-
AP: విమానయానం ఫుల్ జోష్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విమానయానరంగం జోరుమీద కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల ద్వారా 27,49,835 మంది ప్రయాణించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో విమాన ప్రయాణికుల సంఖ్యలో 17.22శాతం వృద్ధి నమోదైంది. 2022-23 సంవత్సరంలో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి 23,45,795 మంది ప్రయాణించగా, ఆ సంఖ్య ఈ ఏడాది 27,49,835కు చేరింది. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయన్న విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖలో అత్యధిక వృద్ధి... పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నం విమానాశ్రయం అన్నిటికంటే అత్యధికంగా 30.5శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. గత ఏడాది విశాఖ నుంచి 11.50 లక్షల మంది ప్రయాణించగా, ఆ సంఖ్య ఈ ఏడాది ఏకంగా 15.03 లక్షలకు పెరిగింది. పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి విశాఖకు విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, గత కొన్ని నెలలుగా నమోదవుతున్న గణాంకాలే దీనికి నిదర్శనమని ఎయిర్పోర్టు అధికారులు పేర్కొన్నారు. విశాఖ తర్వాత గడిచిన ఆరు నెలల్లో విజయవాడ నుంచి 5.41 లక్షల మంది, తిరుపతి నుంచి 4.30 లక్షల మంది, రాజమండ్రి నుంచి 2.11 లక్షల మంది ప్రయాణించారు. కడప ఎయిర్పోర్టు నుంచి 41,056 మంది, కర్నూలు ఎయిర్పోర్టు నుంచి 21,326 మంది ప్రయాణించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల విమానాలు రద్దు కావడంతో తిరుపతి, కర్నూలు విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారి సంఖ్యలో స్వల్ప తగ్గుదల నమోదైందని, రానున్నకాలంలో ఈ రెండు చోట్ల నుంచి కూడా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘భోగాపురం’తో డబుల్ ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం ఎయిర్ఫోర్స్ వారిది కావడంతో రాత్రిపూట అనేక ఆంక్షలు ఉన్నాయని, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఆంక్షలు తొలగిపోతాయని, ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో భోగాపురం విమానాశ్రయం నిర్మిస్తున్నారు. ఈ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ విమానాశ్రయం 2025 నాటికి అందుబాటులోకి రానుంది. చదవండి: వావ్..విశాఖ! -
కడప ఎయిర్పోర్టు అభివృద్ధికి రూ. 224.05 కోట్ల నిధులు
కడప సిటీ : కడప విమానాశ్రయ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రూ. 224.05 కోట్లతో న్యూ డొమెస్టిక్ బిల్డింగ్ నిర్మాణం, ఇతర పనులకు శ్రీకారం చుట్టేందుకు టెండర్లను కూడా ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా పిలిచింది. మరో మూడు నెలల్లో టెండర్లు పూర్తయి రెండేళ్ల కాలంలో అంటే మార్చి 2026కు పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.ఇప్పటికే నైట్ ల్యాండింగ్కు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్పోర్టును తీర్చిదిద్దనున్నారు. రూ. 224.05 కోట్లతో పనులు ఇటీవల ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కడప ఎయిర్పోర్టు అభివృద్ధికి రూ. 224.05 కోట్ల నిధులు కేటాయించింది. ఈ మొత్తంతో 12,900 చదరపు మీటర్లలో న్యూ డొమెస్టిక్ టెర్మినల్ భవన నిర్మాణాన్ని అత్యాధునిక సౌకర్యాలతో చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్లను పిలిచారు. