2003 ఏప్రిల్ 9.. రాష్ట్ర చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకున్న తేదీ. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి(Y.S. Rajasekhara Reddy) చేపట్టిన పాదయాత్ర (Padayatra) ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఎర్రటి ఎండను, వానను లెక్క చేయకుండా ప్రజలతో మమేకమై ముందుగు సాగుతూ వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ పాదయాత్రే ఆ తర్వాత ఆయన్ని సీఎంను చేసింది. రాష్ట్ర గతిని మార్చేసింది. ఆ యాత్రకు 23 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా.. ఆ జ్ఞాపకాలను చిత్రాల రూపంలో గుర్తు చేసుకుంటున్నారు ఆయన అభిమానులు.


