకత్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.మిగతా వాళ్లలో యాసిర్ ఖాన్ (26 బంతుల్లో 26), మొహ్మద్ ఫైక్ (9 బంతుల్లో 19) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ 21 బంతుల్లోనే 44 పరుగులతో సత్తా చాటాడు. ఆఖర్లో సాద్ మసూద్ మెరుపులు (6 బంతుల్లో 19 నాటౌట్) మెరిపించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో పాక్-ఎ జట్టు కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 220 పరుగులు సాధించింది.ఆది నుంచే కష్టాలుఒమన్ బౌలర్లలో షఫీక్ జాన్, ముజాహిర్ రజా, జే ఒడేడ్రా, వసీం అలీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్ సూఫియాన్ యూసఫ్ (3) విఫలం కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ హమ్మద్ మీర్జా (27 బంతుల్లో 34) రనౌట్ అయి వికెట్ పారేసుకున్నాడు.వన్డౌన్లో వచ్చిన కరణ్ సోనావాలే (18 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. మిడిలార్డర్లో వసీం అలీ (5), నారాయణ్ సాయిశివ్ (1), ఆర్యన్ బిస్త్ (2) పూర్తిగా నిరాశపరిచారు. జై ఒడేడ్రా డకౌట్ అయ్యాడు.ఘాఆఖర్లో మెరుపులు..ఇలాంటి దశలో జిక్రియా ఇస్లాం, ముజాహిర్ రజా ధనాధన్ దంచికొట్టి జట్టు విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేశారు. జిక్రియా ఇస్లాం మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు- 57 పరుగులు) సాధించగా.. రజా 24 బంతుల్లో 46 పరుగులతో సత్తా చాటాడు. అయితే, మిగిలిన వారి నుంచి వీరికి సహకారం లభించలేదు.బోణీ కొట్టిన పాక్ఫలితంగా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి.. ఒమన్ కేవలం 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా పాకిస్తాన్ ఒమన్పై 40 పరుగుల తేడాతో గెలిచింది. విజయంతో ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింట్ స్టార్స్ టీ20 టోర్నీని ఆరంభించింది. మాజ్ సదాకత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: గంభీర్ ఊహించని ప్రయోగం.. భారత క్రికెట్ చరిత్రలోనే