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి తరహాలో ఈ ఎయిర్పోర్టును సర్వాంగ సుందరంగా మార్చనున్నారు. మూడు ఏరో బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇవి పూర్తయితే టెర్మినల్ భవనం నుంచి నేరుగా విమానంలోకి చేరుకునే అవకాశం ఉంటుంది. వర్షం వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు విమానం వద్దకు చేరుకోవచ్చు. ప్రస్తుతం బస్సు ద్వారా అక్కడికి చేరుకుంటారు. పెద్ద విమానాలు వచ్చేందుకు అవకాశం కడప విమానాశ్రయంలో పెద్ద విమానాలు రాకపోకలు సాగించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నైట్ ల్యాండింగ్కు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతి వచ్చిన తర్వాత పనులన్నీ పూర్తయ్యాయి. రన్వే పెంపుతోపాటు రన్వే లైటింగ్, అప్రోచ్ లైటింగ్, పార్కింగ్ బే లైటింగ్, 2.5 కిలోమీటర్ల రన్వే, సెక్యూరిటీ, పెరిమీటర్ లైటింగ్, పెరిమీటరు రోడ్డు తదితర పనులు పూర్తయ్యాయి. దీంతో నైట్ ల్యాండింగ్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా విమానాలు దిగేందుకు అవకాశం ఉంటుంది. 8కొత్త టెర్మినల్ లో 700 మంది ప్రయాణికుల సౌకర్యం ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనంలో 40+40 (80) మందికి మాత్రమే అవకాశం ఉంది. కొత్త టెరి్మనల్ పూర్తయితే మొత్తం 700 మందికి రాకపోకలు సాగించే అవకాశాలు ఉంటాయి. ఏడు విమానాలు పార్కింగ్ చేసేందుకు ఇక్కడ అవకాశం ఉంది. అభివృద్ది పనులు పూర్తయితే ఏ–320 (180మంది) ప్రయాణికులు ప్రయాణించే పెద్ద విమానాలు ఇక్కడి నుంచి నడిపేందుకు వీలు ఉంటుంది. 8పైలెట్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు కడప విమానాశ్రయంలో పైలెట్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా పైలెట్ శిక్షణా కేంద్రం లేదు. ప్రప్రథమంగా కడప విమానాశ్రయంలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చేనెల 25, 26 తేదీల్లో ఇందుకు సంబంధించి ప్రణాళిక ఖరారు కానుంది. తర్వాత ఈ శిక్షణా కేంద్రం పనులు చేపట్టే అవకాశం ఉంది. -
భారీ మాల్కు చిక్కులు... మూసివేయాలని ఆదేశాలు...
సాక్షి, చైన్నె: చైన్నె మీనంబాక్కం విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ రూపుదిద్దుకున్న భారీ మాల్ నిర్వహణకు చిక్కులు తప్పడం లేదు. ఈ మాల్, సినిమా కాంప్లెక్స్ కారణంగా విమానాశ్రయం వద్ద కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఏయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) గుర్తించింది. దీంతో ఆ మాల్ను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం తాజాగా వెలుగు చూసింది. వివరాలు.. చైన్నె మీనంబాక్కం విమానాశ్రయం నుంచి స్వదేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన నగరాలకు , దేశాల రాజధానులకు విమానాల సేవలు అందుతున్న విషయం తెలిసిందే. రూ. 2400 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిద్దే పనులు జరుగుతున్నాయి. తొలి దశ పనులు ఏప్రిల్లో ముగించగా, ప్రస్తుతం రెండో దశ పనులు మొదలెట్టి ఉన్నారు. అలాగే, విమానాశ్రయం పరిసరాల్లో పార్కింగ్ కోసం భారీ భవనం ఏర్పాటు చేశారు. ఇక్కడ 2400 కార్లు తదితర వాహనాలు పార్కింగ్ చేసే విధంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. రూ. 250 కోట్లతో ఆరు అంతస్తులతో ఈ నిర్మాణం చేపట్టారు. భద్రతా పరమైన కారణాలతో.. విమానాశ్రయం స్వదేశీ, విదేశీ టెర్మినల్స్కు మధ్య భాగంలో ఆరు అంతస్తులతో భారీ మాల్కు రూపకల్పన చేశారు. ఇక్కడ ప్రయాణికులకు వినోదాన్ని పంచే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు, ఫుట్కోట్లు, పలు బ్రాండ్లకు సంబంధించిన దుకాణాలు ఇక్కడ కొలువు దీర్చారు. అంతే కాకుండా ప్రముఖ సంస్థ నేతృత్వంలో సినిమా థియేటర్లు ఏర్పాటు చేశారు. వర్తక, వినోద కేంద్రంగా ఉన్న ఇక్కడకు నిత్య జనం తాకిడి పెరగడం విమానాశ్రయానికి కొత్త చిక్కులను సృష్టించి ఉంది. ఇక్కడకు వచ్చే వారి వాహనాలతో ఆ కాంప్లెక్స్నిండి పోవడంతో పాటు విమానాశ్రయ పరిసరాలను ఆక్రమిస్తున్నట్టు తేలింది. అలాగే విమానాశ్రయానికి ఏదేని భద్రతా పరంగా సమస్య తలెత్త వచ్చనే అనుమానాలను చైన్నె ఏయిర్ పోర్టు వర్గాలు ఢిల్లీలోని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఇదే మాల్ నుంచి ఓ మహిళ కిందకు దూకి ఆత్మహత్య సైతం చేసుకోవడం వంటి పరిణామాలను, ఇక్కడకు నిత్యం తరలివస్తున్న ప్రేక్షకుల సంఖ్యతో భద్రతా సమస్యలే కాకుండా, పార్కింగ్కు మరింత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో భారీ మాల్, థియేటర్లను మూసి వేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే పూర్తిస్థాయి కారణాలను తెలియ జేయకుండా ఏకపక్షంగా మూసి వేయాల్సిందేనంటూ ఆదే శాలు జారీ చేయడంపై సంబంధింత మల్టిఫ్లెక్స్ సంస్థ న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు తెలిసింది. -
ఆరు విమానాశ్రయాల నుంచి ఎయిర్పోర్ట్స్ అథారిటీకి వేల కోట్లు
న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. (సర్కార్ కొలువుకు గుడ్బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది. కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్ నుంచి కన్సెషన్ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్ మానెటైజేషన్ పైప్లైన్లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి. న్యూఢిల్లీ: లీజుకు ఇచ్చిన ఆరు విమానాశ్రయల నుంచి ప్రైవేటు భాగస్వాముల ద్వారా ఫిబ్రవరి నాటికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) రూ.3,245 కోట్లు సమకూరిందని ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అహ్మదాబాద్, జైపూర్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఖర్చు చేసిన మూలధన వ్యయం రూ.2,349 కోట్లతోపాటు ప్రయాణికుల ఫీజు రూపంలో రూ.896 కోట్లను ఏఏఐ అందుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ రాజ్యసభలో సోమవారం పేర్కొన్నారు. కార్యకలాపాలు, నిర్వహణ, అభివృద్ధికై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 50 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ గ్రూప్ వీటిని దక్కించుకుంది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు విమానాశ్రయాలను 2020లో, మిగిలినవి 2021లో చేజిక్కించుకుంది. కాగా, ముంబై విమానాశ్రయ ప్రైవేట్ భాగస్వామి ద్వారా మార్చి 16 నాటికి రూ.13,000 కోట్లకుపైగా వార్షిక ఫీజును ఏఏఐ అందుకున్నట్టు మంత్రి తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్ నుంచి కన్సెషన్ ఫీజు రూపంలో రూ.620 కోట్లు సమకూరిందని చెప్పారు. నేషనల్ మానెటైజేషన్ పైప్లైన్లో భాగంగా ఏఏఐకి చెందిన 25 ఎయిర్పోర్టులను 2022–2025 మధ్య కాలంలో లీజుకు ఇవ్వనున్నట్టు నిర్ణయించామన్నారు. తద్వారా రూ.10,782 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వీటిలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు సైతం ఉన్నాయి. -
Wings India 2024: ఎయిర్ షో తేదీలు ఖరారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమానికి తేదీలు ఖరారయ్యాయి. బేగంపేట విమానాశ్రయం వేదికగా జనవరి 18 నుంచి నాలుగు రోజులపాటు ఇది జరుగనుంది. పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా వింగ్స్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పౌర విమానయాన రంగంలో ఆసియాలో ఇదే అతిపెద్ద ప్రదర్శన. 2022లో జరిగిన వింగ్స్ ఇండియా ప్రదర్శనలో 125 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు 364 జరిగాయి. 12 ఎయిర్క్రాఫ్ట్స్ కొలువుదీరాయి. ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన సారంగ్ బృందం చేసిన ఎయిర్షో ప్రత్యేక ఆకర్షణ.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
‘‘కేజ్రీవాల్ను చంపుతారా..?’’
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement